Hunt
-
పులి కోసం డ్రోన్లతో వేట.. కాగజ్నగర్లో హై అలర్ట్
సాక్షి,కొమురంభీంజిల్లా: ఆసిఫాబాద్లో ఆపరేషన్ మ్యాన్ ఈటర్ కొనసాగుతోంది. కాగజ్నగర్ కారిడార్లో అటవీ శాఖ హైఅలర్ట్ ప్రకటించింది. ఇక్కడ మొత్తం 15 గ్రామాల్లో పులి కోసం సెర్చ్ ఆపరేషన్ను ఫారెస్ట్ అధికారులు నిర్వహిస్తున్నారు.పులి భయం నెలకొన్ని ఈ 15 గ్రామాల్లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.గగ్రామాల్లోని వారంతా పులి భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.పులి ఆచూకీ కనుగొనేందుకు ఫారెస్ట్ అధికారులు డ్రోన్ సహాయంతో వేట కొనసాగిస్తున్నారు. తాజాగా పులి దాడిలో ఈ ప్రాంతంలో ఇప్పటికే ఓ మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: పులి పంజాకు మహిళ బలి -
Gupta Nidhulu: గుప్తనిధుల కోసం తవ్వకాలు
శాలిగౌరారం: మండలంలోని ఆకారం గ్రామంలో గల పురాతన సూర్య దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపగా సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకారం–వల్లాల అనుసంధాన డొంకదారి సమీపంలో వ్యవసాయ పంటపొలాల నడుమ పూర్తిగా శిథిలావస్థకు చేరి ఉన్న సూర్య దేవాలయంలో గుర్తుతెలియని దుండగులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. దేవాలయ ప్రాంగణంలో రెండు చోట్ల తవ్వకాలు చేపట్టిన దుండగులు గర్భ గుడిలో కూడా తవ్వకాలు జరిపారు. ఈ దేవాలయంలో సూర్యదేవుడి భారీ పంచలోహ విగ్రహంతో పాటు నంది, ఇతర విగ్రహాలు కూడా ఉండేవని స్థానికులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆలయ సమీపంలోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసినప్పటి నుంచి గుప్తనిధుల కోసం ఇక్కడ తవ్వకాలు జరపడంతో పంచలోహ విగ్రహాలు మాయమయ్యాయని స్థానికులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరోమారు గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు జరిపి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
జొన్నగిరిలో రూ.1.75 లక్షల వజ్రం లభ్యం
తుగ్గలి: కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో పేదలను వజ్రాలు వరిస్తున్నాయి. జొన్నగిరిలో పొలాల్లోకి వెళ్లిన ఓ వ్యక్తికి మంగళవారం వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రాన్ని రూ.1.75 లక్షలు, జత కమ్మలు ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేసినట్లు తెలిసింది. -
ప్రపంచవ్యాప్తంగా హమాస్ ఏరివేతకు ఇజ్రాయెల్ రంగం సిద్ధం!
టెల్ అవీవ్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేవలం గాజాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తలదాచుకున్న హమాస్ ఉగ్రవాదులను వేటాడి హతమార్చాలని గూఢచారి సంస్థలను ఆదేశించినట్లు సమాచారం. నెతన్యాహు ఆదేశాలను అమలు చేయడానికి ఇంటెలిజెన్స్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. టర్కీ, లెబనాన్, ఖతార్లలో హమాస్ నాయకులను వేటాడేందుకు ఇజ్రాయెల్ గూఢచారి ఏజెన్సీలు ఇప్పటికే నిఘా పెట్టాయి. హమాస్ వర్గానికి ఖతార్ సానుకూల వైఖరి ప్రదర్శిస్తోంది. రాజధాని దోహాలో హమాస్ కార్యకలాపాలను దశాబ్దంపాటు కొనసాగించేందుకు అనుమతిని కూడా ఇచ్చింది. ఇటీవల ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ కొనసాగించేందుకు కూడా ఖతార్ కీలక పాత్ర పోషించింది. ఖతార్, ఇరాన్, రష్యా, టర్కీ, లెబనాన్,లు హమాస్ కార్యకలాపాలకు అవకాశం కల్పించాయని యుఎస్ ఇప్పటికే ఏన్నోసార్లు ఆరోపించిన విషయం కూడా తెలిసిందే. ఆయా దేశాలతో దౌత్యపరమైన సంక్షోభాలను తొలగించడానికి ఇజ్రాయెల్ కూడా ఇన్నాళ్లు హమాస్ను ఇతర దేశాల్లో లక్ష్యంగా చేయలేదు. కానీ ఇక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హమాస్ను ఏరిపారేయడానికి ఇజ్రాయెల్ ప్రస్తుతం సిద్ధమైనట్లు తెలుస్తోంది. హమాస్ నాయకులను వేటాడి హతమార్చాలని బెంజమిన్ నెతన్యాహు ఆదేశించడం ఇజ్రాయెల్లోని మాజీ ఇంటెలిజెన్స్ అధికారులలో చర్చకు దారితీసింది. మాజీ మొస్సాద్ డైరెక్టర్ ఎఫ్రైమ్ హేలేవీ దీనిని తప్పు నిర్ణయంగా అభిప్రాయపడ్డారు. హమాస్ నాయకులను నిర్మూలించడం వల్ల ఇజ్రాయెల్కు ముప్పు తొలగిపోదని తెలిపారు. అందుకు బదులుగా హమాస్ అనుచరులు మరింత ఘోరమైన దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఇదీ చదవండి: గాజాపై మళ్లీ బాంబుల వర్షం.. 175 మంది మృతి -
నిధుల కొరత, వ్యూహాత్మక భాగస్వాముల వేటలో ‘కూ’
న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ కూ తదుపరి దశ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నిధులు సమీకరించడం లేదా వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకునే యోచనలో ఉంది. సంస్థ సహ వ్యవస్థాపకుడు మయాంక్ బిదావత్కా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం పెట్టుబడుల రాక మందగించిన నేపథ్యంలో ’కూ’ ప్లాట్ఫామ్ విస్తృతంగా వృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించగలిగే భాగస్వామితో చేతులు కలపాలని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. (మోదీజీ..వచ్చే ఏడాదికి గొప్ప బర్త్డే గిఫ్ట్: ఫాక్స్కాన్ పోస్ట్ వైరల్) స్టార్టప్ వ్యవస్థకు 2023 అత్యంత కష్టతరమైన సంవత్సరాల్లో ఒకటని మయాంక్ చెప్పారు. నిధుల ప్రవాహం ఒక్కసారిగా నిల్చిపోయిందని, దాదాపు బ్రేక్ఈవెన్కి దగ్గర్లో ఉన్నవి లేదా ప్రారంభ దశలోని స్టార్టప్లకు మాత్రమే నిధులు లభించాయని తెలిపారు. మరో ఆరు నెలలు సమయం లభించి ఉంటే తాము దేశీయంగా ట్విటర్ను (ప్రస్తుతం ఎక్స్) అధిగమించి ఉండేవారమని, కానీ పరిస్థితుల వల్ల ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చిందన్నారు. (గణేష్ చతుర్థి: ఈ మూడు రోజులు సెలవులేనా? ఇవిగో వివరాలు) -
Manipur: మానవ మృగాల కోసం గాలింపు ముమ్మరం
ఇంఫాల్: మనిషి రూపంలోని మృగాల కోసం మణిపూర్లో భారీ ఎత్తున వేట కొనసాగుతోంది. జాతుల మధ్య వైరంతో విద్వేషం పెంచుకుని.. మూక దాడిలో ఇద్దరిని బలిగొనడమే కాకుండా.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అందులో ఒకరిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారనే అభియోగాలపై ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. తాజాగా ఈ వ్యవహారంలో మరో అరెస్ట్ జరిగింది. వైరల్ వీడియో ఆధారంగా.. ప్రధాన నిందితుడు హుయిరేమ్ హెరోదాస్ సింగ్ను.. మరో ముగ్గురిని పోలీసులు ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అరెస్టుల సంఖ్య ఐదుకి చేరింది. మరోవైపు హుయిరేమ్ ఇంటిని తగలబెట్టిన కొందరు మహిళలు.. అతని కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన నిందితులను పట్టుకునేందుకు భారీ ఎతున సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు మణిపూర్ పోలీసులు. ఈ సెర్చ్ ఆపరేషన్ను స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్సింగ్ పర్యవేక్షిస్తున్నారు. నిందితుల్లో ఓ ఒక్కరినీ వదిలిపెట్టబోమని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో.. తీవ్ర విమర్శల నేపథ్యంలో మరణశిక్ష కోసం ప్రయత్నిస్తామంటూ సీఎం బీరెన్ సింగ్ ప్రకటించిన సంగతీ తెలిసిందే. వీడియో ఆధారంగా వీలైనంత మందిని ట్రేస్ చేసి.. వాళ్ల ద్వారా మిగతా వాళ్లను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు పోలీసులు. వీడియో వైరల్ కావడంతో వాళ్లంతా తలోదిక్కు పారిపోయి తలదాచుకుని ఉంటారని భావిస్తున్నారు. మణిపూర్ వ్యాప్తంగా అటు కొండప్రాంతంలో.. ఇటు లోయ ప్రాంతాల్లోనూ 126 చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి జల్లెడపడుతున్నారు. శాంతి భద్రతలకు మరోసారి విఘాతం కలిగే అవకాశాలు ఉండడంతో.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే నిందితులను త్వరగతిన పట్టుకునే ప్రయత్నం చేస్తామని మణిపూర్ పోలీస్ శాఖ ప్రకటించింది. అలాగే.. నిబంధనలు ఉల్లంఘించిన 413 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇంకోపక్క మణిపూర్ వీడియోలు అంటూ సోషల్ మీడియాలో దిగ్భ్రాంతికర కంటెంట్ అవుతోంది. ఈ క్రమంలో పుకార్లకు చెక్పెట్టేందుకు.. 9233522822 టోల్ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేయించింది మణిపూర్ ప్రభుత్వం. ఇక.. కుకీ వర్సెస్ మెయితీల ఘర్షణల్లో ఎత్తుకెళ్లిన ఆయుధాలను దయచేసి దగ్గర్లో ఉన్న స్టేషన్లో అప్పగించాలంటూ జనాలకు విజ్ఞప్తి చేస్తోంది ప్రభుత్వం. బెస్ట్ స్టేషన్ సమీపంలోనే.. మణిపూర్ నుంచి దేశాన్ని కుదిపేసిన కీచకపర్వానికి సంబంధించి మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగు చూసింది. 2020లో దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది నోంగ్పోక్ సెక్మయ్ స్టేషన్. ఈ పీఎస్ పరిధిలో.. అదీ ఒక కిలోమీటర్ పరిధిలో ఈ అకృత్యం జరగడం గమనార్హం. మే 4వ తేదీన(మణిపూర్ ఘర్షణలు మొదలైన మరుసటి రోజే) బీ ఫైనోమ్ గ్రామంలో మహిళలను నగ్నంగా ఊరేగించారు. పక్షం తర్వాత బాధితులు ఫిర్యాదు చేయడంతో.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నోంగ్పోక్ సెక్మయ్ పోలీసులు.. అపహరణ, హత్య, గ్యాంగ్ రేప్ నేరాల కింద కేసు నమోదు చేశారు. అయితే.. జులై 19న వీడియో వెలుగులోకి రావడం.. విమర్శల నేపథ్యంలో.. ఇప్పుడు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. మరో ఘటన కూడా? మణిపూర్లో ఘర్షణల ముసుగులో జరిగిన రాక్షస చర్యలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మహిళలను నగ్నంగా ఉరేగించిన ఘటన సమయంలోనే మరో దారుణం చోటుచేసుకుందని తెలుస్తోంది. బీ ఫైనోమ్కు 40 కిలోమీటర్ల దూరంలో.. కాంగ్పోక్సీలో కారు సర్వీస్ సెంటర్లో పని చేసే ఇద్దరు యువతులపై గ్యాంగ్ రేప్ జరిగిందని.. అనంతరం బయటకు ఈడ్చేయడంతో వాళ్లు తీవ్రంగా గాయపడ్డారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వాళ్లు కన్నుమూశారని ఆ యువతుల స్నేహితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటి జాతీయ మీడియా కథనాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై అక్కడి పోలీసుల నుంచి ప్రకటన వెలువడాల్సి ఉంది. -
కళ్ల ముందు జింక ఉన్నా.. వేటాడని పులి.. వీడియో వైరల్..
పులి వేటాడితే మామాలుగా ఉండదు. అదనుచూసి చీల్చిచెండాడుతుంది. మరి అలాంటి వన్యమృగం కళ్ల ముందు జింక ప్రత్యక్షమైతే ఊరుకుంటుందా.. వెంటాడి వేటాడి దాని ఆకలి తీర్చకుంటుంది కదా..! కానీ ఈ పులి మాత్రం అలా చేయలేదు. జింక కళ్లముందే కదలాడుతున్నా దాన్ని అసలు పట్టించుకోలేదు. దాన్ని చూస్తూ పక్కనుంచి నడుచుకుంటూ వెళ్లింది తప్ప వేటాడేందుకు ప్రయత్నించలేదు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తరాఖండ్ అటవీ శాఖ ట్విట్టర్లో షేర్ చేయగా అది వైరల్గా మారింది. 'పులి దానికి ఆకలిస్తేనే వేటాడుతుంది, లేదా ఎవరైనా హాని చేయాలని ప్రయతిస్తేనే దాడి చేస్తుంది. కళ్లముందు జింక ఉన్నా ఏమీ అనుకుండా ఎలా నడుచుకుంటూ వెళ్తుందో చూడండి. పులి ఒక సాధవు.' అని అటవీ అధికారి ట్వీట్ చేశారు. The tiger is a monk. It won't bother you, or be bothered by you. It tries to maintain its composure as much as it can. Even if you are around it, it will most likely be unfazed. And even when a tiger expresses its aggression, it is mock. It's a construct. pic.twitter.com/FcxsduIMx2 — Ramesh Pandey (@rameshpandeyifs) March 1, 2023 ఈ వీడియోపై నెటిజ్లను భిన్నరకాలుగా స్పందించారు. పులి చాలా సైలెంట్గా వేటాడుతుంది, ఈ ఒక్క వీడియో చూసి దాన్ని సాధువు అనలేం అని ఓ యూజర్ రిప్లై ఇచ్చాడు. ఆ జింకకు నిజంగా గట్స్ ఉన్నాయి. లేకపోతే పులికి ఎదురుగా అలా ఎందుకు నిలబడుతుంది? దాని జీవితంపై ఆశలు వదిలేసుకుని ఇలా చేసి ఉంటుంది. అని మరో యూజర్ రాసుకొచ్చాడు. చదవండి: మందుబాబులకు గుడ్ న్యూస్.. ఇకపై ఉదయం 3 వరకు బార్లు ఓపెన్.. ఎక్కడంటే? -
ఆఫీషియల్: విడుదలైన రెండు వారాలకే ఓటీటీకి హాంట్, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేం భరత్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ మూవీ ‘ముంబై పోలీస్’కు రీమేక్గా వచ్చిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. అయితే హంట్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీసు వద్ద ఈ మూవీ బోల్తా పడింది. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ దీంతో ఈ మూవీ థియేటర్లో విడుదలైన 2 వారాలకే ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ మూవీ స్ట్రీమింగ్కు అంతా రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తాజాగా ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది. అంటే ఈ శుక్రవారం నుంచి హంట్ ఓటీటీలో సందడి చేయబోతోంది. కాగా ఏ చిత్రమైన థియేటర్లో విడుదలైన 6 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుంది. కానీ సుధీర్ భాబు, శ్రీకాంత్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి రావడం గమనార్హం. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ Get ready for the action-packed #HuntTheMovie thriller movie releasing on Feb 10 on aha.#HuntTheMovieOnAHA Premieres Feb 10@isudheerbabu @_apsara_rani @actorsrikanth @bharathhere @Imaheshh #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial @anneravi @adityamusic pic.twitter.com/qGghi97ip0 — ahavideoin (@ahavideoIN) February 9, 2023 -
అప్పుడే ఓటీటీలోకి ‘హంట్’..స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఈ మూవీ అప్పుడే ఓటీటీలోకి రావడానికి రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా బజ్ ప్రకారం.. ఫిబ్రవరి 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ఫ్రైమ్ వీడియోలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రతి చిత్రం దాదాపు 8 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని ఆ మధ్య టాలీవుడ్ ఓ రూల్ పెట్టుకున్న విషయం తెలిసిందే. కానీ హంట్ చిత్రం మాత్రం రెండు వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్కి రెడీ అయింది. -
నేను అలాంటి సినిమాలు చేయను: సుధీర్ బాబు
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి హిట్ టాక్ లభించింది. తాజాగా చిత్రబృందం సంస్థ కార్యాలయంలో సక్సెస్ మీట్ నిర్వహించారు. సుధీర్ బాబు మాట్లాడుతూ..'సినిమాకు మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారోనని భయపడ్డాం. ప్రేక్షకులు అందరూ సెకండాఫ్లో 30 నిమిషాలు ఎక్సలెంట్ అని చెబుతున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది సినిమాను సూపర్బ్ అంటూ పోస్టులు చేశారు. ఆడియన్స్ చాలా థాంక్స్. నేను అయితే రెగ్యులర్ సినిమాలు చేయను. ఇప్పటి వరకు చేసినవి అన్నీ డిఫరెంట్ సినిమాలే. ఈ సినిమా కూడా చాలా డిఫరెంట్ సినిమా.' అని అన్నారు. దర్శకుడు మహేష్ మాట్లాడుతూ..'క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. హీరో సుధీర్ బాబు గారు ధైర్యంగా ఆ రోల్ చేశారు. నేను ఎప్పటికీ గర్వపడే సినిమా. తెలుగులో ఇటువంటి సినిమా చేయడం తొలిసారి. భరత్ మా సినిమాలో నటించినందుకు థాంక్స్. సుధీర్ బాబుకు హ్యాట్సాఫ్. ప్రేక్షకులకు కొత్తదనం ఇవ్వాలనే తపన ఆయనదే.' అని అన్నారు. భరత్ మాట్లాడుతూ..'తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి కొన్నేళ్లు టైమ్ తీసుకున్నా. మంచి సినిమా చేశా. కంటెంట్ సినిమాల కోసం చూసే ప్రేక్షకులకు సరైన చిత్రమిది. కమర్షియల్ వ్యాల్యూస్తో తీశాం. మహేష్ కెరీర్లో ఇదొక మంచి సినిమా. సుధీర్ బాబు కొత్తగా ట్రై చేశారు. ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు సంతోషంగా ఉంది.' అని అన్నారు. సినిమాటోగ్రాఫర్ అరుల్ విన్సెంట్ మాట్లాడుతూ..'సినిమాకు లభిస్తున్న స్పందనతో సంతోషంగా ఉన్నాం. కొత్తగా చేయడం నాకు చాలా ఇష్టం. 'పలాస' తర్వాత తెలుగులో నేను చేసిన చిత్రమిది. సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ ముగ్గురు హీరోలు అద్భుతంగా నటించారు. సినిమాలో హీరోయిన్ లేదనే ఫీలింగ్ ఎవరికీ ఉండదు. రెస్పాన్స్ బాగుంది.' అని అన్నారు. -
‘హంట్’ మూవీ రివ్యూ
టైటిల్ : హంట్ నటీనటులు: సుధీర్బాబు, శ్రీకాంత్, భరత్, చిత్ర శుక్లా తదితరులు నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్ నిర్మాత: వీ ఆనంద్ ప్రసాద్ దర్శకుడు: మహేశ్ సంగీతం: జిబ్రాన్ సినిమాటోగ్రఫి: అరుల్ విన్సెంట్ ఎడిటర్ : ప్రవీణ్ పూడి విడుదల తేది: జనవరి 26, 2023 కథేంటంటే.. ముగ్గురు ఐపీఎస్ అధికారులు అర్జున్ ప్రసాద్(సుధీర్ బాబు), మోహన్ భార్గవ్(శ్రీకాంత్), ఆర్యన్దేవ్(భరత్)ల చుట్టు ఈ కథ సాగుతుంది. ఈ ముగ్గురు మంచి స్నేహితులు. ఏ కేసునైనా ఇట్టే సాల్వ్ చేస్తారు. వీరిలో ఆర్యన్ దేవ్ దారుణ హత్యకు గురవుతాడు. ఈ కేసును అర్జున్ ప్రసాద్ విచారిస్తాడు. తన స్నేహితుడిని చంపిదెవరో తెలుసుకునే క్రమంలో అర్జున్కు యాక్సిడెంట్ అవుతుంది. ఈ ప్రమాదం కారణంగా ఆయన గతం మర్చిపోతాడు. ఈ విషయాన్ని దాచి మళ్లీ ఆ కేసును విచారించే బాధ్యతను అర్జున్కే అప్పగిస్తాడు కమిషనర్ మోహన్ భార్గవ్. గతం మర్చిపోయిన అర్జున్ ఈ కేసును ఎలా చేధించాడు? ఈక్రమంలో ఆయనకు ఎదురైన ఇబ్బందులేంటి? ఇంతకి ఆర్యన్ దేవ్ని హత్యచేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు చివరకు అర్జున్ ఏం చేశాడు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హంట్ ఓ ఇన్విస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. గతం మర్చిపోయిన ఓ పోలీస్ ఆఫీసర్..తన గతం తెలుసుకొని ఓ మర్డర్ కేసును ఎలా ఛేదించాడు అనేదే ఈ సినిమా కథ. క్లైమాక్స్లో వచ్చే ఒక ట్విస్ట్.. అందరికి షాకివ్వడమే కాకుండా అప్పటి వరకు సినిమాపై ఉన్న ఒపీనియన్ని మార్చేస్తుంది. ఆ ఒక్క పాయింట్ మాత్రమే కొత్తగా ఉంటుంది. ఆ పాయింట్కి ఒప్పుకొని సినిమాను తీసిన సుధీర్ బాబుని కచ్చితంగా అభినందించాల్సిందే. కానీ ఈ సినిమా కథనం మాత్రం ఆసక్తికరంగా సాగదు. మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ నెమ్మదిగా సాగడం సినిమాకు మైనస్. సినిమా ప్రారంభం అయిన కొన్ని క్షణాలకే అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. స్టార్టింగ్ కాస్త ఇంట్రెస్టింగ్గా కథనం సాగుతుంది. కానీ ఓ 15 నిమిషాల తర్వాత రొటీన్ సన్నివేశాలు..స్లో నెరేషన్ ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారుతుంది. దర్శకత్వం లోపం వల్ల కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ మిస్ అయ్యాయి. అలాగే నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. సెకండాఫ్లో కథలో వేగం పుంజుకుంటుంది. ఇంటర్వెల్ తర్వాత వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఆడియన్స్కి గట్టి షాకిస్తుంది. ఎవరెలా చేశారంటే.. అర్జున్ ప్రసాద్ పాత్రలో సుధీర్ బాబు ఒదిగిపోయాడు. గతం మర్చిపోయిన పోలీసు అధికారిగా ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్, యాక్షన్ సీన్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్లో సుధీర్ బాబు నటన అందరినీ మెప్పిస్తుంది. మోహన్ భార్గవ్ పాత్రకి శ్రీకాంత్ న్యాయం చేశాడు. కాస్త సీరియస్గా ఉండే పాత్ర తనది. భరత్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు తెరపై మెరిశాడు. ఏసీపీ ఆర్యన్ దేవ్గా ఆయన ఉన్నంతలో చక్కగా నటించారు. కథంతా అతని పాత్ర చుట్టే తిరుగుతుంది. మైమ్ గోపీ, కబీర్ సింగ్ దుల్హన్, మంజుల, సంజయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతిక విషయాలకొస్తే.. జిబ్రాన్ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయింది. అరుల్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
అందుకే డూప్స్.. రోప్స్ వాడలేదు
‘‘హంట్’ మూవీ ఎంగేజింగ్ థ్రిల్లర్గా ఉంటుంది. స్నేహం నేపథ్యంలో వచ్చే భావోద్వేగ సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. ప్రేక్షకులు నాపాత్రతో ప్రయాణిస్తూ కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఈ సినిమా ఆడియన్స్కి కొత్త అనుభూతిని పంచుతుంది’’ అని హీరో సుధీర్బాబు అన్నారు. మహేశ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘హంట్’. శ్రీకాంత్, భరత్ కీలకపాత్రలు చేశారు. వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుధీర్బాబు పంచుకున్న విశేషాలు. ► ఓ సినిమా కోసం 50, 60 కథలు వింటుంటే ఒక మంచిపాయింట్ నచ్చుతుంది. దాన్ని ఎందుకు వదులుకోవడం? కొత్త దర్శకుడైనా మనం ఎందుకు సపోర్టు చేయకూడదు? అని ఆలోచిస్తాను. నాకు డౌట్స్ ఉంటే ముందు ప్రశ్నలు అడుగుతా.. ఆ తర్వాత టెస్ట్ షూట్ చేయమని చెబుతా. ‘హంట్’ సరికొత్త కథ. పైగా, భవ్య క్రియేషన్స్లాంటి అనుభవం ఉన్న నిర్మాతలున్నారు. ఆ నమ్మకం తోనే ఈ సినిమా చేశాను. ► ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ అర్జున్పాత్ర చేశాను. గతం మర్చిపోవడానికి ముందు, గతం మర్చిపోయిన తర్వాత.. ఇలా రెండు వేరియేషన్స్ ఉంటాయి. ఇందులో యాక్షన్ రియల్గా ఉండాలనుకున్నాం. అందుకే డూప్స్, రోప్స్ వాడలేదు. ‘జాన్ విక్ 4’కు వర్క్ చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్లు మా మూవీకి పనిచేశారు. ఫారిన్లో ఫైట్లు షూట్ చేశాం. నాలుగు రోజుల్లో యాక్షన్ సీక్వెన్సులు తీశాం. ► ‘హంట్’లో హీరోయిన్ లేదు. మేం అక్కడే రూల్ బ్రేక్ చేశాం. రెండు నిమిషాల్లో కథలో లీనమవుతారు. నాకు, నా కుటుంబ సభ్యులకు, ప్రీమియర్ చూసిన వందల మందికి సినిమా నచ్చింది. అయితే ప్రతి హీరో అటెంప్ట్ చేసే స్టోరీ కాదు ఇది. ► మా మామయ్య కృష్ణగారు చాలా ప్రయోగాలు చేశారు. నేను కొత్తగా చేసిన ‘హంట్’ చూసి అభినందిస్తారనే నమ్మకం ఉండేది. కానీ, ఆయన మన మధ్య లేకపోవడంతో వెలితిగా ఉంది. ప్రస్తుతం హర్షవర్ధన్ దర్శకత్వంలో ‘మామా మశ్చీంద్ర’ సినిమా, యూవీ క్రియేషన్స్లో అభిలాష్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాను’’ అన్నారు. -
సుధీర్ బాబు హంట్ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ (ఫోటోలు)
-
కృష్ణగారికి జన్మజన్మలు రుణపడి ఉంటాను.. సుధీర్ బాబు ఎమోషనల్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం హంట్. సీనియర్ హీరో శ్రీకాంత్, 'ప్రేమిస్తే' ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించారు.మహేశ్ సూరపనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. పోలీస్ డ్రామా నేపథ్యంలో రాబోతున్న రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్ ఏ.ఎమ్.బి. మాల్లో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. 'గత ఏడాదిగా మా కుటుంబంలో మూడు మరణాలు చోటు చేసుకున్నాయి. కృష్ణ గారి మరణం మాకు పెద్ద లాస్. మావయ్య చనిపోయాక ఇది నా ఫస్ట్ మూవీ. ఆయన లేని వెలితి కనిపిస్తుంది. నా ప్రతి సినిమా ఫస్ట్ షో చూసిన నాకు ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇప్పుడు నేను అది మిస్ అవుతా. మావయ్య చనిపోవడానికి 20 రోజుల ముందు సినిమా ఏదైనా చూస్తారా? అని ఆయన్ను అడిగితే... 'నేను ఎవరి సినిమాలు చూడను. మహేష్ సినిమాలు, సుధీర్ సినిమాలు మాత్రమే చూద్దామని అనుకుంటున్నా' అని చెప్పారట. ఇది నాకు గర్వకారణం. కెరీర్లో ఎంత దూరం వెళతానో తెలియదు. ఈ ప్రయాణం మావయ్య గారికి అంకితం. జన్మజన్మలు ఆయనకు రుణపడి ఉంటాను' అంటూ సుధీర్ బాబు పేర్కొన్నారు. -
ఆ సినిమా రీమేక్ నేను చేయాల్సింది: భరత్
‘టాలీవుడ్లో అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. గంగోత్రి నుంచి ఆయన జర్నీని చూస్తున్నాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అప్పట్లో ఆ సినిమా తమిళ రీమేక్ నేను చేయాల్సింది.కానీ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను’అని తమిళ హీరో భరత్ అన్నారు. బాయ్స్, ప్రేమిస్తే, యువసేన సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చేరువైన ఆయన...చాలా కాలం తర్వాత తెలుగు సినిమా ‘హంట్’లో కీలక పాత్ర పోషించారు. సుధీర్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ పతాకం పై ప్రముఖ నిర్మా త వి. ఆనం ద ప్రసాద్ నిర్మిం చారు. మహేష్ దర్శకత్వం వహిం చారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుం ది. ఈ సందర్భంగా భరత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘తమిళ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తెలుగు చిత్రాలపై దృష్టిపెట్టలేదు. దర్శకుడు మహేష్ వచ్చి ఈ స్క్రిప్ట్ చెప్పడంతో, కథ నచ్చి దాదాపు పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మూవీ చేశా. ఇందులో ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్ గా నటించా. నేను తమిళంలో పోలీసుగా నటించిన కాళిదాసు మూవీ నచ్చి డైరెక్టర్ మహేష్ ఈ రోల్ ఇచ్చాడు. 'హంట్'లో యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్, ఫ్రెండ్ షిప్ అన్నీ ఉంటాయి. ఈ సినిమా తెలుగులోనూ నా మార్కెట్ కి హెల్ప్ అవుతుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. -
ఆద్యంతం ఆసక్తికరంగా ‘హంట్’ట్రైలర్
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా సినిమా 'హంట్'. భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. మహేష్ దర్శకత్వం వహించారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేసి, చిత్ర యూనిట్కి ఆల్ది బెస్ట్ చెప్పారు. ఇక ట్రైలర్ విషయానికొస్తే.. ‘ఏ కేసును అయితే అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో... అదే కేసును ఇప్పుడు ఈ అర్జున్ సాల్వ్ చేయాలి’ అని శ్రీకాంత్ చెప్పే డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. టీజర్లో కూడా ఆయన ఈ మాట చెప్పారు. ఆ కేసు ఏమిటన్నది ట్రైలర్లో చూపించారు. పట్టపగలు ఓ అసిస్టెంట్ కమిషనర్ హత్యకు గురవుతారు. ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో హీరోకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? ఏం చేశారు? అనేది ఆసక్తికరం. ఈ చిత్రంలో మెమరీ లాస్ అయిన అసిస్టెంట్ కమిషనర్ అర్జున్ పాత్రలో సుధీర్ బాబు నటించారు. మెమరీ లాస్కు ముందు జరిగిన ఘటనలు, వ్యక్తులు గుర్తు లేకపోవడంతో అర్జున్ కొత్తగా కేసును ఇన్వెస్టిగేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. రోజుకు ఒక కొత్త అనుమానితుడి పేరు వస్తుంది. దానికి తోడు 18 రోజుల్లో కేసును పరిష్కరించాలని టార్గెట్. అప్పుడు అర్జున్ ఏం చేశాడు? థ్రిల్లింగ్ జర్నీగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. -
మహేష్ బాబు ఒకప్పటిలా లేడు: సుధీర్ బాబు
-
' హంట్ మూవీ ' హీరో సుధీర్ బాబుతో " స్పెషల్ చిట్ చాట్ "
-
డూప్ లేకుండా రిస్కీ ఫైట్స్.. సుధీర్ బాబు యాక్షన్ స్టంట్స్ మేకింగ్ వీడియో రిలీజ్
సుధీర్ బాబు హీరోగా మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘హంట్’. ఈ నెల 26న ఈ చిత్రం విడుదల కానున్న సందర్భంగా మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సెస్ని ఫ్రాన్స్కి చెందిన క్యాంపస్ యూనివర్స్ కాస్కేడ్స్ టీమ్ డిజైన్ చేసింది. సుధీర్బాబు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలోని రిస్కీ ఫైట్స్కి డూప్ వాడలేదు. రోప్, బెడ్లాంటివి ఏవీ లేకుండానే ఫైట్స్ చేశాం. ఈ సినిమాలో అన్నీ మరపోయే రెండు షేడ్స్ ఉన్న అర్జున్ పాత్ర చేశాను. జ్ఞాపకశక్తి కోల్పోక ముందు కోల్పోయాక.. ఇలా నా పాత్ర ఉంటుంది’’ అన్నారు. ‘‘హై వోల్టేజ్యాక్షన్ థ్రిల్లర్గా ఈ త్రాన్ని రూపొందించాం. హాలీవుడ్ వర్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు వర్క్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ ‘హంట్’కి స్టంట్స్ కంపోజ్ చేశారు. ‘జాన్ విక్ 4’కి చిత్రానికి కూడా వాళ్లే స్టంట్ కొరియోగ్రాఫర్స్. ఈ ముగ్గురికీ తొలి భారతీయ చిత్రం ఇది’’ అన్నారు ఆనందప్రసాద్. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి. -
రిపబ్లిక్ డే కానుకగా ‘హంట్’
సుధీర్బాబు హీరోగా, శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేమ్ భరత్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘హంట్’. మహేశ్ దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో సుధీర్బాబు, శ్రీకాంత్, భరత్ పోలీసాఫీసర్లుగా నటించారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్భంగా వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘రిపబ్లిక్ డే కానుకగా ‘హంట్’ సినిమాను జనవరి 26న థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాం. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తయ్యాయి. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన పలు చిత్రాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్స్ రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియార్ ‘హంట్’ సినిమాకు యాక్షన్ స్టంట్స్ కొరియోగ్రఫీ చేశారు. వాళ్లు డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఓ హైలైట్గా నిలుస్తుంది’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: జిబ్రాన్, కెమెరా: అరుల్ విన్సెంట్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అన్నే రవి. -
సుధీర్బాబు హంట్కు హాలీవుడ్ యాక్షన్ టచ్
సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన చిత్రం 'హంట్'. మహేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. దీనికి హాలీవుడ్ సినిమా యాక్షన్ డైరెక్టర్స్ వర్క్ చేయడం విశేషం. మార్వెల్ స్టూడియోస్ నిర్మించిన చాలా సినిమాలకు పని చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ 'హంట్'లో స్టంట్స్ కంపోజ్ చేశారు. నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "హాలీవుడ్లో రేనాడ్ ఫవెరో, బ్రయాన్ విజియర్ చాలా సినిమాలకు వర్క్ చేశారు. ఇప్పుడు వస్తున్న 'జాన్ విక్ 4'కి కూడా వాళ్ళే స్టంట్ కొరియోగ్రాఫర్స్. మా సినిమాలో వాళ్ళ ఫైట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ వెల్లడిస్తాం'' అని అన్నారు. సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. 'హంట్' మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు నటిస్తున్నారు. చదవండి: మరో భాషలో వస్తున్న కాంతార, రిలీజ్ ఎప్పుడంటే? బాలీవుడ్ నటిపై నిఖిల్ ఆగ్రహం -
తార్ మార్ తక్కర్ మార్.. చివరికి భలే ట్విస్ట్
ప్రాణి ప్రపంచం వాటి మనుగడ పోరాటాన్ని మాత్రమే కాదు అప్పుడప్పుడు సరదాను కూడా మానవాళికి పంచుతుంటుంది. అలాంటి వీడియోనే ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ పులి.. నీల్గై (బ్లూబక్)ను చూసి వేటాడాలనుకుంది. దాడి చేసే క్రమంలో నెమ్మదిగా ముందుకు కదిలింది. సరిగ్గా.. ఆ నీలిజింక తలెత్తి చూసే సమయానికి కిందకు వంగుని దాగుడు మూతలు ఆడింది. చివరికి.. ఆ రెండింటి మధ్య జరిగిన తార్ మార్ తక్కర్ మార్ ఫలితం ఏంటో మీరూ చూసేయండి. Hide and seek! It began when she saw the #Nilgai at about 80m. Interestingly, the #tiger had all the grass to hide, but she continued to blend with the road without cover. #SatpuraNationalPark #Hunting #predator #SavetTiger #TigerTales @NatureIn_Focus @RGSustain1 @conserve_ind pic.twitter.com/qMbK1fOhXG — Rajesh Sanap (@RajeshVS87) November 6, 2022 మధ్యప్రదేశ్ సాత్పురా నేషనల్ పార్క్లో ఈ ఘటన జరిగిందని రాజేష్ సనాప్ అనే వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్ వీడియోను పోస్ట్ చేశారు. విపరీతమైన లైకులు, వ్యూస్తో దూసుకుపోతోంది ఆ వీడియో. సరదా కామెంట్లు మాత్రమే కాదు.. ఈ వీడియోపై సీరియస్ కోణంలోనూ కామెంట్లు కనిపిస్తున్నాయి. ఇదీ చూసేయండి: రైళ్లలో కొందరు ఛాయ్ ఎలా వేడి చేస్తారో తెలుసా? -
‘హాంట్’ టైటిల్ పై వివాదం.. నోటీసులు పంపిన చిత్ర బృందం
గత కొన్నిరోజులుగా సినిమా పరిశ్రమలో నెలకొన్న ఈ వివాదం లీగల్ నోటీసులు వరకు వెళ్ళింది. శ్రీ క్రియేషన్స్ బ్యానర్లో జూలై లొనే హాంట్ అనే టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నామని శ్రీ క్రియేషన్స్ బ్యానర్ తరుపున లాయర్ సురేష్ బాబు ద్వారా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కి, భవ్య క్రియేషన్స్ బ్యానర్ నోటీసులు పంపారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డైరెక్టర్, హీరో నిక్షిత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ లో మొదటగా మేము టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఆ తరువాత భవ్య క్రియేషన్స్ వారు అదే టైటిల్తో అప్లై చేసుకుంటే, రెండు ఫిల్మ్ ఛాంబర్స్ రిజెక్ట్ చేశాయి. ఆ తరువాత అదే టైటిల్ ని ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ద్వారా భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ రిజిస్ట్రేషన్ అయింది. ఛాంబర్ లో ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని మేము అడిగితే సమాధానం ఇవ్వకుండా మాట దాటేస్తున్నారు. అందుకే మా లాయర్ ద్వారా వాళ్లందిరికి నోటీసులు పంపించాం. మా టైటిల్ మాకు వచ్చే అంత వరకు న్యాయపరమైన పోరాటం చేస్తాం’ అని అన్నారు. ‘చాలా ఖర్చు పెట్టి సినిమా తీశాం. ఇప్పుడు టైటిల్ ఇష్యూ వల్ల బిజినెస్కి ఇబ్బంది అవుతుంది. మా టైటిల్ మాకు వచ్చేంత వరకు పోరాటం చేస్తాం’అని నిర్మాత నర్సింగరావ్ అన్నారు. ఎం.ఎస్.ఆర్ట్స్ స్టూడియో అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యుసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ.. ఫిల్మ్ ఛాంబర్స్ సైతం ఈ టైటిల్ శ్రీ క్రియేషన్స్ వారి పేరు మీద ఉందని చెప్పాయి. ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు భవ్య క్రియేషన్స్ వారికి టైటిల్ ఇవ్వొద్దు అని లెటర్స్ పెట్టిన వారి మాటని తిరస్కరించి అనుమతి ఇచ్చిన ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ తప్పును వారే తెలుసుకోవాలి. ఎవరికి అన్యాయం జరగవద్దు అనేది నా కోరి’అని అన్నారు. -
సుధీర్ బాబు ‘హంట్’ టైటిల్ మాది: హీరో నిక్షిత్
‘‘హంట్’ టైటిల్ని ముందు మేము రిజిస్టర్ చేయించాం. అయితే సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్పై రూపొందిన చిత్రానికి కూడా ‘హంట్’ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ మార్చుకోమన్నా వారు పట్టించుకోవడం లేదు’’ అని ‘హంట్’ హీరో, దర్శకుడు నిక్షిత్ అన్నారు. నర్సింగ్ రావు నిర్మించిన చిత్రం ‘హంట్’. నిక్షిత్ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మోషన్ టీజర్ను విడుదల చేశారు. ఎమ్ఎస్ఆర్ట్స్ అధినేత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ– ‘‘శ్రీ క్రియేషన్స్ బ్యానర్పై ‘హంట్’టైటిల్ను 6 నెలల క్రితం ఫిల్మ్ చాంబర్లో రిజిస్టర్ చేసుకున్నాం. ఇదే టైటిల్ని భవ్య క్రియేషన్స్ పెట్టుకుని, సినిమా విడుదల ప్రమోషన్ కూడా స్టార్ట్ చేశారు’’ అన్నారు. ‘‘మా ‘హంట్’ ఆడియో రైట్స్ అమ్మటానికి ప్రయత్నం చేశాం.. కానీ, ‘హంట్’ పేరుతో వేరే చిత్రం కూడా ఉంది కాబట్టి మేము మీ చిత్రం కొనలేమని చెప్పారు. ఈ విషయంలో న్యాయం జరగాలి’’ అని నర్సింగ్ రావు అన్నారు. -
చీకట్లో నల్ల చిరుత.. అలా బంధించే హక్కు ఎవడిచ్చాడు?
వైరల్: నల్ల చిరుత.. చాలా అరుదుగా కనిపించే ప్రాణి. అలాంటి ప్రాణి వేటాడే దృశ్యాలు ఇంకా అరుదుగా కనిపించే దృశ్యమనే చెప్పాలి. అయితే అలాంటి అరుదైన సందర్భాన్ని బంధించే క్రమంలో.. ఓ వీడియోగ్రాఫర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ నల్ల చిరుత.. ఓ జింకను వేటాడి దాని కళేబరాన్ని నోట కరుచుకుని వెళ్లబోతోంది. అయితే ఆ సమయంలో ఓ వీడియోగ్రాఫర్ దాన్ని చిత్రీకరించే యత్నం చేశాడు. అక్కడిదాకా బాగానే ఉన్నా.. ఫోకస్ లైట్ వేసి మరీ వాహనం శబ్దం చేయడంతో అది ఉలిక్కిపడి అక్కడి నుంచి పరుగులు తీసింది. ఇంతలో.. అక్కడే ఉన్న సాధారణ చిరుత ఆ కళేబరాన్ని నోట కరుచుకుని అక్కడి నుంచి పరారైంది. పర్ఫెక్ట్ క్యాప్చర్ అంటూనే.. స్పాట్ లైట్ యొక్క పూర్తి కాంతిలో ప్రకృతి యొక్క ఈ అరుదైన క్షణాలను సంగ్రహించే హక్కు ఎవడిచ్చాడు అంటూ ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్) అధికారి సుశాంత్ నంద ఆ వీడియోను పోస్ట్ చేశారు. A perfect capture. Both by the leopard & the videographer😞😞 But who gave the right to capture these rare moments of nature in full glare of spot light? WA fwd. pic.twitter.com/ZITOBOpO92 — Susanta Nanda (@susantananda3) October 8, 2022 ఎక్కడ, ఎప్పుడు జరిగిదో తెలియదు. ఎవరి ఆ క్షణాల్ని బంధించారో తెలియదు. కానీ, ఆ వీడియోగ్రాఫర్ చేష్టలపై సర్వత్రా ఇప్పుడు విమర్శలు వినిపిస్తున్నాయి. -
అర్జున్ను ఎవరూ ఆపలేరు.. అంచనాలు పెంచుతున్న 'హంట్' టీజర్
టాలీవుడ్ నటుడు సుధీర్బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హంట్'. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ను చిత్రబృందం సోషల్మీడియా వేదికగా విడుదల చేసింది. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. పోలీసు పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్గా సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం టీజర్ను రిలీజ్ చేసింది. 'అతను అర్జున్ ఏ. ఇక నువ్వు ఇప్పుడు అర్జున్ బీ. అర్జున్ ‘ఏ’కి తెలిసిన మనుషులు, సంఘటనలు ఏమీ కూడా అర్జున్ ‘బీ’కి తెలియవు.. వారిద్దరు విభిన్న వ్యక్తులు' అంటూ మంజుల చెప్పే సంభాషణలతో టీజర్ ప్రారంభమైంది. అర్జున్ 'ఏ'కు తెలిసిన లాంగ్వేజెస్, స్కిల్స్, పోలీస్ ట్రైనింగ్ ఇవన్నీ అర్జున్ 'బీ'కి కూడా ఉన్నాయి' అంటూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఏ కేసునైతే ఆ అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయాడో.. అదే కేసును ఈ అర్జున్ సాల్వ్ చేయాలి అనే శ్రీకాంత్ డైలాగ్ మరింత హైప్ పెంచుతోంది. 'తను ఎలా చనిపోయాడో తెలుసుకునే ప్రాసెస్లో ఎవరు ఎఫెక్ట్ అయినా... ఎంత ఎఫెక్ట్ అయినా... నన్ను ఎవరూ ఆపలేరు' అని టీజర్ చివరలో సుధీర్ బాబు చెప్పే డైలాగ్ మరింత ఆసక్తి పెంచుతోంది. సుధీర్ బాబు నటనకు తోడు సిక్స్ ప్యాక్ కూడా ఆట్టుకునేలా ఉంది. రిలీజైన కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన వస్తోంది. కానీ అర్జున్ 'ఎ'గా ఉండటమే అతనికి ఇష్టం! మరి అతని కోరిక నెరవేరిందా? అర్జున్ మొదలుపెట్టి సాల్వ్ చేయలేకపోయినా కేసు ఏమిటి? అనేది 'హంట్' సినిమాలో చూడాల్సిందే. -
సుధీర్ బాబు 'హంట్' అప్డేట్.. టీజర్ రిలీజ్ ఆరోజే..!
సుధీర్ బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'హంట్'. ఈ చిత్రంలో హీరో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ‘గన్స్ డోన్ట్ లై’ అనేది క్యాప్షన్. మహేశ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. పోలీసు పాత్రల్లో యాక్షన్ థ్రిల్లర్గా సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రబృందం ఈనెల 28న టీజర్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. (చదవండి: Sudheer Babu: కనిపించని శత్రువు కోసం సుధీర్బాబు వేట!) సుధీర్, శ్రీకాంత్, భరత్లతో కూడిన పోస్టర్ టీజర్పై మరింత ఆసక్తి పెంచుతోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ రిలీజ్కి సిద్ధమైంది. ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ ముఖ్య పాత్రలు పోషించారు. ఇప్పటికే సుధీర్ బాబు నటించిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' థియేటర్లలో సందడి చేస్తోంది. September 28th is going to be INTENSE 👊👊 #HuntTheMovie teaser is locked and loaded 🎯@bharathhere @actorsrikanth @Imaheshh #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial @anneravi @vincentcinema pic.twitter.com/5vqI8ATtuf — Sudheer Babu (@isudheerbabu) September 24, 2022 -
గోల్ఫ్ కోర్సులో క్రూర మృగాల వేట.. ఆటకు బ్రేక్
ఓ భారీ జిరాఫీని అప్పుడే వేటాడిన నాలుగు యువ సింహాలు, రెండు శివంగులు.. ఆ ‘ఆహారాన్ని’ సొంతం చేసుకొనేందుకు కదన రంగంలోకి దిగి వాటిని తరుముతున్న 20 హైనాలు. తమ వేటను తిరిగి చేజిక్కించుకొనేందుకు ఎదురుదాడికి ప్రయత్నిస్తున్న ఆడ సింహాలు.. ఆ ఇందులో పెద్ద వింత ఏముంది.. ఆఫ్రికా అడవుల్లో ఇలాంటి దృశ్యాలన్నీ సర్వసాధారణమేగా అనుకుంటున్నారా? కానీ ఇదంతా జరిగింది అడవిలో కాదు.. అడవి మధ్య ఉన్న ఓ గోల్ఫ్ కోర్స్లో! దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్ నడిమధ్యన ఉన్న స్కుకుజా గోల్ఫ్ క్లబ్లో తాజాగా కొందరు ఆటగాళ్లు గోల్ఫ్ ఆడుతుండగా వారి ఆటకు ఈ క్రూర మృగాలు ఇలా బ్రేక్ వేశాయి! ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్గా మారింది. అడవికి, గోల్ఫ్కోర్స్కు మధ్య ఎటువంటి రక్షణ కంచె లేకపోవడంతో జంతువులు తరచూ ఇలా లోపలకు దూసుకొస్తాయట. గోల్ఫ్కోర్స్లో ఏర్పాటు చేసిన కృత్రిమ నీటి గుంటల్లో దప్పిక తీర్చుకొనేందుకు జిరాఫీలతోపాటు చిరుత పులులు, ఖడ్గ మృగాలు, ఏనుగులు, అడవి దున్నలు తరచూ అక్కడకు వస్తుంటాయట!! అందుకే ఇక్కడ గోల్ఫ్ ఆడాలనుకొనే ఆటగాళ్లకు ఎంతో గుండెధైర్యం కావాలట! అదొక్కటే కాదు.. అడవి జంతువులేవైనా దాడి చేసి చంపేస్తే క్లబ్ నిర్వాహకుల బాధ్యతేమీ లేదంటూ అగ్రిమెంట్పై సంతకం చేసిన వారినే ఇందులోకి అనుమతిస్తారట!! క్రూగర్ నేషనల్ పార్క్ సిబ్బంది కోసం 1972లో ఈ గోల్ఫ్కోర్స్ను తొలుత ఏర్పాటు చేయగా ఆ తర్వాత క్రమంగా స్థానికులతోపాటు పర్యాటకులకు కూడా ఇందులో ఆడేందుకు అవకాశం కల్పించారు. అందుకే దీన్ని ప్రపంచంలోకెల్లా అత్యంత కఠినమైన, క్రూరమైన గోల్ఫ్కోర్స్గా పిలుస్తున్నారు. చదవండి: రణరంగంలా మారిన బాగ్ధాద్.. కాల్పుల్లో 15మంది మృతి -
అప్పుడే పుట్టిన నవజాత శిశువు పై చిరుత దాడి! ఐతే ఆ తర్వాత.
Cheetah swoops on newborn baby: ఇంతవరకు మనం చిరుతలు, సింహాలు మనుషులు, జంతువుల పై దాడి చేసిన వీడియోలను చూశాం. ఒక్కొసారి కొన్ని జంతువులు ఆ చిరుతలు, సింహాల పై ఎదురుదాడిన చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడొక చిరుత పులి ఇంటిలో ఎవ్వరు లేరని ఒక నవజాత శిశువు పై వేగంగా దూసుకుపోతుంది. కానీ పాపం చిరుత తోక ముడిచి వెనక్కి వెళ్లిపోయింది ఎందుకో తెలుసా!. అసలు విషయంలోకెళ్తే...యూకేలోని వెస్ట్ మిడ్లాండ్స్ సఫారీ పార్క్లో ఒక పసి కందు నేలపై పాకుతూ ఆడుకుంటు ఉంటాడు. వాడు చాలా అమాయకంగా ఎదురుగా ఉన్న గుమ్మం వరకు పాక్కుంటూ వచ్చేశాడు. అయితే ఇంతతో ఒక చిరుత పులి చాలా వేగంగా ఆ పసివాడిపై దాడి చేసేందుకు యత్నించింది. నిజంగానే చంపేస్తుందేమో అనిపిస్తుంది. కానీ మధ్యలో ఒక పారదర్శకమైన గాజు అద్దం ఉండటం వల్ల ఆ పిల్లాడి బతికిపోతాడు. దీంతో ఆ చిరుత దాడి చేయలేనని భావించి వెనుదిరిగి వెళ్లిపోతుంది. అయితే ఆ చిన్నారి చిరుత దాడి చేసేందుకు వచ్చినప్పుడు భయపడి గుక్కపెట్టి ఏడవడం జరుగుతుంది. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆ చిరుత వేగానికి అద్దం పగలి ఉంటే ఏమై ఉండేది..ఊహిచడానికే భయం వేస్తుంది అంటూ రకరకాలుగా కామెంట్లు చేశారు. (చదవండి: గాల్లో ప్రాణాలు.. గగుర్పాటుకు గురిచేసిన వీడియో) -
షో స్టాపర్స్ బ్యూటీ హంట్
షో స్టాపర్స్ సంస్థ దేశ వ్యాప్తంగా బ్యూటీ హంట్ నిర్వహిస్తోంది. పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించనుంది. అక్టోబర్ 8 నుంచి ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత 2021 శుక్రవారం 15 అక్టోబర్న మొదలై అక్టోబర్ 24 వరకు బ్యూటీ హంట్ కొనసాగుతుంది. దీనికి జడ్జిగా నటి శిల్పాశెట్టి వ్యవహరించనున్నారు. షో స్టాపర్స్లో ప్రముఖ బ్యూటీ బ్రాండ్స్ అన్నీ లభిస్తాయి. ఈ బ్యూటీ హంట్ సందర్భంగా బ్యూటీ ట్రెండ్స్, టాలెంట్స్, క్రియేటివిటీ, అద్భుతమైన ఆఫర్లు, మాస్టర్ క్లాసులను షో స్టాపర్స్ అందివ్వనుంది. -
ఊహించని పరిణామం: ఇలాంటి వేటను అస్సలు చూసి ఉండరు!
Giant Tortoise Hunt Small Birds Video: తాబేలు-కుందేలు కథ గుర్తింది కదా!. కుందేలు బద్ధకం కలిసొచ్చి.. నత్తనడకతోనే పరుగు పందెంలో విజయం సాధిస్తుంది తాబేలు. అటుపై తాబేలు కథలెన్నో వాటిపై సింపథినీ, అదొక సాధు జీవి అనే మార్క్ను మనుషులకు క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు మీరు చూడబోయే వీడియో.. ఆ మార్క్ను పూర్తిగా చెరిపిపడేయడం ఖాయం. సాధారణంగా సెచెల్లెస్ తాబేళ్లు శాఖాహార జీవులు. అలాంటిది ఈ భారీ ఆడ తాబేలు.. ఇలా వేటాడింది. తూర్పు ఆఫ్రికా సెచెల్లెస్ దీవుల సముదాయంలోని ఫ్రెగేట్ ఐల్యాండ్లో కిందటి నెలలో ఈ వీడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఐల్యాండ్లో మూడు వేలకు పైగా తాబేళ్లు ఉన్నాయి. జీవావరణంలో మొట్టమొదటిసారి ఇలాంటి దాడిని చూడడమని పరిశోధకులు తేల్చేశారు. సెచెల్లెస్ తాబేళ్ల నుంచి కచ్చితంగా ఇది ఊహించని పరిణామమేనని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యూజియం ఆఫ్ జువాలజీ ప్రొఫెసర్ డాక్టర్ జస్టిన్ గెర్లాచ్ చెబుతున్నారు. సెచెల్లెస్ తాబేళ్లలో ఈ మధ్యకాలంలో ఇలాంటి ప్రవర్తన పెరిగి ఉండొచ్చని ఆయన అంచనా వేస్తూ రాసిన కథనం.. కరెంట్బయాలజీ జర్నల్లో ప్రచురితమైంది. కరోనా ప్రభావం! తాబేళ్లకు కోపం, చికాకు వచ్చినప్పుడు దాడులు చేయడం సహజం. అయితే ఈ మధ్యకాలంలో పక్షుల గూడుల నుంచి పడిపోయిన పిల్లలను, గుడ్లను సెచెల్లెస్ తాబేళ్లు తింటున్నాయనే ప్రచారాలు వినిపించాయి. అయితే చాలామంది పరిశోధకులు ఈ కథనాలను నమ్మలేదు. ప్రస్తుతం ఈ వీడియో బయటకు రావడంతో అది నిజమనే ఓ అంచానికి వచ్చారు. కరోనా ప్రభావం వల్ల తాబేళ్ల జనాభా విపరీతంగా పెరగడం, వాటికి సరైన ఆహారం అందకపోవడం, గుడ్ల కోసం కావాల్సిన కాల్షియం దొరక్కపోవడం.. తదితర కారణాల వల్ల ఇవి ఇలా క్రూరంగా తయారై ఉంటాయని, అయితే వాటిని జీవన విధానానికి విరుద్ధంగా ప్రవర్తించే క్రమంలో అవి మనుగడ కొనసాగించగలవా? లేదా? అనేది తెలియాలంటే కొంతకాలం పరిశీలన తప్పదని ప్రముఖ హెర్పటాలజిస్ట్ జేమ్స్ గిబ్స్ చెప్తున్నారు. చదవండి: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం! -
వజ్రాల కోసం ఎగబడ్డ జనం.. తలలు పట్టుకున్న అధికారులు
అది దక్షిణాఫ్రికా తీరం వెంట ఉండే ఓ చిన్న ఊరు. వారం క్రితం వరకు ఆ ఊరి గురించి.. పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ, ఓ పశువుల కాపరి ప్రకటన తర్వాత ఆ ఊరి పేరు ప్రపంచం మొత్తం తెలిసింది. దేశం నలమూలల నుంచి అక్కడికి ‘క్యూ’ కడుతున్నారు. ఎందుకోసం అనుకుంటున్నారు వజ్రాల వేట కోసం.. ప్రిటోరియా: క్వాహ్లాతి.. సౌతాఫ్రికాలో ఓ చిన్న కుగ్రామం. ఆ ఊరి శివారులో ఉన్న భూముల్లో వారం క్రితం ఓ గొర్రెల కాపరికి మెరిసే రాళ్లు దొరికాయి. అవి వజ్రాలేనని ప్రచారం మొదలుకావడంతో జనాలు ఎగబడి మరీ అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. పదులు.. వందలు.. వేల మంది అక్కడికి చేరుకున్నారు. తమ దారిద్య్రాన్ని తరిమికొట్టేందుకు ఆరాటపడుతున్నారు. ఈ క్రమంలో రంగు రంగుల రాళ్లు వాళ్లకు దొరుకుతున్నాయి. అధికారులకు కరోనా భయం కాగా, తవ్వకాల్ని కట్టడి చేయడంలో అక్కడి అధికార యంత్రాంగం చేతులెత్తేసింది. వేల మంది ఒకేసారి తవ్వకాలు చేపడుతుండడంతో కరోనా విజృంభించే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. ఇప్పటికే వాళ్లలో పదుల సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. ‘మీకు చేతులెత్తి మొక్కుతాం. తవ్వకాలు ఆపండి. మాకు సహకరించండి. ఆశతో ప్రాణల మీదకు తెచ్చుకోవద్దు’ అని మైకుల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆశచావని ప్రజలు కరోనా ఎఫెక్ట్తో దక్షిణాఫ్రికా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనం అయ్యింది. లక్షల మంది పేదరికంలోకి కూరుకుపోయారు. ఈ తరుణంలో తమ తలరాతను మార్చుకునేందుకు వజ్రాల వేటను ముమ్మరం చేస్తున్నారు ప్రజలు. అయితే వారం గడుస్తున్నా అవి వజ్రాలేనా? అనేది తేల్చడంలో జియాలజిస్టులు విఫలమయ్యారు. అయినప్పటికీ ఆశ చావని ప్రజలు.. వేటను కొనసాగిస్తూనే ఉన్నారు. -
పరుగో.. పరుగు
-
పరుగో.. పరుగు
సమస్యలను చూసి భయపడి పారిపోతే.. మరింత ఎక్కువగా తరుముతుంటాయి. అదే ఒక్కసారి ధైర్యం చేసి ఎదురుతిరిగితే.. చివరికి చావు కూడా మనిల్ని చూసి పారిపోతుందంటారు. సరిగ్గా ఇలానే జరిగింది ఓ చోట. ఆహారం కోసం తిరుగుతున్న ఆడ సింహానికి ఎదురుగా గేదెల మంద కనిపించింది. వాటిని చూడగానే సింహం అబ్బ ‘ఈ రోజు నా పంట పండింది.. ఒక వారానికి సరిపోను ఆహారం దొరికింది’ అని సంబరపడింది. గేదెల మందపై దాడి చేద్దామని భావించి అటుగా వెళ్లింది. అయితే సింహం రాక గమనించిన గేదెలు ఒక్కసారిగా పరుగందుకున్నాయి. తనను చూసి భయపడి పారిపోతున్న గేదెల వెనకాల పరిగెత్తింది సింహం. కానీ ఇంతలో ఒక విచిత్రం జరిగింది. ఉన్నట్టుండి ఒక గేదె సింహం వైపు దూసుకొచ్చింది. ఈ ఊహించని పరిణామానికి బిత్తరపోవడం సింహం వంతయ్యింది. వెంటనే తేరుకుని, కాలికి బుద్ధి చెప్పి పరుగు లంకించుకుంది. అంత సేపు గేదెలు తనను చూసి భయడటంతో తానే బలవంతురాలిని అనుకున్న సింహం, ఒక్క గేదె ఎదురుతిరిగే సరికి పారిపోయింది. జీవితం కూడా ఇంతే. సమస్యలు వచ్చినప్పుడు భయపడి పారిపోయే బదులు ఎదురుతిరిగితే.. అవే మనల్ని చూసి పారిపోతాయి అనే దానికి ఉదాహరణగా నిలిచింది ఈ వీడియో. -
దుర్మార్గపు చర్యకు పాల్పడ్డ జపాన్
టోక్యో : దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డ జపాన్.. పలు దేశాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ఏకంగా 300 నీలి తిమింగలాను వేటాడి, అతిక్రూరంగా చంపింది. అంటార్కిటిక్ మహాసముద్రంలో ఈ ఆపరేషన్ను నిర్వహించగా.. ఎలాంటి అవాంతరాలు, అభ్యంతరాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం జపాన్ ప్రకటించుకుంది. తిమింగలాలపై పరిశోధనల పేరిట గత నవంబర్లో మొత్తం ఐదు నావలు దక్షిణమహా సముద్రం నుంచి బయలుదేరాయి. అయితే అది వెళ్లింది పరిశోధనకు కాదని.. వారికి హతమార్చేందుకని ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ సమయంలో పలు దేశాలు జపాన్ చేష్టలను తీవ్రంగా ఖండించాయి. మొత్తం 333 తిమింగలాలను హతమార్చి వాటి మృతదేహాలను నావల్లో వేసుకుని వచ్చాయి. శనివారం ఉదయం పశ్చిమ జపాన్లోని షిమోనోసెకి పోర్ట్కు చేరుకున్నాయి. అయితే తిమింగలాల ప్రవర్తన, జీవశాస్త్రీయ అధ్యయనం కోసమే ఈ ఆపరేషన్ చేపట్టామని జపాన్ ప్రభుత్వం తమ చేష్టలను సమర్థించుకుంటుండగా.. తిమింగలాల పరిరక్షణ సమితి మాత్రం పెద్ద ఎత్తున్న ఉద్యమించేందుకు సిద్ధమైపోయింది. మరోవైపు మూగజీవాల పట్ల జపాన్ ప్రభుత్వం కొనసాగించిన దమనకాండపై జంతు పరిరక్షణ సమితులు సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోస్తుండగా.. ఈ వేట ప్రతీయేటా జరిగే తంతేనని కొట్టిపారేసేవాళ్లు లేకపోలేదు. -
వేటకు వెళ్లి విగతజీవిగా...
శ్రీకాకుళం, వంగర: శ్రీహరిపురం గ్రామానికి చెందిన గుడివాడ ఉగాది దొర(36) అనే మత్స్యకారుడు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వంగర పోలీసులు అందించిన వివరాలు ప్రకారం... సహచరులు గుడివాడ చిరంజీవి, కారంగి గణేష్తో కలిసి ఉగాది దొర ఉదయం ఐదు గంటల సమయంలో మడ్డువలస రిజర్వాయర్లో చేపల వేటకు వెళ్లాడు. పెద్ద దేవకివాడ చేపల రేవు సమీపంలో బోట్లు లంగరు వేసిన ప్రాంతంలో వీరు ముగ్గురు విడిపోయి వేర్వేరు దారుల్లో చేపల వేటకు వెళ్లిపోయారు. ఉదయం 6.30 గంటల సమయంలో సహచర మత్స్యకారులు అటువైపు చూసే సరికి ఉగాదిదొర మృతిచెంది ఉన్నట్టు గమనించారు. మృతుడు తలపై స్వల్ప గాయాలు ఉన్నాయి. మృతదేహాన్ని గ్రామానికి తీసుకురాగా భార్య గుడివాడ పాపమ్మతో పాటు కుటుంబ సభ్యులు బోరున రోదించారు. మృతుడుకు భార్య పాపమ్మతో పాటు ఎనిమిదేళ్ల పావని, ఐదేళ్ల జగదీష్ ఉన్నారు. తన భర్తను ఎవరో చంపి ఉంటారని, తల భాగంలో గాయాలున్నాయని భార్య పాపమ్మ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అనుమానాస్పద స్థితి మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ హెచ్.కాంతారావు తెలిపారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించామని చెప్పారు. శోకసంద్రంలో గ్రామం అందరితో కలిసిమెలసి సరదాగా ఉండే ఉగాది దొర మృతిచెందడంతో శ్రీహరిపురం గ్రామంలో శోకసంద్రం నెలకొంది. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోయామని, తమ కుటుంబం వీధిన పడిందని భార్య పాపమ్మ, బంధువులు రోదనలు అందరినీ కన్నీరు తెప్పించాయి. -
వజ్రాల వేట !
వజ్రకరూరు: మండల కేంద్రం సమీపంలోని చాలా పొలాల్లో వజ్రాన్వేషణ కొనసాగుతోంది. తెల్లారింది మొదలు సాయంత్రం పొద్దు పోయే వరకు వజ్రాల కోసం ఇతర ప్రాంతాల నుంచి భారీగా ఇక్కడకు చేరుకొని అన్వేషిస్తున్నారు. భోజనం, వాటర్ బాటిళ్లతో ఇక్కడకు చేరుకొని చాలమంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. -
వజ్రాల కోసం వేట
వజ్రకరూరు : మండల కేంద్రం వజ్రకరూరు పరిసర ప్రాంతంలో వజ్రాల కోసం వేట ప్రారంభమైంది. మంగళవారం రాత్రి వజ్రకరూరుతోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ప్రతి ఏటా జూన్లో తొలకరి వర్షాలు పడిన వెంటనే వజ్రాల కోసం అన్వేషణ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది కూడా మండల వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం వెదికే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి ఏటా ఐదు నుంచి పది దాకా వజ్రాలు దొరుకుతున్నట్లు సమాచారం. -
కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాదుల వేట
-
ఫేస్బుక్ టాప్ బగ్ హంటర్స్ తెలుసా?
న్యూయార్క్: ఫేస్బుక్లో బగ్స్ను గుర్తించి వాటిని పరిష్కరించడంలో ఇండియన్ రిసెర్చర్స్ ముందువరుసలో ఉన్నారని ఫేస్ బుక్ వెల్లడించింది. అంతేకాదు తాము ఇప్పటి వరకు నగదు రూపంలో చెల్లించిన మొత్తాల్లో ఇండియన్స్ కే అధిక వాటా ఉందని కూడా తెలిపింది. 'బగ్స్ను ఏరివేసే కార్యక్రమంలో మొత్తం 127 దేశాలకు చెందిన టెక్నాలజీ రీసెర్చర్స్, హ్యాకర్స్ పాల్గొంటుండగా అందులో భారత్ మాత్రమే టాప్ స్థానంలో ఉంది. అంతేకాకుండా పెద్దమొత్తాల్లో చెల్లింపులు పొందుతున్న దేశాల్లో కూడా భారత్ దే అగ్రస్థానం' అని ఫేస్ బుక్ వెల్లడించింది. భారత్లోని ఫేస్ బుక్ బగ్ హంటర్స్కు ఇప్పటి వరకు రూ.4.84 కోట్లు చెల్లించినట్లు చెప్పింది. ఈ కార్యక్రమం తాము 2011లో ప్రారంభించినట్లు వెల్లడించింది. -
ఏనుగు కోసం అలీ ఖాన్ వేట
మదపుటేనుగు కోసం గయలో ప్రారంభించిన హైదరాబాదీ మత్తు ఇచ్చి బంధించాలని బీహార్ ప్రభుత్వం వినతి హైదరాబాద్ : దేశంలోనే ఏకైక లెసైన్డ్స్ హంటర్ హైదరాబాదీ నవాబ్ షఫత్ అలీ ఖాన్ మరో ‘వేట’ ప్రారంభించారు. బీహార్లోని గయ అటవీ సమీప గ్రామాల్లోని ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఏనుగును బంధించేందుకు రంగంలోకి దిగారు. ఆ మదపుటేనుగుకు మత్తిచ్చి పట్టుకోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం అలీఖాన్ను ఆహ్వానించింది. బుధవారం రాత్రి గయ చేరుకున్న ఆయన గురువారం నుంచి ఆపరేషన్ ప్రారంభించారు. 15 ఏళ్ల వయసున్న మగ ఏనుగు పది రోజుల క్రితం జార్ఖండ్ నుంచి బీహార్లోకి ప్రవేశించి గయ ఫారెస్ట్ డివిజన్లోకి చొరబడింది. పగటిపూట అక్కడి కొండల్లో తలదాచుకుంటున్న ఈ గజరాజు రాత్రి వేళల్లో సమీప గ్రామాల్లోకి వచ్చి బీభత్సం సృష్టిస్తోంది. పంట, ఆహారధాన్యాలు, ఆస్తుల్ని ధ్వంసం చేయడంతో పాటు ప్రజలపైనా విరుచుకుపడుతోంది. దీన్ని తరిమికొట్టడానికి అక్కడి అటవీ శాఖ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ప్రయత్నాల్లో కొందరు అధికారులు, సిబ్బంది సైతం క్షతగాత్రులయ్యారు. దీంతో ఆ ఏనుగుకు మత్తుమందు ఇచ్చి (ట్రాంక్వలైజేషన్) పట్టుకోడానికి సమర్థుడి కోసం గాలించిన బీహార్ అటవీ శాఖ దేశ వ్యాప్తంగా పలువురి పేర్లు పరిశీలించింది. గతంలో చేసిన ఆపరేషన్లను పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఆ పని చేయడానికి షఫత్ అలీఖాన్ సమర్థుడని గుర్తించింది. ఈ మేరకు ఆయన్ను ఆహ్వానిస్తూ బీహార్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎస్ఎస్ చౌదరి బుధవారం అలీ ఖాన్ను లేఖ రాశారు. హుటాహుటిన బయలుదేరి వెళ్లిన ఆయన గురువారం ఉదయం ఆపరేషన్ ప్రారంభించారు. నగరంలోని ఏసీ గార్డ్స్ ప్రాంతానికి చెందిన షఫత్ అలీఖాన్ దేశవ్యాప్తంగా మ్యానీటర్లుగా మారిన పులులు, చిరుతల్ని మట్టుపెట్టారు. జనానికి ప్రాణహాని కలిగిస్తు న్న మదగజాల్నీ హతమార్చారు. 1976లో కర్ణాటకలోని మైసూర్ సమీపంలో ఉన్న హెడ్డీ కోటలో పులితో ప్రారంభమైన ఆయన ‘వేట’ అసోం, మేఘాలయ, మధ్యప్రదేశ్, హిమాచల్ప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ల్లో సాగింది. షఫత్ అలీ ఖాన్ ‘సాక్షి’తో ఫోనులో మాట్లాడుతూ... ‘ప్రాథమికంగా అక్కడి భౌగోళిక పరిస్థితుల్ని అంచనా వేయాలి. బాధిత గ్రామాల్లో పర్యటించి ఏనుగు వ్యవహారశైలిని అర్థం చేసుకోవాలి. ఆ తరవాత ఎక్కడ? ఎలా? దానికి మత్తుమందు ఇవ్వాలనేది నిర్ణయిస్తాం’ అని అన్నారు. -
నగర శివారులో జింకమాంసం కలకలం
-
నగర శివారులో జింకమాంసం కలకలం
హైదరాబాద్: నగర శివారు ప్రాంతం గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆదివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలో జింకను వేటాడి చంపిన దుండగులు దాని మాంసాన్ని విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ఓ ప్రభుత్వ అధికారి ప్రమేయం ఉన్నట్లు భావించిన పోలీసులు ఆయనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏడాది కాలంలో ఈ ప్రాంతంలో జింకలను వేటాడిన ఘటనలు ఆరుకు పైగా నమోదైనప్పటికీ.. అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. -
బంగారం నింపిన రైలును నిజంగా పాతిపెట్టారా?
బెర్లిన్: ఎప్పుడో నాజీల నాటి రోజుల్లో.. బంగారంతో నింపిన ఓ రైలును భూగర్బంలో పాతిపెట్టి దాచి ఉంచారని జానపదులు చెప్పుకునే మాటలు విని కొందరు గుప్త నిధుల వేటగాళ్లు చెమటోడుస్తున్నారు. రోజుల తరబడి దానికోసం గాలింపులు చేపట్టి చివరకు ఆ ప్రాంతాన్ని గుర్తించి ప్రత్యేక తవ్వకాలు కూడా కొనసాగిస్తున్నారు. అయితే, వారు వెతికిన ఆ చోట ఓ సొరంగ మార్గమైతే కనిపించిందికానీ, రైలు మాత్రం అందులో ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఆ వెతికే వారితోపాటు పనిచేస్తున్న నిపుణులు తెలిపారు. పియోర్ కోపర్, ఆండ్రెస్ రిచ్టెర్ అనే ఇద్దరు వ్యక్తులు తమ హంటింగ్ కు సంబంధించిన విశేషాలు తెలియజేశారు. పోలాండ్ లోని వాల్బ్రిక్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్న ఓ వంతెన వద్ద రెండో ప్రపంచ యుద్ధకాలం సమయంలో యుద్ధంలో తలమునకలైన నాజీలు తమ భవిష్యత్తు అవసరాలకోసం బంగారంతో నింపిన ఓ రైలును సొరంగంలో ఎవరికి కనిపించకుండా పాతిపెట్టి ఉంచారని కథలుకథలుగా అక్కడ జానపదులు ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు. నిజంగానే ఆ ప్రాంతంలో ఏదో దాచి ఉంచబడిందనే చెప్పే కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా లభ్యం అయ్యాయి. అయితే, అది బంగారు రైలే అని మాత్రం స్పష్టంగా తెలియదు. అయినా, ప్రయత్నిస్తే పోయేదేముంది అనుకున్నారేమో ఏమాత్రం నిరాశ చెందకుండా ఆ ప్రాంతంలో ప్రత్యేకంగా పరిశీలనలు జరిపారు. ఆ ప్రాంతం మొత్తాన్ని రాడార్ల సహాయంతో స్కానింగ్ చేయగా అక్కడ ఓ టన్నెల్ లాంటిది ఉందని తెలిసింది. అయితే, అందులో రైలు ఉన్నట్లు ఆధారాలు మాత్రం ఇప్పటివరకు లభించలేదట. మరోపక్క, ఇదే విషయాన్ని చెప్పేందుకు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఒక బృందమేమో తమ బంగారంతో నింపిన రైలు ఉన్నట్లు తోచడం లేదని చెప్పగా మరో బృందం మాత్రం 1945లో సోవియెట్ రెడ్డ్ ఆర్మీ కంటపడకుండా ఉండేందుకు నాజీలు బంగారంతో నింపిన రైలు పెట్టెలను సొరంగంలో పాతిపెట్టారని ఇప్పటికీ జానపదులు చెప్పుకుంటారని, తాము ఆ విషయాన్ని నమ్ముతున్నామని, ఏదేమైనా ఆ సొరంగంలో గాలింపులు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే, వారి నమ్మకం నిజమే అయ్యి బంగారు రైలు దొరుకుతుందేమో వేచి చూడాల్సిందే. -
వేటకు వెళ్లి మృత్యువాత
అడవి పందుల దాడిలో ఒకరి మృతి హైదరాబాద్: వేటకు వెళ్లిన ఓ వ్యక్తి అడవి పందుల దాడిలో మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. గచ్చిబౌలి ప్రాంతంలోని గౌలిదొడ్డిలో నివాసం ఉండే జెర్రి అశోక్(45) ఈ నెల 11న ఉదయం సమీపంలోని శంకర్హిల్స్లో గల అటవీ ప్రాంతానికి వేటకు వెళ్లాడు. పొదల్లో ఉన్న పందులు ఒక్కసారిగా అశోక్పై దాడి చేశాయి. మర్మాంగాలతో పాటు పొట్టలోపల బలమైన గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అశోక్ను స్థానికులు కొండాపూర్లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్సకోసం 12న రాత్రి సికింద్రాబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. అడవి పందులు బలంగా గుద్దడంతో మర్మాంగాలతోపాటు పొట్ట, ఛాతీ భాగంలో బలమైన గాయాలు కావడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అశోక్ కుక్కలను తీసుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, శంకర్హిల్స్ ప్రాంతాల్లో అడవి జంతువులు, పక్షులను తరచూ వేటాడేవాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో వేటకు వెళ్లి మృత్యువాత పడటంతో గౌలిదొడ్డిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
వేటకు వెళ్లి ఇద్దరి మృతి
రేచర్ల: ప్రకాశం జిల్లాలో కుందేళ్లను వేటాడేందుకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని రేచర్ల మండలంలో గురువారం వేకువ జామున వెలుగులోకి వచ్చింది. మండలంలోని అరవీటికోట గ్రామానికి చెందిన రసూల్(35), రంగనాయకులు(25) బుధవారం అర్ధరాత్రి తర్వాత కుందేళ్లను వేటాడేందుకు పొలాల్లోకి వెళ్లారు. దీంతో పొలాల్లో ఉన్న విద్యుత్ వైర్లు తగలి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. -
అచ్చం బజరంగీ భాయ్జాన్ కథే... మరి హీరో?
కరాచీ: బాలీవుడ్లో సంచలనం సృష్టిస్తున్న 'బజరంగీ భాయ్జాన్' చిత్రంలో చిన్నారి షాహిద్ అలియాస్ మున్నీ గుర్తుందా....అచ్చం ఈ సినిమాలోని చిన్నారి లాగానే పాకిస్తాన్లో ఓ యువతి భారత్లో ఉన్న తన కన్నవాళ్లను కలుసుకునేందుకు తపించిపోతోంది. గత 15 ఏళ్లుగా పాకిస్తాన్లోని ఒక అనాధ శరణాలయంలో ఉంటున్న ఆమె నిత్యం తన కుటుంబాన్ని తలచుకుంటూ కుమిలిపోతోంది. తనను.. తన కుటుంబసభ్యులతో కలిపేవారి కోసం ఎదురు చూస్తోంది. సినిమాలోని చిన్నారి షాహిద్ లాగానే ఆ యువతి కూడా పుట్టు చెముడు, మూగ. ఇదంతా...పాకిస్తాన్ హక్కుల కార్యకర్త అన్సర్ బర్నే సోషల్ మీడియాలో పంచుకోడంతో ఈ విషయం వెలుగు చూసింది. ఆ యువతి కుటుంబసభ్యుల వివరాలు ఎవరికైనా తెలిస్తే సాయం చేయమంటూ విజ్ఞప్తి చేశారు. తన సైగల ద్వారా తనకు 12మంది తోబుట్టువు ఉన్నారని, వారిలో ఏడుగురు సోదరులు, ఐదుగురు అక్కాచెల్లెళ్లు వున్నారని తెలిసిందన్నారు. ఆ యువతి వయసు 22, 24 సంవత్సరాల మధ్య ఉంటుందని అయితే పొట్టిగా ఉండటం వల్ల చిన్నదానిలా కనిపిస్తుందని తెలిపారు. భారత్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఆమెగా భావిస్తున్నామని తెలిపారు. మూడేళ్ల క్రితం ఆమె తల్లిదండ్రులను వెతికేందుకు ప్రయత్నించి విఫలమయ్యానని, సల్మాన్ ఖాన్ సినిమా చూసిన తరువాత మళ్లీ తనలో ఆశలు చిగురించాయని అన్సర్ బర్నే తెలిపారు. తాను సెప్టెంబర్లో భారత్కు వస్తున్నానని, అపుడు ఆమెను ఆమె కుటుంసభ్యుల వద్దకు చేర్చాలనేది తన కోరిక అని ఆయన వెల్లడించారు. అందుకు భారత ప్రభుత్వం సహకరిస్తే బావుంటుందని బర్నే ఆశిస్తున్నారు. కాగా సుమారు ఏడేళ్ల క్రితం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన గీత.. అలా.. అలా. పాకిస్తాన్ చేరింది. పలు అనాధ శరణాలయాల్లో ఆశ్రయం పొందింది. చివరకు పాకిస్తాన్లో పేరుపొందిన ఈధీ ఫౌండేషన్ లో తలదాచుకుంటోంది. ఫౌండేషన్ వాళ్లే అమ్మాయికి గీత అని పేరుపెట్టారు. 'పుట్టు మూగ చెవిటి అయిన గీత తరచూ బిగ్గరగా ఏడూస్తూ ఉంటుంది. ఆమెకు హిందీ రాయడం తెలుసట. హిందూ యువతిలాగా నెత్తిన కొంగు వేసుకుంటుంది, తరచూ గుడికి వెడుతుంద'ని ఈధి ప్రతినిధి తెలిపారు. దీంతో గీత హిందూ సాంప్రదాయ కుటుంబానికి చెందినదిగా భావిస్తున్నామని, అయితే ఇక్కడున్న ముస్లింలతో పాటు రంజాన్ సందర్భంగా ఆమెకూడా రోజాను పాటించిందన్నారు. కానీ ఆమె హిందూ అమ్మాయిలా ఉండడంతో తమ దగ్గర ఆమెకోసం ప్రత్యేక ఏర్పాటు చేశామన్నారు. 'బజరంగీ భాయ్జాన్' సినిమాలో పుట్టు మూగ అయిన షాహిదా పొరపాటున పాకిస్తాన్ వెళ్లడానికి బదులు.. ఢిల్లీ ట్రైన్ ఎక్కి.. ఇండియా వచ్చేస్తుంది. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక, తనను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చే నాధుడు ఎవరా? అని దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ పాపను అష్టకష్టాలు పడి చివరికి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తాడు హీరో సల్మాన్ ఖాన్. ఈ క్రమంలో భజరంగీకి పాకిస్తాన్ రిపోర్టర్ నవాజుద్దీన్ ఖాన్ సహాయపడతాడు. మరి ఈ గీతకు శుభం కార్డు వేసే హీరో ఎవరో? -
ఆ 'అరుదైన' మహిళ కోసం వేట..
అది శాన్ఫ్రాన్సిస్కోలోని దక్షిణ తీరప్రాంతం. ముద్దుగా 'సిలికాన్ వ్యాలీ' అని పిలుస్తారు. ప్రపంచంలోని అతిపెద్ద హైటెక్ కార్పొరేషన్లన్నింటికీ కేంద్రం. అక్కడే ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన ఒకాయన కొన్నేళ్లకిందట చనిపోరు. ఇటీవలే ఆయనకు సంబంధించిన కొన్ని పాత వస్తువులను క్లీన్ బే ఏరియా ఈ-వేస్టేజి రీసైక్లింగ్ సెంటర్కు తీసుకెళ్లింది అతని భార్య. కారణాలు ఏవైతేనేం.. ట్యాక్స్ రిసిట్ గానీ, కాంటాక్ట్ నంబర్ గానీ ఇవ్వకుండా వెళ్లిపోయింది. అలా ఆమె వదిలేసి వెళ్లిపోయన వాటిల్లో ఓ పాత సూట్కేస్ కూడా ఉంది. కొద్దిరోజుల తర్వాత క్లీన్ బే సిబ్బంది ఆ పెట్టెను తెరిచిచూశారు. అదొక ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్! ఇంకా లోతుగా వెళితే.. ఆపిల్ కంపెనీ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్లీవ్ వోజ్నియాక్, రాన్ వాయెన్ స్వహస్తాల్లో అసెంబుల్ అయిన డెస్క్టాప్ అది. ప్రపంచంలో తయారైన తొలి 200 ఫస్ట్ జనరేషన్ ఆపిల్ కంప్యూటర్లలో ఒకటి! అంతటి అరుదైన వస్తువును వదిలేసి వెళ్లిన ఆ మహిళ ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు క్లీన్ బే కంపెనీవారు. మళ్లీ ఆమె అవసరం ఎందుకొచ్చిందటే.. ఈ- వేస్టేజిగా తమకు చేరే ఎలక్ట్రానిక్ పరికరాలను శుద్ధిచేసిన అనంతరం వేలం ద్వారా తిరిగి అమ్మకానికి ఉంచుతుంది క్లీన్ బే సంస్థ. అలా ఆక్షన్ ద్వారా వచ్చిన మొత్తంలో సగం సొమ్మును ఆ వస్తువు తెచ్చినవారికి ఇచ్చేస్తుంది. వేలంలో ఉంచగా ఈ అరుదైన కంప్యూటర్ 200 డాలర్లకు (సుమారు 12, 800 రూపాయలు) అమ్ముడుపోయింది. నియమాల ప్రకారం వచ్చిన డబ్బులో సగం ముట్టజెప్పేందుకు ఆ మహిళ కోసం వేట కొనసాగిస్తోంది క్లీన్ బే సంస్థ. -
ప్రకాశం జిల్లాలో గుప్తనిధుల వేట
-
రైళ్లలో ఎలుకల వేట
1,054.. సగటున నెలకు చిక్కుతున్న మూషికాల సంఖ్య సాక్షి, హైదరాబాద్: తిండి వాసన వచ్చిందంటే చాలు.. ఎలుకలు, బొద్దింకలు అక్కడికి చేరుకోవటం పరిపాటి. కాస్త మరుగు ఉందంటే వాటికి తిరుగే ఉండదు. ఈ క్రమంలో చిరుతిండి దండిగా దొరికే రైలు బోగీలను ఇవి ఆవాసాలుగా చేసుకున్నాయి. ప్రయాణికులు పారేసే ఆహార పదార్థాలు తింటూ అందులోనే తిష్ట వేశాయి. వాటి వల్ల ప్రయాణికులకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో ఈ అంశంపై రైల్వే శాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని మరీ వాటి వేట ప్రారంభించారు. ఈ ప్రయత్నంలో కొంతమేర విజయం సాధించినా, ప్రయాణికులు బోగీల్లో ఎక్కడపడితే అక్కడ మిగిలిపోయిన చిరుతిండి పడేస్తుండటంతో ఎలుకలు, బొద్దింకల నిర్మూలన పూర్తిగా సాధ్యంకాలేదు. ఇదే సమయంలో విదేశీ తరహాలో రైళ్లను, రైల్వే స్టేషన్ల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే బోర్డు.. పరిశుభ్రత కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఎలుకలు, బొద్దింకలపై కూడా యుద్ధాన్ని తీవ్రం చేశారు. ప్రత్యేక సిబ్బందిని వినియోగించి మరీ ఆ కసరత్తును ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. {పస్తుతం నెలకు సగటున 1,054 ఎలుకలను పడుతున్నారు. ఈ సంఖ్య ఈ ఏడాది మే నెల వరకు కేవలం 457 మాత్రమే ఉండేది. ఇక సగటున నెలకు 33,237 బొద్దింకలను చంపుతున్నారు. ఇంతకుముందు ఈ సంఖ్య 20,834 మాత్రమే. ఏసీ బోగీల్లో అందించే బెడ్రోల్స్లో నల్లుల బెడద లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఏసీ బోగీలను ప్రతి 15 రోజులకోసారి, సాధారణ బోగీలను నెలకోసారి పూర్తిస్థాయిలో క్రిమిసంహార మందులతో శుభ్రం చేస్తున్నారు. రైళ్లలోని 709 ఏసీ బోగీలు, 3,525 సాధారణ బోగీలు, 53 ప్యాంట్రీ కార్లలో నిరంతరం ఎలుకలు, బొద్దింక ల నివారణ చర్యలు తీసుకుంటున్నారు. రైళ్లలో విద్యుత్తు వైర్లను ఎలుకలు కొరికి తెంపేసే సమస్య కూడా బాగా తగ్గింది. ఫలితంగా ఏసీ బోగీల్లో షార్ట్సర్క్యూట్ భయం కూడా తగ్గుతోంది. ప్రయాణికులు సహకరించాలి ‘‘ప్రయాణికులకు ఎలుకలు, బొద్దింకలు, నల్లులతో ఇబ్బంది లేకుండా మా సిబ్బంది నిరంతరం కృషి చేసి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. మిగిలిపోయిన చిరుతిండి, పళ్లతొక్కలు వంటివి బోగీల్లో పడేయకుండా ప్రయాణికులు మాకు సహకరిస్తే ఈ సమస్య పూర్తిగా నివారించగలం. అలాగే రైల్వే స్టేషన్ ప్రాంగణాల్లో కూడా చెత్తకుండీలను వినియోగిస్తూ సహకరించాలి.’’ - సాంబశివరావు, దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో -
చిన్న వివాదానికే హత్య
-
కీలక ఫైళ్లు కనబడడం లేదనే వార్తలు