దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో దర్యాప్తు ముమ్మరమైంది. ఆడియో, వీడియో టేపులను డీకోడింగ్ చేసే కీలక ప్రక్రియను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ప్రారంభించింది. ఇందుకోసం ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటుచేసింది. మొత్తం 14 ఆడియో, వీడియో టేపులను తెలంగాణ ఏసీబీ వర్గాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు గతంలో పంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు వాటిని విడిగా కాపీచేసి, వాటిలోని నిజాలను నిగ్గుతేల్చేందుకు ఎఫ్ఎస్ఎల్ సిద్ధమైంది. ఇందుకోసం ఏర్పాటుచేసిన మూడు బృందాలు ఇప్పటికే తమ పని మొదలుపెట్టేశాయి.
Published Fri, Jun 19 2015 6:13 PM | Last Updated on Wed, Mar 20 2024 3:43 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement