Forensic Science Laboratory
-
ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం..
ఆంధ్రప్రదేశ్లో న్యాయ వైద్యశాస్త్ర విభాగానికి సంబంధించి ఇటీవలి కాలం (2017)లో... హైకోర్టు క్రిమినల్ అప్పీల్ నం. 326లో వెల్లడించిన ఆదేశాలను అనుసరించి, ఒక సమూల ప్రక్షాళనకై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. హైకోర్టు న్యాయమూర్తులు తమ తీర్పులో శవపరీక్షల నిర్వహణలో పాటించాల్సిన శాస్త్రబద్ధమైన ప్రమాణాలు, తదనంతరం తయారు చేసే నివేదికల నిబద్ధతపై విస్తృతంగా చర్చించారు. ఆధునిక సమాజంలో ప్రజల అసహజ మరణాలకు గల కారణాలను తెలుసుకోవడం, దోషులను శిక్షించడం, నేరాలను నివారించడం ప్రభుత్వాల బాధ్యత. ఈ ప్రక్రియలో పోలీసులు, కోర్టు లతో పాటు ఫోరెన్సిక్ వైద్యుల పాత్ర చెప్పుకోదగ్గది.గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వైద్యుల నియామకాలు జరిగిన పుణ్యమా అని చాలాచోట్ల ఫోరె న్సిక్ వైద్యులు అందుబాటులో ఉండడంచేత శవపరీక్షలు నాణ్యతా ప్రమాణాలతో నిర్వహించడానికి అవకాశం ఏర్పడింది. అయితే హైకోర్టు ఆశించిన విధంగా న్యాయ వైద్య శాస్త్రంలో అంతర్జాతీయ ప్రమాణాలు పాటించడానికి నియమ నిబంధనావళి రూపొందించడం ఈ విశేషజ్ఞుల కమిటీకి పెద్ద కష్టమైన పని కాకపోయినప్పటికీ... దానిని ఆచరణలో పెట్టాలంటే మన శవాగారాలను ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాల చోట్ల శవాలను భద్రపరిచే శీతల వ్యవస్థ (కోల్డ్ స్టోరేజ్) అవసరాలకు సరిపోయేలా లేదు.మన మార్చురీలలో బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ.. ముఖ్యంగా ద్రవ వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి వుంది. శవపరీక్షలు చేయడానికి కావల్సిన ఆధునిక పనిముట్లు చాలాచోట్ల అందుబాటులో లేవు. ప్రపంచం అంతా ఎలక్ట్రిక్ రంపాలతో పుర్రెలను తొలచి మెదడును పరీక్షిస్తుంటే, మనం మాత్రం పాత పద్ధతిలో ఇంకా సుత్తి, శానం వాడుతుండడం బాధాకరం. కొన్ని అసహజ మరణాలను పరిశోధించడానికి బాడీ శాంపుల్స్ను దూరంగా ఉన్న ప్రయోగశాలలకు పంపాల్సి ఉంటుంది, అప్పటివరకు ఆ నమూనాలను పరిరక్షించడానికి డీప్ ఫ్రీజర్లు, అవి చెడిపోకుండా ఉండడానికి ప్రత్యేక సంరక్షక ద్రవ్యాలు అవసరం అవుతాయి. ఈ ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పన పని నాణ్యతను పెంచడానికి ఎంతగానో దోహదపడతాయి.చదవండి: నిజంగా పవన్ కల్యాణ్కు ఆ ధైర్యం ఉందా?ఆంధ్రప్రదేశ్లోని న్యాయ వైద్య శాస్త్ర ప్రయోగశాలలు (ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీస్) అనేక విష పదార్థాల కారణంగా మరణించినవారి శవపరీక్షలలో పరిమాణాత్మక ఫలితాలను అందించ లేకపోతున్నాయి. అనేక విషాలను గుణాత్మకంగా గుర్తించడంలో పేలవంగా ఉన్నాయి. కాలం చెల్లిన విశ్లేష ణాత్మక విషశాస్త్ర పద్ధతులు (ఎనటికల్ టాక్సికాలజీ) ఉపయోగించడమే దీనికి గల ముఖ్య కారణం. ఎఫ్ఎస్ఎల్లు న్యాయ వైద్య విభాగం మధ్య సరిగ్గా సమన్వయం లేక పోవడం కొన్ని కేసుల న్యాయ విచారణ విఫలమయ్యేందుకు కూడా కారణ మవుతోంది.మొత్తంగా న్యాయ వైద్యశాస్త్ర విభాగం బాగుపడాలంటే... మన మార్చురీలలో, న్యాయ వైద్య ప్రయోగశాలల్లో, పోలీస్ వ్యవస్థలో, అలాగే సంబంధిత వ్యక్తులకు వృత్తి పట్ల అంకిత భావంలో పెను మార్పులు అవసరం.– కట్టంరెడ్డి అనంత రూపేష్ రెడ్డిసహాయ ఆచార్యులు, న్యాయ వైద్య శాస్త్రం– విష విజ్ఞాన శాస్త్రం, ఆంధ్ర వైద్య కళాశాల -
న్యాయం వేగంగా జరిగేనా?
కేంద్ర ప్రభుత్వం నూతనంగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య చట్టాలను తెచ్చింది. పార్లమెంట్ భద్రతా వైఫల్యం గురించిన ప్రతిపక్షాల ఆందోళన, బదులుగా అత్యధిక ఎంపీలు సస్పెండ్ కావడంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త బిల్లులు చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. ఇందులో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు తిరిగి శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడమే ప్రభుత్వ ప్రధాన ఆసక్తిగా ఉంది. అయితే దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన,సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయవ్యవస్థను మాత్రం బీఎన్ఎస్ఎస్ ఊహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం క్రిమినల్ లా బిల్లులను వేగంగా ఉపసంహరించు కుంది; వాటికి బదులుగా భారతీయ న్యాయ సంహిత (ఐపీసీ, 1860 స్థానంలో తీసుకొచ్చిన బీఎన్ఎస్–2), భారతీయ నాగరిక్ సురక్షాసంహిత (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 స్థానంలో వచ్చిన బీఎన్ఎస్ఎస్–2) కొత్త వెర్షన్ లను తెచ్చింది. అలాగే, భారతీయ సాక్ష్య చట్టాన్ని (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 స్థానంలో తెచ్చిన బీఎస్బీ–2) తెచ్చింది. వీటి సారాంశం కచ్చితంగా, వివరంగా ఉన్నప్పటికీ, ఈ చట్టాలలో దాగి ఉన్న వాక్చాతుర్యం గురించి ఆందో ళన చెందవలసి ఉంటుంది. క్రిమినల్ చట్టం, న్యాయం విషయంలో ఏదైనా పరివర్తనా దృష్టిని చూడటం వీటిల్లో కష్టమనే చెప్పాలి. మొత్తంమీద మితిమీరిన నేరీకరణ (క్రిమినలైజేషన్), విస్తృతమైన పోలీసు అధికారాల ద్వారా ప్రభుత్వ నియంత్రణను అసమంజసంగా విస్తరించే వ్యవస్థ వైపు మనం వెళ్తున్నట్లు కనిపిస్తోంది. పోలీసులకు విస్తృత అధికారాలా? బీఎన్ఎస్ఎస్కి చెందిన ఒక ప్రత్యేక అంశం పౌర హక్కులపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. కానీ అది పెద్దగా ఎవరిదృష్టినీ ఆకర్షించలేదు. బీఎన్ఎస్ఎస్లో పోలీసు కస్టడీ సంభావ్య వ్యవధికి సంబంధించిన భారీస్థాయి విస్తరణ, పౌర హక్కుల పరిరక్షణ మూలాన్నే దెబ్బతీస్తోంది. సాధారణ క్రిమినల్ చట్టం ప్రకారం ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీ గరిష్ఠ పరిమితిని 60 రోజులు లేదా 90 రోజులకు (నేర స్వభావాన్ని బట్టి) బీఎన్ఎస్ఎస్ విస్తరించింది. ఇప్పటివరకూ ఉన్న చట్టం ప్రకారం, పోలీసు కస్టడీని అరెస్టయిన మొదటి 15 రోజులకు పరిమితం చేస్తారు. అయితే బీఎన్ఎస్ఎస్లోని ఈ కస్టడీ విస్తరణ పోలీసుల మితిమీరిన చర్యల ప్రమాదాన్ని పెంచు తుంది. పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తుల భద్రత గురించి ఇప్పటికే ఎన్నో ఆందోళనలు ఉన్నాయి. నిర్బంధపూరితంగా, బలవంతంగా పొందు పర్చే కల్పిత సాక్ష్యాలకు చెందిన అధిక ప్రమాదం కూడా ఉంటుంది. అయినప్పటికీ బీఎన్ఎస్ఎస్ పోలీసు అధికారాలను దిగ్భ్రాంతికరంగా విస్తరించిందనే చెప్పాల్సి ఉంది. విశేషమేమిటంటే, మన సాధారణ క్రిమినల్ చట్టం ఇప్పుడు ప్రత్యేక చట్టాలకే పరిమితమైన నిబంధ నలను కలిగి ఉండటం. వాస్తవానికి, ఈ నిబంధనలు పోలీసు కస్టడీ వ్యవధిపై ‘ప్రత్యేక చట్టాలు’ అందించిన వాటికంటే కూడా మించి ఉన్నాయి. ఈ పోలీసు కస్టడీ విస్తరణను భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని అత్యంత విస్తారమైన, అస్పష్టమైన నేరాల నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. అనేక నేరాలు మితిమీరిన నేరీకరణ గురించిన కసరత్తులా ఉన్నాయి. రాజ్య భద్రతను పరిరక్షించడానికి ఉద్దేశించిన నేరాలకు ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఉదాహరణకు, బీఎన్ఎస్–1లోని విస్తృత పదాలతో కూడిన నిబంధనలు, తప్పుడు సమాచారానికి శిక్ష (భారతదేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రత లేదా భద్రతకు హాని కలిగించే తప్పుడు లేదా తప్పుదారి పట్టించే సమాచారం) వంటివి బీఎన్ఎస్–2లోనూ అలాగే ఉన్నాయి. పునర్నిర్మించిన బీఎన్ఎస్లో ‘విద్రోహం’ అనే పదాన్ని తొలగించి నప్పటికీ, దానికి మరోరూపమైన నేరం – భారత సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు హాని కలిగించడం– రెండు వెర్షన్లలోనూ విస్తార మైన, అస్పష్టమైన పదాలతో బాధించడం కొనసాగింది. బీఎన్ఎస్–1 కూడా ‘వ్యవస్థీకృత నేరం’, ‘ఉగ్రవాద చర్య’పై విస్తారమైన పదాలతో కూడిన నేరాలను పరిచయం చేసింది. ప్రత్యేకించి వాటిని ఎదు ర్కోవడానికి వాటి ప్రస్తుత నిర్వచనాలకు మించి నిర్వచించింది. ‘చిన్న వ్యవస్థీకృత నేరం’ అనేది ఒకటి కొత్తగా చేరింది. ఇందులో స్నాచింగ్, పిక్–పాకెటింగ్, బ్లాక్లో టిక్కెట్లను విక్రయించడం వంటి వివిధ రకాల వ్యవస్థీకృత దొంగతనాల గురించిన అస్పష్టమైన జాబితా ఉంది.ఈ నేరాల పరిధి బీఎన్ఎస్–2లో విస్తృతంగా కొనసాగుతుండగా, చిన్న వ్యవస్థీకృత నేరాల, వ్యవస్థీకృత నేరాల పరిధిని స్పష్టం చేయడానికి, పరిమితం చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. ‘ఉపా’లోని సెక్షన్ 15 కింద ఉన్న ‘ఉగ్రవాద చట్టం’ నిర్వచనానికి అనుగుణంగానే బీఎన్ఎస్–2 కూడా ఉంది. అయినప్పటికీ, ఉపాపై పెట్టిన తీవ్రవాద నేరాలకు బీఎన్ఎస్ వర్తింపు గురించి స్పష్టత లేదు. బీఎన్ఎస్–2లో కొత్తగా జోడించిన వివరణ ప్రకారం, పోలీసు సూపరింటెండెంట్ స్థాయి కంటే తక్కువ స్థాయి లేని అధికారి ఈ నిబంధన లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967 ప్రకారం కేసు నమోదు చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు. అధికారి ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుంటారనే దానిపై నిజమైన మార్గదర్శకత్వం లేని ఇది ఒక ఆసక్తికరమైన నిబంధన. చట్టంలోని అనేక సానుకూల అంశాలు మన నేర న్యాయ వ్యవస్థలో ప్రాథమిక పరివర్తనలపై ఆధారపడి ఉంటాయి. దర్యాప్తు, విచారణ సమయంలో సమయపాలన, సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా, న్యాయబద్ధతకూ, సామర్థ్యానికీ కట్టుబడి ఉండే నేర న్యాయ వ్యవస్థను బీఎన్ఎస్ఎస్ ఊహించింది. శోధనకు, నిర్బంధానికి సంబంధించిన ఆడియో–వీడియో రికార్డింగ్ తప్పనిసరి అవసరం అనేది పోలీసు పనితీరులో మరింత జవాబుదారీతనం, పారదర్శకత తేవడంలో ఒక ముఖ్యమైన దశ అవుతుంది. ఏది ఏమైనప్పటికీ, మనం లోతైన నిర్మాణాత్మక అడ్డంకులను పరిష్కరిస్తే తప్ప, సత్వర న్యాయం, సమర్థవంతమైన దర్యాప్తునకు చెందిన లక్ష్యాలను న్యాయబద్ధంగా సాధించలేమని గుర్తించడం చాలా ముఖ్యం. కస్టడీలో సీసీటీవీ కెమెరాలుండాలి అధికంగా ఉన్న ఖాళీలు, ఇప్పటికే అధిక భారం మోస్తున్న న్యాయవ్యవస్థ సమస్యలను పరిష్కరించకుండా సమయపాలనను చేరుకోలేము. విచారణలో ఫోరెన్సిక్ నిపుణుల తప్పనిసరి ప్రమేయం, విచారణ సమయంలో ఆడియో–వీడియో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం (పోలీసుల వాంగ్మూలాల రికార్డింగ్తో సహా), మౌలిక సదుపాయాలు, పరికరాలు, సిబ్బంది శిక్షణలో అభివృద్ధి అవసరం. ఫోరెన్సిక్స్లో, సామర్థ్య సమస్యలతో పాటు, మన నేర న్యాయ వ్యవస్థలో ఉపయోగించే పద్ధతుల శాస్త్రీయ ప్రామాణికతకు సంబంధించి చాలా లోతైన సమస్య ఉంది. నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ ద్వారా దేశంలో ఫోరెన్సిక్ సైన్స్ సామర్థ్యాన్ని పెంపొందించడానికి గణనీయమైన తోడ్పాటు అవసరం. అయితే ఫోరెన్సిక్, నిపుణుల సాక్ష్యాలకు సంబంధించిన విధానం గురించి ప్రాథమిక ప్రశ్నలు ఎక్కువగా పరిష్కృతం కాలేదు. సమర్థత, న్యాయం గురించి మనం జాగ్రత్త పడినట్లయితే, కస్టడీ హింసను నిరోధించడానికి పోలీసు స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే ప్రయత్నం విధిగా ఉండాలి. ఇవి ఏ నేపథ్యంలో అమలు అవుతాయో తగినంతగా లెక్కించకుండానే మనం తరచుగా సాంకేతికత, సామర్థ్యానికి చెందిన ప్రశ్నలను పరిశీలిస్తాము. మొత్తంగా ఈ చట్టాలు మన నేర న్యాయ వ్యవస్థలో పాతుకు పోయిన అన్యాయాలను సరిదిద్దే అవకాశాలను కోల్పోయాయి. బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్, బీఎస్బి రెండు వెర్షన్ ల మధ్య మార్పులు ఉన్నాయి, కానీ నేర చట్టానికి సంబంధించిన విధానంలో ఎటువంటి ప్రాథమిక మార్పు వీటిలో లేదు. ఇప్పటికే ఉన్న క్రిమినల్ చట్టాన్ని నిర్వీర్యం చేసే బదులు, ఈ నూతన చట్టాలు వలసవాద తార్కికతకు మళ్లీ శంకుస్థాపన చేశాయి. ఇక్కడ ప్రభుత్వ ప్రధాన ఆసక్తి ప్రజలను గరిష్ఠ స్థాయిలో నియంత్రించడంగానే ఉంది. – అనూప్ సురేంద్రనాథ్, జెబా సికోరా వ్యాసకర్తలు ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ‘ప్రాజెక్ట్ 39ఏ’లో పనిచేస్తున్నారు. -
దటీజ్ డాక్టర్ మహాలక్ష్మీ..వెయ్యికి పైగా డైడ్బాడీస్కి పోస్ట్మార్టం
‘అమ్మాయిలు పోస్ట్మార్టం చేయలేరు’ ఈ అపోహ తప్పని నిరూపిస్తున్నారు ఈ రంగంలోకి వస్తున్న యువ డాక్టర్లు. నాలుగేళ్లలో వెయ్యికి పైగా మృతదేహాలకు పోస్ట్మార్టం చేసి, అమ్మాయిలూ చేయగలరు అని నిరూపిస్తున్నారు కర్ణాటకలోని కార్వార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహాలక్ష్మి మన దేశంలో మొట్టమొదటి ఫోరెన్సిక్ సైంటిస్ట్గా డాక్టర్ రుక్మిణీ కృష్ణమూర్తి వార్తల్లో నిలిచారు. ముంబయ్లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీలో 1974లో చేరిన ఆమె రిటైర్ అయ్యేంతవరకు వర్క్ చేశారు. ఆమె స్ఫూర్తితో ఆ తర్వాత ఈ రంగంవైపు ఆసక్తి చూపినవాళ్లు ఉన్నారు. కానీ, వేళ్లమీద లెక్కించదగిన సంఖ్యలోనే ఉన్నారు. అనారోగ్యంతో ఉన్నవారిని చూడటం సాధారణం. కానీ, కాలిపోయిన శరీరాలు, ప్రమాదాలలో ఛిద్రమైన శరీరాలు, నీటిలో మునిగిపోయిన శరీరాలు చూడటం సాధారణం కాదు. విషం కారణంగా శరీరం నీలం రంగులోకి మారడం లేదా ఆత్మహత్య కారణంగా మృతదేహాలను చూడటం మరింత బాధాకరం. సున్నితమనస్కులైన మహిళలు ఈ ఛాలెంజ్ను స్వీకరించలేరనేది అందరూ అనుకునేమాట. అయితే, ఈ వృత్తిని తాను ఛాలెంజింగ్గా తీసుకున్నానని చెబుతున్నారు డాక్టర్ మహాలక్ష్మి. చదువుకునే రోజుల్లో... ‘‘అమ్మనాన్నలకు ఐదుగురం ఆడపిల్లలం. అందులో ముగ్గురం డాక్టర్లమే. ఒక అక్క డెంటిస్ట్, మరొకరు ఆయుర్వేద డాక్టర్. వాళ్లని చూసే నేనూ డాక్టర్ కావాలని కల కన్నాను. ఆయుర్వేద వైద్యురాలైన మా అక్క ఫోరెన్సిక్ డాక్టర్ కావాలనుకుంది. కానీ, తను ఆ దారిలో వెళ్లలేకపోయింది. నేను ఈ టాపిక్ను ఎంచుకున్నప్పుడు మా అక్క ఎంతో సపోర్ట్నిచ్చింది. మా నాన్న ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. మా ఇంట్లో ఎప్పుడూ చదువుకే ప్రాధాన్యత ఉండేది. రిస్క్ ఎందుకు అన్నారు.. చదువుకునే రోజుల్లో సీఐడీ సీరియల్ చూసేదాన్ని. అందులో ఫోరెన్సిక్ విభాగం నాకు చాలా ఆసక్తిగా అనిపించేది. ఎంబీబీఎస్ రెండో సంవత్సరంలోనే ఫోరెన్సిక్కు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం మొదలుపెట్టాను. మా ప్రొఫెసర్లు కూడా నాకు ఆ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని, నేర కథనాలను వివరించేవారు. ఇందుకు సంబంధించిన నవలలు కూడా చదివాను. మా క్లాస్మేట్ అబ్బాయిలు మాత్రం ‘ఈ విభాగం వద్దు, అమ్మాయివి ఎందుకు రిస్క్. ఇది కేవలం మార్చురీ గురించి మాత్రమే కాదు, సాక్ష్యం కోసం కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. పోలీసులతో కలిసి పనిచేయాలి. రాత్రి, పగలు ఎప్పుడు అవసరమున్నా చురుగ్గా పనిచేయాలి. లేడీస్కి అంత సులభం కాదు’ అన్నారు. ‘మా నాన్నగారు కూడా పెళ్లై, సంప్రదాయ కుటుంబంలోకి వెళితే ఇబ్బందులుగా మారతాయి’ అన్నారు. కానీ, ఒక కేసు దర్యాప్తులో ఫోరెన్సిక్ నిపుణుల పాత్ర చాలా ముఖ్యం అని నాకు తెలుసు. ఈ ఫీల్డ్లో ఛాలెంజెస్ ఎక్కువ. నేను చేయగలను అని భావించే ఈ విభాగంలోకి వచ్చాను. ఇప్పుడు నా నిర్ణయాన్ని అంతా సమర్ధిస్తున్నారు’’ అని వివరించారు ఈ ఫోరెన్సిక్ డాక్టర్. అనేక పరిశోధనలు.. మేల్ డామినేటెడ్ వృత్తిలో ఎలా చోటు సంపాదించుకున్నావని నన్ను చాలామంది అడుగుతుంటారు. సవాళ్లు అంటే ఇష్టం అని చెబుతుంటాను. నేను పుట్టి పెరిగింది కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలోని హుబ్లీ నగరం. ప్రాథమిక విద్య వరకు బెల్గాంలో చదివాను. ఆ తర్వాత కాలేజీ చదువంతా హుబ్లీలోనే. 2007 నుండి 2017 మధ్యన బెల్గాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఎంబీబీఎస్ పూర్తి చేశాను. ఏడాది పాటు గ్రామీణ ప్రజలకు సేవ చేశాను. 2020లో ఫోరెన్సిక్ విభాగంలో చేరాను. అప్పటి నుండి అనేక పరిశోధనలను ఫోరెన్సిక్ నిపుణుల బృందంతో కలిసి పనిచేశాను. మెడికల్ స్టూడెంట్స్కు క్లాసులు తీసుకుంటున్నాను. ఈ విభాగంలో గోల్డ్ మెడల్ వచ్చింది. – డాక్టర్ మహాలక్ష్మి -
ప్రీతి కేసు ఎటువైపు? ఇంకెన్ని రోజులు?
సాక్షి, వరంగల్: సంచలనం సృష్టించిన వైద్యవిద్యార్థిని ప్రీతి మృతి కేసులో స్పష్టత కొరవడింది. ఆత్మహత్యనా? ఇతరత్రా ఏమైనా జరిగిందా? అనే అనుమానంపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన రావడం లేదు. ఓ వైపు ప్రీతిది హత్యేనంటూ ఆమె కుటుంబ సభ్యులు వాదిస్తుండగా.. ఇంకోవైపు టాక్సికాలజీ రిపోర్టు అధికారికంగా పోలీసులు వెల్లడించలేదు. అయితే.. ఎఫ్ఎస్ఎల్(Forensic Science Laboratory) రిపోర్టు వస్తేనే స్పష్టమైన కారణాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తుండడమే జాప్యానికి కారణంగా తెలుస్తోంది. దీంతో కేసు చిక్కుముడి వీడేందుకు ఇంకెన్ని రోజులు పడుతుందో అని ఎదురు చూస్తున్నారంతా. మరోవైపు నిందితుడైన ఎం.ఎ.సైఫ్ను 4 రోజులు కస్టడీలో విచారించిన మట్టెవాడ పోలీసులు.. మరో 2 రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణను కోర్టు మంగళవారానికి వాయిదా వేయడంతో నిందితుడిని ఖమ్మం జైలుకు తరలించారు. ఇంకా క్లారిటీ రాలేదా? ప్రీతితో గొడవకు దారితీసిన పరిస్థితులతోపాటు ఆమెను వేధించడానికి ఎవరెవరి సహాయాన్ని తీసుకున్నాడన్న దానిపై నిందితుడు సైఫ్ను పోలీసులు ప్రశ్నించారు. టెక్నికల్ డేటాను కూడా సైఫ్ ముందుంచి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. విష రసాయనాలు ఏమీ తీసుకోలేదని టాక్సికాలజీ రిపోర్టు చెబుతోందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే సైఫ్ను మరో 2 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరులో పిటిషన్ వేశారు. ఈ 4 రోజుల కస్టడీలోనూ సైఫ్ పోలీసులకు చెప్పిన సమాచారం అసమగ్రంగా ఉండటంతో మళ్లీ కస్టడీకి కోరినట్లు తెలుస్తోంది. కీలకంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ప్రీతి కేసులో వేధింపులు, ర్యాగింగ్ జరిగినట్టు పోలీసులు నిర్ధారించినా ఇప్పటికీ త్రిసభ్య కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలను ఎక్కడా ప్రస్తావించలేదు. తాజాగా టాక్సికాలజీ రిపోర్టులో ఏ విష రసాయనం తీసుకున్నట్టు లేదని నివేదిక వచ్చిందని చక్కర్లు కొడుతున్న వార్తలతో అసలు ప్రీతిది ఆత్మహత్య కాదా...మరేమైనా జరిగిందా అనే దిశగా పోలీసు విచారణ మారినట్టు తెలిసింది. ప్రీతి ఆత్మహత్య కేసును కాస్త అనుమానాస్పద మృతిగా మార్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎఫ్ఎల్ఎస్ ఇచ్చే నివేదిక కీలకం కానుంది. -
'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా'
న్యూఢిల్లీ: శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకు మంగళవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు అధికారులు. విచారణలో శ్రద్ధను తానే చంపానని అఫ్తాబ్ అంగీకరించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) అధికారులు వెల్లడించారు. అయితే తాను ఇలా చేసినందుకు ఎలాంటి పశ్చాతాపం లేదని అతను చెప్పాడని పేర్కొన్నారు. అంతేకాదు తాను చాలా మంది అమ్మాయిలలో డేటింగ్ చేసినట్లు పాలిగ్రాఫ్ టెస్టులో అఫ్తాబ్ ఒప్పుకున్నాడు. శ్రద్ధను హత్య చేసిన అనంతరం శవాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసినట్లు వివరించాడు. పాలిగ్రాఫ్ టెస్టు సమయంలో అఫ్తాబ్ సాధారణంగానే ప్రవర్తించాడని ఫోరెన్సిక్ అధికారులు చెప్పారు. పాలిగ్రాఫ్ టెస్టుకు ముందు రోజు అఫ్తాబ్పై కొందరు కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. అతడ్ని వాహనంలో తీసుకెళ్తుండగా.. వెంబడించారు. దీంతో పటిష్ఠ భద్రత నడుమ అఫ్తాబ్కు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. చాలా కాలంగా సహజీవనం చేస్తున్న శ్రద్ధను అఫ్తాబ్ దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమె శవాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్లో దాచాడు. ఆ తర్వాత రోజూ కొన్ని శరీర భాగాలు తీసుకెళ్లి అడవిలో పడేశాడు. మే 18న జరిగిన ఈ హత్యోదంతం ఆరు నెలల తర్వాత వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నవంబర్ 12న అఫ్తాబ్ను పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం అతడికి నవంబర్ 22న ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. అనంతరం కస్టడీని మరో 13 రోజులు పొడిగించింది. నార్కో టెస్టు కూడా నిర్వహించేందుకు అనుమతించింది. డిసెంబర్ 1న ఈ పరీక్ష జరగనుంది. చదవండి: లిక్కర్ స్కాం కేసు.. సిసోడియా సన్నిహితుడు అరెస్ట్ -
నేరస్తులను పట్టుకునేందుకు... దాదాపు 70 శవాలను సూట్కేస్లో కుక్కి..
హత్య కేసుల్లో నేరస్తులను కనిపెట్టడానికి ఫోరెన్సిక్ బృదం ఇచ్చే రిపోర్టు అత్యత కీలకమైనది. కొన్ని నేరాల్లో మృతదేహాలు పూర్తిగా పాడైపోయిన స్థితిలో దొరకడంతో బాధితుల తోపాటు నిందితులను కూడా గుర్తించడం కష్టమవుతోంది. అలాంటి సందర్భాల్లో కేసును ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎలా కేసును పరిష్కరించాలి అనే దిశగా ముర్డోక్ విశ్వవిద్యాలయంలోని ఫోరెన్సిక్ బృదం ఒక సరికొత్త అధ్యయనానికి సిద్ధమైంది. అందుకోసం ఆస్ట్రేలియాలో ఒక ప్రదేశంలో సూట్కేసుల్లో దాదాపు 70 మృతదేహాలను కుళ్లిపోయేలా వదిలేశారు. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అవి డికంపోజ్ అవుతాయి. మరణించిన ఎన్ని రోజులకు శరీరం కుళ్లిపోతూ మార్పులు మొదలవుతుంది, అనేదాన్ని బట్టి ఎన్ని రోజలు ఇలా పడి ఉందని అనేది అంచనా వేయడం వంటివి కనుగొంటారు. అంతేగాక నేరస్తులు హత్య చేసి తాము దొరక్కుండా ఉండేందుకు మృతేదేహాన్ని దాచి ఉంచడం లేదా నాశనం చేసేందుకు వారి చేసే ప్రయోగాల్లో మృతదేహం స్థితిని అధ్యయనం చేయడం వంటివి చేస్తారు. పైగా హత్య చేసినప్పటి నుంచి తరలించే సమయంలో సెకండరీ క్రైమ్ని అంచన వేయగలుగుతారు. హత్య చేసిన తర్వాత నిందితులు ఏయే ప్రాంతాల్లో ఉంచడానికి ప్రయత్నిస్తుంటారు వంటివి కూడా కనుగొంటారు. ఈ పరిశోధన నేరస్తుడిని ట్రేస్ చేసి మరింత సమాచారాన్ని అధికారులకు అందించేందుకు ఉపకరిస్తుంది. అందుకోసమే పరిశోధకులు సూట్కేసులలో వివిధ జంతువుల కళేభరాలను ఉంచి వాటిలో వస్తున్న మార్పులను అంచనా వేస్తున్నారు. నేర పరిశోధకులకు ఈ అతి పెద్ద ప్రయోగం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఫోరెన్సిక్ శాస్త్రవేత్తలు. MU’s resident bug whisperer @doc_magni has provided a fascinating look inside suitcases used to hide murder victims, and the role played by the insects trapped within. Read about her first-of-its kind experiment in @ConversationEDU ➡️ https://t.co/U93ZD7g1x4#forensics #CSI pic.twitter.com/dgAmeFElHe — Murdoch University (@MurdochUni) August 31, 2022 (చదవండి: ఫిరంగి పరిమాణంలో గుడ్లు... డైనోసార్లలో మరోజాతి) -
ఆ కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి
గాంధీనగర్: దేశంలో నేర న్యాయ వ్యవస్థను, ఫోరెన్సిక్ సైన్స్ దర్యాప్తును మిళితం చేయాలని భావిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల కంటే అధికంగా మన దేశంలో నేర నిరూపణల శాతాన్ని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆరేళ్లకుపైగా జైలుశిక్ష పడేందుకు అవకాశం ఉన్న కేసుల్లో ఫోరెన్సిక్ దర్యాప్తును తప్పనిసరి, చట్టబద్ధం చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. అమిత్ షా ఆదివారం గుజరాత్లోని గాంధీనగర్లో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ(ఎన్ఎఫ్ఎస్యూ) మొదటి స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రతిజిల్లాలో ఫోరెన్సిక్ మొబైల్ దర్యాప్తు సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఫోరెన్సిక్ దర్యాప్తు స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా జరిగేలా చట్టపరమైన చర్యలు చేపడతామన్నారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(సీఆర్పీసీ), ఎవిడెన్స్ యాక్ట్లో మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ చట్టాలను ఎవరూ భారతీయ దృష్టికోణంలో చూడడం లేదన్నారు. -
60 ముక్కలుగా శరీరం, పరిశీలించేందుకు రెండు రోజులు
పురుషులు మాత్రమే పనిచేయగలరనే ఫోరెన్సిక్ విభాగంలో మహిళగా ఆమె రికార్డు సాధించింది. ఎంచుకున్న పనిని ఏళ్లుగా సమర్థంగా నిర్వర్తించడంతో పాటు అందమైన ప్రకృతిని తన కెమరా కన్నుతో పట్టేస్తోంది డాక్టర్ గీతారాణి గుప్తా. మధ్యప్రదేశ్ ఫోరెన్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఏకైక మహిళగానే కాదు, 32 ఏళ్ల వైద్య వృత్తిలో 9,500 మృతదేహాలకు పోస్టుమార్టం చేసిన రికార్డు కూడా డాక్టర్ గీతారాణి గుప్తా సొంతం. 63 ఏళ్ల వయసులోనూ భోపాల్లోని మెడికో లీగల్ ఇనిస్టిట్యూట్లో సీనియర్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్గా విధులను నిర్వహిస్తున్నారు. మగవాళ్లే చేయగలరు అనే విభాగంలో పనిచేయడంతో పాటు, రికార్డు సృష్టించిన గీతారాణి గుప్తా ఇన్నేళ్ల వైద్యవృత్తిలో తన అనుభవాలను ఆమె ఇటీవల పంచుకున్నారు. ఇప్పటికీ మధ్యప్రదేశ్లో ఫోరెన్సిక్ మెడిసిన్లో ఎం.డి చేసిన ఏకైక మహిళగా గీతారాణి పేరే ఉంటుంది. తను పుట్టి పెరిగిన వాతావరణం, ఎంచుకున్న మెడికల్ విభాగం, వృత్తి అనుభవాలతో పాటు, అభిరుచులనూ తెలియజేశారు. కళ్ల ముందు కదలాడే కథలు ‘‘ఎనిమిదేళ్ల క్రితం జరిగిన సంఘటనే అయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. అది అంత దారుణమైనది. 60 ముక్కలుగా కట్ అయి ఉన్న ఉన్న ఒక శరీరం పోస్ట్ మార్టం కోసం షాజాపూర్ నుండి వచ్చింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి, బోర్వెల్లో వేశారు హంతకులు. పోలీసులు మృతదేహాన్ని, వెలికి తీసి తరలించడానికే మూడు రోజులు పట్టింది. దీన్ని పరీక్షించడానికి నాకు రెండు రోజులు పట్టింది. నాలుగేళ్ల క్రితం, మూడు నాలుగు ముక్కలు చేసిన పుర్రె, అస్థిపంజరం తీసుకొచ్చారు. ఇది పరీక్షించడం ఓ సవాల్ అయ్యింది. పుర్రెను పరీక్షించినప్పుడు, బుల్లెట్ పుర్రెలో చిక్కుకున్నట్లు కనుక్కున్నాను. అతని కుటుంబ సభ్యులే ఈ హత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఎన్ని కేసులు... ప్రతీ రోజూ మృతదేహాల మీద పరీక్షలే. ఏకైక మహిళగా తొలి అడుగు మా నాన్నగారు ఉపాధ్యాయుడు. నేను కూడా మెడికల్ కాలేజీలో లెక్చరర్ కావాలనుకున్నాను. అంతే పట్టుదలగా చదివాను. ఫోరెన్సిక్ విభాగంలో లెక్చరర్ షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. దానికి నా వయస్సు రెండు నెలల 8 రోజులు ఎక్కువ. లెక్చరర్గా వెళ్లకుండా ఈ విభాగంలో చేరిపోయాను. అలా ఫోరెన్సిక్ మెడిసి¯Œ లో ఎమ్డి చేసిన రాష్ట్రంలో తొలి మహిళా వైద్యురాలిని అయ్యాను. పీహెచ్డి చేయాలనుకున్నాను. కానీ, ప్రభుత్వ పనికి అంతరాయం కలిగించడం నాకిష్టం లేదు. అందుకే, ఎంచుకున్న వృత్తిలో అలాగే కొనసాగాను. మాటలు రాని క్షణాలు నా మొదటి రోజు ఉద్యోగంలో నేను గమనించిన విషయం.. నోరు, ముక్కుపై క్లాత్ అడ్డుపెట్టుకొని మృతదేహాన్ని చూడటానికి ఆ కుటుంబసభ్యులు వచ్చినప్పుడు మనిషి చనిపోయాక ఇక విలువ లేదని అర్ధం చేసుకున్నాను. ఆ క్షణంలో మాటలు రాకుండా అలాగే ఉండిపోయాను. మొదటిరోజే 20 మృతదేహాలను చూశాను. ఆ రోజు రాత్రంతా నిద్రపోలేకపోయాను. కాని నా మనస్సుకు తెల్లవార్లు బలంగా ఉండాలంటూ నాకు నేను నచ్చజెప్పుకుంటూ గడిపాను. ఇది నాకు అంతర్గత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తరువాత ఇక నేను నా విధిని నిర్వర్తిస్తున్నాను అనే అనుకున్నాను. అలా ఆ ఏడాది 20 మృతదేహాలకు పోస్టుమార్టం చేశాను. ఎంపీ మెడికల్ లీగల్ ఇన్స్టిట్యూట్లో మెడికల్ ఆఫీసర్గా 1989లో ఎంపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఎంపిపిఎస్సి) నుంచి ఎంపిక చేశారు. నాటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ నా పని శవపరీక్ష. ఇదే కాకుండా మెడికో లీగల్ కేసుల పరిష్కారానికి కోర్టుకు హాజరు కావడం. ఖాళీ సమయంలో ఫోటోగ్రఫీ.. ఫోరెన్సిక్ విభాగంలో శవపరీక్ష ఛాయాచిత్రాలను తీయిస్తూ ఉండేవాళ్లం. ఆ ఫొటోలను పరిశీలించడానికి ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. ప్రముఖ ఫోటోగ్రాఫర్స్ రాకేశ్ జైమిని, ప్రశాంత్ సక్సేనా ఫోటోగ్రఫీని నేర్పించారు. అలా ఫొటోగ్రఫీ నా అభిరుచిగా మారిపోయింది. నేను ఒంటరిగా ఉంటాను. కానీ, నాకు నచ్చిన అన్ని పనులు చేస్తాను. మరో నచ్చిన పని లాంగ్ డ్రైవింగ్. నా దగ్గర కారు, ల్యాప్టాప్, కెమెరా ఉన్నాయి. జంతువులు, పక్షుల ఫోటోలు తీయడానికి సిటీ నుంచి అడవుల వరకు దూరంగా వెళ్లిపోతాను. ఎంపిక మనది అవ్వాలి.. నేను ప్రతి రంగంలో అమ్మాయిలు రాణిస్తున్నారు. పురుషు ఆధిపత్య సమాజంలో మహిళలు చోటు సంపాదిస్తున్నారు. అమ్మాయిలూ ధైర్యంగా ఉండండి. సవాళ్లను స్వీకరించి ముందుకు సాగండి. మీరు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో ఈ ఎంపికను మీరే చేసుకోండి. ఏదో ఒక అభిరుచిని మీలో ఎప్పుడూ ఉంచుకోండి. అది మిమ్మల్ని నిరంతరం జీవించేలా చేస్తుంది’’ అని నవతరం అమ్మాయిలకు వివరిస్తారు డాక్టర్ గీతారాణి గుప్తా. -
రేప్ కేసుల్లో న్యాయం జరగాలంటే...
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్ దళిత యువతి అత్యాచారం కేసులో బాధితురాలికి న్యాయం జరగాలంటూ కాంగ్రెస్, దళిత పార్టీలు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఏ అత్యాచారం కేసులోనైనా బాధితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం లేదా అధికార యంత్రాంగం ప్రధానంగా మూడు చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొదటిది లైంగిక దాడి సాక్ష్యాల కిట్స్ను అందుబాటులోకి తీసుకరావడం. రేప్ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలంటే కోర్టు ముందు నిలబడే తిరుగులేని సాక్ష్యాలను బాధితుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. వారి నుంచి వివిధ రకాల నమూనాలతోపాటు డీఎన్ఏను సేకరించి సీల్డ్ బాక్సులో నేరుగా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించే ప్రత్యేకమైన కిట్లను అందుబాటులోకి తీసుకరావడం. నిర్భయ కేసును దృష్టిలో ఉంచుకొని 2014లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘సెక్సువల్ అసాల్ట్ ఫోరెన్సిక్ ఎవిడేన్స్ లేదా సేవ్’ కిట్ల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సూచించింది. (హథ్రాస్: న్యాయం చేసే ఉద్దేశముందా?) 2019 వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కేవలం తొమ్మిదంటే తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేశాయని, సేఫ్ కిట్లను సేకరించాయని తెల్సింది. 16 నిమిషాలకు ఓ అత్యాచారం జరుగుతున్న భారత్లో దేశవ్యాప్తంగా 3,120 సేఫ్ కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ‘బ్యూరో ఆఫ్ పోలీస్ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్’వర్గాలు తెలిపాయి. ఇలాంటి కిట్లు ప్రస్తుతం అమెరికాలో లక్షల్లో ఉన్నాయి. గత ఆరు నెలల్లో ఇలాంటి కిట్ల ద్వారా సేకరించిన డీఎన్ఏ సాక్ష్యాధారాలతోనే రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులోని పలు కోర్టులు నేరస్థులకు సకాలంలో శిక్షలు విధించగలిగాయి. హథ్రాస్ దళిత యువతి రేప్ కేసులో సేఫ్ కిట్లను ఉపయోగించినట్లయితే సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న ఆరోపణలుగానీ, అనుమానాలుగానీ వ్యక్తం అయ్యేవి కావు. (రేప్ కేసుల్లో బాధితుల పేర్లు వెల్లడిస్తే..) రేప్ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలంటే పోలీసులకు, నర్సులకు, వైద్యులకు తగిన శిక్షణ అవసరం. నిర్భయ గ్యాంగ్ రేప్ నేపథ్యంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోకి 357 సీ సెక్షన్ ప్రకారం రేప్ బాధితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా వైద్య చికిత్సను అందించాలి. దీనికి సంబంధించి 2014లో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా వైద్యులు, నర్సులు రేప్ బాధితులు మానసిక ఒత్తిడికి గురికాకుండా అండగా ఉండాలి. ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా బాధితులకు సేఫ్ కిట్లతో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను భద్రంగా ఉంచాలి. రేప్ కేసుల్లో సాక్ష్యాధారాల సేకరణకు మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది కనుక వైద్య సిబ్బందికి ఎంతో క్రమశిక్షణ అవసరం. అత్యాచార కేసుల్లో బాధితులు మరణించిన పక్షంలో వారి మత దేహాలను కొంతకాలం పాటు భద్రపర్చాలి. అనుమానాలు వ్యక్తం అయిన సందర్భాల్లో మరోసారి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించేందుకు వీలుంటుంది. మతదేహాన్ని దహనం చేయకుండా పూడ్చి పెట్టినట్లయితే సాక్ష్యాధారాలను సేకరించేందుకు వీలుంటుంది. భారత్లాంటి దేశంలో మెజారిటీ సామాజిక వర్గాల ప్రజలు దహన సంస్కారాలే చేస్తారు. (హత్రాస్ ఉదంతం.. ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు) హథ్రాస్ రేప్ కేసులో బాధితురాలు మంగళవారం ఉదయం మరణించగా, ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు ఆమె మతదేహాన్ని దహనం చేయడం తెల్సిందే. ఆ మరుసటి రోజే బాధితురాలిపై అత్యాచారం జరగలేదంటూ పోలీసులు ఫోరెన్సిక్ నివేదికను బయట పెట్టారు. దానిపై సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించేందుకు బాధితురాలి మృతదేహం లేకుండా పోయింది. ఈ విషయంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టం ముందు దోషులను నిరూపించేందుకు పోలీసులకు కూడా తగిన శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. -
దిశకేసులో కీలకంగా మారిన ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్
-
దిశ కేసు: నిందితుల డీఎన్ఏలో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్ : దిశ అత్యాచారం, హత్య కేసు విచారణలో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నివేదిక కీలకంగా మారింది. కాలిపోయిన దిశ శరీరం స్టెర్నమ్ బోన్ నుంచి సేకరించిన డీఎన్ఏ ఆధారంగా.. ఆ మృతదేహం దిశదే అని నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అదే విధంగా ఘటనాస్థలంలోనే నిందితులు అత్యాచారం చేసినట్లుగా స్పష్టమైన ఫోరెన్సిక్ ఆధారాలు లభించాయి. ఈ క్రమంలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. దిశ శరీరంలో ఆల్కహాల్ ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. దీంతో దిశపై అత్యాచారానికి పాల్పడటానికి ముందు నిందితులు ఆమెకు మద్యం తాగించినట్లుగా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ విషయాన్ని నిందితులు ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇక ఎన్కౌంటర్లో మరణించిన దిశ నిందితుల డీఎన్ఏ నివేదికలో సైతం కీలక అంశాలు వెలుగుచూస్తున్నాయి. గతంలో జరిగిన నేరాలతో దిశ నిందితుల డీఎన్ఏ మ్యాచ్ అవుతున్నట్లు నిపుణులు వెల్లడించారు. దీని ఆధారంగా నిందితులకు నేర చరిత్ర ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా వెటర్నరీ డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న దిశను నలుగురు నిందితులు చటాన్పల్లి వద్ద పాశవికంగా అత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన విషయం విదితమే. అనంతరం ఆమె మృతదేహాన్ని కాల్చివేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ క్రమంలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారించారు. క్రైం సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులను ఘటనాస్థలికి తీసుకువెళ్లగా అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిందితులది బూటకపు ఎన్కౌంటర్ అంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా... విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం... ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్ను నియమించింది. -
ఫోరెన్సిక్ ల్యాబ్ల ఆధునీకరణ
న్యూఢిల్లీ: నేర ఘటనలలో సమర్థవంతమైన దర్యాప్తు జరిపేందుకు వీలుగా దేశంలోని ఆరు కేంద్ర ఫోరెన్సిక్ ప్రయోగశాలలను అప్గ్రేడ్ చేయనున్నట్లు కేంద్రం తెలిపింది. చండీగఢ్, హైదరాబాద్, కోల్కతా, భోపాల్, పుణే, గువాహటిలలో ఉన్న ఆరు సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలు (సీఎఫ్ఎస్ఎల్)లను ఆధునీకరించనుంది. ఈ ఆరు సీఎఫ్ఎస్ఎల్ల సామర్థ్యాన్ని పెంచాలని హోం శాఖ నిర్ణయించిందని ఒక అధికారి తెలిపారు. తీవ్రమైన నేరాలలో మరింత సమర్థవంతమైన, శాస్త్రీయ విధానంలో దర్యాప్తును సులభతరం చేయడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. పరిశోధన కార్యకలాపాలను నిర్వహించడానికి ఇటీవల ఢిల్లీలోని డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్ సర్వీసెస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిహేవియరల్ సైన్సెస్, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. దీని ద్వారా విద్యావేత్తలు–అభ్యాసకుల మధ్య భాగస్వామ్యాన్ని పెండడంతోపాటు అత్యాధునిక పరిశోధనలకు దోహదపడుతుందని భావిస్తున్నారు. -
థర్డ్ డిగ్రీలకు కాలం చెల్లింది
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసుల్లో నేర నిర్థారణ శాతం చాలా తక్కువగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. పోలీసులు అనుమానితుల పట్ల థర్డ్ డిగ్రీని ప్రయోగించడం, ఫోన్ల ట్యాపింగ్ లాంటి పురాతన విధానాలు నేరాలను అరికట్టడంలో ఆశించిన ఫలితాలను ఇవ్వలేవని చెప్పారు. బుధవారం ఢిల్లీలో పోలీస్ పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్డీ) 49వ వ్యవస్థాపక దినోత్సవంలో అమిత్ షా మాట్లాడారు. దర్యాప్తులో పోలీసులు ఫోరెన్సిక్ ఆధారాలను వినియోగించుకోవాలని, వీటి ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని సూచించారు. నేర శిక్షా స్మృతి, భారతీయ శిక్షా స్మృతిని సవరించడంపై చర్చల ప్రక్రియను ప్రారంభించాలన్నారు. దీనిపై సూచనలు, సలహాలు సేకరించి హోంశాఖకు పంపాలన్నారు. శిక్షా కాలం ఏడేళ్లు అంతకు మించిన క్రిమినల్ కేసుల్లో ఫోరెన్సిక్ ఆధారాలను తప్పనిసరి చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. శాస్త్రీయ విధానాలను అనుసరించాలి ‘ఫోరెన్సిక్ ఆధారాలను సైతం జత చేస్తూ పోలీసులు సమగ్రవంతమైన చార్జ్షీటును కోర్టుకు సమర్పిస్తే నిందితుల తరపు న్యాయవాదులకు వాదించడానికి పెద్దగా అవకాశాలు ఉండవు. శిక్ష పడే అవకాశాలు సైతం బాగా పెరుగుతాయి. నేరగాళ్లు, నేర ప్రవృత్తి వ్యక్తుల కన్నా పోలీసులు నాలుగు అడుగులు ముందు ఉండటం అత్యవసరం. పోలీసులు వెనకపడకూడదు. బలగాల ఆధునికీకరణతోనే ఇది సాధ్యం. ఇది థర్డ్ డిగ్రీలు ప్రయోగించే కాలం కాదు. దర్యాప్తులో శాస్త్రీయ విధానాలను అనుసరించాలి. ఫోన్ల ట్యాపింగ్ సత్ఫలితాలు ఇవ్వదు. పౌర పోలీసింగ్, ఇన్ఫార్మర్ల వ్యవస్థతో చాలా ప్రయోజనాలున్నాయి. బీట్ కానిస్టేబుళ్ల విధానాన్ని బలోపేతం చేయాలి’ అని అమిత్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఫోరెన్సిక్ వర్సిటీ జాతీయ స్థాయిలో పోలీస్ ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటుచేయాలని కేంద్రం భావిస్తోందని అమిత్ షా వెల్లడించారు. వర్సిటీకి ప్రతి రాష్ట్రంలో అనుబంధ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు. 12వ తరగతి తరువాత పోలీస్ దళాల్లోకి ప్రవేశించాలనుకునే విద్యార్థుల కోసం శిక్షణ ఇచ్చి పరీక్షల్లో వెయిటేజ్ కల్పిస్తామన్నారు. ఈమేరకు బీపీఆర్డీ అందచేసిన ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. గుజరాత్లో ఈ ప్రయోగం విజయవంతమైందని, ఫోరెన్సిక్ వర్సిటీల నుంచి పట్టా పొందిన విద్యార్థుల్లో ఒక్కరు కూడా నిరుద్యోగిలా మిగిలిపోలేదన్నారు. -
నేరపరిశోధనలో నారీమణి
అత్యాచారాలు.. హత్యలు.. దోపిడీలు.. ఇంకా క్రూరాతి క్రూరమైన లైంగిక నేరాలలో.. నిజ నిర్ధారణ సవాళ్లతో కూడుకున్న పని. అయితే ‘ఫోరెన్సిక్ ఒడంటాలజీ’లో నిష్ణాతురాలైన డా. హేమలతా పాండే ఎంతో నైపుణ్యంతో ఈ అంతుచిక్కని నేరాలను ఛేదిస్తున్నారు. దంత వైద్యశాస్త్రంతో ముడిపడిన ‘ఫోరెన్సిక్ ఒడంటాలజీ’ భారత్లో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా.. లైంగికదాడులు, ఇతర హింసాత్మక కేసుల్లో నిందితుల ప్రమేయాన్ని నిగ్గుతేల్చడంలో ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతోంది. వివిధ సివిల్, క్రిమినల్ కేసులతో పాటు క్రీడాకారుల వయసు నిర్ధారణ వివాదాల పరిష్కారానికీ ఈ శాస్త్ర పరిశోధన దోహదపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు విచారణలో భాగంగా తొలిసారి ఫోరెన్సిక్ ఒడంటాలజీ వెలుగులోకి వచ్చింది. దీని ద్వారానే ఈ కేసులో నిందితుల క్రూరత్వాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలిగారు. పోలీసులిచ్చిన అనుమానితుల ఫొటోల్లోని ముఖకవళికలను బట్టి నిందితుల నోటి పళ్ల సరళి ద్వారా వారి వయసు (రేప్కు పాల్పడిన వారిలో ఓ మైనర్ కూడా ఉండటంతో) నిర్ధారించారు.నిర్భయ శరీరంపైæగాయాలను ఈ నిందితుల పలువరసను పోల్చి చూడటం ద్వారా ఈ కేసును పరిష్కరించారు. ఇలాంటి కేసులను ఛేదించడంతో పాటు హత్యలు లేదా ఏవైనా ప్రమాదాల్లో ఆనవాలు పట్టలేని విధంగా మారిపోయిన శరీర అవశేషాలతో అపరిష్కృతంగా మిగిలిపోయిన కేసుల పరిష్కారంలోనూ ఈ శాస్త్రం ముఖ్యభూమిక పోషిస్తోంది. అస్థిపంజరం లేదా ఎముకల ఆధారంగా వేసే వయసు అంచనాలో పదేళ్ల వరకు వ్యత్యా సం ఉండే అవకాశం ఉండగా.. దంతాల ఆధారంగా హతులు లేదా నిందితుల వయసు అంచనా ఓ ఏడాది మాత్రమే అటూ ఇటుగా ఉండటంతో ఈ ఒడంటాలజీకి ప్రాధాన్యం చేకూరింది. దేశంలో ఉన్నది పదిమందే! సవాళ్లతో కూడుకున్న ఈ ఫోరెన్సిక్ ఒడంటాలజీ రంగంలో డా. హేమలతా పాండే తనదైన ప్రతిభను చాటుతున్నారు. ఈ ప్రత్యేక నేరపరిశోధనా రంగంలో శాస్త్రపరమైన అనుభవమున్న వారు దేశవ్యాప్తంగా ఉన్నది కేవలం పదిమందే. వీరంతా కూడా విదేశాల్లో ఈ పీజీ కోర్సును పూర్తిచేశాక, అక్కడే శిక్షణ పొంది వచ్చినవారే. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ (కేఈఎం) హాస్పటల్లో గ్రాడ్యుయేషన్ కోర్సు చదువుతున్నపుడు హేమలతకైతే అర్హులైన ఫోరెన్సిక్ సైన్స్ బోధకులే ఉండేవారు కాదు. అయినా ఫోరెన్సిక్ డెంటిస్ట్రీపై పాండేకు ఆసక్తి పెరిగింది. ఇంగ్లండ్లోని వేల్స్ నుంచి మాస్టర్డిగ్రీ పూర్తిచేశాక, 2013 లో కేఈఎం ఆసుపత్రిలోనే చేరారు. ఫోరెన్సిక్ రంగాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ తర్వాత స్థానికంగా, ఇతర రాష్ట్రాల్లోనూ వివిధ కేసుల పరిశోధనలకు పోలీసులకు సహకారాన్ని అందించారు.గుర్తుపట్టలేనంతగా తయారైన శరీరభాగాల కొలతలతో ముందుగా పుర్రె స్వరూపాన్ని రూపొందించుకుని అందులో దంత ద్వయాన్ని, పండ్ల మధ్యనున్న సందులు ఇతర రూపాలను ప్లాస్టర్ ఆఫ్ పారిస్, బంకమట్టి, ఇతర మోడళ్లు, డిజిటల్ పరికరాలతో తయారుచేసుకుంటామని హేమలత తెలిపారు. గ్రామీణ యువతి హత్య కేసు అత్యాచారాలు, లైంగికహింస, హత్యల వంటి కేసుల్లో మరణించిన వారి వయసుతో పాటు, వారు ఆడా, మగా అనేది ముందుగా నిర్ధారించాల్సి ఉంటుంది. హతులు ఫలానావారు అయుండొచ్చని పోలీసులు అనుమానిస్తే తదనుగుణంగా వారి ఫొటోలు, ముఖకవళికలను బట్టి గుర్తించేందుకు వీలుగా పంటి ద్వయాన్ని సిద్ధం చేస్తారు. మహారాష్ట్రలోని ఓ గ్రామీణ యువతి హత్య కేసు పరిశోధనలో భాగంగా పాండే బృందం ఓ గ్రూపు ఫొటో నుంచి ఆనవాళ్లు తీసుకుని, వాటిని శవంతో సరిచూసి నిర్ధారించగలిగారు. ఫొటోను పెద్దదిగా చేసినపుడు ఆ అమ్మాయి నవ్వులో పలువరస కనిపించడంతో దాని ఆధారంగా దంతాల తీరును, ముందుపళ్ల నున్న సందుతో హతురాలిని గుర్తించారు. ఎనిమిది నెలల తర్వాత డీఎన్ఏ టెస్ట్లో ఇదే విషయం స్పష్టమైంది. రెండేళ్లక్రితం నాటి అహ్మద్నగర్ రేప్ కేస్లోనూ ఆమె పరిశోధనతోనే హతురాలి శరీరంపై పళ్లగాట్లతో నేరస్తుడిని పోల్చి పట్టుకున్నారు. దీనిపై ఆమె కోర్టులోనూ పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దాదాపు పది, పన్నెండు కేసుల్లో కోర్టు విచారణకు హాజరై ఫోరెన్సిక్ సైన్స్ నిపుణురాలిగా హేమలత సాక్ష్యమిచ్చారు. స్పెషల్ కోర్సు లేదు! భారత్లో ప్రతీ ఏడాది దాదాపు 26 వేల మంది డెంటిస్ట్ గ్రాడ్యుయేట్లు తయారవుతున్నారు. అందులో మూడువేల మందే పోస్ట్గ్రాడ్యుయేషన్ వరకు వెళుతున్నారు. ప్రస్తుతం దేశంలో ‘ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ’ కోర్సుకు సంబంధించి ప్రభుత్వ గుర్తింపు పొందిన పీజీ కోర్సు ఏదీ లేదు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ ఒడొంటాలజీ మాత్రం.. ఓ సర్టిఫికెట్ కోర్సుతో పాటు ఈ రంగంలో వర్క్షాపులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ అసోసియేషన్ కార్యదర్శి డా. ఆషిత్ ఆచార్య నిర్భయకేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించారు. ధార్వాడ్లోని ఎస్డీఎం కాలేజి ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ హాస్పటల్లో ఆయన అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కర్ణాటకలోని అన్నెగెరిలో లెక్కకు మించి మనుషుల పుర్రెలు బయటపడినపుడు, అవి 1790 నాటి స్త్రీ, పురుషులవిగా ఆయన తన పరిశోధనలో తేల్చారు. ఇక హైదరాబాద్లోని పాణనీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రీసెర్చి ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ విభాగాధిపతి డా. సుధీర్ బళ్లా వివిధ కేసుల్లోని దోషుల వయసు నిర్ధారణలో తనవంతు కృషి చేస్తున్నారు. 18 ఏళ్ల పైబడిన, ఆ వయసు కంటే తక్కువున్న వారికి చట్ట అన్వయం ఒక్కో విధంగా ఉన్నందున వయసు నిర్ధారణలో ఈ శాస్త్రం కీలకంగా మారింది.. 16–18 ఏళ్ల వయసున్న వారిని వయోజనులుగా పరిగణించవవచ్చు కాబట్టి వారికి పడే శిక్షలు వేరుగా ఉంటాయి. ఈ సైన్స్ ద్వారా మనుషుల్లోని జ్ఞానదంతం పెరుగుదలను బట్టి వయస్సును నిర్ధారిస్తారు. – కె. రాహుల్ -
పళ్లలో పట్టేస్తారు...!
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సష్ఠించిన ఢిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం,హత్య కేసు విచారణలో భాగంగా ఈ పరిశోధన వెలుగులోకి వచ్చింది. దంతవైద్యశాస్త్రంతో ముడిపడిన ఒడంటోలజీ ఫోరెన్సిక్ సైన్స్ ద్వారానే ఈ కేసులో నిందితుల క్రూరత్వాన్ని సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలిగారు. పోలీసులిచ్చిన అనుమానితుల ఫోటోల్లోని ముఖకవళికలను బట్టి నిందితుల నోటి పళ్ల సరళి ద్వారా వారి వయసు (రేప్కు పాల్పడిన వారిలో ఓ మైనర్ కూడా ఉండడంతో ) నిర్థారించారు. నిర్భయ శరీరంపై æగాయాలను ఈ నిందితుల పలువరసను పోల్చి చూడడం ద్వారా ఈ కేసును పరిష్కరించారు. నేర పరిశోధనలో...మరీ ముఖ్యంగా తీవ్రాతి తీవ్రమైన నేరాలు, క్రూరమైన పద్ధతుల్లో లైంగికహింస, దాడులు, హత్యలు సాగుతున్న ప్రస్తుత సందర్భంలో ‘ఫోరెన్సిక్ ఒడంటోలజీ’ కీలకపాత్ర పోషిస్తోంది. దంతవైద్యశాస్త్రంతో ముడిపడిన ఈ ఫోరెన్సిక్ సైన్స్ భారత్లో ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నా, లైంగికదాడులు, ఇతర హింసాత్మక కేసుల్లో నిందితుల ప్రమేయాన్ని నిగ్గుతేల్చడంలో ముఖ్యమైన ఆధారంగా ఉపయోగపడుతోంది. వివిధ సివిల్, క్రిమినల్ కే సులతో పాటు క్రీడాకారుల వయసు నిర్థారణ వివాదాల పరిష్కారానికి ఈ పరిశోధన దోహదపడుతోంది. అస్థిపంజరం, ఎముకల ద్వారా కంటే కూడా ఈ ఫోరెన్సిక్ సైన్స్ నిర్థారణ పక్కాగా ఉంటుంది. దంతాల ఆధారంగా హతులు లేదా నిందితుల వయసు అంచనా ఓ ఏడాది అటూ ఇటూగా ఉంటే, అస్థిపంజరం లేదా ఎముకల ఆధారంగా చేసే అంచనా మధ్య తేడా పదేళ్ల వరకు ఉండొచ్చునంటున్నారు. ఫోరెన్సిక్ ఒడంటోలజీ లో డా. హేమలతా పాండే తనదైన ప్రతిభ, నైపుణ్యాన్ని చాటుతున్నారు. ఈ ప్రత్యేక నేరపరిశోధనా రంగంలో శాస్త్రపరమైన అనుభవమున్న వారు దేశవ్యాప్తంగా కేవలం పది మంది వరకే ఉన్నారు. వీరంతా కూడా విదేశాల్లోనే ఈ పీజీ కోర్సును పూర్తిచేశాక, అక్కడే శిక్షణ పొంది వచ్చినవారే. ఇలాంటి కేసులకు సంబంధించి వార్తలు పత్రికలో చూశాక, తనకు తానే పోలీసుల వద్దకు వెళ్లి వాటి పరిష్కారానికి అవసరమైన సహకారాన్ని అందిస్తానంటూ తొలినాళ్లలో పాండే వంటి వాళ్లు చెప్పాల్సి వచ్చేది. మహారాష్ట్రలోని ఓ గ్రామీణ యువతి హత్య కేసు పరిశోధనలో భాగంగా పాండే బందం ఓ గ్రూపు ఫోటో నుంచి ఆనవాళ్లు తీసుకుని, వాటిని శవంతో సరిచూసి నిర్థారించగలిగారు. ఫోటోను పెద్దదిగా చేసినపుడు ఆ అమ్మాయి నవ్వులో పలువరస కనిపించడంతో దాని ఆధారంగా దంతాల తీరును, ముందుపళ్ల నున్న సందుతో హతురాలిని గుర్తించారు. ఎనిమిదినెలల తర్వాత డీఎన్ఏ టెస్ట్లో ఇదే విషయం స్పష్టమైంది. రెండేళ్లక్రితం నాటి అహ్మద్నగర్ రేప్కేస్లోనూ ఆమె పరిశోధనతోనే హతురాలి శరీరంపై పళ్లగాట్లతో నేరస్తుడిని పోల్చి పట్టుకున్నారు. దీనిపై ఆమె కోర్టులోనూ పవర్పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దాదాపు పది,పన్నెండు కేసుల్లో కోర్టు విచారణకు హాజరై ఫోరెన్సిక్ సైన్స్ నిపుణురాలిగా సాక్ష్యమిచ్చారు. మనదేశంలో అంతంతే... భారత్లో ప్రతీ ఏడాది దాదాపు 26 వేల మంది డెంటిస్ట్ గ్రాడ్యువేట్లు తయారవుతున్నారు. అందులో మూడువేల మందే పోస్ట్గ్రాడ్యువేషన్ వరకు వెళుతున్నారు. ప్రస్తుతం దేశంలో ‘ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ’కోర్సుకు సంబంధించి ప్రభుత్వ గుర్తింపు పొందిన పీజీ కోర్సు ఏదీ లేదు. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫోరెన్సిక్ ఒడొంటోలజీ ఓ సర్టిఫికెట్ కోర్సుతో పాటు ఈ రంగంలో వర్క్షాపులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది. ఈ అసోసియేషన్ కార్యదర్శి డా. ఆషిత్ ఆచార్య నిర్భయకేసు పరిశోధనలో కీలకంగా వ్యవహరించారు. ధార్వాడ్లోని ఎస్డీఎం కాలేజి ఆఫ్ డెంటల్సైన్సెస్ అండ్ హాస్పటల్లో ఆయన అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. కర్ణాటకలోని అన్నెగెరిలో లెక్కకు మించి మనుషుల పుర్రెలు బయటపడినపుడు, అవి 1790 నాటి స్త్రీ,పురుషులవిగా ఆయన తన పరిశోధనలో నిగ్గు తేల్చారు. దుర్భిక్షంగా కారణంగా వారంతా మరణించినట్టు వెల్లడించారు. అప్పటివరకు మొగల్ సైన్యం స్థానికులను సామూహికంగా హత్య చేసి ఉంటుందని అందరూ భావించారు. హైదరాబాద్లోని పాణ నీయ ఇన్సిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ అండ్ రిసెర్చీ ఫోరెన్సిక్ డెంటిస్ట్రీ విభాగాధిపతి డా. సుధీర్ బళ్లా వివిధకేసుల్లోని దోషుల వయసు నిర్థారణలో తనవంతు కషి చేస్తున్నారు. 18 ఏళ్ల పైబడిన, ఆ వయసు కంటే తక్కువున్న వారికి చట్ట అన్వయం ఒక్కో విధంగా ఉన్నందున వయసు నిర్థారణలో ఈ శాస్త్రం కీలకంగా మారింది.. 16–18 ఏళ్ల వయసున్న వారిని వయోజనులుగా పరిగణించవవచ్చు కాబట్టి వారికి పడే శిక్షలు వేరుగా ఉంటాయి. ఈ సైన్స్ ద్వారా మనుషుల్లోని జ్ఞానదంతం పెరుగుదలను బట్టి వయస్సును నిర్థారిస్తారు. -
బురారీ కేసు.. ప్రమాదం మాత్రమే : ఫోరెన్సిక్ రిపోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ సామూహిక మరణాల మిస్టరీ వీడింది. భాటియా కుటుంబ సభ్యులవి ఆత్మహత్యలు కావని.. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదం మాత్రమేనని సీబీఐ- సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది. గత జూన్లో ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. వారిలో 10 మంది ఇంట్లోని సీలింగ్కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతుండగా, ఇంటి యజమాని నారాయణ దేవి (75) గొంతు కోయడం వల్ల చనిపోయింది. కాగా తాంత్రిక పూజల ప్రభావానికి లోనుకావడం వల్లే వీరంతా ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు భావించారు. భాటియా కుటుంబ సభ్యుల్లో ఒకడైన లలిత్ భాటియా మూఢనమ్మకాల కారణంగానే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని విచారణలో వెల్లడైంది. అయితే భాటియా కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఈ విషయాన్ని వ్యతిరేకించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఉరివేసుకోవడం వల్లే మరణించారని నివేదిక రావడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. వీరి మరణాలకు గల స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు.. మృతుల సైకలాజికల్ అటాప్సీ నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్కు లేఖ రాశారు. వీరికి ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఏమాత్రం లేదని.. ఇదొక ప్రమాదమని ఫోరెన్సిక్ ల్యాబ్ బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చింది. సైకలాజికల్ అటాప్సీ అంటే... మెడికల్ రిపోర్టుల ఆధారంగా ఒక వ్యక్తి మానసిక స్థితిని అధ్యయనం చేసే ప్రక్రియనే సైకలాజికల్ అటాప్సీ అంటారు. సైకలాజికల్ అటాప్సీలో వ్యక్తి స్నేహితులు, వ్యక్తిగత డైరీలు, కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. బురారీ కేసులో కూడా ఈ ప్రక్రియనే అనుసరించామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. సైకలాజికల్ అటాప్సీలో భాగంగా భాటియా కుటుంబ యజమాని నారాయణ దేవి పెద్ద కుమారుడు దినేశ్ సింగ్ చందావత్, అతడి సోదరి సుజాతా నాగ్పాల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, లలిత్ భాటియా డైరీలు, రిజిస్టర్లు, ఇరుగుపొరుగు వారు చెప్పిన విషయాల ఆధారంగా ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. -
ఫోరెన్సిక్పై అనాసక్తి!
ఫోరెన్సిక్ విభాగంలో చేరేందుకు వైద్య విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడమే ప్రధాన విధి కావడంతో విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారు. కర్నూలు మెడికల్ కళాశాలలో ఫోరెన్సిక్ విభాగంలో రెండు పీజీ సీట్లు ఉన్నాయి. ఇవి కూడా ఏటా భర్తీకి నోచుకోవడం లేదు. ఏ పీజీ సీటు రాని వారు ఇందులో చేరినా మధ్యలోనే మానేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో సిబ్బంది కొరత వేధిస్తోంది. పోస్టుమార్టం చేయడం, కేసుల కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుండటంతో ఉన్నవారిపై భారం పడుతోంది. కర్నూలు(హాస్పిటల్): వైద్య వృత్తి, పోలీసు విభాగంలో ఉన్నవారు వృత్తిరీత్యా మృతదేహాలను వారు తరచూ చూడాల్సి వస్తుంది. అయితే మృతదేహాలను చూడటం వేరు, వాటికి పోస్టుమార్టం చేయడం వేరు. పోస్టుమార్టం చేయడానికి మనోధైర్యం కావాలి. అయితే చాలామందికి మనోధైర్యం ఉండదు. ఈ కారణంగానే ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో చేరే వైద్య విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. చేరినా మధ్యలోనే మానేసి వెళ్లిపోతున్న సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. అభ్యసనకు దూరంగా విద్యార్థులు.. ఎంబీబీఎస్ చదివే విద్యార్థులకు ఫోరెన్సిక్ మెడిసిన్ ఒక సబ్జెక్ట్గా ఉంటుంది. విద్యార్థులు ఆరు నెలల పాటు ఈ విభాగంలో అభ్యసించాల్సి ఉంటుంది. కానీ చాలా మంది వైద్య విద్యార్థులు ఏదో విధంగా ఈ సబ్జెక్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారనే విమర్శలున్నాయి. ఇక పోస్టుమార్టం చేసే విధానాన్ని ఇక్కడి కళాశాలలో చాలా మంది విద్యార్థులు నేర్చుకోవడం లేదనే ఆరోపణలూ ఉన్నాయి. ఎంబీబీఎస్ పూర్తి చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో మెడికల్ ఆఫీసర్లుగా వెళ్తే అక్కడకు వచ్చే మృతదేహాలకు వీరు పోస్టుమార్టం నిర్వహించాల్సి ఉంటోంది. పోస్టుమార్టంపై అవగాహన లేకపోవడంతో జిల్లాలో నంద్యాల, ఆదోని మినహా జిల్లాలో ఎక్కడ మెడికో లీగల్ కేసు మరణం సంభవించినా మృతదేహాలను దాదాపు కర్నూలుకే పోస్టుమార్టం కోసం పంపిస్తున్న ఘటనలు అనేకం. వైద్యుల కొరత ఏటా రెండు పీజీ సీట్లు భర్తీ అయితే మూడేళ్లకు ఆరుగురు పీజీ వైద్యులు అందుబాటులో ఉంటారు. అయితే ఫోరెన్సిక్ విభాగంలో ప్రస్తుతం ఒక్క పీజీ వైద్య విద్యార్థే అభ్యసిస్తున్నారు. ఈ విభాగంలో రెండు ప్రొఫెసర్, రెండు అసోసియేట్, నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉండాలి. ప్రస్తుతం ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ఇద్దరు అసిస్టెంట్ వైద్యులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. వైద్యుల కొరతతో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సాయంత్రం 5 గంటలు దాటితే మృతదేహాలకు పోస్టుమార్టం జరగదు. మరునాడు ఉదయం 10 గంటల తర్వాతే పోస్టుమార్టం నిర్వహించాల్సి వస్తోంది. దీనికితోడు పోస్టుమార్టం చేసిన కేసుల నిమిత్తం నివేదికలు తయారు చేయడం, తరచూ కోర్టులకు వెళ్లి రావడం వల్ల కూడా ఉన్న వారిపై భారం పడుతోంది. వైద్యవృత్తిలో ఎంతో కీలకమైన ఈ విభాగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. పీజీలో చేరే వారేరీ? కర్నూలు వైద్య కళాశాలలోని ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగంలో రెండు పీజీ సీట్లు ఉన్నాయి. ఏటా పీజీ సీట్ల భర్తీ అన్ని విభాగాలతో పాటు ఈ విభాగానికి జరుగుతుంది. ఏ సీటు రాని వారే ఫోరెన్సిక్ విభాగం పీజీ సీటును తీసుకుంటారనే వాదన కూడా ఉంది. ఈ విభాగంలో చేరుతున్న వైద్య విద్యార్థులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, ఏ పీజీ సీటు రాని వారు ఇందులో చేరినా మధ్యలో వెళ్లిపోతున్నారు. 2009–10లో డాక్టర్ జోషి కుమార్, 2014–15లో డాక్టర్ సునీల్బాబు, 2016–17లో డాక్టర్ ఎం. ప్రవీణ్కుమార్రెడ్డి కోర్సులో చేరి మధ్యలో మానేశారు. 2011–12, 2012–13, 2013–14, 2015–16, 2018–19 విద్యా సంవత్సరాల్లో ఒక్క విద్యార్థి కూడా ఇందులో చేరలేదంటే విద్యార్థుల అనాసక్తిని అర్థం చేసుకోవచ్చు. -
ఫ్లైఓవర్కు వేలాడుతూ మృతదేహం.. కలకలం
న్యూఢిల్లీ : జనంతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఫ్లై ఓవర్ గ్రిల్కు ఓ వ్యక్తి మృతదేహం వేలాడుతుండటం కలకలం రేపింది. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఇది గమనించి పోలీసులకు సమాచారం అందించగా వారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఉత్తర ఢిల్లీ అజాద్పూర్ సమీపంలోని ఎంసీడీ కాలనీలో 38 ఏళ్ల సత్యేంద్ర కుటుంబుం నివాసం ఉంటోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం అతడి మృతదేహం దౌలాఖాన్ ఫ్లై ఓవర్ గ్రిల్కు వేలాడుతూ కనిపించింది. ఇది గమనించిన ఓ వ్యక్తి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడి జేబులో ఉన్న కార్డులు, ఇతరత్రా పేపర్లు పరిశీలించిన అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. పోస్టుమార్టం అనంతరం అతడి ఫ్యామిలీకి సత్యేంద్ర మృతదేహాన్ని అప్పగించారు. మృతుడి వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే.. అసలు ఇది హత్యా.. లేక ఆత్మహత్యా తెలియనుందని పోలీసులు వివరించారు. -
ప్రొఫెసర్ నిర్మలాదేవికి స్వర పరీక్ష
టీ.నగర్: కళాశాల విద్యార్థినులను లైంగిక ప్రలోభాలకు గురిచేసిన ప్రొఫెసర్ నిర్మలాదేవికి ఫోరెన్సిక్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ హేమలత సమక్షంలో గురువారం స్వర పరిశోధన (వాయిస్ టెస్ట్) జరిగింది. విరుదునగర్ జిల్లా అరుప్పుకోటై ప్రైవేటు కళాశాల ప్రొఫెసర్ నిర్మలాదేవి విద్యార్థినులను సెల్ఫోన్లో సంప్రదించి లైంగిక ప్రలోభాలకు గురి చేసినట్లు ఆడియో సామాజిక మాధ్యమాల్లో విడుదల కావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగింది. నిర్మలాదేవిపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు. అనంతరం మదురై సెంట్రల్జైల్లో నిర్బంధించారు. నిర్మలాదేవికి సహకరించిన మదురై కామరాజర్ వర్సిటీ ప్రొఫెసర్ మురుగన్, పరిశోధక విద్యార్థి కరుప్పస్వామిలను అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ కేసుపై సీబీసీఐడీ పోలీసులు తీవ్ర విచారణ జరుపుతున్నారు. మదురై జైల్లో ఉన్న ప్రొఫెసర్ నిర్మలాదేవికి స్వర పరిశోధన జరపాలంటూ సీబీసీఐడీ పోలీసులు మదురై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మదురైలో ఈ పరీక్షకు తగిన పరికరాలు లేనందున చెన్నైలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు నిర్మలాదేవిని తీసుకువచ్చి పరీక్షలు జరిపేందుకు అనుమతినిచ్చారు. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు పుళల్ జైలు నుంచి మైలాపూరులో గల పరిశోధన కేంద్రానికి 10.30 గంటలకు ప్రొఫెసర్ నిర్మలాదేవిని పోలీసు భద్రతతో తీసుకుని వచ్చారు. తరువాత ఆమెను పరిశోధన కేంద్రంలో హాజరు పరచి వాయిస్ టెస్ట్తో పాటు వివిధ పరీక్షలు జరిపారు. దీనికి సంబంధించిన నివేదికను మదురై హైకోర్టులో సమర్పించనున్నట్లు సమాచారం. -
6 నెలల్లో 3500 ఫోన్ కాల్స్.. పొసెసివ్నెస్ వల్లే
సాక్షి, న్యూఢిల్లీ : సహోద్యోగి భార్యను హత్య చేసిన కేసులో నిందితుడు, ఆర్మీ మేజర్ నిఖిల్ హండాను ఆదివారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిఖిల్ను సోమవారం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు.. ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలు, వివరాలు రాబట్టేందుకు అతడిని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. విచారణ అనంతరం పలు కీలక విషయాలు వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం... సహోద్యోగి, మేజర్ అమిత్ ద్వివేది భార్య శైలజను వివాహం చేసుకోవాలని భావించిన నిఖిల్.. శైలజను కలవడానికి ముందు రోజే తన భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం ఢిల్లీకి వచ్చి శైలజను తన హోండా సిటీ కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా ఆమెను కోరాడు. అందుకు శైలజ నిరాకరించడంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆమె మరణాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని తన కారులో తీసుకెళ్లి రోడ్డుపై పడేశాడు. ఆ తర్వాత మీరట్కు వెళ్లిన అనంతరం కారును పూర్తిగా శుభ్రం చేశాడు. శైలజ, తన ఫోన్లలో ఉన్న కొన్ని అప్లికేషన్లను డెలిట్ చేశాడు. అంతేకాకుండా తన ఫోన్ను పూర్తిగా ధ్వంసం చేసి, ఇంటి సమీపంలో ఉన్న ఓ చెత్త డబ్బాలో పడేశాడు. తర్వాత తన స్నేహితుడికి ఫోన్ చేసి శైలజను చంపేసినట్టు చెప్పాడు. అయితే ఆమెతో తనకు అంతగా చనువు లేదని తెలిపాడు. అయితే నిఖిల్ కారును పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు రక్తపు మరకలు, వేలి ముద్రలు, ముందు సీటు భాగంలో ఇరుక్కున్న తల వెంట్రుకలు గుర్తించారు. అవి శైలజకు సంబంధించినవిగా తేల్చారు. నిఖిల్ ఫోన్ డేటాను పరిశీలించినన పోలీసులు గడిచిన ఆరు నెలల్లో 3500 సార్లు శైలజకు ఫోన్ చేసినట్లుగా గుర్తించారు. శైలజ, నిఖిల్ ఫోన్లలో తొలగించిన యాప్స్ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తునట్లు పోలీసులు తెలిపారు. ఈ అంశాలన్నీ పరిశీలిస్తుంటే శైలజ విషయంలో పొసెసివ్నెస్తోనే నిఖిల్ ఉన్మాదిగా మారినట్టు తెలుస్తోందని పోలీసు ఉన్నతాధికారి పేర్కొన్నారు. అయితే శైలజను హత్య చేసేందుకు ఉపయోగించిన ఆయుధం మాత్రం ఇంకా లభించలేదని ఆయన తెలిపారు. -
ఒకే తుపాకీతో గౌరీ, కల్బుర్గి హత్య
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక కార్యకర్త గౌరీ లంకేశ్ను, హేతువాది ఎంఎం కల్బుర్గిని ఒకే తుపాకీతో కాల్చి చంపినట్టు తేలింది. కర్ణాటక రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ గౌరీ హత్య కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్)కు నివేదిక అందజేసింది. కల్బుర్గి 2015 ఆగస్టు 30న ధార్వాడ్లోని తన ఇంట్లోనే హత్య చేశారు. గౌరి కిందటేడాది సెప్టెంబర్ 5న తన నివాసానికి సమీపంలో దుండగుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు. రెండేళ్ల తేడాతో వీరిద్దరినీ ఒకే తుపాకీతో చంపారని సిట్ గతంలో చెప్పినా ఫోరెన్సిక్ నివేదిక సాక్షిగా ఆ విషయం ఇప్పుడు స్పష్టంగా బయటపడింది. 7.65 ఎంఎం దేశవాళీ తుపాకీతో వీరిని చంపినట్టు నివేదిక పేర్కొంది. గౌరీ లంకేశ్ కేసుకు సంబంధించి సిట్ ఇప్పటికే బెంగళూరులోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు తొలి చార్జిషీట్ సమర్పించింది. అందులో హిందుత్వ కార్యకర్త నవీన్ కుమార్ను నిందితుడిగా సిట్ పేర్కొంది. అందులో ‘గౌరీ లంకేశ్ హిందూ వ్యతిరేకి.. ఆమెకు బతికే అర్హత లేదు’ అని ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ తనతో చెప్పాడని నిందితుడు నవీన్ పేర్కొన్నట్లు పొందు పరిచారు. లంకేశ్ను హత్య చేసేందుకు బుల్లెట్లు సిద్ధం చేయమని ప్రవీణ్ అడిగాడని నవీన్ చెప్పినట్టు పేర్కొన్నారు. మరో హత్యకు కుట్ర హేతువాది, హిందుత్వ సిద్ధాంత విమర్శకుడు కేఎస్ భగవాన్ హత్యకు కుట్ర జరుగుతున్నట్టు నవీన్ సిట్ వద్ద అంగీకరించాడు. కిందటేడాది నవంబర్లో సంజయ్ బన్సారే అను వ్యక్తి తనను కలసి కేఎస్ భగవాన్ను చంపేందుకు తుపాకీలను సిద్ధం చేయమని అడిగాడని సిట్తో చెప్పాడు. తనకు శ్రీరామ్ సేనే, బజరంగ్దళ్తో సంబంధాలున్నా యని, 2014లో హిందూ యువసేనే అనే సంస్థను స్థాపించానని నవీన్ వెల్లడించాడు. -
భర్తను చంపి.. ముక్కలుగా కోసి
పనాజి : కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. పోలీసులకు అనుమానం రాకూడదనే ఉద్దేశంతో శవాన్ని అటవీ ప్రాంతంలో పడేసింది. ఈ దారుణ సంఘటన దక్షిణ గోవాలోని కరోచీరాం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బసౌరాజ్ బసు, కల్పనా బసు భార్యాభర్తలు. వీరికి ఇద్దరు సంతానం. బసౌరాజ్ దినసరి కూలీగా పనిచేసేవాడు. నెలరోజుల క్రితం భార్యాభర్తల మధ్య చిన్న గొడవ తలెత్తింది. దీంతో కోపోద్రిక్తురాలైన కల్పన ఆవేశంలో తన భర్తను గొంతు నులిమి హత్య చేసింది. తర్వాత భయంతో ఈ విషయాన్ని భర్త స్నేహితులకు చెప్పి, వారి సాయం కోరింది. అనంతరం ముగ్గురు వ్యక్తులతో కలిసి భర్త శవాన్ని మూడు ముక్కలుగా కోసి, గోనె సంచిలో కుక్కి నిర్మానుష్య ప్రదేశంలో పడేసింది. అనుమానం వచ్చిందిలా.. నిందితుల్లో ఒకరైన వ్యక్తి భార్యకు అతడి ప్రవర్తన పట్ల అనుమానం కలిగింది. విషయమేమిటని నిలదీయగా అతడు నిజం చెప్పేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులు కల్పనా బసు, సురేశ్ కుమార్, అబ్దుల్ కరీం, పంకజ్ పవార్లను అరెస్టు చేశారు. తమదైన శైలిలో నిందితులను విచారించగా నిజాలు వెల్లడించారని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. వారు చెప్పిన అంశాల ఆధారంగా నిర్మానుష్య ప్రదేశంలో, కుళ్లిపోయిన స్థితిలో ఉన్నశవాన్ని కనుగొన్నామని.. అయితే ఆ శవం బసౌరాజ్దేనని తేల్చేందుకు ఆధారాలు లేకపోవడంతో ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామన్నారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. -
ఆర్నెల్ల తర్వాత శవానికి పోస్టుమార్టం
కురబలకోట : ఆరు నెలల క్రితం మృతిచెందిన అంగళ్లుకు చెందిన శెట్టి సీతారాంరెడ్డి మృతదేహాన్ని గురువారం వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. శరీర భాగాలను తిరుపతిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నట్లు ఇన్చార్జి రూరల్ సీఐ సురేష్కుమార్ వెల్లడించారు. ఆర్నెళ్ల తర్వాత కూడా మృత దేహం చెక్కు చెదరకుండా ఉండడం విశేషం. వివరాల్లోకెళితే.. అంగళ్లుకు చెందిన సీతారాంరెడ్డి ఆరు నెలల క్రితం మృతిచెందారు. ఆయన గుండెపోటుతో మృతిచెంది నట్టు భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. మదనపల్లెలో ఇటీవల జరిగిన హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కొంతమంది నిందితులను అరెస్టు చేశారు. విచారణలో వారు సీతారాంరెడ్డిని హత్య చేసినట్టు అంగీకరించారు. ఆస్తి పంపకాలకు అడ్డుపడుతున్నాడన్న కారణంతో అతన్ని బంధువులు పథకం ప్రకారం హత్య చేయించినట్టు వెల్లడించారు. ఊరి బయటకు వాకింగ్కు వెళ్లిన ఆయనకు బలవంతంగా విషపు నీరు తాగించడంతో చనిపోయినట్లు వివరించారు. పోలీసులు తహసీల్దార్ ఆధ్వర్యంలో గురువారం సీతారాంరెడ్డి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయించారు. ఆయన శరీర భాగాలను తిరుపతి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఐదుగురు నిందితులపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి నివేదిక అందిన తర్వాత దర్యాప్తు వేగవంతం చేస్తామన్నారు. -
బోనీకపూర్ను అరెస్ట్ చేసే అవకాశం?
-
బోనీకపూర్ను అరెస్ట్ చేసే అవకాశం?
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతిపై అనేక సందేహాలు నెలకొన్నాయి. ఆమె గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన రిపోర్ట్పై దుబాయ్ పోలీసులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసును పోలీసులు పునర్విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. నేడు మరోసారి శ్రీదేవి భర్త బోనీ కపూర్ను విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాస్పోర్ట్ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ పూర్తయ్యేవరకు దుబాయ్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. బోనీని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. శ్రీదేవి, బోనీకపూర్ కాల్డేటాను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలిస్తున్నారు. శ్రీదేవి ఫోన్ నుంచి ఒకరికి ఎక్కువగా కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు. పెళ్లి ఈ నెల 20న జరిగితే శ్రీదేవి 24వరకు దుబాయ్లోనే ఎందుకున్నారు. ముంబై తిరొగొచ్చిన బోనీ మళ్లీ అక్కడికి ఎందుకు వెళ్లారు. టబ్లో పడ్డ ఆమెను ఎవరు చూశారు. ఆ సమయంలో బోనీ ఎక్కడున్నారనే ?అన్ని కోణాల్లో పోలీసులు విచారణ జరపుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆమె భౌతిక కాయం అప్పగింతపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో ఆమె భౌతిక కాయం వచ్చే అవకాశం కనిపించడంలేదు. అన్ని సందేహాలు తీరాకే ఆమె భౌతికకాయం అప్పగిస్తామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీదేవి మరణంపై బోనీకపూర్ ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది. -
మరణం వెనుక..
సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శ్రీదేవి గుండెపోటుతో మరణించలేదని, ప్రమాదవశాత్తూ మృతి చెందినట్టు దుబాయి ఫోరెన్సిక్ నిపుణులు తేల్చడంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. శ్రీదేవి బాత్రూమ్లో గుండెపోటుకు గురవడంతో హాస్పిటల్కు తరలించామని, కానీ చికిత్స అందించే లోపే చనిపోయినట్టు కుటుంబీకులు ఇప్పటిదాకా చెప్పుకొచ్చారు. కానీ జరిగింది అది కాదన్న సంగతి ఫోరెన్సిక్ నివేదికను బట్టి తెలుస్తోంది. బాత్టబ్లో ప్రమాదవశాత్తూ ఆమెనే పడిపోయారా లేదా ఎవరైనా తోసేశారా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఎన్నో సందేహాలు.. - పెళ్లి జరిగింది ఈ నెల 20న అయితే శ్రీదేవి 24 వరకు ఎందుకు దుబాయిలోనే ఉన్నారు? - 22వ తేదీ మధ్యాహ్నం నుంచి 24 వరకు శ్రీదేవి అసలు హోటల్ రూమ్ నుంచి బయటకు రాలేదు. అందుకు కారణం ఏంటి? ఆల్కహాల్ తీసుకొని స్పృహ లేకుండా ఉందా? - గది నుంచి శ్రీదేవి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి హోటల్ సిబ్బంది వెళ్లి చూశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై కుటుంబీకులు ఎందుకు స్పందించడం లేదు? - శ్రీదేవిని సర్ప్రైజ్ చేసేందుకు బోనీకపూర్ నిజంగానే 24న సాయంత్రం ముంబై నుంచి దుబాయి వెళ్లారా? లేదా శ్రీదేవి మృతి వార్త తెలిశాక వెళ్లారా? - గతంలో శ్రీదేవికి ఎప్పుడూ గుండెపోటు రాలేదని సంజయ్ కపూర్ మీడియాకు వెల్లడించారు. అలాంటప్పుడు ఆమె గుండెపోటుతోనే మరణించారన్న ప్రచారం ఎందుకు జరిగింది? - బోనీ కపూర్ తన స్నేహితుడికి కాల్ చేసి ఆ తర్వాత హాస్పి టల్కు తీసుకెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవ మెంత? అసలు శ్రీదేవిని హాస్పిటల్కు ఎవరు తీసుకెళ్లారు? ఫోరెన్సిక్ రిపోర్టులో ఇదెలా సాధ్యం? శ్రీదేవి మృతికేసులో ఫోరెన్సిక్ విభాగం ఇచ్చిన రిపోర్టుపైనా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మన దేశంలో అయితే నీటిలో మునిగి చనిపోతే.. ఫోరెన్సిక్ రిపోర్టులో అంతవరకే ప్రస్తావిస్తారు. ప్రమాదవ శాత్తూ మునిగిపోయారా? లేదా ఎవరైనా బలవంతంగా నీటిలో ముంచి చంపేశారా అన్నది తేల్చాల్సింది పోలీసులే! కానీ దుబాయి ఫోరెన్సిక్ నిపుణులు వారే ‘ప్రమాదవశాత్తూ మునిగిపోవడం’ (యాక్సిడెంటల్ డ్రౌనింగ్) వల్ల చనిపోయినట్టు తేల్చారు. ఇది సందేహాత్మకంగా కనిపిస్తోందని రాష్ట్ర ఫోరెన్సిక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రమాదమా కాదా అన్నది ఫోరెన్సిక్ నిపుణులు తేల్చాల్సిన అంశం కాదని, అది పూర్తిగా పోలీసు దర్యాప్తులో తేలాల్సిన వ్యవహారమని వారు చెబుతున్నారు. అలాగే రిపోర్టులో ‘డ్రౌనింగ్’ అన్న పదం స్పెల్లింగ్ను ‘డ్రావింగ్’ అని తప్పుగా ప్రచురించారు. ఒక సెలబ్రెటీ కేసులో ఇలా అచ్చు తప్పుతో నివేదిక రూపొందించడం కూడా ఫోరెన్సిక్, పోలీసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే శ్రీదేవి తూలి బాత్టబ్లో పడిపోతే తలకు లేదా మరేదైనా ప్రాంతంలో గాయాలై ఉండాలి. కానీ ఇలాంటి ఆనవాళ్లు ఉన్నాయా? లేదా అన్న అంశాలను కూడా రిపోర్టులో వెల్లడించలేదు. దుబాయిలో ఇవి నిబంధనలు... - డెత్ రిపోర్టు కోసం దరఖాస్తు చేసుకోవాలంటే మృతిచెందిన వ్యక్తికి తప్పనిసరిగా పాస్పోర్టు, వీసా ఉండాలి. వీటితో పాటు పోలీసులిచ్చే నివేదిక తప్పనిసరి. - సాధారణంగా డెత్ సర్టిఫికెట్ కోసం ఫీజుగా 60 దిరమ్స్ కట్టాలి. అరబ్ భాషలో కాకుండా ఇంగ్లిష్లో సర్టిఫికెట్ కావాలంటే 100 దిరమ్స్ చెల్లించాలి. ఎంబసీ నుంచి సర్టిఫికెట్ కోసం 700 దిరమ్స్ కట్టాలి. - డెడ్బాడీని మాతృదేశానికి తరలించే ప్రక్రియలో భాగంగా దుబాయి పోలీసుల నుంచి ఎన్ఓసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) తీసుకోవాలి. ఆ ఎన్ఓసీని ఎయిర్పోర్టు అథారిటీకి అందించాలి. ఇదే సమయంలో ఎంబసీకి దరఖాస్తు చేస్తే మృతిచెందిన వ్యక్తి పాస్పోర్టు రద్దు చేస్తారు. తర్వాత డెడ్బాడీని మాతృదేశానికి పంపించేందుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. - మాతృదేశంలోని హోంశాఖ కూడా మృతదేహాన్ని తీసుకునేందుకు ఎన్ఓసీ ఇవ్వాలి. సాధారణంగా ఈ ప్రక్రియను భారత ఎంబసీ చూసుకుంటుంది. కుటుంబీకులు ఎందుకు మాట్లాడడం లేదు? శ్రీదేవి మృతి విషయంలో బోనీ కపూర్ కుటుంబం గానీ, కపూర్ ఫ్యామిలీ గానీ ఎక్కడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడంలేదు. మృతి విషయంలో వస్తున్న అనేకానేక పుకార్లను ఖండించే ప్రయత్నం కూడా చేయడంలేదు. తీవ్ర విభేదాలు, తగాదాలు వస్తే తప్పా ఇంతటి పరిస్థితి రాదన్నది కపూర్ కుటుంబ సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట. అద్దం ముందు నిలబడి... శ్రీదేవి అంటే నాకు చిన్నప్పటి నుంచీ ఇష్టం. ఆమె నటించిన మిస్టర్ ఇండియా, చాల్బాజ్, లమ్హే సిని మాలు అంటే పిచ్చి. ఒక గ్రేస్తో కామెడీని పండిం చిన.. పండించగల నటి ఆమె ఒక్కరే. మిస్టర్ ఇండియాలోని చార్లీ చాప్లిన్ రోల్, కాటే నహీ పాట, లమ్హేలోని డ్యుయల్ రోల్, చాల్బాజ్ పాటలను ఇంట్లో నేను అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎక్స్ప్రెషెన్స్లో శ్రీదేవీని ఇమ్మిటేట్ చేసేదాన్ని. ఎంత ట్రై చేసినా వచ్చేవి కావు. అలా చిన్నప్పటి నుంచీ నేను ఆరాధించిన నటితో నటించే అవకాశం నా మూడో సినిమాకే వచ్చింది. ఆ సినిమా లాడ్లా. అప్పటికే ఆమె సూపర్స్టార్. చాలా భయపడ్డా. కాని ఆమె చాలా ఈజీ చేసేశారు. శ్రీదేవి ఎవరితో ఎక్కువగా మాట్లాడరు. సెట్లో కూడా చాలా కామ్గా ఉంటారు అని అంటుంటారు. కాని లాడ్లా షూటింగ్ అప్పుడు నాతో చాలా క్లోజ్గా ఉన్నారు. తను వచ్చి.. ‘రెడీ అయిపోయావా? రా.. నా వ్యాన్లో కూర్చుని మాట్లాడుకుందాం’’ అని నన్ను తన వానిటీవ్యాన్లోకి తీసుకెళ్లేవారు. చిట్చాట్, జోక్స్, డిస్కషన్స్ చేసేవారు. నా జీవితంలో మరిచిపోలేని రోజులవి. – రవీనా టాండన్. కహానీ కోరిక... విశ్రాంతి సమయంలో పుస్తకాలు చదవడం, నిద్రపోవ డం, పెయింటింగ్ అంటే శ్రీదేవికి ఇష్టం. అవే చేసేవారు కూడా. పెళ్లి, పిల్లల తర్వాత సినిమాల నుంచి తీసు కున్న పదిహేనేళ్ల బ్రేక్ను ఇంటిని, పిల్లలను చూసుకోవడానికే ఆసక్తి చూపారు. కాని బోనీకపూర్, జాన్వి, ఖుషీల బలవంతం, ప్రోత్సాహంతో గౌరీ షిండే ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. గౌరీ అంటే శ్రీదేవికి చాలా అభిమానం. ఆమె తన చిన్నకూతురు ఖుషీలాగే చురుకుగా, అల్లరిగా,చలాకీగా ఉంటుందని గౌరీని ‘ఖుషీ’ అని పిలిచేవారట. సెట్స్లోకి రాగానే ‘‘వేర్ ఈజ్ మై ఖుషీ’’ అంటూ గౌరీని వెదుక్కునేవారట. ప్రతి సినిమాను కొత్తగా.. మొదటి సిని మా అనుకొనే చేస్తారు. తన నటన పట్ల పూర్తి సంతృప్తిని ఎప్పుడూ కనబర్చ లేదు. ఇంట్లోవాళ్లు, స్నేహితులు చాలా బాగా చేశావ్ అని మెచ్చుకున్నా.. శ్రీదేవి మాత్రం ఇంకా చేసుండాల్సింది అని అనుకునేవారట. అదే ఆరాటం, అంతే జిజ్ఞాస చివరి సినిమా వరకు కనబర్చారు. బహుశా ఆ తపనే ఆమెను దేశంలోనే ఫస్ట్ ఫీమేల్ సూపర్స్టార్గా నిలబెట్టిం దేమో! ఎవరితో ఎక్కువగా మాట్లా డకుండా తన పని తాను చేసుకుపోయే ఈ స్టార్కు కామెడీ సినిమాలు చేయడం అంటే ఇష్టం. అయితే బయట గంభీరంగా కనిపించే శ్రీదేవి ఇంట్లో, దగ్గరి వాళ్లతో జోక్స్ వేస్తూ, వాళ్లను సరదాగా ఆటపట్టిస్తూ చాలా జోవియల్గా ఉంటారు. చక్ దే ఇం డియా, తారే జమీన్ పర్, విక్కీ డోనర్ , కహానీ సినిమాలంటే ఇష్టం. కహానీ లాంటి సినిమా చేయాలని ఆమె కోరిక. బాలీవుడ్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్ పట్ల ఇప్పుడు వచ్చిన మార్పు పట్ల చాలా సంతోషపడేవారు. స్క్రిప్ట్ ముఖ్య భూమిక పోషించడం, నటనకు స్కోప్ ఉండడాన్ని ఆమె ప్రశంసించారు. కూల్ మామ్... ‘‘మా అమ్మ చాలా స్ట్రిక్ట్. అయితే మా అమ్మ నాతో ఉన్నట్టుగా నేను నా పిల్లల దగ్గర ఉండలేను. కాలంతో మారాలి కదా! అందుకే పట్టూవిడుపులూ చూపిస్తా. లైఫ్లో బేసిక్ ఎథిక్స్ ఉండాలని చెప్పేదాన్ని. వాళ్లు టీన్స్లో ఉన్నప్పుడు లేట్ నైట్స్ రావాల్సి వస్తే వాళ్లతో పాటు నేనూ వేళ్లేదాన్ని. పిల్లలు వచ్చే వరకు కార్లో వెయిట్ చేసేదాన్ని. ఇప్పుడు పెరిగారు. వాళ్ల మంచి చెడ్డలు చూసుకోగలరు. పిల్లల విషయంలో నేను, బోనీ ఇద్దరం బ్యాలెన్స్డ్గా ఉంటాం. నేను స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు ఆయన.. ‘‘పిల్లలు కదా.. కొన్ని విషయాల్లో మనం చూసీచూడనట్టు ఉండాలి. అంత కఠినంగా ఉండకు వదిలెయ్’’ అని చెప్తుంటారు. కొన్ని సందర్భాల్లో నేను అలా చెప్తుంటాను బోనీకి (నవ్వుతూ). మామూలుగా నేను షూటింగ్లో ఉన్నా గ్యాప్ దొరికినప్పుడల్లా పిల్లలకు ఫోన్ చేస్తుంటా. అయితే మామ్ సినిమా అప్పుడు మాత్రం చేయలేదు. ఖుషీ.. అందిట జాన్వితో. ‘ఇదేంటి అమ్మ ఒక్కసారి కూడా ఫోన్ చేయట్లేదు’ అని. మామ్ సినిమాలోని దేవకీ పాత్ర అలాంటిది. కంప్లీట్గా.. నా పిల్లలను కూడా మరిచిపోయేంతగా లీనమయ్యా అందులో. – మామ్ ప్రమోషనల్ సమయంలో శ్రీదేవి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ డాక్టర్.. సినిమాల్లో! జాన్వి సినిమాల్లోకి వస్తాను అన్నప్పుడు శ్రీదేవేమీ షాక్ అవలేదట. జాన్వి చిన్నప్పుడు బంధువులు ఆమెను పెద్దయ్యాక ఏమవుతావ్ అని అడిగారట. ‘డాక్టర్’ అని జవాబిచ్చిందట జాన్వి. అక్కడే ఉన్న శ్రీదేవి ఆ ఆన్సర్కి ఆనందపడి ఉబ్బితబ్బిబ్బయ్యే లోపే ఆ పిల్ల ‘కాని సినిమాల్లో’ అని చెప్పిందట. తాను పెద్దయ్యాక ఏం కావాలనుకుంటుందో కూతురు మెస్సేజ్ ఇచ్చేసిందని గ్రహించారట శ్రీదేవి. అందుకే ‘‘నేను యాక్టింగ్ను కెరీర్గా ఎంచుకోవాలనుకుంటున్నాను’’ అని చెప్పినప్పుడు పెద్దగా ఆశ్చర్యపోలేదట. నా పనైపోయిందనుకున్నా.. అందరిలాగే ఫర్హాన్ అక్తర్కూ శ్రీదేవి అంటే పిచ్చి. ఆమె నటించిన లమ్హే సినిమా ప్రొడక్షన్ వర్క్లో ఫర్హాన్ కూడా పాలు పంచుకున్నాడు. నిజానికి ఆ సినిమాతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు ఫర్హాన్. ఓ పాట షూటింగ్ కోసం శ్రీదేవి రిహార్సల్స్ చేస్తోందట. వాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న చోట ఫ్లోర్ పాలీష్ పోయి నల్లగా ఓ మచ్చలా కనపడుతోంది. డైరెక్టర్ వచ్చి అక్కడ పెయింట్ వేయమని ఫర్హాన్కు పురమాయించాడు. దాంతో పెయింట్ వేశాడు ఫర్హాన్. శ్రీదేవి ఆరిపోని ఆ పెయింట్ మీద కాలు వేసి జారి పడ్డారట. దెబ్బకే సెట్లో అంతా సైలెంట్. అందరిలో భయం. ఫర్హాన్లో ఇంకా భయం. తన పనైపోయింది.. ఇక సినిమాలకు తనకూ గుడ్ బై అనుకున్నాడట. అంతలోకే శ్రీదేవి పెద్దగా నవ్వడం మొదలెట్టారట. దాంతో సెట్లో అంతా ఊపిరిపీల్చుకొని వాళ్లూ ఆమె నవ్వుతో జతకలిపారు. అయోమయంగా చూస్తున్న ఫర్హాన్ దగ్గరకు వచ్చి.. ‘కూల్’ అంటూ అతని భుజం తట్టారట శ్రీదేవి. అలా ఆమె తన కెరీర్ను కాపాడారు అని ట్వీట్ చేశాడు ఫర్హాన్ అక్త్తర్. -
మిస్టరీగా మారిన శ్రీదేవీ మృతి..?
దుబాయ్ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. యూఏఈ అధికారులు విడుదల చేసిన ఫోరెన్సిక్ రిపోర్టు అనంతరం అనుమానాలు మరింత పెరిగాయి. శ్రీదేవీ గుండెపోటుతో చనిపోలేదని, ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడిపోవడం వల్ల ఊపిరాడక చనిపోయారంటూ ఫోరెన్సిక్ రిపోర్టు తెలిపింది. అయితే ఈ రిపోర్టు వెలువడక ముందు ప్రముఖ రచయిత, ఫిజిషియన్ తస్లిమా నస్రీన్ చేసిన ట్వీట్తో పాటు, ట్విట్టర్ యూజర్లు కూడా ఫోరెన్సిక్ రిపోర్టుపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఒక ఆరోగ్యకరమైన మహిళ ప్రమాదవశాత్తు బాత్టబ్ల్లో పడిపోతారా? అంటూ ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అనంతరం ఫోరెన్సిక్ రిపోర్టు శ్రీదేవీ ప్రమాదవశాత్తు బాత్టబ్లో పడిపోయినట్టు పేర్కొంది. అయితే శవపరీక్షలో ప్రమాదవశాత్తు పడిపోయినట్టు అని ఎలా పేర్కొంటారు? అని ట్విట్టర్ యూజర్లు మండిపడుతున్నారు. కేవలం బాత్టబ్లో పడిపోయినట్టే చెప్పాలని, ఒకవేళ అది ప్రమాదవశాత్తు అయి ఉంటే శవపరీక్ష దాన్ని ఎలా బహిర్గతం చేస్తుంది? ఇది ఒక సందేహాస్పదమైన రిపోర్టు అంటున్నారు. మరోవైపు ఫోరెన్సిక్ రిపోర్టు కూడా డైరెక్టర్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ పేరుతో విడుదలైంది. అంటే ఫోరెన్సిక్ అని చెబుతున్న ఈ రిపోర్టు అసలు నిజమైందేనా? అనే సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మేనల్లుడు పెళ్లి వేడుకకు వెళ్లిన శ్రీదేవీ తాను ఒక్కతే ఎందుకు దుబాయ్లోనే ఉండాలనుకున్నారు? ఎందుకు బోనీ కపూర్ మళ్లీ శ్రీదేవీని కలవడానికి ముంబై నుంచి దుబాయ్ వెళ్లారు? అంటూ పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. తొలుత కార్డియాక్ అరెస్ట్ అని, తర్వాత బాత్టబ్లో పడిపోయి చనిపోయిరని ఎందుకు చెప్పారని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు బోనీ కపూర్ శ్రీదేవీ మృతిపై స్పందించలేదు. ఒకే నెంబర్ నుంచి శ్రీదేవీకి పలుమార్లు కాల్ శ్రీదేవీ మృతిపై ఇంకా విచారణ కొనసాగుతుందని దుబాయ్ పోలీసులు పేర్కొన్నారు. ఆమె కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్కు బదిలీ చేశారు. శ్రీదేవీ కాల్ డేటా, బోనీ కపూర్ కాల్డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బోనీ కపూర్, శ్రీదేవీ ఎప్పుడెప్పుడు మాట్లాడుకున్నారో కూడా తేలుస్తున్నారు. ఒకే నెంబర్ నుంచి ఆమెకు పలుమార్లు కాల్ వెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు బోనీ కపూర్ని కూడా సుదీర్ఘ సమయం పాటు పోలీసులు విచారించారు. ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఆయనతో పాటు అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవీని బోనీతోపాటు ఆసుపత్రికి తీసుకెళ్లిన మరో ముగ్గురు వ్యక్తులు, రషీద్ ఆసుపత్రి ఇద్దరు డాక్టర్లు, ఐదుగురు అటెండర్ల వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేసుకున్నారు. హోటల్ సిబ్బందిని కూడా దుబాయ్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బోనీ కపూర్, హోటల్ సిబ్బంది దుబాయ్ ప్రాసిక్యూషన్ అధికారుల అదుపులోనే ఉన్నట్టు తెలుస్తోంది. టబ్లో పడిపోయిన సమయంలో శ్రీదేవీ ఆల్కహాల్ సేవించినట్టు తెలుస్తోంది. అయితే ఆమెకు ఆల్కహాల్ సేవించే అలవాటు లేదని రాజ్యసభ ఎంపీ అమర్ సింగ్ అన్నారు. బాత్టబ్లో పడిపోయిన తర్వాత ఎంత సేపటికి ఆమెను గుర్తించారు? తనంతట తానే పడిపోయిందా? లేదా ఆమెను ఇంకెవరైనా బాత్టబ్లోకి తోసేశారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. -
షాకింగ్ ట్విస్ట్.. శ్రీదేవికి గుండెపోటు కాదు.. ప్రమాదం
దుబాయ్ : ప్రముఖ నటి శ్రీదేవి హఠాన్మరణంపై షాకింగ్ విషయం తెలిసింది. ఇప్పటి వరకు అనుకున్నట్లు ఆమె గుండెపోటు కారణంగా చనిపోలేదు. ప్రమాదం కారణంతో ఆమె చనిపోయారు. అనుకోకుండా జారీ ప్రమాదవశాత్తు నీటి టబ్లో పడిపోవడం వల్లే శ్రీదేవి చనిపోయారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఆమె దేహంలో కొంతమేరకు ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు. నీటి టబ్బులో నుంచి బయటకు తీసే సమయానికే శరీరం కొంత ఉబ్బిపోయి ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు దుబాయ్ పోలీసులు శ్రీదేవి కుటుంబ సభ్యులకు శవ పరీక్ష నివేదికను అప్పగించారు. పోలీసులు ఇచ్చిన నివేదిక ప్రకారం శనివారం సాయంత్రం పార్టీ నుంచి హోటల్లో గదికి వెళ్లిన శ్రీదేవి 7గంటల ప్రాంతంలో బాత్రూమ్కు వెళ్లారు. అందులోనే అనుకోకుండా కాలు జారీ నీళ్ల టబ్లో పడిపోయారు. ఆ సమయంలోనే ఆమె తీవ్ర కంగారుకు లోనై గుండెపోటు వచ్చి టబ్లో నుంచి పైకి లేవలేక, ఊపిరి ఆడక ఆమె తుది శ్వాస విడిచారు. అయితే, ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే ఆమె భర్త బోనీ కపూర్ హోటల్ గదికి వచ్చారు. ఎంత కొట్టి చూసినా శ్రీదేవి బాత్ రూం తలుపులు తీయకపోవడంతో హోటల్ సిబ్బంది సాయంతో తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న శ్రీదేవిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, కాపేసట్లో ప్రత్యేక జెట్ విమానంలో ఆమె మృతదేహాన్ని తరలించనున్నారు. -
శ్రీదేవిది బలవన్మరణం కాదు..
దుబాయ్ : ప్రముఖ నటి శ్రీదేవి అకాల మరణంపై ఫోరెన్సిక్ నివేదిక అందింది. ఆమె మరణ ధ్రువీకరణ పత్రం దుబాయ్ పోలీసులకు అందింది. శ్రీదేవి మరణం వెనక ఎలాంటి కుట్ర లేదనివారు స్పష్టం చేశారు. మరోవైపు ఇమిగ్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. గల్ఫ్లో వాసుదేవరావ్ అనే ఓ జర్నలిస్టు తెలిపిన వివరాల ప్రకారం సాధారణంగా ఓ వ్యక్తి ఆస్పత్రిలోనే చనిపోతే అందుకు గల కారణాలు ముందే రికార్డెడ్గా ఉండి తదుపరి జరగాల్సిన కార్యక్రమాలు వేగంగా ఉంటాయని, కానీ, ఆస్పత్రి వెలుపల సాధారణంగానే చనిపోయినా కూడా చాలా ప్రొసీజర్ ఉంటుందని అన్నారు. ముందుగా పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తారని తెలిపారు. ఒక వేళ విదేశాలకు చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని పంపించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ ఆలస్యం అవుతుందని, ఎక్కువమంది అధికారులు ఇందులో జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ముందుగా మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వానికి సంబంధించిన శవాలగదిలో ఉంచుతారని, ఆ తర్వాత ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి ఆ వెంటనే తిరిగి పోలీసులకు అప్పగిస్తారని అన్నారు. శవ పరీక్ష నివేదిక వచ్చిన మరణ ధృవీకరణ పత్రం ఇస్తారని, ఆ తర్వాతే పోలీసులు తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ సమయాల్లో పలు లేఖలను పోలీసులు ఇవ్వాల్సి ఉంటుందని, మరణ ధ్రువీకరణ పత్రం అరబిక్లో ఇస్తారని, భారత్ కాన్సులేట్కు మాత్రం దానికి అనువాదం చేసిన ఆంగ్ల ప్రతిని ఇస్తారని, అప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చి సదరు కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారని అన్నారు. ఇప్పుడు శ్రీదేవి పార్థీవ దేహం విషయంలో కూడా పైన పేర్కొన్న ప్రొసీజర్ జరుగుతోందని చెప్పారు. -
గుట్టు విప్పిన డీఎన్ఏ రిపోర్టు
సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ చిలుకా నగర్లోని చిన్నారి నరబలి కేసు విచారణ తుదిదశకు చేరుకుంది. ఈ కేసుకు సంబంధించి డీఎన్ఏ నివేదిక పోలీసులకు అందింది. క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై లభించిన తల, అతడి ఇంట్లో లభించిన రక్తపు మరకలు ఆడ శిశువువిగా ఫోరెన్సిక్ రిపోర్టులో తేలింది. మూఢ నమ్మకాల నెపంతో చిన్నారిని బలి ఇచ్చినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రతాప సింగారం వద్ద మూసీనదిలో మొండెంను పడేసినట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది. బలి ఇచ్చిన చిన్నారిని బోయగూడలోని ఫుట్పాత్ వద్ద నిద్రిస్తున్న వారి దగ్గర నుంచి చిన్నారిని ఎత్తుకొచ్చినట్లు సమాచారం. ఈ కేసులో క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్, అతని భార్య శ్రీలత, బంధువులు లచ్చక్క, బుచ్చమ్మ, నలుగురు మాంత్రికులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా రాజశేఖర్ తన భార్య శ్రీలత ఆరోగ్యం కోసం నరబలి చేసినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్న విషయం తెలిసిందే. నిందితులను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నరబలి తర్వాత పాప తలపై చంద్రుని వెలుగు, సూర్య కిరణాలు పడాలని చెప్పడంతో డాబాపై తల పెట్టినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నరబలి కేసులో మరొ కొత్త ట్విస్ట్.. నరబలి కేసులో బోయగూడకు చెందిన రాజశేఖర్ సోదరుడు గణేశ్ కీలకంగా వ్యవహారించాడు. గణేశ్ చార్మినార్లోని ఒక బాబా కన్నుసన్నల్లో పూజలు చేయించాడు. బోయగూడలోని ఓ ఫుట్ పాత్ నుంచి నరబలి కోసం చిన్నారిని ఎత్తుకొచ్చాడు. నరబలి తర్వాత రక్తం మరకలు ఉన్న దుస్తులను సోదరులు ఇద్దరు బండ్లగూడ మూసి సమీపంలో చెట్ల పొదలో పడేశారు. పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకకుండా ముందు జాగ్రత్త పడ్డారు. వీరిద్దరికి కన్నతల్లి అన్ని విధాలా సహకరించింది. తనకు ఏమి తెలియనట్లు రాజశేఖర్ తల్లి పోలీసుల దగ్గర నమించే ప్రయత్నం చేసింది. కేసు దర్యాప్తులో మృతి చెందిన చిన్నారిని తల్లి గుర్తించడమే కాకుండా గణేశ్ అపహరించినట్లు పోలీసులకు సమాచారం అందించింది. పోలీసుల దృష్టి మరల్చేందుకు అర్ధరాత్రి సమయంలో గణేశ్ నరహరి ఇంటిలోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. -
నరబలి కేసులో ఫోరెన్సిక్ రిపోర్ట్
-
ఆ తల ఆడ శిశువుదే!
సాక్షి, సిటీబ్యూరో/ఉప్పల్: ఉప్పల్ చిలుకానగర్లోని మైసమ్మ దేవాలయం వద్ద నివసించే క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ ఇంటిపై లభించింది ఆడ శిశువు తలేనని ఫోరెన్సిక్ నిపుణులు నిర్థారించారు. ఈ నెల ఒకటిన లభించిన ఈ తలకు సంబంధించిన మొండెం ఆచూకీ లేకపోవడంతో ఆడా, మగా అన్నది ఇప్పటి వరకు తేలలేదు. తలకు ప్రాథమిక పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించిన ‘గాంధీ’ ఫోరెన్సిక్ వైద్యులు సైతం ఈ విషయంపై స్పష్టత ఇవ్వలేకపోయారు. దీంతో పోలీసులు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు చెందిన నిపుణుల సహాయం కోరారు. ఈ తలకు సంబంధించిన పుర్రె నిర్మాణం తదితరాలను అధ్యయనం చేసిన నిపుణులు.. ఆడ శిశువు తలగా ప్రాథమికంగా నిర్ధారిస్తూ శుక్రవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న రాజశేఖర్ పోలీసు విచారణలో నోరు విప్పట్లేదు. అదుపులోకి తీసుకుని విచారించిన తొలిరోజు తానే నరబలి ఇచ్చానంటూ చెప్పినా ఆపై మాట మార్చాడు. పోలీసులు పదేపదే ప్రశ్నించినందుకు అలా చెప్పానంటూ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇతడి నుంచి ఆశించిన సమాచారం రాకపోవడంతో దర్యాప్తు అధికారులు సాంకేతిక ఆధారాలపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సిటీకి చెందిన ప్రత్యేక క్లూస్ టీమ్ను చిలుకానగర్కు రప్పించారు. ప్రధాన అనుమానితుడు రాజశేఖర్ ఇంటితో పాటు చుట్టుపక్కల మరికొన్ని ఇళ్లల్లోనూ తనిఖీలు చేశారు. రాజశేఖర్ ఇంటికి సంబంధించి అతడు నివసించే డాబాతో పాటు పక్కనే ఓ రేకుల షెడ్డు కూడా ఉంది. దీనిపై అనుమానాస్పద స్థితిలో ఉన్న వెదురు చీపురును అధికారులు గుర్తించారు. దీంతో పాటు లభించిన కొన్ని వస్తువుల్ని అనుమానిత వస్తువుల జాబితాలోకి చేర్చారు. ఇలాంటి వాటిని సాధారణంగా క్షుద్రపూజల కోసం వినియోగిస్తారని అనుమానిస్తున్న అధికారులు.. నిర్థారణ కోసం అన్ని కోణాల్లో ఆరా తీస్తున్నారు. రాజశేఖర్ ఇంటి బెడ్రూమ్లో కొన్ని అనుమానిత మరకల్నీ ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. ఇవేంటనేవి గుర్తించేందుకు పరీక్షలకు పంపారు. శనివారం ఆ నివేదిక వచ్చే అవకాశం ఉంది. ఉప్పల్ పోలీసులు ఇప్పటి వరకు దాదాపు 71 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. మరోపక్క శవమైన చిన్నారి ఎవరనేది ఇప్పటికీ స్పష్టత రాలేదు. కరీంనగర్ జిల్లా తండాల నుంచి తీసుకువచ్చిన శిశువుగా వార్తలు రావడంతో ప్రత్యేక పోలీసు బృందాలు ఆ జిల్లాలో ఆరా తీశాయి. తండాల్లో విచారించినప్పటికీ ఎలాంటి సమాచారం రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలపై కూపీ లాగుతున్నారు. గతేడాది çనవంబర్ నెలలో పాతబస్తీలోని ఓ ప్రాంతం నుంచి శిశువు అదృశ్యమైనట్లు ఉప్పల్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆ శిశువుకు తల్లిదండ్రుల నుంచి రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపినట్లు తెలిసింది. ఈ నమానాలకు రాజశేఖర్ ఇంటిపై లభించిన తల నుంచి సేకరించిన నమూనాలతో పోలుస్తూ డీఎన్ఏ పరీక్షలు చేయనున్నారని సమాచారం. మిస్టరీగా మారి, పోలీసులకు సవాల్ విసురుతున్న ఈ కేసుపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. -
ఎలాగైనా చంపాలని..
సాక్షి, ఆసిఫాబాద్ : ఇచ్చిన అప్పు తిరిగి తీర్చమని అడిగినందుకు ప్రత్యర్థుల చేతిలో బలైపోయిన దళిత మహిళ దుర్గం సేవాంతను ఎలాగైనా మట్టుపెట్టాలని నిందితులు చూసినట్లు తెలుస్తోంది. మృతురాలి కుమారులు, బంధువులు స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం ఎలాగైనా ఆమెను చంపాలని నిందితులు భావించి ఒకసారి విఫలమై రెండోసారి కూడా అదే తరహాలో దాడి పాల్పడినట్లు తెలుస్తోంది. మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లో నిద్రిస్తున్న సేవాంత ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి హతమార్చాలని చూడడం.. బాధితురాలు కాలిన గాయాలతో చికిత్స పొందుతూ బుధవారం మరణించడం తెలిసిందే. అయితే ఈ ఘటన కన్నా ముందే ఆమెపై హత్యాయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఈ నెల 25 (గురువారం) రాత్రి మృతురాలు సేవంతా ఇల్లు కాలిపోయింది. ఇల్లు తగలబెట్టింది కూడా వీరేనని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యానేరంలో ప్రస్తుతం నిందితులుగా ఉన్న కామ్రే సాలుబాయి, బసరత్ఖాన్ మృతురాలికి ఇచ్చిన అప్పు విషయంలో తరచూ గొడవలు జరుగుతుండేవని చెబుతున్నారు. ఈ క్రమంలో కక్ష గట్టి ఇంటి తగలబెట్టడం అలా కుదరకపోవడంతో నేరుగా ఒంటిపై కిరోసిన్ పోసి చంపే ప్రయత్నం చేశారని కుటుంబసభ్యుల ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కానీ కేవలం ఇచ్చిన డబ్బుల కోసమే ఇంత ఘాతుకానికి పాల్పడ్డారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా వీరి మధ్య ఇతర వర్గ వైషమ్యాలు ఉన్నయా? అనేది కూడా విచారిస్తున్నామని పోలీసులు అంటున్నారు. అప్పుడే పట్టించుకుని ఉంటే.. మొదట ఇల్లు కాలిపోయినప్పుడు పోలీసులు స్పందించి ఉంటే నిందితులు ఈ ఘాతుకానికి ఒడిగట్టేవారు కాదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొదట నిద్రిస్తున్నప్పుడు ఇంటికి నిప్పు పెట్టారు. అలా కుదరకపోవడంతో మరో ఐదురోజుల తర్వాత నిద్రిస్తున్న సేవాంతపైనే నేరుగా కిరోసిన్ పోసి హత్యచేయాలని ప్రణాళిక వేశారు. అయితే బాధితురాలు కేకలు విని కుటుంబ సభ్యులు అత్యవసర నంబర్ 100కు ఫోన్ చేయడంతో 108ద్వారా ఆసుపత్రి తరలించే ముందు స్థానిక తహసీల్దార్, ఎస్సై సమక్షంలో ఒకసారి, సిర్పూర్(టి) సామాజిక ఆస్పత్రిలో స్థానిక జూనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ గారి సమక్షంలో మరోసారి, స్థానిక మీడియా ప్రతినిధులు అడిగిన వారికి సేవంతా మరణించే కొంత సమయానికి ముందు ముగ్గురు పేర్లు కామ్రే సాలుబాయి, ఆమె కొడుకు సాయి, బెజ్జూరు మండల కోఆప్షన్ సభ్యుడు బసరత్ఖాన్ తనను చంపాలనికిరోసిన్ పోసి నిప్పంటించారని వెల్లడించింది. వాంగ్మూలమే ప్రధాన ఆధారం ఓ వ్యక్తి మరణించే ముందు చెప్పే వాంగ్మూలాన్ని చట్టం బలంగా నమ్ముతుంది. అదే క్రమంలో సేవాంత కేసులో కూడా ఆమె చివరిగా చెప్పిన మాటలే నిందితులను అదుపులోకి తీసుకోవడానికి ప్రధాన ఆధారంగా మారింది. దాని ఆధారంగానే ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. గురువారం కాగజ్నగర్ డీఎస్పీ సాంబయ్య మృతురాలి ఇంటికి వెళ్లి ప్రాథమిక ఆధారాలు సేకరించారు. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపుతున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా విచారణ కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం అదుపులో ఉన్న ముగ్గురు నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు హత్యానేరం కింద కేసు నమోదు చేశామని డీఎస్పీ తెలిపారు. నిందితులను ప్రస్తుతం విచారిస్తున్నామని పేర్కొన్నారు. దీని వెనక ఎవరూ ఉన్నా విడిచిపెట్టదిలేదని స్పష్టం చేశారు. ఈ ఘటన వెనక ఎవరూ ఉన్న వారందర్ని కఠినంగా శిక్షించాలని సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన మృతురాలి కుటుంబ సభ్యుల్ని స్థానిక దళిత నాయకులతో కలిసి పరామర్శించారు. వారి వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామన్నారు. సేవాంత కుటుంబానికి 20లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అప్పు అడిగినందుకు ప్రత్యర్థులచేతిలో హతమైన దళిత మహిళ దుర్గం సేవాంత కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.20లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీపీఐ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ డిమాండ్ చేశారు. గురువారం ఆయన బెజ్జూరు మండలం మర్తిడికి చెందిన మృతురాలు దళిత మహిళ దుర్గం సేవాంత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె మృతి కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఆయన వెంట జిల్లా సీపీఐ నాయకులు అంబాల ఓదెలు, దళిత సంఘం నాయకులు ఉన్నారు. దిక్కులేని వాళ్లం అయ్యాం.. ఇన్నాళ్లు మా నాన్న లేకున్నా అమ్మ మమ్మల్ని చదివించాలని ఆరాట పడేది. ప్రస్తుతం అమ్మ కూడా లేకపోవడంతో దిక్కులేని వాళ్లం అయ్యాం. ప్రస్తుతం నేను, చిన్న తమ్ముడు హైదరాబాద్లో చదువుకుంటున్నాం. ఇన్నాళ్లు అమ్మ డబ్బులు పంపింతే మా చదువు సాగేది. ఇప్పుడు భవిష్యత్ తలుచుకుంటే భయంగా ఉంది. మా అమ్మ చావుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి. ఈ ఘటనకు కారణమైన వారిని ఎవర్ని కూడా విడిచిపెట్టోద్దు. – శంకర్, మృతురాలి పెద్ద కొడుకు -
ఫోరెన్సిక్ ఆడిట్కు గిరాకీ!!
న్యూఢిల్లీ: ఆడిట్ సంస్థలు, స్వతంత్ర దర్యాప్తు ఏజెన్సీలకు ఫోరెన్సిక్ ఆడిట్ రూపంలో ఇప్పుడు భారీ అవకాశాలు వచ్చి పడ్డాయి. ప్రభుత్వం ఇటీవలే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్లో (ఐబీసీ) చేసిన సవరణలు కొత్త అవకాశాలకు ద్వారాలు తెరిచాయి. ఈ చట్టం కింద కంపెనీలు తమ ఖాతాల్లోని మొండి బకాయిలను (ఎన్పీఏలు) పరిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓ అంచనా ప్రకారం ఐబీసీ చట్టం కింద ఫోరెన్సిక్ ఆడిట్ వ్యాపారం గత మూడు నెలల్లోనే రెట్టింపయింది. ఇదింకా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫోరెన్సిక్ ఆడిట్లో భాగంగా బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన, భారీగా బకాయిలున్న కంపెనీల ప్రమోటర్ల వ్యవహారాల పరిశీలన, ఆస్తుల సోదాలు, వాటికి రుణాలు అందజేసిన సంస్థల వివరాల ధ్రువీకరణ, నగదు ప్రవాహాలను శాస్త్రీయంగా పరిశీలించడం జరుగుతుంది. దివాలా కేసులకు సంబంధించి ఇప్పటికే పరిష్కార నిపుణులుగా సేవలందిస్తున్న పెద్ద ఆడిటింగ్ సంస్థలకు ఇప్పుడు ఐబీసీ చట్టం రూపంలో కొత్త అవకాశాలు వస్తున్నాయి. ప్రమోటర్ల గురించి ఆరా.. ప్రమోటర్లకు సంబంధించి వ్యక్తిగత వివరాల పరిశీలన, ఇతర వివరాల కోసం ఆరా తీయడం ఐబీసీ చట్టంలో సవరణల తర్వాత పెరిగిపోయింది. ప్రమోటర్లకు సంబంధించిన వ్యక్తులు కంపెనీలను తక్కువ విలువకు సొంతం చేసుకుంటున్నారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. బిడ్డింగ్ వేసే వారు విదేశీ సంస్థలయినా లేదా సంబంధం లేని పరిశ్రమ నుంచి బిడ్డింగ్ వచ్చినా ఈ విధమైన ఆందోళనలు నిజం కావచ్చన్న వాదన ఉంది. ‘‘అధిక శాతం కేసుల్లో బిడ్లర్ల గత చరిత్ర, వారికి ఎవరితో సంబంధాలున్నాయో తనిఖీ చేయాలని మమ్మల్ని అడుగుతున్నారు’’ అని క్రోల్ సంస్థ దక్షిణాసియా విభాగం హెడ్ రేష్మి ఖురానా తెలిపారు. బిడ్లర్ల నేపథ్యం, వారి ఉద్దేశం, వారికున్న వనరుల మూలాలు, గత చరిత్ర అన్నవి బిడ్డర్ల ఎంపికలో బ్యాంకులు చూసే కీలకమైన అంశాలుగా పేర్కొన్నారు. ఇలా అయితే కష్టం... కొన్ని భారతీయ కంపెనీలు ఎన్నో సబ్సిడరీలు, అసోసియేట్ కంపెనీల ద్వారా ఒకదానిలో ఒకటి వాటాలతో క్లిష్టమైన నిర్మాణంతో పనిచేస్తున్నాయి. అలాగే, కొన్ని కంపెనీలు సంబంధిత పార్టీలు ఎవరన్నది వెల్లడించడం లేదు. వార్షిక నివేదికల్లో సైతం ఈ వివరాలు ఉండడం లేదు. దీంతో సంబంధిత పార్టీలు ఎవరన్నది గుర్తించడం కష్టం’’ అని ఈవై ఇండియాకు చెందిన ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్, డిస్ప్యూట్ సర్వీసెస్ పార్ట్నర్ విక్రం బబ్బర్ తెలిపారు. కంపెనీలు, ప్రమోటర్ల నేపథ్యం గురించి తనిఖీలు జరిగిన గత సందర్భాల్లో భారీ మొత్తాల్లో షెల్ కంపెనీల ద్వారా నిధులు మాయం చేసిన ఘటనలు వెలుగు చూశాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక లావాదేవీల్లో ఉత్తుత్తి కస్టమర్లు, అమ్మకందారులను సైతం ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘‘బ్యాంకులు, దివాలా పరిష్కార నిపుణులు కంపెనీల లావాదేవీలతో సంబంధం ఉన్న సంస్థల వివరాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాయి. దీనివల్ల ఆస్తుల స్వాధీనం, వాటి మళ్లింపు లేదా తస్కరించేందుకు ఆయా సంస్థలను ఉపయోగించితే తెలుస్తుంది‘‘ అని కేపీఎంజీ ఇండియా పార్ట్నర్ సువీర్ ఖన్నా వివరించారు. -
హోం మంత్రి చినరాజప్ప ఇంకా అలకవీడలేదు
-
అలకవీడని చినరాజప్ప..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప ఇంకా అలకవీడలేదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి గురువారం హోంమంత్రికి ఆహ్వానం లభించని విషయం తెలిసిందే. దీంతో అవమానంగా భావించిన చినరాజప్ప అప్పటి నుంచి అలకబూనారు. అయితే ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు చినరాజప్పతో ఫోన్లో మాట్లాడారు. మీ శాఖలో మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అధికారుల పట్ల మెతక వైఖరితో ఉండొద్దని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. శంకుస్ధాపనకు తనని పిలవకుండా అవమానించారని చినరాజప్ప మనస్థాపానికి గురయ్యారు. మంత్రినే పట్టించుకోకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు వ్యవహరించిన తీరు పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నచంద్రబాబు.. ) -
సర్కారు ఉదాసీనతతో నేరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల ఉదాసీనత వల్లే నేరాలు జరుగు తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అయితే గట్టిగా వ్యవహరిస్తే అవన్నీ తగ్గుతాయని చెప్పారు. గురువారం రాజధాని ప్రాంతంలోని తుళ్లూరులో ఐదు ఎకరాల్లో రూ.254 కోట్లతో నిర్మించే ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్)కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. ఉదాసీనంగా ఉండటం వల్ల అనేక సమస్యలు వస్తాయన్నారు. ఏదో విధంగా కోర్టులో తప్పించుకోవచ్చనే ధీమాతో నేరాలు జరుగుతున్నాయని, గట్టిగా శిక్ష వేస్తే వీటికి అడ్డుకట్ట పడుతుందన్నారు. -
ఏపీ హోం మంత్రికి తీవ్ర అవమానం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్పకు తీవ్ర అవమానం జరిగింది. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకం చేపట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి హోంమంత్రికి ఆహ్వానం లభించలేదు. వివరాల్లోకి వెళ్తే ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శంఖుస్థాపన చేశారు. అయితే ఆసమయంలో హోంమంత్రి అక్కడ లేకపోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి హోంమంత్రి చినరాజప్పకు ఆహ్వానం అందలేదు. తూతూ మంత్రంగా ఒక కానిస్టేబుల్తో ఆహ్వానం పంపించి చేతులు దులుపుకున్నారు. దీంతో హోంమంత్రి చినరాజప్ప అలకపూనారు. ప్రారంభోత్సవానికి వెళ్లకుండా హుటాహుటిన తిరుమలకు వెళ్లారు. ఇప్పటికే చాలా సార్లు ఇలాంటి సంఘనలు జరిగాయని మంత్రి వాపోయినట్టు సమాచారం. ఇప్పటివరకూ తనకు ఆహ్వానం అందినా అందకపోయినా ప్రతి కార్యక్రమానికి వెళ్లానని, కానీ ఇప్పుడు సొంత శాఖలో జరిగిన అవమానాన్ని మాత్రం ఆయన తీవ్రంగా పరిగణిస్తున్నానని అన్నారు. అయితే ఈసంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫోన్లో హోంమంత్రిని బుజ్జగించే పనిచేశారు. దీనిపై స్పందిచడానికి హోంశాఖ అధికారులు, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు నిరాకరించారు. సాక్షాత్తు మంత్రికే ఇలా జరగడంతో భవిశ్యత్తులో తమలాంటి చిన్న నేతల పరిస్థితి ఏంటని తెలుగుదేశం నేతలు గుసగుసలాడుతున్నారు. చినరాజప్పకు తీవ్ర అవమానం -
నాకు పవర్ లేకుండా చేశారు
సాక్షి, అమరావతి: పవర్ సెక్టార్లో తాను అనేక సంస్కరణలు తీసుకొచ్చా.. కానీ 2004లో మీరు నాకు పవర్ లేకుండా చేశారని ప్రజలనుద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అమరావతిలో ఏపీ ఫోరెన్సిక్ లేబొరేటరీకి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలీసులు, ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే అనేక సమస్యలు వస్తాయన్నారు. రాష్ట్రంలో రౌడీలకు, దొంగలకు స్థానం లేదని, దొంగల వేలిముద్రలు సేకరించడం వల్ల తక్కువ సమయంలో కేసులు చేధిస్తున్నామన్నారు. ఏపీలో రాబోయే రోజుల్లో ఎలాంటి క్రైం జరగడానికి అవకాశం లేదని, గట్టిగా శిక్ష వేస్తేనే నేరాలకు అడ్డుకట్ట పడుతుందని వ్యాఖ్యానించారు. కోర్టులో ఏదో ఒకచోట తప్పించుకుంటామనే భావనతోనే నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆరునెలల్లో అమరావతి ఒక రూపు సంతరించుకుంటుందని, పీపీపీ విధానంలో నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పోలీసు అధికారులందరికి స్కిల్ ట్రైనింగ్ తప్పనిసరి అని అన్నారు. ఎన్ని కేసులు బుక్ చేశామనేది కాదు, ఎన్ని ఛేదించామనేదే ముఖ్యమన్నారు. కేసుల పరిష్కారంలో కాస్త వెనుకబడి ఉన్నామని, టెక్నాలజీ వాడకంలో పోలీసులు కూడా వెనుకబడి ఉన్నారని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ద్వారా తప్పు చేసేవాడిని ముందుగానే గుర్తించవచ్చునని తెలిపారు. కన్విక్షన్ రేటు పెరగాల్సిన అవసరం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాలు నియంత్రించాలని సూచించారు. శాంతికి మారుపేరుగా రాష్ట్రం ఉండాలని కోరారు. -
ఐబీఏ ఫోరెన్సిక్ ఆడిటర్ల జాబితాలో దిగ్గజ సంస్థలు
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో మోసాలకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్న ఆడిటర్ల జాబితాలో దిగ్గజ సంస్థలకూ చోటు దక్కింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) రూపొందించిన జాబితాలో కేపీఎంజీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై), డెలాయిట్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఉన్నాయి. ఇంకా బీఎంఆర్ అడ్వైజర్స్, చోక్సి అండ్ చోక్సి ఎల్ఎల్పీ, గ్రాంట్ థార్న్టన్, ముకుంద్ ఎం చితాలే అండ్ కో సైతం ఫోరెన్సిక్ ఆడిటర్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాయి. మొత్తం మీద 39 ఆడిట్ సంస్థలతో ఐబీఏ ఈ జాబితాను రూపొందించింది. ఈ సంస్థలు బ్యాంకుల్లో రూ.50 కోట్లకుపైగా విలువైన మోసాలకు సంబంధించి ఆడిట్ నిర్వహించనున్నాయి. అలాగే రూ.50 కోట్లకు లోపున్న మోసపూరిత కేసుల్లో ఫోరెన్సిక్ ఆడిట్ కోసం గాను 73 ఆడిట్ సంస్థలను ఐబీఏ గుర్తించింది. బ్యాంకుల్లో ఇటీవలి కాలంలో రూ.లక్షకు పైన విలువతో కూడిన మోసాల సంఖ్యలో పెరుగుదల చోటు చేసుకుంది. 2012–13లో వీటి సంఖ్య 4,235గా ఉంటే, 2016–17లో 5,076 కేసులు నమోదయ్యాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లోనే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.69,769 కోట్ల విలువ మేర మోసాలు జరిగాయి. ఇందుకు సంబంధించి 22,949 కేసులు వెలుగు చూడడం గమనార్హం. -
జిల్లా పోలీసింగ్ ఆధునీకరణకు 150 కోట్లు
సైబర్, ఫోరెన్సిక్ ల్యాబ్ల ఏర్పాటుకు కసరత్తు సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖ ఆధునీ కరణలో భాగంగా జిల్లా పోలీస్ కమిషనరేట్లలో టెక్నాలజీ పరిచయానికి ఉన్నతాధికారులు కసరత్తు మొదలుపెట్టారు. సీసీటీవీల ఏర్పాటుపై ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన పోలీస్ అధికారులు సైబర్ ల్యాబ్లు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ల ఏర్పాటుకు నిధులు కేటాయించినట్టు డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా రూ.150 కోట్లు కేటాయించగా, ప్రతీ జిల్లా/కమిషనరేట్కు రూ.3 కోట్ల చొప్పున విడుదల చేసినట్టు తెలిసింది. సైబర్ క్రైమ్ను నియంత్రించేందుకు ప్రతీ జిల్లా పోలీస్/కమిషనరేట్లో సైబర్ క్రైమ్ వింగ్, దానికి అనుసంధానంగా ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. అక్కడి నుంచే జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ నియంత్రణపై శిక్షణ ఇవ్వనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. మరో 100 కోట్లకు ప్రతిపాదనలు.. హైదరాబాద్ కమిషనరేట్లో ఉపయోగి స్తున్న సెక్యూరిటీ యాప్స్ను జిల్లాల్లో కూడా ప్రవేశపెట్టేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టనున్నారు. సంచలనాత్మకంగా మారే కేసుల్లో కీలక ఆధారాల సేకరణకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కీలకం కావడంతో రీజియన్ల వారీగా ఏర్పాటుకు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. అదే విధంగా జిల్లాకో అత్యాధునిక సాంకేతికత కలిగిన మొబైల్ ఫోరెన్సిక్ వ్యవస్థ ఏర్పాటుకు ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు మొదటి దశలో భాగంగా రూ.150కోట్లు కేటాయించగా, మరో దఫాలో రూ.100కోట్లకు కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. -
చచ్చినా.. చావే..!
►ఇది రిమ్స్లో చనిపోయిన వారి పరిస్థితి ►మార్చురీలో ఫ్రీజర్లు పని చేయకపోవడంతో.. ►మృతదేహాల నుంచి దుర్వాసన ►పట్టించుకోని అధికారులు కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ విభాగం చాలా కీలక పాత్ర పోషిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, హత్యాయత్నాలకు గురై, ఆత్మహత్య చేసుకుని.. రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం మార్చురీకి తీసుకొస్తారు. అలాగే ఎవరైనా అనాథలు మృతి చెందితే కనీసం వారం రోజుల పాటు ఫ్రీజర్లో ఉంచాలి. వారి బంధువులు ఎవరైనా వస్తే తీసుకు వెళతారని, తద్వారా కడ చూపునకైనా నోచుకోనివ్వాలనేది దీని ఉద్దేశం. కానీ ఇక్కడ రిమ్స్ మార్చురీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కళాశాల ఏర్పాటు చేసినపుడు మార్చురీలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. కళాశాల నిర్మితమై 11 ఏళ్లు కావడంతో ఇక్కడ వివిధ గదుల్లో మృతదేహాలను భద్ర పరుచుకునేందుకు ఏర్పాటు చేసిన బాడీ ఫ్రీజర్లు పాడైపోయాయి. వాటి స్థానంలో కొత్తవి తేలేదు. ఉన్న వాటికి మరమ్మతులు చేయించలేదు. ఈ బాధ్యతను రిమ్స్ అధికారులు నిర్వర్తించాల్సి ఉంది. ఈ బాడీ ఫ్రీజర్ల కొనుగోలు, మరమ్మతులు తదితరాలు రిమ్స్కు ఏపీఎంఎస్ఐడీసీ వారు చూడాల్సి ఉంది. ప్రతిపాదనలు పంపినా.. అంతే..! రిమ్స్ అధికారులు ప్రతిపాదనలు పంపినా.. ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే ఇటీవల ఏర్పాటు చేసిన పది మృతదేహాలను భద్ర పరుచుకునే ఫ్రీజర్లకు కూడా గ్రహణం పట్టుకుంది. వాటికి సంబంధించిన విద్యుత్ సరఫరా బోర్డు కాలిపోతే కనీసం మరమ్మతు చేయించేందుకు తక్కువ ఖర్చు అయినా దాని గురించి పట్టించుకోలేదు. ఈ విషయంపై ఫోరెన్సిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ మృతదేహాలను భద్రపరిచే ఫ్రీజర్ల గురించి అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. రెండు వారాల నుంచి మృతదేహాలు వచ్చినా.. వాటిని భద్రపరిచేందుకు అవకాశం లేకపోవడంతో మరుసటి రోజు నుంచి దుర్వాసన వస్తోందని ఆయన పేర్కొన్నారు. ∙ఆదివారం రిమ్స్ మార్చురీలో ఓ వ్యక్తి మృతదేహానికి సంబంధించిన బంధువులు విజయవాడ నుంచి రావాల్సి ఉండగా.. బాడీ ఫ్రీజర్ పని చేయకపోవడంతో కుటుంబ సభ్యులు బయటి నుంచి దాతల ద్వారా ఒక బాడీ ఫ్రీజర్ను తెప్పించుకున్నారు. ఈ సంఘటనపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ∙బాడీ ఫ్రీజర్ల మరమ్మతులకు కేవలం రూ.25 వేలు మాత్రమే ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నా.. ఇప్పటి వరకు దానిపై దృష్టి పెట్టకపోవడం బాధాకరం. ఏదైనా అనాథ మృతదేహం వస్తే వెంటనే మరుసటిరోజే సేవా సంస్థలకు అంత్యక్రియల కోసం అప్పగిస్తున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృతదేహానికి సంబంధించిన బంధువులు వచ్చేంత వరకు కనీసం వారం రోజులైనా బాడీ ఫ్రీజర్లలో భద్రపరుచుకునే పరిస్థితి కొరవడింది. ఆర్ఎంఓ వివరణ ఈ వ్యవహారంపై రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ జంగం వెంకటశివ మాట్లాడుతూ బాడీ ఫ్రీజర్ల మరమ్మతు విషయం తమ దృష్టికి వచ్చిందని, సూపరింటెండెంట్, డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు వారి ద్వారా ఏపీఎంఎస్ఐడీసీ వారికి కూడా పరిస్థితిని వివరించామన్నారు. త్వరలో వాటిని మరమ్మతులు చేయిస్తామన్నారు. – డాక్టర్ జంగం వెంకట శివ, ఆర్ఎంఓ, కడప రిమ్స్ -
వీడియోకాన్కు షాకిచ్చిన బ్యాంకులు
ముంబై : వేలకోట్లు ఎగనామం పెట్టిన సంస్థలపై ఉక్కుపాదం మోపేందుకు బ్యాంకులు రంగంలోకి దిగాయి. ఈ మేరకు వీడియోకాన్ ఇండస్ట్రీస్కు బ్యాంకులు షాకిచ్చాయి. ఈ ఇండస్ట్రీస్ అకౌంట్లపై ఫోరెన్సిక్ ఆడిట్ చేపట్టాలని బ్యాంకుల కన్సోర్టియం ఎస్బీఐ ఆదేశాలు జారీచేసింది. కంపెనీ వ్యాపార పరిస్థితులు బాగా లేక రుణాలు కట్టడం లేదా? లేదా తప్పుడు ఆర్థిక నిర్వహణతో ఈ విధంగా పాల్పడుతుందో తెలుసుకోవడం కోసం ఎస్బీఐ ఫోరెన్సిక్ ఆడిట్కు ఆదేశించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. వీడియోకాన్ మొత్తం రూ.43వేల కోట్ల రుణాలు బ్యాంకులకు ఎగనామం పెట్టింది. దేశంలో అతిపెద్ద నాలుగు ఆడిట్ సంస్థల్లో ఒకటైన కేపీఎంజీ ఈ ఆడిట్ను చేపట్టబోతుందని తెలిసింది. ఆఫ్రికాలో ఉన్న టెలివిజన్ తయారీ నుంచి ఆయిల్ అన్వేషణ వరకు అన్ని వ్యాపారాల గ్రూప్ అకౌంట్లను ఈ ఆడిట్ సంస్థ తనిఖీ చేయనుంది. కేపీఎంజీ తన రిపోర్టును సమర్పించిన అనంతరం వెనువెంటనే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్ట్రప్సీ కోడ్ కింద రుణాలను రీకాస్ట్ చేసే ప్రక్రియ ప్రారంభమవుతోంది. ప్రస్తుతం ఈ గ్రూప్కు రుణాలిచ్చిన బ్యాంకులు, ప్రమోటర్లు రుణాల పునర్నిర్మాణం కోసం చూస్తున్నారు. ఈ ప్రక్రియలో ముందుకు వెళ్లేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ రుణాల ఎగవేత కేసులో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్తో సహా ఐదుగురు ఐడీబీఐ బ్యాంకు అధికారులు అరెస్టు అయిన క్రమంలో దేశీయ బ్యాంకులు నిర్వహణ అభీష్టానుసారం నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభించాయి. కంపెనీ అన్ని బాధ్యతలను సక్రమంగా చేపడుతోందని కానీ రుణాలను చెల్లించడానికి తమకు మరింత సమయం కావాలని వీడియోకాన్ ఇంటస్ట్రీస్ చైర్మన్ వేణుగోపాల్ దూత్ చెప్పారు. ప్రస్తుతం వీడియోకాన్కు రూ.43వేల కోట్లుంటే, మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.793 కోట్లే ఉంది. ఈ గ్రూప్లో 62 శాతం వాటా దూత్ కుటుంబసభ్యులే కలిగి ఉన్నారు. రుణాలను రీకాస్ట్ చేయాలని కంపెనీ బ్యాంకులను కోరుతోంది. రుణాలను చెల్లించడానికి మరింత సమయం కావాలని అభ్యర్థిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకుల కన్సార్టియం ఎస్బీఐ ఫోర్సెన్సిల్ ఆడిట్కు ఆదేశించింది. -
అసెంబ్లీ పేల్చివేతకు కుట్ర
ఉత్తరప్రదేశ్ విధానసభలో విస్ఫోటక పీఈటీఎన్ను గుర్తించిన సిబ్బంది ► సభలో విపక్షనేత సీటు సమీపంలో పౌడర్ ►ఫోరెన్సిక్ నివేదికతో కుట్ర బట్టబయలు ► ఎన్ఐఏ దర్యాప్తుకు యూపీ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ పేల్చివేతకు భారీ కుట్ర జరిగింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో సభ్యుల భద్రతకు సవాల్ విసురుతూ సభలో ప్రమాదకర పేలుడు పదార్థం లభించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ ప్లాస్టిక్ పేలుడు పదార్థమైన పీఈటీఎన్ (పెంటా ఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్)ను విధ్వంసానికి ముందే గుర్తించటంతో భారీ ప్రమాదం తప్పింది. జూలై 12న అసెంబ్లీని శుభ్రం చేస్తున్న ఉద్యోగులకు ప్రతిపక్ష సభ్యులు కూర్చునే సీటు కింద పేపర్లో చుట్టిన పీఈటీఎన్ దొరికింది. అత్యంత భద్రత ఉండే అసెంబ్లీలో.. అదీ అసెంబ్లీ హాల్లో 150 గ్రాముల పేలుడు పదార్థం దొరకటం కలకలం రేపుతోంది. దీనిపై ఎన్ఐఏ విచారణ జరపాలని యూపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. దీంతోపాటు అసెంబ్లీలో పనిచేస్తున్న సిబ్బందిని విచారించేందుకు కూడా స్పీకర్ హృదయ్ నారాయణ్ దీక్షిత్ ఆదేశాలు జారీచేశారు. మామూలు పౌడర్ అనుకుంటే..! యూపీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. జూలై 11న బడ్జెట్ ప్రవేశపెట్టారు. తర్వాత యథావిధిగా 12వ తేదీన సమావేశాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ సమయంలో అసెంబ్లీ హాలును శుభ్రం చేస్తున్న సిబ్బందికి.. విపక్ష నేత రాంగోవింద్ చౌధురీ కూర్చునే సీటు సమీపంలో ఓ కాగితపు పొట్లం కనబడింది. దీన్ని విప్పిచూస్తే పౌడర్ కనిపించింది. జాగిలాలు వచ్చి పరిశీలించినా ఈ పౌడర్ ఏంటో గుర్తించలేకపోయాయి. ఈ పౌడర్ను స్థానిక పోలీసు స్టేషన్ ఎస్సై ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించటంతో అసలు కుట్ర వెలుగులోకి వచ్చింది. అత్యంత విధ్వంసకరమైన ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ పీఈటీఎన్ అని తేలింది. ఈ విషయాన్ని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా సభలో ప్రకటించటంతో ఎమ్మెల్యేలంతా నిశ్చేష్టులయ్యారు. కేవలం 150 గ్రాముల పీఈటీఎన్ మాత్రమే లభించిందని.. అయితే 500 గ్రాముల ఈ పౌడర్తో మొత్తం విధానసభ భవనాన్నే పేల్చేయవచ్చని సీఎం వెల్లడించారు. అయితే ఐఈడీ లేదా డిటోనేటర్తో మాత్రమే దీన్ని వినియోగించవచ్చని ఒక్క పౌడర్తో ఎలాంటి సమస్యా ఉండదని భద్రతాధికారులు స్పష్టం చేశారు. భద్రతపై అనుమానాలు ‘ఇదో తీవ్రమైన ఉగ్రవాద కుట్రగా భావిస్తున్నాం. సభ భద్రత మా బాధ్యత. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు. ఈ ఘటనపై ఎన్ఐఏ విచారణకు సభ ఏకాభిప్రాయ తీర్మానం చేసింది. విధాన్ భవన్ (అసెంబ్లీ) ఉద్యోగులందరినీ పోలీసులు విచారించేందుకు అనుమతినిచ్చాం’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. సభ జరుగుతున్న సమయంలో భద్రతా వలయాన్ని దాటుకుని ఇంత విధ్వంసకర పేలుడు పదార్థం సభ లోపలకు రావటం ప్రమాదకరమని దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందన్నారు. సభలోపలకు ఎమ్మెల్యేలు, మార్షల్స్ తప్ప వేరెవరినీ అనుమతించేది లేదన్నారు. ఎమ్మెల్యేలు, సిబ్బంది మొబైల్ ఫోన్స్ను సభలోకి తీసుకురావొద్దని యోగి కోరారు. అటు అసెంబ్లీ గేట్ల వద్ద క్విక్ రెస్పాన్స్ టీం (క్యూఆర్టీ), సాయుధ బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎమ్మెల్యేల భద్రత కోసం ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలకు తమ మద్దతుంటుందని విపక్ష నేత రాంగోవింద్ చౌధురీ తెలిపారు. పేల్చేస్తానన్న యువకుడి అరెస్టు ఆగస్టు 15న అసెంబ్లీని పేల్చేస్తానంటూ బెదిరించిన ఫర్హాన్ అహ్మద్ (20) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.∙అహ్మద్ తప్పుడు డాక్యుమెంట్లతో సిమ్ కొని ఫోన్చేసి బెదిరించాడని పోలీసులు తెలిపారు. దీనిపై విచారణ జరుగుతోంది. క్రిస్టల్స్ రూపంలో ఉండే ఈ పీఈటీఎన్ను భద్రతా పరికరాలు పసిగట్టలేవు. అందుకే దీన్ని ఉగ్రవాదులు ఎక్కువగా వాడతారని ఫోరెన్సిక్ నిపుణులు చెప్పారు. నైట్రో గ్లిజరిన్ కుటుంబానికి చెందిన పీఈటీఎన్ బ్లాక్ మార్కెట్లో విరివిగానే లభిస్తుందని కూడా వారు తెలిపారు. గనుల్లో ఉపయోగించే ఈ మిశ్రమాన్ని చాలా దేశాలు నిషేధించాయి. 2011 ఢిల్లీ హైకోర్టులో పేలుడు (17 మంది మృతి చెందారు) ఘటన సందర్భంగా తొలిసారిగా పీఈటీఎన్ వినియోగం భారత్లో బయటపడింది. పీఈటీఎన్ అంటే? పెంటాఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్ (పీఈటీఎన్) అత్యంత శక్తిమంతమైన ప్లాసిక్ పేలుడు పదార్థం. నైట్రోగ్లిజరిన్ తరహా రసాయనిక మిశ్రమం. పౌడర్ రూపంలో, స్పటిక రూపంలో లేదా సన్నని ప్లాస్టిక్ షీట్ రూపంలో ఉంటుంది. వేడిని పుట్టించడం ద్వారా (బ్లాస్టింగ్ క్యాప్ ద్వారా సన్నటి అల్యూమినియం లేదా రాగి గొట్టానికి వైర్లతో కనెక్ట్ చేసి బ్యాటరీ ద్వారా వేడి చేస్తారు)నైనా, షాక్వేవ్ ద్వారానైనా దీన్ని పేల్చవచ్చు. మోతాదు తక్కువ.. తీవ్రత ఎక్కువ! పీఈటీఎన్ పేలుడు తీవ్రత భారీగా ఉంటుంది. అందుకే అధిక జననష్టాన్ని కోరుకునే ఉగ్రవాదులు పేలుళ్లకు దీన్ని ఎంచుకుంటారు. రవాణా, నిలువ చేయడం తేలిక, సురక్షితం కూడా. పేల్చినపుడు మాత్రం భీకరమైన శక్తి వెలువడుతుంది. తక్కువ మోతాదుతోనే భారీనష్టం కలిగించవచ్చు. 1894లో జర్మనీ పేలుడు పదార్థాల ఉత్పత్తి సంస్థ ‘స్ప్రెంగ్స్టోఫ్’ మొదటిసారిగా దీన్ని ఉత్పత్తి చేసి పేటెంట్ పొందింది. మొదటి ప్రపంచయుద్ధం తర్వాత వాణిజ్యస్థాయిలో విస్తృత వినియోగంలోకి వచ్చింది. పీఈటీఎన్ సాధారణ ఎక్స్రే స్కానర్లకు, మెటల్ డిటెక్టర్లకు దొరకదు. పైగా ప్లాస్టిక్ షీట్ రూపంలో ఉన్నపుడు దీన్ని ఏ ఆకృతిలోకైనా మార్చవచ్చు. అనుమానం రాకుండా ఏదైనా వస్తువులో దాచేయొచ్చు. శరీరానికి అతికించేయొచ్చు. ఎలక్ట్రికల్ వస్తువుల్లో దాస్తే పట్టుకోవడం కష్టం. దీన్ని దృష్టిలో పెట్టుకొనే వాణిజ్య తయారీ సంస్థలు పీఈటీఎన్ను గుర్తించేందుకు వీలుగా దాంట్లో కొన్ని పదార్థాలను కలుపుతున్నాయి. అయితే.. కాస్తంత రసాయన శాస్త్ర పరిజ్ఞానంతో మార్కెట్లో సులువుగా దొరికే పదార్థాలతోనే పీఈటీఎన్ను తయారు చేస్తున్నారు. విమానాల్లో రెండు యత్నాలు 2001లో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానాన్ని కూల్చడానికి బ్రిటన్కు చెందిన రిచర్డ్ రీడ్ విఫలయత్నం చేశాడు. బూట్లలో పెంటాఎరిథ్రిటాల్ టెట్రానైట్రేట్ను దాచి విమానం ఎక్కాడు. పేలకపోవడంతో చేత్తో అంటించే ప్రయత్నం చేశాడు. తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది సకాలంలో అతన్ని బంధించారు. 2009 క్రిస్మస్ రోజు డెట్రాయిట్కు వెళుతున్న నార్త్వెస్ట్ ఎయిర్లైన్స్ విమానాన్ని పీఈటీఎన్తో పేల్చడానికి ఉమర్ ఫరూక్ అబ్దుల్ ముతల్లాబ్ విఫలయత్నం చేశాడు. లోదుస్తుల్లో దాచిన పీఈటీఎన్ను పేల్చడానికి ఉమర్ సిరంజితో పలు రసాయనాలను అందులోకి జొప్పించాడు. అయితే బాంబు పేలకుండా అతని తొడ కాలిపోయింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
శిరీషపై అత్యాచారం జరగలేదు
- నమూనాల్లో దానికి సంబంధించిన ఆనవాళ్లు లేవు - విశ్లేషణ తర్వాత స్పష్టం చేసిన ఫోరెన్సిక్ నిపుణులు - బంజారాహిల్స్ పోలీసులకు పరీక్షల నివేదిక అందజేత సాక్షి, హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆమెపై అత్యాచారం జరగలేదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారిం చారు. మృతదేహంతో పాటు ఆమె వస్త్రాల నుంచి సేకరించిన నమూనాల్లో అత్యాచారానికి సంబంధించిన ఆనవాళ్లు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు పరీక్షల నివేదికను ఫోరెన్సిక్ నిపుణులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసులకు అందించారని వెస్ట్జోన్ డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. జూన్ 13న షేక్పేట్లోని ఆర్జే ఫొటోగ్రఫీ కార్యాలయంలో శిరీష ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు రాజీవ్, శ్రవణ్లను అరెస్టు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు.. శిరీషది ఆత్మహత్యగా గతంలోనే నిర్థారించారు. అయితే శిరీష కుటుంబీకులు ఇది హత్యేనంటూ ఆరోపించడంతో పాటు అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. ఆమెపై అత్యాచారం జరిగిందని, ఆమె వస్త్రాలపై రక్తపు మరకలు ఉన్నాయని, ఈ నేథప్యంలో ఆమెది హత్యేనంటూ ఆరోపించారు. వీటిని సీరియస్గా తీసుకున్న పోలీసులు శిరీషకు పోస్టుమార్టం పరీక్షలు చేస్తున్న సమయంలో కొన్ని నమూనాలు సేకరించారు. వీటితో పాటు ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆమె ధరించిన వస్త్రాలనూ పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపారు. ఈ నమూనాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు విస్రా (కడుపు నుంచి సేకరించిన నమూనా) పరీక్షలను బట్టి ఆత్మహత్య చేసుకునే సమయంలో శిరీష మద్యం తాగి ఉన్నట్లు నిర్థారించారు. మరోవైపు సున్నితమైన అవయవాల నుంచి సేకరించిన స్వాబ్స్ (నమూనాలు) విశ్లేషించిన నిపుణులు వాటిలో సెమన్(వీర్యం) కానీ, స్పర్మటోజోవా(శుక్ర కణాలు) ఆనవాళ్లు కానీ లేవని నివేదించారు. ఆమె లోదుస్తులపై ఉన్న మరకలు వ్యక్తిగతమైనవిగా తేల్చారు. మరికొన్ని నమూనాలను విశ్లేషించిన ఫోరెన్సిక్ నిపుణులు ఉరి వేసుకోవడం వల్లే ఆమె మరణం సంభవించినట్లు తేల్చారు. ఈ వివరాలతో కూడిన సమగ్ర నివేదికను కేసు దర్యాప్తు చేస్తున్న బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. చనిపోయిన సమయంలో శిరీష ఒంటిపై ఉన్న గాయాల విషయంలోనూ తమకు స్పష్టత ఉందని, పక్కాగా చేపట్టిన దర్యాప్తులో ఈ వివరాలు తెలిశాయని డీసీపీ వెంకటేశ్వరరావు అన్నారు. కుకునూర్పల్లి నుంచి తిరిగి వస్తున్న సయమంలో రాజీవ్, శ్రవణ్ ఆమెపై దాడి చేశారని, ఈ నేపథ్యంలోనే ఆ గాయాలు, రక్తపు మరకలు అయ్యాయని వివరించారు. నిందితుల్ని దోషులుగా నిరూపించడానికి అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు చెప్తున్నారు. త్వరలోనే వీరిపై అభియోగపత్రాలు దాఖలు చేస్తామన్నారు. -
శిరీషపై అత్యాచారం జరగలేదు!
హైదరాబాద్ : బ్యూటీషియన్ శిరీషపై అత్యాచారం జరగలేదని ఎఫ్ఎస్ఎల్ ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు బంజారాహిల్స్ పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందినట్లు తెలుస్తోంది. శిరీష దుస్తులపై ఉన్న మరకల ఆధారంగా ఈ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కాగా ఎఫ్ఎస్ఎల్ నివేదిక తమకు ఇంకా అందలేదని పోలీసులు చెబుతునక్నారు. అయితే ఫోరెన్సిక్ పరీక్ష రిపోర్ట్ పూర్తిస్థాయిలో వస్తేనే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది అధికారికంగా, స్పష్టంగా చెప్పగలమని పోలీసులు చెబుతున్నారు. అయితే శిరీషపై అత్యాచారం జరగలేదని నిందితులు రాజీవ్, శ్రావణ్లు విచారణలో చెప్పారని, హైదరాబాద్ నుంచి కుకునూర్పల్లి వరకూ ఆరుచోట్ల సీసీ ఫుటేజ్ సేకరించినట్లు పోలీసులు తెలిపారు. ఆర్జే స్టూడియోలో రాజీవ్కు సంబంధించిన వీడియోలు సేకరించినట్లు పేర్కొన్నారు. కాగా కుకునూర్పల్లిలో ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి ఆమెపై అత్యాచారయత్నం చేయడంతో పాటు అనంతరం జరిగిన ఉదంతం నేపథ్యంలోనే మనస్తాపంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని, ఆమెది ముమ్మాటికీ ఆత్మహత్యేనని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే శిరీష కుటుంబసభ్యులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ముమ్మాటికీ హత్యనేని ఆరోపిస్తున్నారు. మరోవైపు శిరీష ఆత్మహత్య కేసులో నిందితులు బోదాసు శ్రవణ్(21), వల్లభనేని రాజీవ్ (31) పోలీస్ కస్టడీ ముగియడంతో వారిని నిన్న కోర్టులో ప్రవేశపెట్టి అనంతరం చంచల్గూడ జైలుకు తరలించారు. -
శిరీషను హింసించారు
రాజీవ్–శ్రవణ్ అమానుషంగా ప్రవర్తించారని నిర్ధారించిన పోలీసులు హైదరాబాద్: బ్యూటీషియన్ శిరీష అనుమానాస్పద మృతి కేసులో నిందితులుగా ఉన్న శ్రవణ్, రాజీవ్ ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారని పోలీసులు నిర్ధారించారు. కుకు నూర్పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే మార్గంలో ఆమె ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిం చడం, దాడి చేయడం, కొట్టడం తదితర చర్యల కు పాల్పడినట్లు తేల్చారు. ఈ నేపథ్యంలో నిందితులపై తొలుత నమోదు చేసిన ఐపీసీ 306, 109 సెక్షన్లకు తోడు 324, 354, 509 సెక్షన్లను అదనంగా చేర్చారు. రాజీవ్–శ్రవణ్ కస్టడీ గడువు మంగళవారంతో ముగిసింది. నిందితులిద్దరినీ బుధవారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచాలని అధికారులు నిర్ణయించారు. వచ్చేప్పుడు ఏం జరిగింది..? మంగళవారం నిందితుల రెండోరోజు విచార ణలో కుకునూర్పల్లి నుంచి హైదరాబాద్ వచ్చే సమయంలో జరిగిన ఘటనలపైనే దృష్టి సారించారు. మార్గమధ్యంలో శిరీష కారు నుంచి ఎందుకు దూకాలనుకుంది..? ఆమెను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అన్న అంశాలపై నిందితుల నుంచి పోలీసులు సమాచారం రాబట్టారు. శిరీషపై కుకునూర్పల్లిలో ఎస్సై ప్రభాకర్రెడ్డి అనుచిత ప్రవర్తన, తిరిగి వచ్చే సమయంలో శ్రవణ్, రాజీవ్ ఆమెను అవమానిస్తూ కొట్టడం, ఇక రాజీవ్ తనను వదిలిం చుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు శిరీష తెలుసు కోవడం తదితర పరిణామాల నేపథ్యంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు నిర్థారణకు వచ్చారు. కుకునూర్పల్లి ఎస్సై క్వార్టర్స్లో శిరీషపై అత్యాచారయత్నం జరిగినప్పుడు శ్రవణ్, రాజీవ్ అక్కడే ఉన్నారా? ఎక్కడికైనా వెళ్లారా? అనేది లోతుగా ఆరా తీశారు. నిందితులు తాము ఆ సమయంలో క్వార్టర్స్ బయటే ఉన్నామని చెప్పినట్లు తెలిసింది. ఆర్జే ఫొటోగ్రఫి స్టూడియోలో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్న పోలీసులు నిందితుడు చెప్పిన వివరాలు, సమయం కరెక్టుగా ఉందో లేదో అన్నది క్రైమ్ సీన్ రీ–కనస్ట్రక్షన్ ద్వారా నిర్థారించాలని నిర్ణయించారు. తేజస్విని వాంగ్మూలం నమోదు శిరీషను తీవ్రంగా అవమానించినట్లు ఆరోపణ లు ఎదుర్కొంటున్న రాజీవ్ ప్రియురాలు తేజస్విని వాంగ్మూలాన్ని కూడా పోలీసులు మంగళవారం రికార్డు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మంగళవారం గచ్చిబౌలిలోని తేజస్విని నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లి అక్కడే వాంగ్మూలం తీసుకున్నారు. పోలీసు విచార ణలో తేజస్విని ఈ ఆత్మహత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. శిరీష ఆత్మహత్య తనను చాలా కల చి వేసిందని, ఆమె తన కుటుంబం విషయం ఆలోచించి.. ఆ నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదని పేర్కొన్నట్లు సమాచారం. శిరీష ఆత్మహత్య విషయం 13న తెలిసిందని, ఆ సమయంలో తాను విజయవాడలో ఉన్నానని చెప్పినట్లు తెలిసింది. శిరీష ఆత్మహత్య చేసు కుందని తెలియగానే కన్నీరుమున్నీరయ్యానని.. సాటి మహిళగా చాలా బాధపడ్డానని పోలీసులకు తెలిపింది. తాను రాజీవ్ను ప్రేమించిన విషయం వాస్తవమేనని, పెళ్లి చేసుకోవాలనుకున్నానని అయితే రాజీవ్–శిరీష సన్నిహితంగా ఉండటం తనకు నచ్చలేదని వాపోయినట్లు తెలుస్తోంది. తమ ప్రేమకు అడ్డుగా ఉందన్న ఉద్దేశంతో పలుమార్లు శిరీషడ ను తమ మధ్య నుంచి తప్పుకోవాలని చెప్పిన మాట వాస్తవమేనని.. తన స్థానంలో ఎవరు న్నా అలాగే చేస్తారని విచారణలో తేజస్వి ని పేర్కొన్నారు. 12న తాను విజయవాడ వెళ్లి రాజీవ్ తల్లిని కలిశానని, అయితే పెళ్లి ప్రస్తావన మాత్రం తీసుకురాలేదని, రాజీవ్తో కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పానని పేర్కొన్నట్లు సమాచారం. విజయవాడ నుంచి తాను తన ఇంటికి వచ్చేశానని, తెల్లవారిన తర్వాత శిరీష ఆత్మహత్య విషయం తెలుసుకున్నానని చెప్పిన ట్లు తెలుస్తోంది. తనకు రాజీవ్ ఫేస్బుక్లో పరిచయం కాగా.. కొద్దిరోజుల్లోనే ప్రేమకు దారి తీసిందని.. అతడు తనను పెళ్లి చేసుకుం టానని చెప్పడంతో నమ్మానని వెల్లడించినట్లు సమాచారం. గత నెల 30న అనివార్య కారణాల నేపథ్యంలో రాజీవ్, శిరీషపై ఫిర్యాదు చేయడానికి తాను బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు వచ్చినట్లు తేజస్విని పోలీసుల ఎదుట అంగీకరించింది. ఫోరెన్సిక్ నివేదిక కోసం చూస్తున్నాం.. శిరీష వ్యవహారంపై పశ్చిమ మండల డీసీపీ ఎ.వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. ‘శిరీషది ముమ్మాటికీ ఆత్మహత్యే. ఆమె వస్త్రాలతో పాటు ఫోరెన్సిక్ డాక్టర్లు సేకరించిన నమూనాలను పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపాం. ఆ నివేదిక కోసం ఎదురు చూస్తున్నాం. ఫోరెన్సిక్ పరీక్ష రిపోర్ట్ వస్తే ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అనేది అధికారికంగా, స్పష్టంగా చెప్పగలం. కుకునూర్పల్లిలో జరిగిన ఉదంతం నేపథ్యంలోనే మనస్తాపంలో శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నాం’ అని చెప్పారు. -
తలపై రాళ్లతో మోది హతమార్చారు
ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడి కర్నూలు(హాస్పిటల్): వైఎస్సార్సీపీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి చెరకులపాడు నారాయణరెడ్డిని ప్రత్యర్థులు తలను లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. పెద్ద పెద్ద రాళ్లతో ఆయన తలపై మోది హతమార్చారు. అనంతరం వేటకొడవళ్లతో తలను ఛిద్రం చేసినట్లు సోమవారం నిర్వహించిన పోస్టుమార్టంలో ప్రాథమికంగా తేలింది. పూర్తిస్థాయి నివేదికను కర్నూలు మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ హెచ్ఓడీ డాక్టర్ లక్ష్మీనారాయణ రూపొందిస్తున్నారు. -
ఎన్నాళ్లు కాపాడతారు
నరసాపురం : మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్లో ఐదుగురు కూలీల ఉసురు తీసింది విష వాయువులేనని తేలిపోయింది. ఆ ప్లాంట్లో మార్చి 30న చోటుచేసుకున్న ఈ ఘోరానికి విద్యుదాఘాతమే కారణమని.. అక్కడి ప్లాంట్ నుంచి ఎలాంటి విష వాయువులు వెలువడలేదని నమ్మించేందుకు ప్లాంట్ యాజమాన్యం, నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు సహా మరికొంతమంది ప్రజాప్రతినిధులు తీవ్రంగా ప్రయత్నిసూ్తనే ఉన్నారు. తద్వారా కేసును పక్కదారి పట్టించి.. యాజమాన్యాన్ని ఒడ్డున పడేయడంతోపాటు తుందుర్రులో నిర్మిస్తున్న ఆక్వా పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉధృతంగా సాగుతున్న ఉద్యమంపై నీళ్లు చల్లేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసి ఆక్వా పార్క్ యాజమాన్యం తరఫున వకాల్తా పుచ్చుకుంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశ్రామిక అభివృద్ధి ముసుగులో తరచూ ఆక్వా పార్క్కు అనుకూల ప్రకటనలు చేసూ్తనే ఉన్నారు. మొగల్తూరు ప్లాంట్లో కాలుష్యమే లేదని రాష్ట్ర మంత్రులు అసెంబ్లీ వేదికగా పచ్చి అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేశారు. కాలుష్యం కళ్లముందే కనబడుతున్నా.. అలాంటిదేమీ లేదని ఇప్పటికీ బొంకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ విభాగం వాస్తవాలను నిగ్గుతేల్చింది. అమోనియా, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి విషవాయువులే మరణా లకు కారణమైనట్టు ఫోరెన్సిక్ నిపుణులు స్పష్టం చేశారు. అయినా.. మౌనముద్రలోనే మొగల్తూరు ఆనంద ఆక్వా ప్లాంట్లోని వ్యర్థాలను శుభ్రం చేసేందుకు మార్చి 30న ఉదయం నరసాపురం మండలం సీతారామపురం గ్రామానికి చెందిన ఈగ ఏడుకొండలు (22), మొగల్తూరు కట్టుకాలువకు చెందిన తోట శ్రీనివాస్ (30), నల్లంవారి తోటకు చెందిన నల్లం ఏడుకొండలు (22), మొగల్తూరు మండలం కాళీపట్నంకు చెందిన జక్కంశెట్టి ప్రవీణ్ (21), మొగల్తూరు మండలం మెట్టిరేవుకు చెందిన బొడ్డు రాంబాబు (22) ట్యాంకులోకి దిగారు. ఒకరి తరువాత ఒకరు క్షణాల్లోనే ప్రాణాలు వదిలారు. ఇందుకు కారణమైన ట్యాంక్ నుంచి సుమారు వారం రోజులపాటు విష వాయువుల ఆనవాళ్లు కనిపించాయి. అయినప్పటికీ.. ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదనే వాదనను తెరమీదకు తెచ్చారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అందిన నివేదిక వాస్తవాన్ని వెల్లడి చేయడంతో ఆక్వా ప్లాంట్ యాజమాన్యమే ఇందుకు కారణమని తేలిపోయింది. నరసాపురం ప్రభుత్వాసుపత్రికి మూడు రోజుల క్రితమే ఫోరెన్సిక్ నివేదిక అందగా.. ఆసుపత్రి సూపరింటెండెంట్ దానిని డీఎస్పీ జి.పూర్ణచంద్రరావుకు అందజేశారు. ప్రమాదం జరిగిన రోజున విషవాయువులే ప్రమాదానికి కారణమని.. ఇందులో ఆనంద యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు రాష్ట్ర మంత్రులు సైతం ప్రకటించారు. యాజమాన్యంపై కేసు నమోదు చేశామని కూడా చెప్పారు. ఆ మరుసటి రోజునుంచి దర్యాప్తును గాలికొదిలేశారు. ఫోరెన్సిక్ నివేదిక వస్తే తప్ప తామేమీ చేయలేమని చేతులెత్తేశారు. ఆ నివేదిక అంది మూడురోజులు గడిచినా.. పోలీస్ యంత్రాంగం నేటికీ మీనమేషాలు లెక్కిస్తోంది. న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, అనంతరమే ముందుకు వెళతామని పోలీస్ అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఉద్యోగుల్ని బలిపెడతారా! ఐదుగురి ప్రాణాలు హరించిన పాపం నుంచి యాజమాన్యాన్ని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ప్లాంట్లో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులపై కేసులు నమోదుచేసి యాజమాన్యాన్ని తప్పించేందుకు కుట్ర పన్నుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఘటన జరిగిన రోజున మంత్రులు దగ్గరుండి మరీ పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. అందువల్ల పోస్టుమార్టం నివేదిక తారుమారయ్యే అవకాశం ఉందనే విమర్శలు ఇంకా వినిపిస్తున్నాయి. పోస్టుమార్టం అనంతరం పోలీసులు కాపలా ఉండిమరీ ఆ రోజు అర్ధరాత్రి హడావుడిగా అంత్యక్రియలు జరిపించడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇదిలావుంటే.. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలనే డిమాండ్తో ఆందోళనలు మొదలయ్యాయి. ప్రభుత్వం కళ్లు తెరవాలి విష వాయువుల కారణంగానే మొగల్తూరు ఆక్వాప్లాంట్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారనే విషయం వెల్లడైంది. ఫోరెన్సిక్ నివేదిక ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. ఇకనైనా పంతానికి పోకుండా ప్రభుత్వం కళ్లు తెరవాలి. 40 గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తున్న తుందుర్రు ఆక్వాపార్క్ను తీరానికి తరలించాలి. ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. – ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే మంత్రులూ.. ఇప్పుడేమంటారు ప్రమాదం సాధారణంగా జరిగిందని, అక్కడ ఎలాంటి కాలుష్యం లేదని అసెంబ్లీలో అప్పటి మంత్రులు బుకాయించారు. ఎంపీ గోకరాజు గంగరాజు అయితే ఇది కరెంట్ షాక్ వల్లే జరిగిందన్నారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన నేపథ్యంలో మంత్రులు ఏం చెబుతారు. ప్రజల రక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇప్పటికైనా మంత్రులు కళ్లు తెరిచి వారి ప్రకటనల్ని వెనక్కి తీసుకోవాలి. – శిరిగినీడి నాగభూషణం, నాయకుడు, సర్వోదయ రైతు సంఘం హత్యానేరం కింద కేసు నమోదు చేయాలి మొగల్తూరు ఆక్వా ప్లాంట్ యాజమాన్యంపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలి. ఇది ప్రభుత్వ నిర్ల క్ష్యం, యాజమాన్యం అలసత్వం వల్లే జరిగిందనేది ఫోరెన్సిక్ నివేదిక ద్వారా తేలిపోయింది. అసలు ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి. ఇప్పుడు కూడా యాజమాన్యాన్ని రక్షించాలనుకుంటే అంతకంటే దారుణం ఉండదు. – బి.బలరామ్, సీపీఎం జిల్లా కార్యదర్శి న్యాయ సలహాతో ముందుకెళ్తాం మొగల్తూరు ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక అందింది. దానిని పరిశీలిస్తున్నాం. దీనిపై న్యాయ సలహా తీసుకుని కేసు విషయంలో ముందుకు వెళ్తాం. ఐదుగురు మృత్యువాత పడిన ఘటనకు సంబంధించి అప్పట్లోనే కేసు నమోదైంది. ప్రత్యేకంగా మళ్లీ కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు. కేసు దర్యాప్తులో ఉంది. ప్రస్తుతానికి ఇంతకుమించి వివరాలు చెప్పలేం. – జి.పూర్ణచంద్రరావు, డీఎస్పీ, నరసాపురం -
ఫోరెన్సిక్ నివేదికతో బట్టబయలైన నిజాలు
-
ఫోరెన్సిక్ నివేదికతో బట్టబయలైన నిజాలు
మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఫ్యాక్టరీ ప్రమాద ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక జిల్లా పోలీస్ శాఖకు చేరింది. హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి విషవాయుడు కారణంగానే అయిదుగురు మృతి చెందినట్లు నిర్థారణ అయింది. ఈ ఏడాది మార్చి 30న మొగల్తూరు ఆనంద ఆక్వా పార్క్లో ఐదుగురి మరణానికి విషవాయువులు కారణం కాదని.. విద్యుదాఘాతం వల్ల ప్రమాదం జరిగిందని నమ్మించే డ్రామాకు ఆనంద గ్రూపు సంస్థల యాజమాన్యం తెరలేపింది. ఇందుకోసం దళారులను రంగంలోకి దింపింది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో నిజాలు బట్టబయలు అయ్యాయి. 37 రోజులుగా ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలకు అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారు. ప్రమాద ఘటనపై ఇప్పటికీ పోలీసులుతో పాటు రెవెన్యూ అధికారులు కూడా ఇప్పటికీ విచారణ చేయలేదు. కాగా ఫోరెన్సిక్ నివేదిక రావడంతో ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. కాగా విషవాయువులు కారణం ఈగ ఏడుకొండలు (22), తోట శ్రీనివాస్ (30), నల్లం ఏడుకొండలు (22), జక్కంశెట్టి ప్రవీణ్ (23), బొడ్డు రాంబాబు (22) ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. -
నిజం సమాధి కాకూడదు
నిజం భూస్థాపితం కాకూడదు. అబద్ధం శిలాఫలకం అవకూడదు. నిజమూ అబద్ధమూ... రెండూ ఒకే రూపంలో కనిపిస్తున్నప్పుడు... నిజమేదో, అబద్ధమేదో తేల్చడానికి భూమిని తవ్వి తవ్వి తియ్యాలి. ప్రతి శిలనూ కదిలించి చూడాలి. అనుమాన భూతాన్ని పట్టెయ్యాలి. అలా పట్టేసేదే... రీపోస్ట్ మార్టమ్. రేపటికి నెల.. మధుకర్ చనిపోయి! మార్చి 13న ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. మధుకర్ది హత్యా... ఆత్మహత్యా అన్నది ఇంకా తేలలేదు. ఇప్పటికి రెండు పోస్ట్మార్టమ్లు అయ్యాయి. మొదటి పోస్ట్ మార్టమ్లో ఆత్మహత్య అని సూచించేలా వివరాలు ఉన్నాయి. అయితే తల్లిదండ్రులు, బంధువులు పట్టుపట్టి, రీ పోస్ట్మార్టమ్ కోసం కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అది కచ్చితంగా హత్యేనని వారి ఆరోపణ. రెండో పోస్ట్ మార్టమ్ ఏప్రిల్ 10న జరిగింది. రిపోర్ట్ రావలసి ఉంది. మధుకర్ది తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఖానాపూర్. అదే మండలంలోని వెంకటాపూర్ యువతి, మధుకర్ ప్రేమికులు. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసి యువతి తల్లిదండ్రులు మధుకర్ని హెచ్చరించారనీ, ఆ తర్వాత కొద్ది రోజులకే అతడిని హత్యచేశారని మధుకర్ కుటుంబం, దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.రీ పోస్ట్మార్టమ్నంతా వీడియోలో చిత్రీకరించారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కుమారుడి మృతదేహాన్ని చూసి ఆ తల్లి సొమ్మసిల్లిపోయింది. ఫోరెన్సిక్ నిపుణులు నమూనాలు తీసుకెళ్లారు. వారం రోజుల్లో నివేదిక హైకోర్టుకు అందుతుంది. మధుకర్ది హత్యా, ఆత్మహత్యా అన్నది అధికారికంగా అప్పుడు మాత్రమే వెల్లడవుతుంది. ఇంతకీ మధుకర్ మృతదేహానికి రీ పోస్ట్మార్టమ్ ఎందుకు అవసరమైంది? ఇంటి నుంచి బయటికి వెళ్లిన మధుకర్ మర్నాడు ఖానాపూర్ శివార్లలో శవమై కనిపించాడు. అక్కడి దృశ్యం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా కనిపించినా.. ముళ్లకంపలో మృతదేహం పడి ఉండడంతో ఇక్కడికి వచ్చి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి పోస్ట్మార్టం చేయించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే, ప్రేమ వ్యవహారం కారణంగానే మధుకర్ను దారుణంగా హత్య చేశారనీ, కళ్లు పీకి, మర్మాంగాలు కోసి చంపేశారని సామాజిక మాధ్యమాలలో ప్రచారం జరగడంతో మధుకర్ తల్లిదండ్రులతో పాటు, దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నేతలు ఆందోళనకు దిగి, రీపోస్ట్మార్టమ్ చేయించారు. ఈ నేపథ్యంలో.. అసలు పోస్ట్మార్టమ్ అంటే ఏమిటో, ఎప్పుడు చేస్తారో తెలుసుకుందాం. నాలుగు రకాలు అనుమానాస్పద కేసుల్లో... ఆ వ్యక్తి మృతి చెందడానికి అసలు కారణం ఏమిటో తెలుసుకోవడానికి చేసే శవ పరీక్షే పోస్ట్మార్టమ్. దీన్ని అటాప్సీ అని కూడా అంటారు. దీనిని నాలుగు సందర్భాలలో చేస్తారు. మెడికో–లీగల్: ఒక వ్యక్తి మరణానికి దారి తీసిన అసలు కారణాన్ని తెలుసుకోవడం కోసం చేసే సాధారణ శవపరీక్షను మెడికో లీగల్ అటాప్సీ అంటారు. ఇది ఆయా దేశాల్లో అమలులో ఉన్న చట్టాల ప్రకారం ఏదైనా అనుమానాస్పద మృతి కేసుల్లో నిర్వహిస్తారు. ఇందులో శవపరీక్ష కోసం శస్త్రాలను ఉపయోగిస్తారు. ఆకస్మిక మృతి సంభవించినప్పుడు, ప్రమాదాల వంటి సందర్భాల్లో, హింస చెలరేగి మృతి సంభవించినప్పుడు ఏ కారణంగా ప్రాణం పోయిందో ఈ పరీక్ష ద్వారా తెలుసుకుంటారు. క్లినికల్ లేదా పాథలాజికల్: రోగి ఏదైనా జబ్బుతో మృతి చెందితే... అతడు / ఆమె మృతి చెందడానికి కారణమైన జబ్బు ఏదో తెలుసుకోడానికి చేసే పరీక్ష క్లినికల్ లేదా పాథలాజికల్ అటాప్సీ. అనటామికల్ లేదా అకడమిక్ : ఇది విద్యాభ్యాసంలో భాగంగానో లేదా వైద్య విజ్ఞాన సముపార్జనలో భాగంగానో చేసే శవపరీక్ష. వర్చువల్ లేదా మెడికల్ ఇమేజింగ్ : ఇందులో కేవలం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి శవపరీక్ష నిర్వహిస్తారు. అంటే ఎమ్మారై, సీటీ స్కాన్ వంటి అధునాతన వైద్య పరీక్షలతో చేస్తారు. నేరాలు జరిగినప్పుడు మృతి స్వభావాన్ని తెలుసుకోవడం కోసం పైన పేర్కొన్న అటాప్సీలలో ప్రధానంగా మొదట పేర్కొన్న తరహా శవపరీక్షను నిర్వహిస్తారు. ఒక కేసులో మృతి చెందడానికి వివరించిన కారణం సహేతుకంగా అనిపించనప్పుడు, దానిపై అనుమానాలు చెలరేగినప్పుడు మళ్లీ తిరిగి శవపరీక్ష (రీ పోస్ట్మార్టమ్) నిర్వహిస్తారు. రీ పోస్ట్ మార్టమ్ ఎలా చేస్తారు? అయితే మృతి చెందిన వెంటనే శరీర భాగాలు శిథిలం కావడం, కుళ్లడం మొదలవుతాయి. ఇది మృతి చెందిన తర్వాత కాల వ్యవధిని బట్టి దశలవారీగా జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మృతి సంభవించిన సమయం మొదలుకొని... అప్పటికి ఎంతమేరకు శవం శిథిలమై ఉంటుందన్న అంచనా వేసుకుని, దానిని బట్టి మిగతా శవపరీక్షలు నిర్వహిస్తారు. కొన్ని సందర్భాల్లో శరీరం చాలావరకు శిథిలమైనా ఏదైనా ఒక లోపలి అవయవం (ఇంటర్నల్ ఆర్గాన్) దొరికినా దానికి రీ–పోస్ట్మార్టమ్ నిర్వహించి, తగిన వైద్యపరీక్షలతో మృతుడు ఏ కారణం వల్ల మరణించాడో తెలుసుకోడానికి తగినంత పరిజ్ఞానం అందుబాటులో ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు ఈ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే శవదహనం జరిగాక భౌతికకాయం ఉండదు కాబట్టి మొదట నిర్వహించిన పోస్ట్మార్టమ్ (అర్లియర్ పోస్ట్మార్టమ్ ఫైండింగ్స్) ఆధారంగా, ఆ సమయంలో తీసిన ఫొటోల ఆధారంగా నిపుణులు తమ అభిప్రాయాలను ఇస్తారు. రీ పోస్ట్మార్టమ్ – కొన్ని కేసులు ఎయిర్ హోస్టెస్ రీతూ 2015 ఏప్రిల్లో హైదరాబాద్ రామాంతపూర్లో నివాసం ఉండే మాజీ ఎయిర్ హోస్టెస్ రీతు (28) అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె భర్త సచిన్ రీతు తల్లిదండ్రులకు ఫోన్ చేసి రీతు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పగా వారొచ్చి ఇంట్లో చూసేసరికే ఆమె మృతి చెంది ఉంది. ఈ మృతి అప్పట్లో పెద్ద సంచలనం రేపింది. విచారణలో టివి రిమోట్ కోసం చిన్నపాటి జగడం అయ్యిందని, తాను ఆమెను చెంప దెబ్బ కొట్టడం తప్ప వేరే ఏమీ చేయలేదని, బయటికి వెళ్లి సిగరెట్ తాగి వచ్చేలోగా ఆమె అపస్మారకంగా పడి ఉందని భర్త సచిన్ తెలిపాడు. రీతు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ చేయగా అందులో ‘కాజ్ ఆఫ్ డెత్’ (మృతికి కారణం) ఏమిటన్నది తేలలేదు. దీనిని రీతు బంధువులు అనుమానించారు. ‘కాజ్ ఆఫ్ డెత్’ తేలడానికి రీ పోస్ట్మార్టమ్ నిర్వహించాల్సిందేనని వారు పట్టుబట్టారు. వారి విన్నపం ప్రకారం పన్నెండు మంది వైద్యుల సమక్షంలో రీతు మృతదేహానికి రీపోస్ట్మార్టం జరిగింది. మరోవైపు ‘లోతైన విచారణ’ జరుపగా భర్త సచిన్ అసలు విషయాన్ని బయటపెట్టాడు. ఆ రోజు రాత్రి మద్యం తాగి స్నేహితునితో ఇంటికి రాగా అతడి ముందు భార్య తనని అవమానించిందని దానివల్ల చేయి చేసుకున్నానని, దాంతో స్నేహితుడిని బయటకు పంపి ఆమె ముక్కుపై దిండు అదిమి చంపేశానని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. పెళ్లయ్యి రెండేళ్లు కాకమునుపే జరిగిన ఈ హత్య రీ పోస్ట్మార్టమ్ నివేదిక వల్లే నిందితుడిని పట్టుకోగలిగింది. ఆశ్రమ భక్తురాలు సంగీత యేడాదిన్నర కిందటి సంఘటన ఇది! సంగీత అనే 24 ఏళ్ల అమ్మాయి విషయం. 2015లో చనిపోయింది. ఆమె మరణం కలకలమే రేపింది. తమిళనాడులోని తిరుచ్చి సంగీత స్వస్థలం. అయితే సంగీత కర్ణాటకలోని బెంగుళూరు దగ్గరున్న బిదాడిలో ఉండేది. అక్కడి నిత్యానంద ధ్యానపీఠంలో. తన 20వ యేటనే ఆ ఆశ్రమానికి వెళ్లింది. నాలుగేళ్లుగా ఆశ్రమంలోనే జీవనం సాగిస్తున్న సంగీత 2015, జనవరిలో హఠాత్తుగా చనిపోయింది. ‘మీ అమ్మాయి చనిపోయింది’ అని ఆశ్రమం వాళ్లు సంగీత తల్లిదండ్రులకు కబురు పంపారు. ఆ వార్త విని హతాశులయ్యారు వాళ్లు. హుటాహుటిన బిదాడికి చేరుకున్నారు. కార్డియాక్ అరెస్ట్తో చనిపోయిందని ఆశ్రమం అధికారులు చెప్పారు. పోస్ట్మార్టమ్లో కూడా అనుమానాస్పద అనవాళ్లు ఏమీ తేలలేదు. విషాదంతోనే కూతురి భౌతికకాయాన్ని తీసుకొని సొంతూరు తిరుచ్చి దగ్గర్లోని నవలూరు కుట్టపాట్టుకి బయలుదేరారు. శవాన్ని ఖననం చేశారు. అయినా వాళ్ల మనసుల్లో ఎక్కడో అనుమానం.. తమ బిడ్డది సహజ మరణం కాదని. అందుకే రీపోస్ట్మార్టమ్ కోసం కర్ణాటకలోని రామనగరం జిల్లా సూపరింటిండెంట్కు పిటిషన్ పెట్టుకున్నారు. సమ్మతించి రీపోస్ట్మార్టమ్ కోసం ఆదేశాలు జారీ చేశారు. దాంతో కర్ణాటకలోని పోలీస్ టీమ్ తిరుచ్చి చేరుకుంది. సంగీత తండ్రి, స్థానిక రెవెన్యూ ఆఫీసర్, స్థానిక పోలీసుల సమక్షంలో సంగీత డెడ్ బాడీని బయటకు తీశారు. అక్కడి మహాత్మాగాంధీ మెమోరియల్ గవర్నమెంట్ హాస్పిటల్కు చెందిన ఇద్దరు డాక్టర్లు రీపోస్ట్మార్టమ్ నిర్వహించారు. టీనేజ్ అమ్మాయి ఫెమి రెండున్నరేళ్ల క్రితం కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలోని రైల్వేట్రాక్ మీదకు ఓ శవం కొట్టుకొచ్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. అది ఓ అమ్మాయి మృతదేహం. ఆనవాళ్లు పట్టలేనంతగా శరీరం ఉబ్బిపోయింది. పోస్టుమార్టమ్లో ఆ అమ్మాయి వయసు 14 ఏళ్లు అని, విషం సేవించడం వల్ల మరణించిందని తెలుసుకున్నారు. ఆ తర్వాత ఖనన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. రెండు నెలల తర్వాత ఆ మృతదేహాన్ని వెలికి తీసి, రీ పోస్టుమార్టమ్ నిర్వహించారు. ఆమె మృతదేహం నుంచి కొన్ని శాంపిల్స్ సేకరించడంతో పాటు డిఎన్ఎ టెస్ట్ కూడా చేశారు. నిజానిజాలు రాబట్టిన పోలీసులు వాస్తవాలను బయటపెట్టారు. మొదట ఇరింజలకుడ పోలీస్ స్టేషన్లో 14 ఏళ్ల అమ్మాయి తప్పిపోయిందని కేసు ఫైల్ అయినట్టు గుర్తించారు. ఆ అమ్మాయి పేరు ఫెమి. ఆమె తండ్రి పేరు బెన్నీ. మరణించిన అమ్మాయే బెన్నీ కూతురు ఫెమి అని డిఎన్ఎ నివేదికలో నిర్ధారించారు. బెన్నీ మొదటి భార్య కూతురు ఫెమి. భార్యాభర్తలు రెండేళ్ల క్రితం విడిపోయారు. చట్టబద్ధంగా ఫెమి తండ్రి దగ్గరే ఉంటోంది. తమకు అడ్డుగా ఉందని భావించి ప్రియురాలు వినీతతో కలిసి పళ్లరసంలో స్లీపింగ్ పిల్స్ కలిపి తాగించి కన్నతండ్రే ఈ హత్య చేశాడని, ఆ తర్వాత తెల్లవారుజామున సముద్రంలో విసిరేశారని, ఫెమీ శరీరం థియేటర్ వెనకాల గల రైల్వే ట్రాక్ మీదకు కొట్టుకొచ్చిందనే నిజాన్ని తేల్చి, చిక్కుముడిని విప్పారు. దోషులకు జైలు శిక్ష విధించారు. బీటెక్ విద్యార్థిని శ్రీయా ప్రసాద్ హైదరాబాద్లోని నేరెడ్మెట్ వాయుపురి కాలనీకి చెందిన టి.శ్రీయాప్రసాద్ విశాఖపట్టణం గీతం వర్శిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదివేది. కిందటేడాది ఫిబ్రవరి 12న ఆమె అక్కడే చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటో తెలియరాలేదని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టమ్ నివేదికలో శ్రీయా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మరణించినట్లు తెలిపారు. అయితే అదే రోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో స్నేహితురాలితో ఆమె ఫేస్బుక్ చాటింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో వారికి కూతురి మరణం పట్ల అనుమానాలు తలెత్తాయి. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేటంత పిరికిది కాదని, ఆమె మృతిపట్ల అనుమానాలు ఉన్నాయని, వాస్తవాలు వెలికితీయాలంటూ శ్రీయా తల్లి యావన్ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు మార్చి 4న మృతదేహాన్ని వెలికి తీసి పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, రీ పోస్ట్మార్టమ్ చేయాలన్న స్పష్టత కోర్టు ఆదేశాల్లో లేదని, మృతదేహం వెలికితీతను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించి అక్కణ్ణుంచి వెళ్లిపోయారు. తర్వాత మార్చ్ 12న కోర్టు ఉత్తర్వులతో శ్రీయా ప్రసాద్ మృతదేహం వెలికి తీసి రీ–పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. 12 మంది నిపుణులు, అధికారుల సమక్షంలో ఈ వెలికితీత కార్యక్రమాన్ని నిర్వహించారు. మృతదేహం అంతర అవయవాల నమూనాలను ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపారు. -
బ్యాంకుల్లో మోసాలపై ఐబీఏ దృష్టి
ఫోరెన్సిక్ ఆడిట్కు సీఏల నియామకంపై కసరత్తు న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో మోసాల ఉదంతాలు పెరుగుతుండటంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) దృష్టి సారించింది. మోసాలను అరికట్టేందుకు, పోయిన నిధులను రాబట్టేందుకు బ్యాంకుల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం ప్రముఖ చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్థలను నియమించుకోవడంపై కసరత్తు చేస్తోంది. ఫోరెన్సిక్ ఆడిట్ కోసం ఎంపికైన సీఏ సంస్థలు.. రుణాల విశ్లేషణ, విదేశీ వాణిజ్య పత్రాల పరిశీలన, విదేశీ వాణిజ్యానికి సంబంధించిన వ్యవస్థ పనితీరు పరిశీలన, రుణాల మదింపు మొదలైనవి చేయాల్సి ఉంటుంది. అలాగే లై డిటెక్టింగ్ మెషిన్, మొబైల్ కాల్ ఇంటర్ప్రిటర్, బిగ్ డేటా విశ్లేషణ సాధనాల్లాంటివి కూడా వినియోగించాల్సి ఉంటుంది. సీబీఐ, సెబీ, ఎస్ఎఫ్ఐవో, ఐబీఏ తదితర ఏజెన్సీల్లో సభ్యత్వం కలిగి ఉన్న వాటికి ఎంపికలో ప్రాధాన్యం లభిస్తుందని ఐబీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్ పరిశ్రమలో రూ.50 కోట్ల దాకా, అంతకు పైగా మొత్తాలకు సంబంధించి జరిగే మోసాలపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం సీఏ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలియజేసింది. ఐబీఏకి దరఖాస్తులు చేరడానికి ఏప్రిల్ 25 ఆఖరు తేది. నిబంధనల ప్రకారం రూ. 50 కోట్ల పైబడిన మోసాలపై ఆడిట్ నిర్వహించే సంస్థలకు ఆ విభాగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. మొండిబాకీలు రాబట్టేందుకు తోడ్పాటు: పేరుకుపోతున్న మొండిబాకీలను రాబట్టే దిశగా బ్యాంకులు తగు సలహాలు పొందేందుకు... కొత్తగా ఏర్పాటయ్యే ఆడిటర్ల ప్యానెల్ ఉపకరించగలదని బ్యాంకింగ్ రంగానికి చెందిన సీనియర్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. మోసాల ఉదంతాలు అన్ని బ్యాంకుల్లోనూ చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణకు చర్యలు అవసరమన్నారు. కొన్నాళ్ల క్రితం బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ. 6,000 కోట్లపైగా విదేశాలకు రెమిటెన్సులకు సంబంధించిన అవకతవకలపై ఫోరెన్సిక్ ఆడిట్ జరిగిన సంగతి తెలిసిందే. -
రూ.253 కోట్లతో ఫోరెన్సిక్ ల్యాబ్ : డీజీపీ
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో రూ.253 కోట్లతో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ సాంబశివరావు చెప్పారు. సోమవారమిక్కడ ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రకు సైతం పోలీసు అనుమతి తీసుకోవాలని, ఇకపై చట్టపరంగా పరిశీలించిన తర్వాతే పాదయాత్రలకు అనుమతి ఇస్తామన్నారు. 1994లో జరిగిన పాదయాత్రలను కూడా పరిశీలిస్తున్నామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకే దేనికైనా అనుమతి ఇస్తామని చెప్పారు. విశాఖ సమీపంలో రూ.850 కోట్లతో గ్రే హౌండ్స్ శిక్షణ కేంద్రం, విజయవాడలో రూ.9.8 కోట్లతో నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 868 పోలీసు స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రతి ఫిర్యాదునూ స్వీకరించి రశీదు ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కులపరమైన ఘర్షణలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఒక్క అమలాపురం సబ్ డివిజన్లోనే వందకుపైగా ఇలాంటి సంఘటనలు జరిగాయన్నారు. ఆర్కే విషయంలో మావోయిస్టుల ఆరోపణలు అసత్యమని నిరూపితమైందని, వారు మొదటి నుంచి ఇదే పంథాలో ఉన్నారంటూ గిరిజన ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని డీజీపీ సాంబశివరావు తెలిపారు. -
రూ.253 కోట్లతో ఫోరెన్సిక్ ల్యాబ్ : డీజీపీ
-
ఉద్రిక్తత నడుమ పోస్టుమార్టం
- ఫోరెన్సిక్ ల్యాబ్కు ప్రదీప్ శరీర భాగాలు - నివేదిక తారుమారు చేస్తారేమోనని బంధువుల అనుమానం సాక్షి, విశాఖపట్నం/కేజీహెచ్: అనుమానాస్పదంగా శవమై తేలిన ఇంజనీరింగ్ విద్యార్థి ప్రదీప్ మృతదేహానికి బుధవారం విశాఖ కేజీహెచ్లో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం తమ సమక్షంలోనే చేయాలని బంధువులు పట్టుబట్టడం దానికి అధికారులు నిరాకరించడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ప్రదీప్ శరీర భాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. నివేదిక రావడానికి వారం రోజులు పడుతుందని తెలిపారు. కాగా, తమ కళ్లెదుటే పోస్టుమార్టం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన అధికారులు తీరా ఇప్పుడు హైడ్రామా నడిపించారంటూ మృతుని బంధువులు మండిపడ్డారు. కోర్టు అనుమతి ఉండాలంటున్నారని, తహసీల్దార్ సమక్షంలో కూడా పోస్టుమార్టం జరగలేదని, ఇదంతా చూస్తుంటే పోస్టుమార్టం నివేదికను మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానం కలుగుతోందని ఆరోపించారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్, ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్లు నిందితులకు సహకరిస్తున్నట్లుగా అనుమానం కలుగుతోందన్నారు. ఎమ్మెల్యే, ఎంపీలు నిందితులకు మద్దతు ఉపసంహరించుకుని ప్రదీప్ మరణానికి కారణమైన వారిని శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా నిబంధనల ప్రకారమే తన సమక్షంలోనే పోస్టుమార్టం జరిగిందని అనకాపల్లి తహసీల్దార్ కృష్ణమూర్తి తెలిపారు. బంధువులు ఆరోపిస్తున్నట్లుగా పోస్టుమార్టం నివేదికలో ఎలాంటి అవకతవకలకు తావులేదన్నారు. అంతా వీడియో, ఫొటోలు తీయించామన్నారు. -
శవాలతో సావాసం మాకొద్దు..!
ఫోరెన్సిక్ మెడిసిన్పై అభ్యర్థుల్లో తగ్గుతున్న ఆసక్తి సగం పీజీ సీట్లు కూడా భర్తీకాని వైనం ప్రభుత్వాస్పత్రుల్లో శవ పరీక్షకు వైద్యుల కరువు పంచనామా చేసిన వైద్యులే మళ్లీ పాఠాలూ చెప్పాలి ప్రైవేటులో అవకాశాలు లేకనే రావడం లేదంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఫోరెన్సిక్ మెడిసిన్కు సినిమాల్లో తప్ప వాస్తవంలో ఏమాత్రం ప్రాధాన్యత ఉండడంలేదు. పీజీ చెయ్యక పోయినా ఫర్వాలేదుగానీ, నాన్క్లినికల్ గ్రూప్లో భాగంగా ఉన్న ఈ కోర్సులో సీటు తీసుకోకూడదనే ఆలోచనలో అభ్యర్థులున్నారు. దీంతో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కనీసం సగం పీజీ వైద్య సీట్లు కూడా భర్తీ కావడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండీ ఫోరెన్సిక్ మెడిసన్ సీట్లు 12 ఉండగా ఈ ఏడాది కేవలం 3 మాత్రమే భర్తీ కావడం గమనార్హం. ఫోరెన్సిక్ మెడిసిన్లో పీజీ చేసినా మార్చురీలో పనిచేయడం మినహా ఎక్కడా ప్రాధాన్యత లేదని ప్రస్తుతం ఫోరెన్సిక్ పూర్తిచేసిన వైద్య అభ్యర్థులు వాపోతున్నారు. పైగా ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ గత కొన్నేళ్లుగా రెగ్యులర్ పోస్టులకు నియామకాలు లేవు. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ అభ్యర్థులకు ఎలాంటి అవకాశాలూ లేకపోవడం దీనిపై ఆసక్తి లేకపోవడానికి మరో కారణం. ప్రమాద కేసులు, ఆత్మహత్య కేసులు, మెడికో లీగల్ కేసులకు ప్రభుత్వాస్పత్రుల్లోనే శవ పంచనామా జరగాలి. కానీ అక్కడ ఫోరెన్సిక్ వైద్యుల కొరత వేధిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి. మొత్తం 11 బోధనాస్పత్రులు, 8 జిల్లా ఆస్పత్రులు ఉంటే అందులో శవ పరీక్షలు నిర్వహించే దిక్కులేక అవస్థలు పడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ప్రమాద కేసులో మృతిచెందితే నిరీక్షణే ఏటికేటికీ రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మృతులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఆ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని బట్టి పోలీస్ స్టేషన్ పరిధిని బట్టి ఆయా జిల్లా ఆస్పత్రి లేదా బోధనాస్పత్రికి తీసుకెళతారు. కానీ బోధనాస్పత్రుల్లో 8 మంది ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులుండాల్సి ఉంటే కనీసం ఇద్దరు కూడా లేని పరిస్థితి. ఒక్కో బోధనాస్పత్రికి సగటున రోజుకు ప్రమాద లేదా ఆత్మహత్య మృతుల కేసులు 10 నుంచి 15 వరకూ వస్తుంటాయి. అంటే రోజూ రాష్ట్రవ్యాప్తంగా 150 నుంచి 200 వరకూ మృతులకు పంచనామా చేయాల్సి ఉంటుంది. కానీ ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు లేక చివరకు అటెండర్లు, వార్డు బాయ్లే శవ పంచనామా చేసి తూతూమంత్రంగా రిపోర్టు రాసే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకు కడప రిమ్స్లో ఆరుగురు ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యులు ఉండాలి. కానీ ఇద్దరే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో శవాలు ఎక్కువగా వస్తే పంచనామా జాప్యమవుతోంది. పోనీ శవాలకు సరిపడా ఫ్రీజర్లు(శీతల పెట్టెలు) ఉన్నాయా అంటే అదీ లేదు. దీంతో చాలా ఆస్పత్రుల్లో ఉన్న వైద్యులకు ఎంతోకొంత లంచమిచ్చి త్వరగా పంచనామా చేయించుకుంటున్నారు. కర్నూలు, గుంటూరు, విశాఖపట్నం, కాకినాడ వంటి పెద్దాస్పత్రుల్లో విపరీతంగా ప్రమాద మృతుల కేసులు పంచనామాకు వస్తుంటాయి. అలాంటి చోటే వైద్యులు లేరు. ఉన్న వైద్యులు పంచనామా చేయడంతోపాటు ఎంబీబీఎస్ విద్యార్థులకు పాఠాలు కూడా చెప్పాల్సిన పరిస్థితి. ప్రైవేటులో అవకాశాలు లేకనే.. ప్రభుత్వాస్పత్రుల్లోనే శవపంచనామా చేయాల్సి ఉంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో అభ్యర్థులకు అవకాశాలు లేవు. దీంతో కొంతమంది అనాసక్తి చూపిస్తున్న మాట వాస్తవమే. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్యుల కొరత లేదు. త్వరలోనే పదోన్నతులు చేపడుతున్నాం. ఆ తర్వాత ఫోరెన్సిక్లో ఎండీ చేసిన వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకుంటాం. – డా.కె.బాబ్జీ, వైద్యవిద్యా సంచాలకులు (అకడెమిక్) -
డెడ్బాడీ తరలింపు ఇక ఈజీ
డెడ్బాడీ తరలింపు ఇక ఈజీ అందుబాటులోకి ‘ఫోరెన్సిక్ కార్ప్స్క్యారియర్’ ఎలాంటి ఇబ్బందులు లేని పోస్టుమార్టం పరీక్షల కోసం దేశంలో తొలిసారిగా నగర కమిషనరేట్లో ఏర్పాటు ప్రారంభించిన సీపీ మహేందర్రెడ్డి హిమాయత్నగర్: హత్య, ఆత్మహత్య, అనుమానాస్పద మృతి, రోడ్డు ప్రమాదం... ఈ తరహా ఉదంతాలు జరిగినప్పుడు, గుర్తు తెలియని మృతదేహాలు లభించినప్పుడు డెడ్బాడీలను పోస్టుమార్టం పరీక్షలకు తరలించడానికి పోలీసులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వీటిని తీసుకెళ్లేందుకు అంబులెన్స్లు సుముఖంగా లేకపోవడమే ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికి పరిష్కారంగా నగర పోలీసు విభాగం ‘ఫోరెన్సిక్ కార్ప్స్ క్యారియర్’ పేరుతో రూపొందించిన వాహనాన్ని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్రెడ్డి సోమవారం ప్రారంభించారు. దేశంలో మరే ఇతర కమిషనరేట్లోనూ ఇప్పటి వరకు ఈ తరహా వెహికిల్స్ అందుబాటులో లేవు. ప్రాథమికంగా ఓ వాహనం ఏర్పాటు నగర కమిషనరేట్ పరిధిలో మృతదేహాల తరలింపు కోసం సిద్ధం చేసిన ఒక ‘ఫోరెన్సిక్ కార్ప్స్ క్యారియర్’ను సోమవారం ట్రాఫిక్ కమిషనరేట్ వద్ద అదనపు సీపీలు జితేంద్ర (ట్రాఫిక్), స్వాతిలక్రా (నేరాలు), వీవీ శ్రీనివాసరావు (శాంతిభద్రతలు), మురళీకృష్ణ (పరిపాలన)లతో కలిసి నగర కమిషనర్ మహేందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్వాల్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మృతదేహాల తరలింపు కోసం ఎస్హెచ్ఓలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఈ వాహనం అందుబాటులోకి రావడంతో ఆ సమస్య తీరిందన్నారు. ఈ వాహనం 24 గంటలూ అందుబాటులో ఉంటుందని, డిమాండ్ను బట్టి వాహనాల సంఖ్యను పెంచుతామన్నారు. ఈ వెహికల్లో డ్రైవర్తో పాటు శవాన్ని తరలించేందుకు ఇద్దరు సిబ్బంది ఉంటారన్నారు. కదిలించిన అనేక ఘటనలు... చట్ట ప్రకారం మెడికో లీగల్ కేసులతో పాటు ఎఫ్ఐఆర్ నమోదైన మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించడం తప్పనిసరి. అలా చేయకుంటే అనేక చట్ట పరమైన ఇబ్బందులు రావడంతో పాటు కేసుల దర్యాప్తు సైతం సరైన దిశలో సాగదు. వీటన్నింటికీ మించి మృతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ తదితరాలు క్లైమ్ చేసుకోవాలంటే ఎఫ్ఐఆర్తో పాటు పోస్టుమార్టం పరీక్ష నివేదిక తప్పనిసరి. ఇలాంటి మృతదేహాలను పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రులకు తరలించడానికి పోలీసులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మరోపక్క గత కొన్ని రోజులుగా మృతదేహాలను మృతుల కుటుంబ సభ్యులు మోసుకెళ్లడం వంటివి మీడియాలో రావడం నగర పోలీసు విభాగాన్ని కదిలించాయి. -
‘ఎఫ్సీసీ’..దేశంలోనే మొట్టమొదటి వాహనం
ఏదైనా ప్రమాద సంఘటన జరిగినప్పుడు స్పాట్లోనే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేలా సౌకర్యాలతో ఉన్న వాహనం హైదరాబాద్ పోలీసులకు అందుబాటులోకి రానుంది. ఈ వాహనాన్ని సోమవారం సాయంత్రం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రారంభించనున్నారు. ‘ఫోరెన్సిక్ కార్ప్స్ క్యారియర్’గా పిలిచి ఈ వాహనంలో స్ట్రెచర్స్, మృతదేహాన్ని కప్పి ఉంచే నల్లటి కవర్లు,వైద్యులు వాడే గ్లవ్స్ వంటివిఅందుబాటులో ఉంటాయి. దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణ పోలీసు శాఖకు ఈ సౌకర్యం సమకూరిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
ఫోరెన్సిక్ ల్యాబ్కు నయీమ్ ఆయుధాలు
-
ఫోరెన్సిక్ ల్యాబ్కు నయీమ్ ఆయుధాలు
షాద్నగర్: గ్యాంగ్స్టర్ నయీమ్ ఉపయోగించిన ఆయుధాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపినట్లు మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ సీఐ రామకృష్ణ తెలిపారు. నయీమ్ ఎన్కౌంటర్ తరువాత అతను ఉపయోగించిన ఆయుధాలు ఏకే 47, మూడు రివాల్వర్లు, ఇతర మందుగుండు సామగ్రిని అదేరోజు పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఏకే 47, 3 రివాల్వర్లను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినట్లు తెలి సింది. శనివారం షాద్నగర్ మెజిస్ట్రేట్ సీఎచ్ఎన్ మూర్తి సమక్షంలో ఆయుధాల ను సీజ్ చేసి ల్యాబ్కు పంపించారు. సంఘటన స్థలంలో లభించిన బుల్లెట్లు, మందుగుండు సామగ్రిని కూడా తీసుకెళ్లారు. -
మెడకు చుట్టుకుంటుందా?
-
మెడకు చుట్టుకుంటుందా?
హైదరాబాద్: అంతా సజావుగా సర్దుకుపోయిందనుకుంటున్న ఓటుకు నోట్ల కేసు మరోసారి తెరమీదకు రావడంతో తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. కేసును పునర్విచారణ చేయాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖంగుతిన్నారు. వెంటనే సన్నిహిత అధికారులను పిలిచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సన్నిహిత న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. అంతా అయిపోయిందనుకున్న సమయంలో కోర్టు నుంచి ఇలాంటి ఆదేశాలు వెలువడటం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని తెలిసింది. చివరకు ఈ కేసు మెడకు చుట్టుకుంటుందా అన్న భయం కూడా ఉందని ఆ పార్టీ నేతల్లో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓటుకు నోట్ల కేసులో ఏసీబీ చార్జిషీటు దాఖలు చేసిన నేపథ్యంలో ఇక ఎలాంటి సమస్యలు రావని భావిస్తున్న తరుణంలో కోర్టు కేసును పునర్విచారణకు ఆదేశించడం చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టింది. నిజానికి ఓటుకు నోట్లు కేసులో మొదట్లో విచారణ చురుకుగా సాగినప్పటికీ ఆ తర్వాత కాలంలో వేగం బాగా తగ్గింది. దానికి తోడు ఈ కేసులో చంద్రబాబు ముద్దాయిగా తేల్చడానికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక చాలా కాలం బయటకు రాలేదు. ఫోరెన్సిక్ నివేదిక పేరుతో ఇంతవరకు ఈ కేసులో చంద్రబాబు నాయుడిని అధికారులు ప్రశ్నించలేకపోయారు. అయితే ఫోరెన్సిక్ నివేదిక కోర్టు ముందుంచిన తర్వాత కూడా కేసులో ఎలాంటి ముందడుగు పడలేదు. దానిపై అప్పట్లోనే రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఫోరెన్సిక్ నివేదికపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడం, కోర్టు ఆయన వాదనతో ఏకీభవించి కేసు పునర్విచారణకు ఆదేశించడంతో చంద్రబాబు వర్గీయుల్లో గుబులు మొదలైంది. అందులోనూ ఫోరెన్సిక్ నివేదికను పరిగణలోకి తీసుకుని విచారణ జరగాలని కోర్టు కోరడం చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం మింగుడు పడటం లేదని తెలిసింది. ఈ విషయంలో తదుపరి చర్యలు ఏం తీసుకోవాలన్న దానిపై ఆయన న్యాయకోవిదులతో సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. ఏసీబీ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తే చంద్రబాబు విచారణకు సిద్ధపడటం లేదని తెలిసిపోతుంది. అలాగని పై కోర్టులను ఆశ్రయించని పక్షంలో కేసు మెడకు చుట్టుకునే ఆస్కారం ఉంది... ఏ కోణంలో చూసినా చంద్రబాబుకు ఇబ్బందికరమైన పరిస్థితే తలెత్తిందని సీనియర్ టీడీపీ నేత ఒకరు చెప్పారు. ఓటుకు కోట్ల కేసులో తనకేమాత్రం సంబంధం లేదని, ఈ కేసులో తాను దోషి కాదని చంద్రబాబు నిజాయితీగా నిరూపించుకోవలసిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. కోర్టు తీర్పు ప్రతి అందిన తర్వాత తదుపరి చర్యలపై నిర్ణయం ఉంటుందని ముఖ్యమంత్రి సన్నిహిత అధికారి ఒకరు చెప్పారు. -
ప్రతి జిల్లాలోనూ ఫొరెన్సిక్ ల్యాబ్లు
ఇక నుంచి బెంగళూరులోనే డీఎన్ఏ పరీక్షలు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ బెంగళూరు: రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఫొరెన్సిక్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి డాక్టర్ జి.పరమేశ్వర్ వెల్లడించారు. సోమవారమిక్కడి మడివాళలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలి కాలంలో నేరాల సంఖ్య పెరుగుతోందని, ఈ నేపథ్యంలో నేరస్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా చేసేందుకు సాక్ష్యాల అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఫొరెన్సిక్ ల్యాబ్లు ఇచ్చే నివేదికలు ఎంతైనా ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ ఫోరెన్సిక్ ల్యాబ్ ఏర్పాటుకు నిర్ణయించినట్లు చెప్పారు. ఇక డీఎన్ఏ పరీక్షల కోసం గతంలో హైదరాబాద్ లేదంటే ఢిల్లీకి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని అయితే ఇక నుంచి బెంగళూరులోనే డీఎన్ఏ పరీక్షలను నిర్వహించే విధంగా ఫొరెన్సిక్ ల్యాబ్ను ఉన్నతీకరిస్తున్నట్లు మంత్రి పరమేశ్వర్ వెల్లడించారు. ప్రస్తుతం ఫొరెన్సిక్ ల్యాబ్లో 186 మంది నిపుణులు విధులు నిర్వర్తిస్తున్నారని, ఈ సంఖ్యను 286కు పెంచనున్నట్లు తెలిపారు. ఇదే సందర్భంలో మైసూరు జిల్లా కలెక్టర్ శిఖా పై బెదిరింపులకు పాల్పడ్డ కేసుపై మంత్రి పరమేశ్వర్ స్పందిస్తూ....‘టైస్టులనే పట్టుకునే మా పోలీసులకు మరిగౌడను పట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదు, ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మంజునాథ్ను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడైన మరిగౌడ పరారీలో ఉన్నాడన్నారు. త్వరలోనే అతన్ని కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారు’ అని పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో డీజీపీ ఓం ప్రకాష్, రాష్ట్ర హోం శాఖ ప్రధాన సలహాదారు కెంపయ్య తదితరులు పాల్గొన్నారు. -
భార్యే సూత్రధారి!
* ప్రియుడితో కలిసి భర్త దారుణహత్య * పైగా కనిపించడం లేదని ప్రచారం * మూడేళ్లకు వీడిన హత్యకేసు మిస్టరీ! కొందుర్గు: అదృశ్యమైన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మూడేళ్ల తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్యే ప్రియుడితో కలిసి అతడిని హతమార్చిందని తేలింది. పోలీసులు మంగళవారం నిం దితులను అరెస్ట్చేశారు. వివరాలను షాద్నగర్ రూరల్ సీఐ మధుసూదన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు విలేకరులకు వెల్లడించారు. మండలంలోని ఇంద్రానగర్కు చెందిన జా కారం నర్సింహులు(42), తూంపల్లికి చెం దిన వెంకటయ్య దూరపు బంధువులు. ఎని మిదేళ్లక్రితం నుంచి వీరు ఇద్దరు కలిసి తూంపల్లి శివారులోని గుట్టల్లో రాయికొట్టి జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో నర్సింహులు భార్య యాదమ్మ అక్కడికి టిఫి న్ తీసుకెళ్లేది. ఈ క్రమంలో ఆమెకు వెంకటయ్యతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారితీసింది.ఈ విషయం ఆమె భర్త నర్సింహులుకు తెలి సింది. దీంతో ఎలాగైనా అతడిని అడ్డుతొలగించుకోవాలని యాదమ్మ, వెంకట య్య ఓ పథకం రచించారు. ఆ ప్రకారమే 2013 సెప్టెంబర్లో పీర్లపండగకు 3రోజుల ముందు హత్యచేయాలని భావించారు. గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి.. తూంపల్లి శివారులో గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి, వాటిని తవ్వుకొద్దామని నచ్చచెప్పి ఆ రోజు రాత్రి అక్కడికి నర్సింహులును తీసుకెళ్లారు. అందరూ కలిసి గొయ్యి తవ్వి.. అందులోకి అతని దించారు. మట్టి తీస్తుండగా అంతకుముందే తెచ్చి సిద్ధంగా ఉంచిన పెద్ద పెద్ద బండరాళ్లను నర్సింహులుపై వేసి హత్యచేశారు. ప్రాణం పోయిందని తెలుసుకుని అదే గొయ్యిలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. నాటినుంచి నర్సింహులు కనిపించడం లేదని భార్య యాదమ్మ బంధువులతో పాటు పరిసర గ్రామాల్లో నమ్మించింది. కాగా,వెంకటయ్య, యాద మ్మ మరింత చనువయ్యారు. యాదమ్మ అవసరాలకు అప్పుడప్పుడు డబ్బు కూడా ఇచ్చేవాడు. ఇలా వెలుగులోకి.. కొంతకాలం తరువాత యాదమ్మ, వెంకటయ్య ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. నర్సింహులును హత్యచేసిన విషయం అతడి తమ్ముడు చంద్రయ్య కు తెలిసింది. దీంతో ఈనెల 25న యా దమ్మతో పాటు ఆమె ప్రియుడు తూం పల్లికి చెందిన వెంకటయ్య కలిసి వీఆర్ ఓ గోపాలకృష్ణ వద్దకు వెళ్లి నిజాన్ని బయటపెట్టారు. నర్సింహులును తామే హత్యచేశామని నేరం అంగీకరించా రు. వీఆర్ఓ పోలీసులకు ఫోన్ద్వారా సమాచారం ఇచ్చే సమయంలో పరారయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీ సులు మంగళవారం యాదమ్మ, వెంకటయ్య ను అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. నర్సింహులు అస్థికలను బయటికి తీసి, ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. -
పరమాన్నం తినిపించి పంగనామం!
ప్రసాదం తిన్నాక ధ్యానంలోకి వెళ్తారన్న దొంగ బాబా ప్పృహ కోల్పోయిన తర్వాత చేతికి పని హైదరాబాద్: దొంగ బాబా శివస్వామి(33)తో హైదరాబాద్లోని రియల్ ఎస్టేట్ వ్యాపారి, లైఫ్స్టైల్ మధుసూదన్రెడ్డికి గత నవంబర్ లో పరిచయం ఏర్పడింది. రెండు, మూడుసార్లు బెంగళూరులో అతడిని కలిశాడు. ఆ సందర్భంగా కొంతకాలంగా సమస్యలు ఎదురవుతున్నాయని, ఆరోగ్యం దెబ్బతింటోందని, వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయంటూ మధుసూదన్రెడ్డి గోడు వెల్లబోసుకున్నాడు. వీటన్నింటికి పూజలు ఒక్కటే మార్గం అంటూ శివ నమ్మించాడు. ఇందులో భాగంగానే బెంగళూరు నుంచి మంగళవారం హైదరాబాద్ చేరుకొని ఓ హోటల్లో బస చేశాడు. బుధవారం ఉదయం మధుసూదన్రెడ్డి తన స్కోడా కారులో శివను తీసుకొని పూజకు కావాల్సిన సామగ్రి కోసం మొజంజాహి మార్కెట్కు తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గులు వేసి నిమ్మకాయలు, తమలపాకులు అమర్చి దేవుడి పటం ముందు డబ్బు పెడితే రెండింతలు అవుతుందని చెప్పాడు. దీంతో మధుసూదన్రెడ్డి రూ.1.33 కోట్ల నగదును బ్యాగులో ఉంచి ముగ్గులో ఉంచారు. ఈ సమయంలో డ్రైవర్లు, పని మనుషులెవరూ ఉండవద్దంటూ అందరినీ బయటకు పంపించేశాడు. డ్రైవర్కు ఒక టార్చిలైట్ ఇచ్చి ఇలాంటిదే మరో టార్చ్లైట్, అందులో బ్యాటరీ కొనుక్కొని రావాలని పంపాడు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మధుసూదన్రెడ్డి, విద్యావ తి దంపతులకు పూజ అయిపోయిందంటూ పరమాన్నం తినిపించాడు. ఇది తిన్న తర్వాత ధ్యానంలోకి వెళ్లిపోతారంటూ చెప్పాడు. కానీ కాసేపటికే వారిద్దరూ సృ్పహ కోల్పోయారు. అదే సమయంలో మధుసూదన్రె డ్డి కొడుకు సందేశ్ ఇంటికి రాగా ఆయనకు కూడా ప్రసాదం ఇచ్చాడు. మైకం కమ్ముతున్న సమయంలో సందేశ్రెడ్డిని డబ్బులున్న బ్యాగును తీసుకొని రావాలని చెప్పడంతో అతడు బ్యాగును తెచ్చి కారు డిక్కీలో ఉంచాడు. మూడు ఆలయాల్లో పూజలు చేసుకొని వస్తే రెండింతలవుతుందన్నాడు. కారులోంచి డబ్బు ఏ‘మార్చాడిలా..’ మొదట జగన్నాథ టెంపుల్, తర్వాత కనకదుర్గ దేవాలయం, ఆ తర్వాత కమాన్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి కొద్దిసేపు ధ్యానం చేయాలంటూ ఓహిరీస్ హోటల్కు తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లాక ధ్యానంలోకి వెళ్లి ఇష్టదైవాన్ని స్మరించుకోవాలంటూ సందేశ్కు సూచించాడు. అప్పటికే మత్తులోకి వెళ్లిన సందేశ్ జేబులోంచి కారు తాళం చెవులు తీసుకున్న దొంగ బాబా కిందకు వచ్చి స్కోడాలో నుంచి నగదు ఉన్న బ్యాగును తీసి తన కారులో వేసుకున్నాడు. ఆ వెంటనే పైకి వచ్చి ధ్యానం నుంచి బయటకు రావాల్సిందిగా సందేశ్కు సూచించి కిందికి తెచ్చాడు. ‘నేను ట్యాక్సీలో వస్తా.. నువ్వు నీ కారులో ముందు వెళ్లు..’ అని చెప్పాడు. సందేశ్ అలాగే తన కారులో ముందు వెళ్తుండగా శివ కొద్ది దూరం వరకు అనుసరించి మినిస్టర్ క్వార్టర్స్ యూటర్న్ వద్ద మెహిదీపట్నం వైపు వెళ్లిపోయాడు. మెహిదీపట్నం బ్రిడ్జి కింద కారు ఆపి రాత్రి 8 గంటలకు తాను వస్తానని అప్పటి వరకు ఇక్కడే ఉండాలని తన కారు డ్రైవర్కు చెప్పి బ్యాగుతో ఉడాయించాడు. ఇంటికి వచ్చిన సందేశ్కు... తన తల్లిని డ్రైవర్ ఎత్తుకొస్తుండటం కనిపించింది. ఏమైందని ప్రశ్నించగా.. తల్లిదండ్రులిద్దరూ అపస్మారక స్థితికిలోకి వెళ్లారని డ్రైవర్ చెప్పాడు. బాబా కారు ఎంతకీ రాకపోవడం, డిక్కీలో నగదు బ్యాగులేకపోవడంతో మోసపోయామని సందేశ్ తెలుసుకున్నాడు. తల్లిదండ్రులను వెంటనే అపోలో ఆస్పత్రిలో చేర్చి, పోలీసులకు సమాచారం అందించారు. కాగా, అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మధుసూదన్రెడ్డి కోలుకున్నారు. ఫోరెన్సిక్ ల్యాబ్కు పరమాన్నం మధుసూదన్ ఇంటి నుంచి పోలీసులు పరమాన్నంతోపాటు బూంది లడ్డు, విభూది, తీర్థం, తదితర సామాగ్రిని సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పూజా సామగ్రిని కూడా భద్రపరిచారు. ఘటనా స్థలంలో ఓ విషం బాటిల్ కూడా దొరికినందున అన్నంలో అది కలిపాడా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. -
గోమాంసం అయితే ఏంటీ?
లక్నో: ఉత్తరప్రదేశ్లోని దాద్రిలో గోమాంసం తిన్నారనే అనుమానంతో యాభై ఏళ్ల మొహమ్మద్ అఖ్లాక్ను గతేడాది సెప్టెంబర్ నెలలో ఓ హిందూ అల్లరి మూక నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపింది. ఆయన 22 ఏళ్ల కుమారుడిని తీవ్రంగా గాయపరిచింది. వారి ఇంటి ముందు చెత్త కుప్పలో దొరికిన మాంసం మటన్ కాదని, ఆవు లేదా లేగ దూడ మాంసమని ఎనిమిది నెలల తర్వాత ఫోరెన్సిక్ పరీక్ష తేల్చింది. ఈ విషయాన్ని ఈ రోజు అన్ని వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. అది నిజంగా మటన్ కాకపోవచ్చు, ఆవు మాంసమే కావచ్చు. అయినంత మాత్రాన కేసులో ఏం తేడా వస్తుంది? మాంసం ఏదైనా హత్య హత్యేకదా? దాన్ని ఎవరైనా ఎలా సమర్థించుకుంటారు? ఉత్తరప్రదేశ్లో అమల్లో ఉన్న గోరక్షణ చట్టం ప్రకారం గోవులను చంపడం మాత్రమే నేరం. దాని మాంసం కలిగి ఉండడం లేదా తినడం ఎలాంటి నేరం కాదు. అఖ్లాక్ తన ఇంట్లో టన్నుల కొద్ది గోమాంసాన్ని దాచుకున్నా, అది ఎంత మాత్రం నేరం కాదు. అది మటన్ కాదని, గో మాంసమేనని ఫోరెన్సిక్ పరీక్షలో తేలడం హంతకులపై తాము దాఖలు చేసిన కేసుపై ఎలాంటి ప్రభావం చూపదని రాష్ట్ర పోలీసులు మంగళవారం తెలిపారు. అఖ్లాక్ ఇంటి ముందు చెత్త కుప్పలో దొరికిన మాంసాన్ని అసలు ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించాల్సిన అవసరమే చట్ట ప్రకారం లేదు. స్థానిక బీజేపీ నాయకుల ఒత్తిడికి లొంగి దాన్ని పరీక్షలకు పంపించారు. ఇదే విషయమై స్థానిక పోలీసులను ప్రశ్నించగా గోమాంసం కలిగివున్న ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి మాత్రమే తాము పరీక్షలకు పంపించాల్సి వచ్చిందని వారు చెప్పారు. అఖ్లాక్ కుటుంబ సభ్యులే గోమాంసాన్ని ఇంటి ముందున్న చెత్త కుప్పలో పడేసి ఉంటారా? అని ప్రశ్నించగా చెప్పలేమని, ఎవరైనా పడేసే అవకాశం లేకపోలేదని పోలీసులు చెప్పారు. తరచు మత కలహాలు చోటుచేసుకునే దాద్రిలో మసీదుల ముందు చంపిన పందులను, ఆలయాల ముందు గోమాంసాన్ని పడేయడం సాధారణమే. అలాంటి పరిస్థితుల్లో అల్లరి మూకలు ఉద్దేశపూర్వకంగానే గోమాంసాన్ని తీసుకొచ్చి అఖ్లాక్ ఇంటి ముందు చెత్త కుప్పలో వేసే అవకాశం లేకపోలేదు. ఏదేమైనా మాంసం ఏదన్నది కాదు ప్రశ్న. ఏది నేరమన్నదే ప్రశ్న. -
కళాభవన్ మణి మృతి కేసులో ట్విస్ట్
కొచ్చి: విలక్షణ నటుడు కళాభవన్ మణి మృతిపై మిస్టరీ కొనసాగుతోంది. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించిన అంశాలతో ఆయన మృతిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఆయన దేహంలో అత్యంత విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్(మిథనాల్) అవశేషాలు కనుగొన్నట్టు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్ కు చెందిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(సీఎఫ్ఎస్ఎల్) నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం వెలుగు చూసింది. అయితే కళాభవన్ మణి శరీరంలో ఎంత శాతం మిథనాల్ ఉంది, అది ఎంతవరకు ఆయన మరణానికి కారణం అయిందనేది వెల్లడి కాలేదు. పురుగు మందుల అవశేషాలు లేవని తేల్చింది. ఫోరెన్సిక్ నివేదికపై స్పష్టత కోసం సీఎఫ్ఎస్ఎల్ ను కేరళ పోలీసులు సంప్రదించనున్నారు. మణి శరీరంలో ప్రమాదకరమైన క్రిమిసంహారిణి 'క్లోర్ పిరిఫొస్' అవశేషాలు ఉన్నట్టు కొచ్చిలోని కక్కనాడ్ ప్రాంతీయ రసాయన పరీక్షా కేంద్రం అంతకుముందు వెల్లడించింది. మలయాళంతో పాటు ఇతర భాషాల్లో 200 సినిమాల్లో నటించిన కళాభవన్ మణి ఈ ఏడాది మార్చి 6న అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. ఆయన మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పెళ్లంటేనే పెద్ద మిస్టరీ...
హాలీవుడ్ సినిమా / గాన్ గర్ల్ ఆ రోజు వాళ్ల పెళ్లిరోజు. పెళ్లయి అయిదేళ్లయింది. సెలబ్రేట్ చేసుకోవలసిన తరుణంలో భార్య హఠాత్తుగా మాయమైంది. ఫోరెన్సిక్ నిపుణులకి భార్య అమీ రక్తపు మరకలు దొరికాయి. భర్త నిక్, ఆమెని చంపేసి మాయమైనట్లు ఆధారాలు సృష్టించాడని పోలీసులు భావించారు. నిక్ తనకేమీ తెలియదంటాడు. ఇంతకీ ఏం జరిగింది? ఏమై ఉంటుందో ఈ కథని రాసిన గిలియన్ ఫ్లిన్కి తెలుసు. ఫ్లిన్ వృత్తి రీత్యా జర్నలిస్ట్. మనిషి మనసుని మించిన థ్రిల్లర్ మరొకటి ఉండదని ఫ్లిన్ ప్రగాఢ నమ్మకం. క్రూరమైన స్త్రీ పాత్రలు సృష్టించడంలో ఆమె స్పెషలిస్ట్. ఆమె రాసిన ఫస్ట్ డ్రాఫ్ట్ తర్వాత దర్శకుడు డేవిడ్ ఫించర్కి మరో రచయిత అవసరం లేదన్పించింది. బెన్ ఎఫ్లెక్, రోజ్మండ్ పైక్ హీరో హీరోయిన్లుగా షూటింగ్ ప్రారంభించాడు. సరిగ్గా ఏడాది తర్వాత 2014 సెప్టెంబర్లో విడుదలయింది. విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా 61 మిలియన్ల డాలర్ల బడ్జెట్తో రూపొందిన ఈ సినిమా 370 మిలియన్ల డాలర్లు వసూలు చేసింది! ఇంతకీ మాయమైంది కేవలం ఓ స్త్రీ కాదు. మానవ సంబంధాలు. వెదుకులాట జరగాల్సింది - ప్రేమానురాగాల కోసం. అందుకే ‘గాన్ గర్ల్’ ఓ మంచి సైకలాజికల్ థ్రిల్లర్గా నిలిచిపోయింది. కథేమిటంటే... నిక్, అమీ భార్యాభర్తలు. వాళ్ల వివాహ వార్షికోత్సవం రోజున అమీ కనబడకుండా పోయింది. ఓ కామిక్ క్యారెక్టర్ అమీని దృష్టిలో ఉంచుకుని, ఆమె తల్లిదండ్రులు సృష్టించి ఉంటారు. ఆ పాత్ర జనంలో బాగా పాపులర్. అందుకే అమీ అదృశ్యం మీడియాకి హాట్ న్యూస్ అయింది. పోలీస్ డిటెక్టివ్లు, ఫోరెన్సిక్ నిపుణులు రంగప్రవేశం చేశారు. ఆ ఇంట్లో అమీ రక్తపు మరకలని కడిగి, శుభ్రం చేసినట్లుగా ఫోరెన్సిక్ వాళ్లకి ఆధారాలు దొరికాయి. నిక్ తన భార్య అమీని హత్య చేశాడనే అనుమానం పోలీసులతో పాటు, ప్రజల్లో కూడా పెరిగింది. ఈ కేసు పరిశోధనలో భాగంగా- నిక్, అమీల గతాన్ని తవ్వి చూస్తే, వారిద్దరూ పేరుకి భార్యాభర్తలయినా - అనుబంధం అంతంత మాత్రమే. రిసెషన్లో ఉద్యోగాలు పోగొట్టుకుని, న్యూయార్క్ నుంచి నిక్ స్వగ్రామం మిస్సోరికి చేరుకున్నారు. రకరకాల ఆర్థిక ఇబ్బందులు. భార్యాభర్తల మధ్య గొడవలు. నిక్ చిరాగ్గా, నిరాశా నిస్పృహలతో కాలం గడుపుతుండేవాడు. మాయం కావడానికి ముందు అమీ గర్భవతి అని ఓ మెడికల్ రిపోర్ట్ దొరికింది. ఆ విషయం తనకి తెలియదంటాడు నిక్. అమీ ఓ గన్ కొనే ప్రయత్నం చేసింది. ఆమె రాసుకున్న డైరీలో తన భర్త తనని చంపుతాడనే భయం వ్యక్తం చేసింది. ఈ ఆధారాలతో నిక్ ఆమెని చంపేశాడనే అభియోగం బలపడసాగింది. నిజానికి అమీ బతికే ఉంది. భర్త తనని నిర్లక్ష్యం చేయడం, తన డబ్బుతో వ్యాపారం చేయాలనుకోవడం, మరో స్త్రీతో అక్రమ సంబంధం... ఇలాంటివి అమీని బాధపెట్టాయి. భర్తమీద ఒక రకమైన కసి, కోపం ఏర్పడ్డాయి. గర్భవతి అయిన పక్కింటావిడ యూరిన్ సేకరించి, అది తన శాంపిల్గా క్రియేట్ చేసింది. తనని తాను గాయపర్చుకుని ఇల్లంతా రక్తపు మరకలు పడేలా చేసింది. డైరీలో కావాలనే నిక్ మీద అనుమానం వచ్చేట్లు రాసింది. పోలీసులు కచ్చితంగా నిక్ని అరెస్ట్ చేసి, ఉరిశిక్ష వేస్తారని, ఆ తర్వాత తను ఆత్మహత్య చేసుకోవాలని అమీ ప్లాన్. ఈ కేసు నుంచి బయటపడటానికి నిక్ టానర్ బోల్ట్ అనే లాయర్ని ఆశ్రయించాడు. భార్యలని చంపిన భర్తల తరఫున కేసులు వాదించడంలో ఆ లాయర్ దిట్ట. అమీ తన మాజీ బాయ్ఫ్రెండ్ దేశీ కోలింగ్స్ లేక్హౌస్లో రహస్యంగా తలదాచుకుంది. ఓ టీవీ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో నిక్ తన తప్పులని ఒప్పుకుంటూ, తనో మంచి భర్త కానని, అమీ తిరిగి తనకి లభిస్తుందనే ఆశని వ్యక్తం చేస్తాడు. నిక్ మాటలు అమీని కదిలించాయి. కాని మాయమైన తను తిరిగి ఎలా బయటి ప్రపంచంలోకి రావాలి? మళ్లీ మాస్టర్ ప్లాన్ చేసింది అమీ. తనని తాను గాయపర్చుకుంది. దేశిని రెచ్చగొట్టి, సెక్స్లో పాల్గొంది. ఆ సమయంలో దేశి గొంతు కోసి, చంపేసింది. ఆ గాయాలతో, రక్తపు మరకలతో ఇంటికి తిరిగొచ్చి దేశీ కోలింగ్స్ తనని కిడ్నాప్ చేశాడని, రేప్ చేశాడని పోలీసుల ముందు చెప్పింది. నిక్ నిర్దోషిగా విడుదలయ్యాడు. జరిగిన వాస్తవాలను భర్తతో చెప్పింది అమీ. ఇదే విషయాన్ని నిక్ పోలీస్ డిటెక్టివ్ బోనీ, లాయర్ బోల్ట్, తన సోదరి మార్గరెట్కి చెబుతాడు. కాని సాక్ష్యాధారాలు లేకపోవడంతో అమీని నేరస్తురాలిగా నిరూపించలేకపోతారు. టీవీ ఇంటర్వ్యూలో నిక్ వ్యక్తం చేసిన ప్రేమకి తను చలించిపోయానని, నిక్ లేకుండా బతకలేనని అమీ చెబుతుంది. ఓ ఫెర్టిలిటీ క్లినిక్లో స్టోర్ చేసిన నిక్ వీర్యం ద్వారా తను కృత్రిమ గర్భధారణ చేశానని, నిక్ బిడ్డ తన కడుపులో పెరుగుతుందని అమీ చెబుతుంది. భార్యని వదల్లేని పరిస్థితుల్లో ఆమెతో కలిసి కాపురం చేస్తుంటాడునిక్. హ్యాపీ కపుల్గా జనం దృష్టిలో పేరు తెచ్చుకుంటారు. - తోట ప్రసాద్ సున్నిత మనస్కురాలైన స్త్రీ దుర్మార్గంగా మారే పరిస్థితులు ఎందుకొస్తాయి అనేది ఫ్లిన్ రచనల సెల్లింగ్ పాయింట్. 2012లో తను రాసిన పాపులర్ నవలే ‘గాన్ గర్ల్’. రెండు మిలియన్ల కాపీలు అమ్ముడయింది. థ్రిల్లర్ నవలల్లో నెంబర్వన్గా నిలిచింది. అయితే నవలగా మార్కెట్లోకి రావడానికి ముందే 2011లో ఈ సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత వెస్లీ డిక్సన్ - ఆ నవల రాతప్రతిని చదివింది. విశేషంగా నచ్చేసింది. వెంటనే సినిమా తీద్దామని రచయిత్రి ఫ్లిన్తో సంప్రదింపులు ప్రారంభించింది. నవల విడుదల అయిన తర్వాత ‘ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్’ నవల హక్కులు కొనుగోలు చేసింది. అయితే రచయిత్రి ఫ్లిన్ స్క్రీన్ప్లే కూడా తనే రాయాలని కండిషన్ పెట్టింది. -
పేలుడు వల్లే ఈజిప్ట్ విమానం కూలిందా?
కైరో: మధ్యధరా సముద్రంలో కుప్పకూలిన ఈజిప్టుఎయిర్ విమానం పేలుడు వల్లే కూలిందా..? దీనికి అవుననే అంటున్నారు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాల ఆనవాళ్లను పరీక్షించిన ఫోరెన్సిక్ నిఫుణులు. సముంద్రం నుంచి స్వాధీనం చేసుకున్న మృతదేహాల ఆనవాళ్లను పరీక్షిస్తే ప్రమాదానికి పేలుడే కారణమని తెలుస్తోందని ఈజిప్టు ఫోరెన్సిక్ అధికారి ఒకరు పేర్కొన్నారు. గత వారం ఈజిప్టు ఎయిర్కు చెందిన విమానం పారిస్ నుంచి కైరోకు వస్తుండగా సముద్రంలో కుప్పకూలడంతో 66 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈజిప్టు దర్యాప్తు బృందంలో సభ్యుడైన ఫోరెన్సిక్ నిఫుణుడు మృతదేహాల ఆనవాళ్లను పరీక్షించారు. ఘటనా స్థలం నుంచి 80 శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారని, ఇవన్నీ చాలా చిన్నచిన్నగా ఉన్నాయని, పెద్ద భాగం ఒక్కటి కూడా లేదని, దీని వల్లే విమానంలో పేలుడు సంభవించినట్టుగా భావిస్తున్నామని చెప్పారు. అయితే పేలుడుకు కారణం ఏమిటనే దాని గురించి ఇప్పుడు చెప్పలేనన్నారు. మరోవైపు ఈజిప్టు అధికారులు దీనిపై స్పందిస్తూ.. పేలుడుకు ఉగ్రవాద చర్య కారణం కావచ్చని, సాంకేతిక సమస్య కారణం కాకపోవచ్చని పేర్కొన్నారు. అయితే కొందరు ఏవియేషన్ నిఫుణులు మాత్రం బాంబు పేలుడు లేదా కాక్పిట్లో ప్రమాదం పేలుడుకు కారణం కావచ్చిన విశ్లేషిస్తున్నారు. -
ప్రమాదమే దేవి ప్రాణాలు తీసింది!
► ఫోరెన్సిక్ విచారణలోనూ దొరకని హత్య ఆనవాళ్లు ► 1500 మంది టవర్ లోకేషన్స్ విశ్లేషించిన పోలీసులు ► ప్రమాద సమయంలో..వేర్వేరు ప్రాంతాల్లో ఆ నలుగురు సాక్షి,హైదరాబాద్: ఇంజినీరింగ్ విద్యార్థిని కట్కూరి దేవిరెడ్డి మరణం... ప్రమాదం వల్లే జరిగిందని మలి విచారణలోనూ తేలింది. దేవి మరణంపై మిస్టరీ నెలకొన్న నేపథ్యంలో ఆమెను హత్య చేశారంటూ తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో పోలీసులు ఫోరెన్సిక్, మోటారు వాహనాల నిపుణులతో కలిసి చేసిన రెండవ విచారణలోనూ దేవిది హత్య అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదని సమాచారం. దేవి ప్రయాణించిన కారు ధ్వంసమైన తీరు, కారు ఎయిర్ బెలూన్ తెరుచుకున్నాక కూడా తలకు బలమైన గాయాలు కావటం తదితర అంశాలపై వివిధ రంగాల నిపుణులతో విచారించారు. దేవి తల్లిదండ్రులు లేవనెత్తిన సందేహాలను ఓ ప్రశ్నావళి రూపంలో పోలీస్లు ఫోరెన్సిక్ బృందానికి అందజేయగా, వారు ప్రమా దం వల్లే అలాంటి గాయాలవుతాయని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వారందరి లొకేషన్స్ పరిశీలన: ఆరోపణలు ఎదుర్కొంటున్న భరత్సింహారెడ్డి ఫోన్ కాల్ డాటా ఆధారంగా ఆయనతో గతేడాది కాలంగా 1500 మంది వివిధ సందర్భాల్లో టచ్లో ఉన్నట్టు తెలిసింది. అయితే ప్రమాదానికి ముందు, తర్వాత ఆ 1500 మంది సెల్ఫోన్ టవర్ లొకేషన్స్ను పోలీస్లు పరిశీలించగా వారెవరూ ఆ పరిసర ప్రాంతాల్లో లేరు. దేవికి సంబంధించిన కాల్ డాటా, వాట్సాప్ ఫొటోలు, మెసేజ్లను సైతం పోలీస్లు మొత్తం విశ్లేషించారు. ఫేస్బుక్ ద్వారా ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయంతో గత ఎనిమిది నెలలుగా భరత్-దేవీలు టచ్లో ఉంటున్నట్లు గుర్తించారు. ఇక గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని పబ్ నుంచి తెల్లవారుజామున 3.33 గంటలకు బయలుదేరిన భరత్సింహారెడ్డి, దేవీల స్నేహితులు వెంకట్, పృధ్వీ, విశ్వనాథ్లతో పాటు సోనాలి అనే అమ్మాయి సెల్ఫోన్ టవర్ లోకేషన్స్ సైతం వేర్వేరు ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. 11 నిమిషాల్లో దూసుకొచ్చిన కారు: పబ్ నుంచి భరత్సింహారెడ్డి, దేవితో కలిసి కారులో గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బీపీఎం పబ్ నుంచి తెల్లవారుజామున 3.33 గంటలకు బయల్దేరినట్లు టవర్ సిగ్నల్ బహిర్గతం చేసింది. అక్కడి నుంచి కేవలం 11 నిమిషాల్లోనే భరత్ తన కారును దూసుకుపోనిచ్చి జర్నలిస్టు కాలనీకి చేరుకున్నారు. ఇక్కడ ఒక పత్రికా కార్యాలయం సీసీ ఫుటేజీలో వీరి కారు 3.44 గంటలకు దూసుకుపోతున్నట్టు కనిపించింది. తండ్రితో ఫోన్ మాట్లాడేందుకు కొద్దిదూరంలోనే ఐదు నిమిషాలపాటు కారు నిలిపి ఉన్నట్లు కూడా టవర్ సిగ్నల్ ద్వారా తేలింది. అప్పటికే ఇంటి నుంచి ఫోన్లు వస్తుండటంతో..భరత్ కారు వేగాన్ని మరింత పెంచే యత్నంలో కంట్రోల్ తప్పి చెట్టుకు ఢీకొట్టారన్న నిర్ధారణకు పోలీసులు వచ్చినట్లు సమాచారం . -
అంజయ్య మైనర్ కాదు.. మేజరే..!
* గ్యాంగ్రేప్ నిందితుడిపై ఫోరెన్సిక్ నివేదిక * జువైనల్ హోం నుంచి కోర్టుకు తరలించే అవకాశం..? * జాతీయ ఎస్సీ కమిషన్కు బాధితురాలు ఫిర్యాదు * వివరాలు తెలుసుకున్న కమిషన్ సభ్యురాలు కమలమ్మ సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / వీణవంక: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరుకు చెందిన దళిత యువతి గ్యాంగ్రేప్ ఘటనలో నిందితుడు ముద్దం అంజయ్య అలియాస్ అంజి మైనర్ కాదని తేలింది. అంజయ్య మేజర్ అని, ఆయన వయస్సు 19 నుంచి 21 సంవత్సరాలుగా నిర్ధారిస్తూ వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ విభాగం తేల్చింది. ఈ మేరకు నివేదికను జిల్లా పోలీసులకు అందజేసినట్లు తెలిసింది. ఈ కేసును నేరుగా విచారిస్తున్న ఎస్పీ జోయల్ డేవిస్ నిందితుడు అంజయ్య వయస్సు నిర్ధారణపై ప్రత్యేకంగా పోలీసులను పంపించి నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. అంజయ్య మైనర్ అంటూ జువైనల్ హోంకు పోలీసులు తరలించిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, దళిత సం ఘాలు, ప్రజాసంఘాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు వెల్లువెత్తాయి. పోలీసులు కేసును నీరుగార్చేందుకు నిందితులను మైనర్లుగా చిత్రీకరిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఈ నేపథ్యంలో నిందితుడి వయస్సు నిర్ధారించాలంటూ ఎస్పీ వైద్యశాఖకు లేఖ రాశారు. దీంతో వరంగల్లోని కాకతీయ మెడికల్ కళాశాల ఫోరెన్సిక్ ప్రొఫెసర్ కృపాల్సింగ్ నేతృత్వంలో నాలుగు రోజులుగా నిందితుడి వెంట్రుకలు, ఎముకలు, లింగనిర్ధారణ వంటి పరీక్షలు చేశారు. వీటి ఆధారంగా అంజ య్యకు 19 నుంచి 21 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుం దని నిర్ధారిస్తూ నివేదిక రూపొం దించారు. ఆ నివేదికను శుక్రవారం హుజూరాబాద్ డీఎస్పీ రవీందర్రెడ్డికి అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో గతవారం రోజులుగా నింది తుడి వయస్సుపై కొనసాగుతున్న సస్పెన్స్కు తెరపడింది. బాధితురాలికి న్యాయం అందేలా చూస్తాం: జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ హైదరాబాద్: కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చ ల్లూరు గ్రామంలో సామూహిక అత్యాచారానికి గురైన దళిత యువతికి పూర్తి న్యాయం అందేలా చూస్తామని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ అన్నారు. సామూహిక అత్యాచారం ఘటనను తీవ్రంగా పరిగణించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యురాలు కమలమ్మ శుక్రవారం బాధిత దళిత యువతి, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్కు పిలిపించుకున్నారు. బాధిత యువతి, కుటుంబ సభ్యులు, తెలంగాణ పీసీసీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్లు ఎర్రమంజిల్కాలనీ ఎమ్మెల్యే క్వార్టర్స్లోని కమలమ్మ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా సమాజంలో స్త్రీలకు రక్షణలేదని, ముఖ్యంగా నిమ్నజాతుల స్త్రీ పరిస్థితి మరీ దయనీయంగా ఉందని కమలమ్మ కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై తనకు పూర్తి నివేదిక అందలేదని, తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం నిందితు ల్లో ఒక్కర్ని మేజర్గా చూపించారని, మిగిలిన వారిని మైనర్లుగా చూపుతున్నారన్నారు. నేడు (శనివారం) ఉదయం 11:30 నిమిషాలకు కరీంనగర్ జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను అమీర్పేటలోని ఎస్సీ కమిషన్ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించినట్టు ఆమె చెప్పారు . బాధితురాలు మాట్లాడుతూ తనకు జరి గిన అన్యాయం మరెవరికీ జరగకుండా నిందితులకు కఠిన శిక్షవిధించాలని డిమాండ్ చేసింది. కమిషన్సభ్యురాలు కమలమ్మ తనకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పిందని తెలిపారు. -
ఆరు నెలల తర్వాత పోస్ట్మార్టం
కొండమోడు గ్రామానికి చెందిన కరీం మృతి పై అనుమానాలు భ ర్తను హత్య చేశారని భార్య పోలీసులకు ఫిర్యాదు మృతదేహం వెలికితీత పిడుగురాళ్ళ రూరల్ చనిపోయిన వ్యక్తి శవాన్ని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు వెలికితీసి శుక్రవారం పోస్ట్మార్టం చేసిన ఘటన రాజుపాలెం వుండలం కొండమోడు గ్రావుంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. గతేడాది సెప్టెంబర్ 3న కొండమోడు గ్రామానికి చెందిన కరీం పిడుగురాళ్ల వెళుతున్నానని చెప్పి మరుసటి రోజు శవమై కన్పించాడు. బంధువులు ముస్లింల శ్మశానవాటికలో ఖననం చేశారు. తన భర్తను హత్య చేశారని ఆరోపిస్తూ కరీం భార్య షహీనా పోలీసులు చుట్టూ తిరుగుతోంది. ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు రెండు రోజుల క్రితం పోలీసులు కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శుక్రవారం పిడుగురాళ్ళ రూరల్ సీఐ శ్రీధర్రెడ్డి, రాజుపాలెం తహశీల్దార్ సీహెచ్ విజయు జ్యోతికువూరి, గుంటూరు ఫోరెన్సిక్ ల్యాబ్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ కృష్ణవుూర్తి, గురజాల మెడికల్ ఆఫీసర్ సతీష్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. పంచనావూ నిర్వహించి పోస్టువూర్టం చేశారు. ప్రజా సంఘాల నేతల ఆగ్రహం పోర్ట్మార్టం చేసే విధానంపై ప్రజా సంఘాల నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా హక్కుల సంఘం వేదిక రాష్ట్ర సెక్రటరీ, డిఫెన్స్ లాయుర్ పాపారావు, ప్రజా హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మీసాల ప్రభుదాసు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం పోస్టువూర్టం నిర్వహించేందుకు వుుగ్గురు పైన డాక్టర్లు ఉండాలన్నారు. ఒక్క వైద్యుడితో ఎలా నిర్వహిస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. దీంతో పోలీసులు డాక్టర్లను పిలిపించారు. మధ్యాహ్నం వరకూ కనిపించని మృతదేహం జాడ మధ్యాహ్నం 2 గంటల వరకు కరీం వుృతదేహం జాడ కనిపించలేదు. ఇటీవల శ్మశానవాటికకు మెరక తోలించడంతో సమస్య ఎదురైంది. పొక్లెయిన్తో తవ్వించి జాడ కనుగొన్నారు. కరీం భార్య షహీనా నుంచి అధికారులు స్టేట్మెంటు నమోదు చేశారు. తన భర్తను ఎవరో హత్య చేశారని ఆమె తెలిపింది. కొండమోడులోని ఓ పెస్టిసైడ్ కంపెనీలో 10 సంవత్సరాలుగా గువుస్తాగా పని చేస్తున్నాడని, గతేడాది జనవరి 15న యుజవూనితో గొడవ పడి వచ్చాడని తెలిపింది. తర్వాత షాపు యజమాని సెప్టెంబర్ 2న ఇంటి వద్దకు వచ్చి వేరే కంపెనీలో పని చేయువద్దని, చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారని షహీనా ఫిర్యాదు చేసింది. వుూడవ తేదీ రాత్రి 9.30 గంటల సవుయుంలో ఓ ఫోన్ కాల్ వచ్చిందని, వెంటనే వస్తానని చెప్పి వెళ్ళిన భర్త మర్నాడు పిడుగురాళ్లలోని ఓవర్బ్రిడ్జి వద్ద చనిపోరుు ఉన్నాడని తహశీల్దార్కు తెలిపింది. అనంతరం రెండవ వైద్యాధికారి, గురజాల మెడికల్ ఆఫీసర్ సతీష్ సంఘటనా స్థలానికి హాజురు కావటంతో సాయుంత్రం 6 గంటల సవుయుంలో గొరుు్యలో నుంచి కరీం మృతదేహాన్ని తీసి మరలా పోస్టుమార్టం నిర్వహించారు. నివేదికలను పోలీసు అధికారులకు అందజేస్తావున్నారు. సీఐ శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ కేసును త్వరలో ఛేదిస్తామన్నారు. ప్రజా సంఘాల నాయుకులు వూట్లాడుతూ కరీం మృతి వెనుక రాజకీయు కోణాలు ఉన్నాయుని, సిట్టింగ్ జడ్జితో పోస్టువూర్టం నిర్వహించాలని వారు కోరారు. కార్యక్రవుంలో రాజుపాలెం, పిడుగురాళ్ళ, వూచవరం ఎస్ఐలు, రెవెన్యూ, వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు. -
అగ్రీ గోల్డ్ కేసులో సీఎం అసంతృప్తి
విజయవాడ బ్యూరో : అగ్రి గోల్డ్ కేసు దర్యాప్తు తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. కీలకమైన ఈ కేసులో ఆశించిన రీతిలో పురోగతి కనిపించడం లేదని, అవసరమైతే దీనిపై సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖ రాస్తానని చెప్పారు. కలెక్టర్ల సమావేశంలో శాంతిభద్రతల సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ కేసు దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేసేందుకు ప్రయత్నించాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అమరావతిలో ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ ఏర్పాటు చేయాలని హోంశాఖ కోరగా అందుకు ఆమోదం తెలిపారు. తాత్కాలికంగా వారం, పది రోజుల్లో విజయవాడలో ల్యాబ్ను ఏర్పాటుచేస్తామని చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఇంకా జరుగుతుండడం, అమరావతిలో నేరాల పెరుగుదలపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో నేరాలు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాత్రి 11 గంటలకు కలెక్టర్ల సమావేశం ముగిసింది. -
తుపాకులకూ ప్రింట్స్
‘ఫైరింగ్ కేసుల’ నిర్ధారణలో ఇవే కీలకం వీటిని విశ్లేషించేది ఫోరెన్సిక్ బాలిస్టిక్ నిపుణులు న్యాయస్థానానికి చేరనున్న సాంకేతిక నిర్ధారణలు డాక్టర్ల త్రయం కేసు: లారెల్ ఆస్పత్రి వివాదం నేపథ్యంలో డాక్టర్ శశికుమార్ తన లెసైన్డ్స్ రివాల్వర్తో మరో వైద్యుడు ఉదయ్కుమార్పై హత్యాయత్నం చేసి, ఆత్మహత్య చేసుకున్నాడు.ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ కేసు: నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి గన్మెన్ రవీందర్ నిర్లక్ష్యం కారణంగా అతడి చేతిలోనే సర్వీస్ పిస్టల్ పేలడంతో డ్రైవర్ అక్బర్ అక్కడికక్కడే మరణించారు. ఈ రెండు ఘటనల్లోనూ తుపాకులు ఎవరివి? ఎవరి చేతిలో పేలాయి? అనే అంశాలను దర్యాప్తులో భాగంగా పోలీసులు నిర్ధారించారు. అయితే న్యాయస్థానంలో సమర్పించాల్సిన సాంకేతిక నిర్ధారణ దగ్గరకు వచ్చేసరికి ఇంకో విషయమూ కీలకంగా మారనుంది. ఘటనాస్థలం, హతుడి శరీరం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న తూటాలు ఆయా నేరాల్లో వాడిన తుపాకుల నుంచే పేలాయని నిర్ధారించడం తప్పనిసరి. ఈ పని రైఫ్లింగ్ మార్క్స్ ఆధారంగా ఫోరెన్సిక్ బాలిస్టిక్ నిపుణు లు తేలుస్తారు. మనుషులకు వేలిముద్రలు ఉన్నట్లే... తుపాకులకు ఉండే ‘ప్రింట్స్’నే రైఫ్లింగ్ మార్క్స్ అంటారు. ఏ రెంటికీ సరిపోలవు... ఈ ప్రపంచంలో ఏ ఇద్దరు మనుషుల వేలిముద్రలు, తల వెంట్రుకలు, డీఎన్ఏ ఒకే విధంగా ఉండవు. అలాగే తుపాకుల్లోనూ రైఫ్లింగ్ మార్క్స్ విషయంలో ఇలాంటి సారూప్యతే ఉంది. ప్రొహిబిటెడ్ బోర్గా పరిగణించే .9 ఎంఎం తుపాకుల నుంచి సాయుధ బలగాలు వినియోగిం చే ఏకే-47, సాధారణ ప్రజలకు లెసైన్స్ ఆధారంగా మం జూరు చేసే .32 తదితర తుపాకులకు రైఫ్లింగ్ మార్క్స్ ఉంటా యి. ఇవి ఏ రెండు తుపాకులకూ ఒకే విధంగా ఉండవు. గొట్టం లోపల చుట్లు... ట్రిగ్గర్ నొక్కినప్పుడు హ్యామర్ ప్రభావంతో తుపాకీ ఛాంబర్/సిలిండర్ల్లో ఉన్న బుల్లెట్ పేలి... దాని ముందు భాగం వేగంగా బయటకు దూసుకువస్తుంది. ఈ వేగం ఎంత ఎక్కువగా ఉంటే.. అంత దూరంలో ఉన్న టార్గెట్కు తగులుతుంది. తుపాకీ గొట్టం (బ్యారెల్) పైకి చూడటానికి నునుపుగానే ఉంటుంది. అయితే బుల్లెట్ వేగాన్ని పెంచేందుకు ఆ గొట్టం లోపలి భాగంలో స్క్రూ తరహా చుట్లు ఉంటాయి. ఇవి బుల్లెట్ తన చుట్టూ తాను అమిత వేగంతో తిరగడానికి ఉపకరిస్తాయి. ఈ కారణంగానే గాల్లో దూసుకుపోయే తూటా తన చుట్టూ తాను వలయాకారంలో తిరుగుతూ వేగాన్ని పుంజుకుంటుంటుంది. తూటాలపై మార్కింగ్స్... పేలిన తూటా అలా చుట్లలో తిరుగుతూ గొట్టం దాటి బయటకు వచ్చేలోపు దానిపై కొన్ని నిర్దిష్టమైన గీతలు పడతాయి. ఈ గీతల్నే సాంకేతికంగా రైఫ్లింగ్ మార్క్స్ అంటా రు. ఇవి ప్రతి తూటా పైనా దాన్ని పేల్చిన ఆయుధానికి సంబంధించినవే పడతాయి. ఈ మార్క్స్ను కాల్చిన బుల్లెట్ ఆధారంగానే కాకుండా తుపాకీ లోపలి భాగాన్ని సాంకేతికంగా అధ్యయనం చేయడం ద్వారా ఫలానా తూటా, ఫలానా తుపాకీ నుంచే వెలువడింది అనే అంశా న్ని నిర్ధారిస్తారు. పేల్చి పోల్చే నిపుణులు... నేరం జరిగిన తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్న తుపాకీతో పాటు దాని నుంచి వెలువడి కింద పడిన, మృతుడు/క్షతగాత్రుడు శరీరం నుంచి వెలికి తీసిన తూటాలనూ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ లాబ్కు పంపిస్తారు. అక్కడ ఉండే బాలిస్టిక్ నిపుణులు టెస్ట్ ఫైరింగ్ ఎక్యూప్మెంట్ వినియోగిస్తారు. సదరు తుపాకీలో మరో తూటా పెట్టి పేలుస్తారు. దానిపై పడే రైఫ్లింగ్ మార్క్స్ను, పోలీసు లు స్వాధీనం చేసుకున్న దానిపై ఉన్న మార్క్స్తో పోలుస్తారు. ఇది పాజిటివ్ వస్తే స్వాధీనం చేసుకున్న తూటా ఇదే తుపాకీ నుంచి పేలినట్లు నిర్ధారించి నివేదిక తయారు చేస్తారు. డేటాబేస్కు కేంద్రం యోచన... రాష్ట్రాల వారీగా దేశ వ్యాప్తంగా ఉన్న లెసైన్డ్స్ ఆయుధాల నుంచి రైఫ్లింగ్ మార్క్స్ సేకరించి ఓ డేటాబేస్లో నిక్షిప్తం చేయాలని కేంద్రం ఆధీనంలోని ఎంహెచ్ఏ భావిస్తోంది. ఇందులో సదరు తుపాకీ యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు, చిరునామా కూడా ఉంటాయి. దీనికోసం లెసైన్డ్స్ ఆయుధాలను స్థానిక పోలీసులు పూర్తిస్థాయిలో స్క్రూట్నీ చేయాల్సి ఉండటంతో రెన్యువల్ కానివి, నిబంధనల విరుద్ధంగా వినియోగిస్తున్న వాటి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఈ రైఫ్లింగ్ మార్క్స్ డేటాబేస్ ద్వారా లెసైన్డ్స్ ఆయుధాలను వినియోగించి ఓ వ్యక్తి ఏ రాష్ట్రంలో నేరం చేసినా... డేటాబేస్ ఆధారంగా కేసును తక్షణం కొలిక్కి తీసుకురావడంతో పాటు నిందితుల్నీ పట్టుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నది వారి అభిప్రాయం. అయితే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తుపాకుల్ని వినియోగించి చేస్తున్న నేరాల్లో అత్యధికం దేశవాళీ ఆయుధాలతోనే జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన రైఫ్లింగ్ మార్క్స్ సేకరణ ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదు. ఈ పరిణామాన్ని పరిగణలోకి తీసుకున్న ఎంహెచ్ఏ దీనికి పరిష్కారం కోసం అన్వేషిస్తోంది. - సాక్షి, సిటీబ్యూరో -
నీరుగారిపోయిన సూసైడ్ నోట్
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య రెండున్నరేళ్లుగా ముందుకు సాగని కేసు రైల్వే, పోలీస్ శాఖల మధ్య సమన్వయ లోపం న్యాయం కోసం తండ్రి ఎదురుచూపు నరసరావుపేట టౌన్ : తీవ్ర మనో వేదనకు గురైన ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి రెండున్నరేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఎందుకు చనిపోతోంది.. అందుకు కారకులైన వారి పేర్లను ఆ నోట్లో స్పష్టంగా పేర్కొన్నాడు. ఈ ఘటన జరిగి రెండున్నర సంవత్సరాలు గడచిపోయినా ఆ కేసు ఒక్క అడుగు కూడా ముందుకు వేయడం లేదు. ఇతర ఏ సాక్షాధారాలు పరిగణనలోకి తీసుకోకుండా కేవలం సూసైడ్నోట్ ఆధారంతో శిక్షలు వేయవచ్చని చట్టాలు చెబుతున్నాయి. అలాగే అమలు చేస్తున్నాయి.. సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి తండ్రి దోషులను శిక్షించాలని కోరుతున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.స్థానిక క్రిస్టియన్పాలెంకు చెందిన వజ్రగిరి మోజోస్కు, ప్రకాశం జిల్లా దర్శి మండలం చందలూరుకు చెందిన మహిళతో 2011లో వివాహమైంది. కొన్ని నెలల తరువాత భార్య, భర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లి ఉంటోంది. భార్యను కాపురానికి తీసుకువచ్చేందుకు భర్త వెళ్లగా అక్కడ మరో యువకుడితో సన్నిహితంగా మెలుగుతూ కనిపించింది. దీనిపై భర్త ప్రశ్నించగా భార్యతరఫు బంధువులు మోజెస్పై దాడికి పాల్పడ్డారు. దీంతో మనస్తాపం చెందిన మోజెస్ 22 జులై 2013న పట్టణంలోని బాబాపేట దగ్గర గల క్రైస్తవ శ్మశానవాటిక వద్ద రైలుపట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి జేబులో ఉన్న సూసైడ్నోట్ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు తన ఆత్మహత్యకు భార్య, ఆమె తల్లిదండ్రులు, మరో ఇద్దరు బంధువులు కారణమంటూ స్పష్టంగా వారి పేర్లను సూసైడ్నోట్లో పేర్కొన్నట్లు అధికారులు గుర్తించారు. కేసు విచారణ, నిందితులు అరెస్ట్కు సాంకేతిక కారణాలు అడ్డు రావడంతో రైల్వే పోలీసులు అదే ఏడాది ఆగస్టు 8వ తేదీన కేసును సివిల్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేయాలని రైల్వే ఎస్పీ ద్వారా జిల్లా రూరల్ ఎస్పీకి నివేదిక పంపారు. సంఘటన చోటుచేసుకున్న ప్రాంతం టుటౌన్ పరిధిలోకి రావడంతో రూరల్ ఎస్పీ అదే నెల 20వ తేదీన ఆ స్టేషన్కు కేసును బదలాయించారు. అప్పటి నుంచి నేటి వరకూ కేసులో ఎటువంటి పురోగతి లభించలేదు. మృతుడి తండ్రి జయరావు ఇప్పటికే రెండు పోలీసు శాఖల ఉన్నతాధికారులను కలిసి, తన కుమారుడి ఆత్మహత్య విషయంలో న్యాయం చేయాలని విన్నవించాడు. అతని గోడు విని మిన్నకున్నారే కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఉన్నవారికో న్యాయం, లేనివారికో న్యాయం అన్న చందంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మృతుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సూసైడ్ నోట్కు విలువ లేదా? చట్టంలో సూసైడ్ నోట్కు ఉన్న ప్రాధాన్యతపై అనేక తీర్పులు ఉన్నాయి. వీటిని ఆధారం చేసుకుని వేలాది కేసుల్లో శిక్షలు అమలు చేశారు. ఇంతటి బలమైన ఆధారం ఉన్న కేసులో అధికారులు వ్యవహరించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. కేసు నమోదు మినహా నేటి వరకూ ఎటువంటి పురోగతి లేకపోవడం మృతుడి కుటుంబ సభ్యులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. అధికారుల నిర్లక్ష్యపు చర్య చట్టాలపై ప్రజలకు నమ్మకాన్ని పోగొట్టేలా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. కేసు విచారణతో మాకు సంబంధం లేదు సూసైడ్ నోట్ రాసి రైలు పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడటంతో కేసు నమోదు చేసి సాంకేతిక కారణాల వల్ల కేసును సివిల్ పోలీసులకు అప్పగించామన్నారు. కేసు విచారణ, నిందితుల అరెస్ట్ మొత్తం సివిల్ పోలీసులే చూసుకుంటారు. - రైల్వే ఎస్ఐ సత్యనారాయణ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అనంతరం చర్యలు మృతుడి వద్ద లభ్యమైన సూసైడ్ నోట్ను, అతని చేతిరాత గల పుస్తకాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపాం. అక్కడ నుంచి నివేదిక వచ్చా చర్యలు తీసుకుంటాం. - టూటౌన్ సీఐ సాంబశివరావు -
ఫోరెన్సిక్ పరీక్షలకు సూసైడ్ నోట్
-
ఫోరెన్సిక్ పరీక్షలకు సూసైడ్ నోట్
♦ ‘కొట్టివేతల’పై పోలీసుల దృష్టి ♦ గుంటూరు జిల్లా గురజాలకు మాదాపూర్ ఏసీపీ ♦ రోహిత్ తండ్రి, తాత, నానమ్మల నుంచి వివరాల సేకరణ ♦ స్థానిక రెవెన్యూ అధికారులతోనూ సంప్రదింపులు సాక్షి, హైదరాబాద్: హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసులు ముమ్మరం చేశారు. రోహిత్ రాసిన సూసైడ్ నోట్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిం చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రోహిత్ తండ్రి నివసిస్తున్న గుంటూరు జిల్లా గురజాలకు వెళ్లి కుటుంబీకులను విచారించారు. కేసులో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్లను చేర్చడంతో ప్రధానంగా కుల నిర్ధారణపై దృష్టి సారించారు. రోహిత్ రాసిన 5 పేజీల లేఖలో ఉన్న కొట్టివేతలపై విచారణ జరుపుతున్నారు. రెండు భాగాలుగా రాసిన ఈ లేఖలో మొత్తం మూడు చోట్ల రోహిత్ సంతకం చేశాడు. నాలుగు పేజీలు రాసిన తర్వాత సంతకం చేసి, మర్చిపోయిన అంశాలను మరో పేజీలో రాశాడు. నోట్లోని చేతి రాత, సంతకాలు రోహిత్వేనా అని నిర్ధారించుకునేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపిస్తున్నారు. కొట్టివేతల వెనుక ఏముంది..? ఆత్మహత్య చేసుకోవడానికి కారణాన్ని సూసైడ్ నోట్లో రోహిత్ ఎక్కడా ప్రస్తావించలేదు. మూడో పేజీలో 11 లైన్ల పేరా కొట్టేసి ఉంది. ‘ఈ పదాలను నా అంతట నేనే కొట్టేస్తున్నాను’ అని పేరా చివర్లో రోహిత్ రాసి సంతకం చేశాడు. నోట్లో మొత్తం 73 కొట్టివేతలున్నాయి. కేసు దర్యాప్తులో ఈ కొట్టివేతలు కీలకంగా మారవచ్చని అధికారులు చెబుతున్నారు. కుల నిర్ధారణపై ప్రత్యేక దృష్టి రోహిత్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని సెక్షన్ 3ను చేర్చిన నేపథ్యంలో దర్యాప్తులో భాగంగా కుల నిర్ధారణ తప్పనిసరి. అయితే ఇప్పటికే రోహిత్ కులంపై వివాదం చెలరేగడంతో కేసు దర్యాప్తు బాధ్యతలను మాదాపూర్ ఏసీపీ రమణకుమార్ చేపట్టారు. రోహిత్ కుల నిర్ధారణకు బుధవారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా గురజాలకు వెళ్లి రోహిత్ తండ్రి నాగమణి కుమార్, తాత వెంకటేశ్వర్లు, నాయనమ్మ రాఘవమ్మలను విచారించారు. కుటుంబ నేపథ్యం, మణికుమార్ వివాహం, పిల్లలు తదితర అంశాలపై ఆరా తీశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, గురజాల సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై తదితరుల నుంచి వివరాలు సేకరించారు. -
రాజయ్య కోడలిది ఆత్మహత్యే
-
రాజయ్య కోడలిది ఆత్మహత్యే
* నిర్థారించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ * గ్యాస్ లీక్తో వ్యాపించిన మంటల వల్లే కాలిన శరీరాలు * పొగకు ఊపిరాడకపోవడంతో మృత్యువాత * ఆహారంలో ఎలాంటి విషపదార్థాలు లేవని వెల్లడి * నివేదికను సిద్ధం చేసిన ఎఫ్ఎస్ఎల్ అధికారులు * జిల్లా అధికారులకు పంపడానికి ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారికది ఆత్మహత్యేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిర్థారించింది. గ్యాస్ లీక్ వల్ల వ్యాపించిన మంటల కారణంగానే సారికతో పాటు ముగ్గురు చిన్నారుల శరీరాలు కాలిపోయినట్టు తేల్చారు. నివేదికను సిద్ధం చేసిన ఎఫ్ఎస్ఎల్ అధికారులు.. దానిని వరంగల్ కమిషనర్కు పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో సారిక, ముగ్గురు పిల్లల మరణంపై ఉన్న సందిగ్ధతకు తెరపడింది. ఈ నెల 4వ తేదీ తెల్లవారుజామున హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంట్లో ఆయన కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు అనుమానాస్పద స్థితిలో సజీవదహనమైన విషయం తెలిసిందే. సారికతో పాటు ముగ్గురు చిన్నారులు దారుణంగా మృత్యువాత పడటంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేగింది. అంతేకాక వారి మరణాలపై మొదట్లో పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో డెడ్బాడీస్లోని శ్యాంపిల్స్ను పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపిం చారు. పలు పరీక్షలు నిర్వహించిన అనంతరం సారికది ఆత్మహత్యేనని, ఆమెతోపాటు ముగ్గురు పిల్లలు చనిపోయినట్టు ఎఫ్ఎస్ఎల్ అధికారులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి నివేదికను తయారు చేసి జిల్లా అధికారులకు పంపించేందుకు సిద్ధమవుతున్నారు. ఊపిరాడకపోవడం వల్లే.. రాజయ్య కోడలు సారిక, మనవళ్లు అభినవ్(7), ఆయాన్(3), శ్రీయాన్(3) ఊపిరాడకపోవడం వల్లే మృత్యువాత పడినట్లు ఎఫ్ఎస్ఎల్ అధికారులు నిర్ధారించారు. నలుగురు హత్యకు గురైనట్లు నిర్ధారించే ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది. వారు తీసుకున్న ఆహారంలో ఎలాంటి విషపదార్థాల ఆనవాళ్లు లభించలేదని నివేదికలో పేర్కొన్నారు. వారు బతికుండగానే గ్యాస్ లీక్ కారణంగా వ్యాపించిన మంటలకు కాలిపోయినట్లు నిర్ధారించారు. వారి గొంతు, ఊపిరితిత్తుల్లో పొగ చేరినట్లు ఎఫ్ఎస్ఎల్లో జరిపిన పరీక్షల్లో తేల్చారు. హత్య చేసిన తర్వాత శరీరాలు కాలిపోయినట్లయితే ఊపిరి తీసుకునే పరిస్థితి ఉండదు కాబట్టి శరీరంలోకి పొగ చేరదని నివేదికలో ప్రస్తావించారు. దీంతో గ్యాస్ సిలిండర్లను లీక్ చేసిన తర్వాతే సారిక నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో స్పష్టం చేశారని సమాచారం. ఇక తేలాల్సింది కారణాలే.. సారికది ఆత్మహత్యే అని ఎఫ్ఎస్ఎల్ నివేదిక స్పష్టం చేయడంతో.. వారు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి గల కారణాలు బయట పడాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును వేధింపుల కోణంలోనే విచారిస్తున్నారు. సారిక భర్త అనిల్కుమార్, అత్త మాధవి తరచూ తనను వేధిస్తున్నారంటూ సారిక పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాక గతంలో బేగంపేట మహిళా ఠాణాలో భర్త, అత్తమామలపై వరకట్న వేధింపుల కేసు కూడా పెట్టింది. కుటుంబ సభ్యులతో సఖ్యత లేని కారణంగానే కొంత కాలంగా సారిక ముగ్గురు పిల్లలతో కలసి వేరుగా ఉంటోంది. అయితే ఒంటరిగా ఉంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సారిక.. ఉన్నట్టుండి ఒక్కసారిగా పిల్లలతో పాటు ఆత్మహత్యకు పాల్పడటం వెనకున్న కారణాలపై పోలీసులు దృష్టి సారించారు.