నగరంలోని బంజారాహిల్స్లో శనివారం అర్థరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో శనివారం అర్థరాత్రి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాగి వాహనం నడుపుతున్న 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసులు నమోదు చేశారు. వారి వద్ద నుంచి నుంచి 10 కార్లు, 6 బైకులు, ఆటో స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. వీరందరికి కౌన్సిలింగ్ నిర్వహించి.. కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.