ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప ఇంకా అలకవీడలేదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి గురువారం హోంమంత్రికి ఆహ్వానం లభించని విషయం తెలిసిందే. దీంతో అవమానంగా భావించిన చినరాజప్ప అప్పటి నుంచి అలకబూనారు. అయితే ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు చినరాజప్పతో ఫోన్లో మాట్లాడారు. మీ శాఖలో మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అధికారుల పట్ల మెతక వైఖరితో ఉండొద్దని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది.