ఏదైనా ప్రమాద సంఘటన జరిగినప్పుడు స్పాట్లోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేలా సౌకర్యాలతో ఉన్న వాహనం హైదరాబాద్ పోలీసులకు అందుబాటులోకి రానుంది. ఈ వాహనాన్ని సోమవారం సాయంత్రం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రారంభించనున్నారు. ‘ఫోరెన్సిక్ కార్ప్స్ క్యారియర్’గా పిలిచి ఈ వాహనంలో స్ట్రెచర్స్, మృతదేహాన్ని కప్పి ఉంచే నల్లటి కవర్లు,వైద్యులు వాడే గ్లవ్స్ వంటివిఅందుబాటులో ఉంటాయి. దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ పోలీసు శాఖకు ఈ సౌకర్యం సమకూరిందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
‘ఎఫ్సీసీ’..దేశంలోనే మొట్టమొదటి వాహనం
Published Mon, Oct 3 2016 11:14 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM
Advertisement
Advertisement