nimmakayala chinarajappa
-
టీడీపీ సీనియర్లకు షాకిచ్చిన చంద్రబాబు
ఈసారి తెలుగుదేశం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్లకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లందరికీ చంద్రబాబు మొండి చెయ్యి చూపించారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు నేతలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని కూటమి నుంచి గెలిచి మంత్రి పదవి తీసుకున్న ఆ నేత వల్ల వీరిద్దరి ఆశలకు గండి పడింది. ఇక పదవులు వస్తాయన్న నమ్మకమే లేకుండా పోయిందట వారిద్దరికీ. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు?కాకినాడ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలు తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కర్లేని నాయకలు. 2014లో పెద్దాపురం నియోజకవర్గం నుండి మొదటిసారి గెలిచిన చినరాజప్ప డిప్యూటీ సిఎం హోదాలో హోం మంత్రిగా పని చేశారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు..ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో రాజప్ప..నెహ్రూ మరోసారి గెలిచి.. టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన తరపున ఆ పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి దక్కడంతో రాజప్ప, నెహ్రూ ఆశలకు గండి పడింది.పవన్కల్యాణ్.. నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలది ఒకే సామాజికవర్గం కావడంతో.. సామాజిక సమీకరణాలతో చంద్రబాబు వీరిద్దరని దూరం పెట్టారు. అనేక మంది సీనియర్లతో పాటే వీరిద్దరికి కూడా పదవులు దక్కలేదు. అందుకే ఇద్దిరికీ నిరాశ ఎదురైంది. జ్యోతుల నెహ్రూకు మంత్రి కావాలని ఎప్పటి నుండో ఉన్న ఓకోరిక. అయితే జిల్లా టీడీపీని తన చేతుల్లో ఉంచుకున్న యనమల రామకృష్ణుడుతో ఉన్న రాజకీయ వైరం కారణంగా జ్యోతుల నెహ్రూ కల సాకారం కాలేదు. కనీసం ఈ ఎన్నికల్లో అయినా తన కల సాకారం అవుతుందని ఆయన భావించారు. కాని పవన్ కళ్యాణ్ రూపంలో మరోసారి జ్యోతుల మంత్రి పదవి కల.. కలగానే మిగిలిపోయింది.ఈ ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన పది మందికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. వీరితో పాటు రెండు మూడు సార్లు గెలిచిన మరో ఏడుగురికి కూడా తొలిసారి క్యాబినెట్ బెర్త్లు దక్కాయి. మరి కాకినాడ జిల్లాలోని జ్యోతుల నెహ్రూ కల ఎప్పటికైనా తీరుతుందా అనే చర్చ జరుగుతోంది. -
పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
తూర్పు గోదావరి: అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి రోజురోజుకూ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు వరుస రాజీనామాలు చేయడం, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం వంటి పరిస్థితులు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఒకపక్క 2009 ఎన్నికల నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించి నిరాశ చెందిన పరమట శ్యామ్కుమార్కు ఈ సారీ టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో స్వతంత్ర (రెబల్) అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇదే క్రమంలో నియోజకవర్గ టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న మండలానికి చెందిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ప్రకటన చేయడం టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది. జగ్గయ్యనాయుడు దూరంగా ఉంటానన్న ప్రకటన వెనుక నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా పరిమాణాలే కారణమని సమాచారం. పరమట శ్యామ్కుమార్ రెబల్గా పోటీ చేయడంపై తెర వెనుక తన అన్నయ్యతో పాటు తన ప్రమేయం ఉందన్న గుసగుసలు జగ్గయ్యనాయుడిని కొంచెం బా«ధించాయి. టీడీపీలో జరుగుతున్న ఈ అనూహ్య పరిణామాలతో తనకు సంబంధం లేదన్న బాధతో రాజకీయాలకు దూరమయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తన సోదరుడు చినరాజప్పతోనూ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఆనందరావుతోనూ ఎడమోహం పెడమోహంతో ఉంటున్న జగ్గయ్యనాయుడు పొమ్మనకుండానే పొగ పెడుతున్నట్టు ముందుగానే గుర్తించి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానన్న మాటతో పరోక్షంగా టీడీపీకి దూరమవుతున్న సంకేతాలను తెలియజేశారు. ఇటీవల అల్లవరం మండలానికి చెందిన టీడీపీ కీలక నాయకుడు అడపా కృష్ణ పారీ్టకి రాజీనామా చేసి రెబల్ అభ్యర్థి పరమట శ్యామ్కుమార్ పక్కన చేరడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. ఇలా వరుస ప్రతికూల ప్రకటనలతో టీడీపీ అభ్యర్థి ఆనందరావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
పెద్దాపురంలో వేడెక్కిన రాజకీయం.. లైడిటెక్టివ్ పరీక్షకు సిద్ధమన్న దవులూరి
సాక్షి, కాకినాడ జిల్లా: పెద్దాపురం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల సవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రామేశ్వరం మెట్ట, ఆనూరుమెట్ట మట్టి తవ్వకాలపై వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబుపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన దొరబాబు.. గ్రావెల్ తరలింపు వ్యవహారంలో నిజాయితీని నిరూపించుకునేందుకు లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో ట్రూత్ ల్యాబ్ అనుమతి తీసుకొని.. సంతకం చేసిన బాండ్ పేపర్లతో లైడిటెక్టర్ పరీక్షల కోసం మున్సిపల్ సెంటర్కు బయలుదేరారు. లైడికెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని చినరాజస్పకూ దవలూరి సవాల్ విసిరారు. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పిఠాపురంలోని వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. దవులూరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెద్దపురం వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. -
చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: అమలాపురంలో విధ్వంసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రభుత్వ ఆస్తులు, మంత్రి, ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు కీలక పాత్రధారిగా వ్యవహరించిన అమలాపురానికి చెందిన మాజీ రౌడీషీటర్, టీడీపీ నేత గంధం పల్లంరాజు, మరో ఇద్దరు రౌడీషీటర్లు గంప అనిల్, యాళ్ల నాగులతోపాటు 18 మందిని సోమవారం అరెస్టు చేశారు. వారిలో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి దాడులకు పురిగొల్పిన వారు కూడా ఉన్నారు. దాంతో ఈ కేసులో ఇప్పటివరకు 129 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అరెస్టు చేసిన 18 మంది నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండు కోసం జైలుకు తరలించినట్టు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. టీడీపీ పాత్ర బట్టబయలు గంధం పల్లంరాజు అరెస్టుతో ఈ కుట్ర కేసులో టీడీపీ పాత్ర మరోసారి బట్టబయలైంది. అతను టీడీపీ ప్రభుత్వంలో హోంమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. అతనిపై అమలాపురం, పరిసర ప్రాంతాల్లో పలు కేసులతో పాటు రౌడీషీట్ కూడా ఉండేది. గంధం పల్లంరాజుపై అమలాపురం స్టేషన్లో ఉన్న రౌడీ షీట్ను చినరాజప్ప హోంమంత్రిగా ఉన్న సమయంలోనే ఎత్తివేయడం గమనార్హం. గతంలో ఇసుక మాఫియా నడిపిన అతను అనంతరం రియల్టర్గా రూపాంతరం చెందాడు. అమలాపురంలో గత నెల 24న చలో కలెక్టరేట్ ర్యాలీ సందర్భంగా అల్లర్లకు పన్నాగం వెనుక అతను క్రియాశీలకంగా వ్యవహరించాడు. రౌడీషీటర్లను అమలాపురం వీధుల్లో మాటువేసేలా చేయడంతోపాటు వారంతా ఒకేసారి ర్యాలీలోకి ప్రవేశించేలా స్కెచ్ను అమలు చేశాడు. అతనికి అమలాపురానికే చెందిన గంప అనిల్, కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన యాళ్ల నాగులు సహకరించారు. వాట్సాప్ గ్రూప్ల ద్వారా కుట్ర నడిపించారు.. వాట్సాప్ గ్రూపులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ విద్వేషాలు రెచ్చగొట్టడం, వాట్సాప్ గ్రూపుల ద్వారానే పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించడం, ఏ సమయంలో దాడులకు పాల్పడాలో ఇలా మొత్తం కుట్రను పక్కాగా నడిపించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు వాట్సాప్ సందేశాలు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజీలను విశ్లేషించి పూర్తి ఆధారాలను సేకరించారు. కాగా, ఈ కేసులో కుట్రదారులు, పాత్రధారులు మరికొందరి పాత్రపై పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. వారిని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు అమలాపురంతోపాటు కోనసీమ అంతటా 144 సెక్షన్, పోలీసు సెక్షన్ 30లను పోలీసులు కొనసాగిస్తున్నారు. -
టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..
అధికారంలో ఉన్నప్పుడు సామ్రాజ్యాలను విస్తరించుకుపోయారు తెలుగు తమ్ముళ్లు. అప్పుడు ఒకరంటే ఒకరికి పడకున్నా చేతిలో పవర్ ఉండటంతో కిమ్మనకుండా ఉన్నారు. తీరా గత సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిని, అధికారానికి దూరమయ్యేసరికి వారి మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎన్నికలకు వెళ్లడమంటే డబ్బుతో కూడుకున్న పని. అందుకు ముఖం చాటేస్తున్న నేతలు ఆ నిందను ఒకరిపై మరొకరు నెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్ల తరువాత జరిగే రాజకీయ పరిణామాలకు ఇప్పటి నుంచే వ్యూహాల కత్తులకు పదును పెడుతున్నారు. సాక్షి ప్రతినిధి,రాజమహేంద్రవరం: జిల్లా టీడీపీ నేతల మధ్య చాప కింద నీరులా ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు.. ప్రస్తుత పంచాయతీ పోరు పుణ్యమా అని రచ్చకెక్కాయి. ఆ పార్టీ పదవులకు, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, పార్టీ సీనియర్ నాయకుడు వీర వెంకట సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) శుక్రవారం గుడ్బై చెప్పారు. మీడియా ముందు రాజీనామా ప్రకటన వేళ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కంట తడి పెట్టారు. తమ రాజీనామాలకు మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కారణమని సత్తిబాబు ఆరోపించారు. (చదవండి: టీడీపీ పదవులకు మాజీ ఎమ్మెల్యే దంపతుల రాజీనామా) అయితే సత్తిబాబు దంపతుల మీడియా సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే చినరాజప్ప మాట్లాడుతూ, ఇందులో తన ప్రమేయం ఎంతమాత్రం లేదని అన్నారు. ఏడాది కాలంగా అనంతలక్ష్మి దంపతులు పార్టీ బాధ్యతల నుంచి వైదొలగుతామంటూ చెబుతూ వచ్చి, ఇప్పుడు హఠాత్తుగా తనపై నింద వేస్తున్నారని అన్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, బరువు మోయాల్సిన సమయంలో సత్తిబాబు కాడి వదిలేస్తున్నారని వైరి వర్గం ఆరోపిస్తోంది. ఈ వివాదానికి ఇరుపక్షాల నుంచి వినిపిస్తున్న వాదనలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ పచ్చ రచ్చకు అసలు కారణాలు వేరే ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. (చదవండి: చిత్తూరు జిల్లాలో టీడీపీ హైడ్రామా) భాస్కర రామారావును తీసుకువచ్చేందుకు.. ప్రస్తుతం తటస్థంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావును పార్టీలోకి క్రియాశీలకంగా తీసుకు రావాలనేది సత్తిబాబు వ్యూహం. పార్టీ ఆవిర్భావం నుంచి సత్తిబాబుకు భాస్కర రామారావు ప్రధాన అనుచరుడనే ముద్ర ఉంది. తాను త్యాగం చేసిన కాకినాడ రూరల్ స్థానానికి భాస్కర రామారావును తీసుకువచ్చి, చినరాజప్ప భవిష్యత్తు వ్యూహానికి చెక్ పెట్టాలనేది సత్తిబాబు ఎత్తుగడగా ఉంది. ఎక్కడో కోనసీమ నుంచి వచ్చి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి, తమ నియోజకవర్గంలో వేలు పెడితే తమ వ్యూహం తమకు ఉండదా అని సత్తిబాబు వర్గం ప్రశి్నస్తోంది. ఆర్థిక స్తోమతతో దూకుడుగా వ్యవహరించే భాస్కర రామారావును కాకినాడ రూరల్కు తీసుకువస్తే పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించినట్టవుతుందని సత్తిబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని ఇటీవల ఆయన వద్ద ప్రతిపాదించారు. ఈ విషయాన్ని సత్తిబాబే స్వయంగా మీడియాకు చెప్పడం గమనార్హం. అయితే భాస్కర రామారావును తీసుకు రావాలనుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదని చినరాజప్ప వర్గం పేర్కొంటోంది. భాస్కర రామారావును తీసుకురావాలనే సత్తిబాబు వ్యూహం బయటకు పొక్కడంతో తప్పు తమ నాయకుడిపై నెట్టేందుకు ప్రయతి్నస్తున్నారని చినరాజప్ప వర్గీయులు అంటున్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, పవర్ పోయేసరికి పార్టీని వదిలేసిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం తప్పేమిటని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత ఎంపీటీసీ ఎన్నికల నుంచి నేటి పంచాయతీ ఎన్నికల వరకూ నియోజకవర్గ ఇన్చార్జిగా సత్తిబాబు అభ్యర్థులను నిలబెట్టకుండా పార్టీని నిరీ్వర్యం చేయడం వాస్తవం కాదా అని రాజప్ప వర్గీయులు ప్రశి్నస్తున్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు పయనిస్తుందో వేచి చూడాల్సిందే. ఈలోగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇరు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. మా కుటుంబంపై మీకేమైనా గౌరవం ఉంటే, మాజీ శాసన సభ్యురాలిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే ఉద్దేశం ఉంటే నేను, నా భార్య అనంతలక్ష్మి చనిపోయిన తరువాత తెలుగుదేశం జెండా కప్పి శ్మశానానికి తీసుకువెళ్లండి. మీతో అభిప్రాయ భేదాలు కాదు.. నేను మనస్తాపం చెందాను. నా కుటుంబం ఇబ్బంది పాలయింది. నా కుర్రాళ్లు ‘తిరం’ కాదు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. అర్హత ఉన్న వారిని పెట్టుకోమని చెబుతున్నాను. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు ఇబ్బందులు వచ్చాయి. నెల కిత్రం చంద్రబాబుతో జూమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడాను. ఆయన సమస్య రెక్టిఫై చేస్తానన్నారు. కానీ రానురానూ జిల్లా పార్టీ యంత్రాంగంలో నాకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కొంతమంది నాయకులకు నేనంటే ఇష్టం లేదు. ఇష్టం ఉన్న నాయకుడిని పెట్టుకోండి. నాకు ఇబ్బంది లేదు. బొడ్డు భాస్కర రామారావు వద్దకు వెళ్లి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని, నీ వద్ద ఉన్న డబ్బు, సత్తా, ఎప్పియరెన్స్కు కచ్చితంగా నెగ్గుతావని అన్నాను. చినరాజప్ప తదితరులతో మనస్పర్థలున్నాయి. బొడ్డు భాస్కర రామారావును రమ్మనడం వలన ఇబ్బందులు పెడుతున్నారేమో అర్థం కాలేదు. – పిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి రూరల్పై రాజప్ప కన్ను వేయడమే కారణమా! టీడీపీలో రగిలిన ఈ రచ్చకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కేంద్ర బిందువనే చర్చ నడుస్తోంది. రెండుసార్లుగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప వచ్చే ఎన్నికలకు కాకినాడ రూరల్పై కన్ను వేశారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో చినరాజప్ప కాకినాడ రూరల్ నుంచి పోటీకి దిగుతారని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో చినరాజప్పను పెద్దాపురం నుంచే రెండోసారి బరిలోకి దింపారు. పెద్దాపురంలో పార్టీ శ్రేణులు చెల్లాచెదురై ఆదరణ తగ్గిపోవడంతో మూడేళ్లు ముందే కొత్త స్థానం కోసం చినరాజప్ప వెతుకులాడుతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో తాను ఆశించిన కాకినాడ రూరల్ నియోజకవర్గంపై ఆయన కన్ను వేశారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాకినాడ రూరల్లో లైన్ క్లియర్ చేసుకునే లక్ష్యంతోనే చినరాజప్ప ఆ నియోజకవర్గ ఇన్చార్జి సత్తిబాబు దంపతులపై ఏడాది కాలంగా అధిష్టానానికి వ్యూహాత్మకంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో పార్టీని నిర్వీర్యం చేశారని చినరాజప్ప పార్టీ అధినేత చంద్రబాబుకు పదేపదే ఫిర్యాదులు చేస్తూ, తమను తక్కువ చేస్తున్నారని సత్తిబాబు వర్గీయులు మండిపడుతున్నారు. అనంతలక్ష్మి దంపతులను కాకినాడ రూరల్ నుంచి పొమ్మనకుండానే పొగ పెట్టేందుకే రాజప్ప ఈవిధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రాజకీయ వేధింపులకు తోడు ఇటీవల కుటుంబ పరంగా ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలోనే పార్టీ పదవులు, ఇన్చార్జి బాధ్యతల నుంచి వైదొలగాల్సి వస్తోందని సత్తిబాబు చెబుతున్నారు. ఆ ప్రకటన బాధాకరం.. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి నా కారణంగా బయటకు వెళ్తున్నట్టు శుక్రవారం విలేకర్ల సమావేశంలో చెప్పారు. వీరిద్దరూ గత ఏడాది కాలంగా ఇంటి నుంచి బయటకు రాలేదు. అనంతరం చంద్రబాబు, యనమల రామకృష్ణుడితో పాటు నా వద్దకు కూడా వచ్చి తాను ఇన్చార్జ్గా ఉండలేనని చెప్పారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టాలని రామకృష్ణుడు చెప్పారు. ఆవిధంగానే గ్రామాల్లో అభ్యర్థులను ఏర్పాటు చేశారు. ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు నా కారణంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం బాధాకరం. నేను పార్టీ కోసం పని చేస్తాను. పార్టీకి నష్టం కలిగించే పని చేయను. – నిమ్మకాయల రాజప్ప, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే, పెద్దాపురం -
తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు..
టీడీపీకి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒకరైతే పెత్తనం మరొకరిది. దీంతో ఆ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్యపోరుతో సతమతమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి వెలగబెట్టడంతో సరేలే అని సర్దుకుపోయిన వారు ఇప్పుడు తిరుగుబాటను ఎంచుకున్నారు. ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న పోరు మంగళవారం ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆధ్యక్షతన జరిగిన వెబినార్లోబహిరంగ ఫిర్యాదులకు దిగడం... మాటల తూటాలు పేల్చడంతో విభేదాలు బట్టబయలయ్యాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉంది జిల్లా తెలుగుదేశం పార్టీ పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన ఆ పార్టీకి జిల్లాలో దిశానిర్దేశకత్వం కొరవడింది. పార్టీ అధినేత చంద్రబాబు సైతం వయోభారంతో పార్టీపైన, నేతలపైన పట్టు కోల్పోతున్నారనే భావన పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇది వరకు ఆయన సమక్షంలో జరిగే పార్టీ సమావేశాల్లో పెదవి విప్పని నేతలు కూడా ఇప్పుడు తరచు జిల్లా నాయకత్వ తీరును దుయ్యబడుతున్నారు. మాజీ సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో జూమ్లో వెబినార్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు చంద్రబాబు సాక్షిగా బట్టబయలవడంతో పార్టీ వర్గాలకు మింగుడుపటం లేదు. ప్రధానంగా పార్టీ జిల్లా నాయకత్వంపై దాదాపు నేతలంతా గుర్రుగా ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడుగా జెడ్పీ మాజీ చైర్మన్ (పదవీ కాలం పూర్తికాకుండానే అర్ధాంతరంగా మధ్యలోనే దింపేసిన)నామన రాంబాబును అధ్యక్ష స్థానానికే పరిమితం చేసేశారని పలువురు నేతలు చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు. నామనను నామ్కేవాస్తే అధ్యక్షుడిగా చేసి సర్వం తానే అన్నట్టు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వ్యవహరిస్తున్నారని కొందరు నేతలు తీవ్రంగా తప్పుపట్టారని తెలియవచ్చింది. చినరాజప్ప పార్టీకి షాడో అధ్యక్షుడిగా తయారవడంతో తమ బోటి నాయకులకు విలువ లేకుండా పోయిందని సీనియర్లు బాబు దృష్టికి తీసుకువెళ్లారని తెలియవచ్చింది. ఆ పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి చినరాజప్పపై చంద్రబాబుకు నేరుగా పలు ఫిర్యాదులు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆధిపత్యపోరుతో విసుగు కోవిడ్–19తో జిల్లా ప్రజలు అతలాకుతలమవుతుంటే తెలుగు తమ్ముళ్లు ఆధిపత్య పోరు కోసం వెంపర్లాడటం విస్మయాన్ని కలిగిస్తోంది. కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలవాల్సిన పార్టీ నాయకత్వం నుంచి కనీసం స్పందన లేకపోగా జిల్లా నాయకత్వం కోసం ఆధిపత్య పోరుకు తెరతీయడాన్ని విజ్ఞులు తప్పుపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్ట బోయిన చందాన కేవలం నాలుగు సీట్లకే పరిమితమైనా ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలనే ధ్యాస ఆ పార్టీ నాయకులకు లేకుండా పోవడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని పలువురు సీనియర్లు చంద్రబాబు ముఖంమీదనే కుండబద్దలు కొట్టారని తెలిసింది. ఫిరాయింపు నేత జ్యోతులకు ఇచ్చిన మాటకోసం చంద్రబాబు జెడ్పీ చైర్మన్గా ఉన్న నామనను తప్పించి ఆ పదవిని జ్యోతుల నవీన్కుమార్కు కట్టబెట్టిన విషయం తెలిసిందే. రాంబాబును బుజ్జగించేందుకు అన్నట్టుగా జిల్లా అధ్యక్ష పదవిని వద్దన్నా అంటగట్టారు. ఆయన మెతక వైఖరి కారణంగా పార్టీ పగ్గాలను అనుభవమనే ఆయుధాన్ని వాడుకుంటూ రాజప్ప నేటీకీ చక్కబెడుతున్నారు. చినరాజప్ప ఇటీవల పెదపూడి మండలానికి చెందిన సంపర మాజీ ఎమ్మెల్యే మట్ట వెంకటరమణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చారు. అక్కడ కొంతమంది తనకు పూర్వాశ్రమం నుంచి తెలిసిన వైఎస్సార్సీపీ నాయకులను పలకరించడం రామకృష్ణారెడ్డికి రుచించ లేదు. ఆ రోజే రాజప్పను రామకృష్ణారెడ్డి అడిగినా సరైన సమాధానం లేకపోవడంతో యనమల దృష్టికి వెళ్లింది. దీనిని సర్థుబాటు చేయాల్సిందిగా చినరాజప్పకే తిరిగి యనమల అప్పగించినా ఫలితం లేకపోవడంతో ఆ పంచాయతీ వెబినార్లో చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయినా చినరాజప్ప పెద్దగా పట్టించుకోకపోవడంతో రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారంటున్నారు. అదే సమయంలో పార్టీ జిల్లా నాయకత్వాన్ని, షాడో రాజకీయాన్ని మార్చాలని డిమాండ్ వచ్చింది. అలా మార్చుకోకుంటే తామే పార్టీ మారిపోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు సమాచారం. జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టీడీపీ నేతలు ‘నిమ్మ’కు నీరెత్తినట్లు వ్యవరిస్తున్న తీరుపై పార్టీ సీనియర్లు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. నమోదవుతున్న కేసులపై అధినాయకత్వం ట్విటర్లోను, ప్రసార మాధ్యమాల్లో స్పందించడమే గాని క్షేత్ర స్థాయిలో పట్టించుకోవడాన్ని పలువురు తప్పుపట్టారు. ఈ విషయాలపై కొందరు నేతలు నేరుగా చంద్రబాబుపైనే ప్రశ్నల వర్షం కురిపింకచారని చెబుతున్నారు. చివరకు లోపం మీ వద్ద ఉందా, జిల్లా నేతల వద్ద ఉందా అని బాబును ప్రశ్నించారని తెలిసింది. అన్నీ ఆలకించిన బాబు జిల్లా నాయకత్వంపై త్వరలో నిర్ణయం తీసుకుందాం, రెండు పార్లమెంటు స్థానాలు కలిపి ఒక జిల్లాగా పరిగణించి పార్టీ పగ్గాలు అప్పగిద్దామని నచ్చజెప్పి వెబినార్ను ముగించారు. -
‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు..
వరుస పంక్చర్లతో కుదేలైపోతున్న ‘సైకిల్’ సచిత్రమాలిక కళ్లెదుటే కనిపిస్తోంది. వికృత చేష్టలతో, అహంకార పూరిత నిర్ణయాలతో, రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అవరోధం కల్పించేలా వ్యవహరిస్తున్న అధినాయకత్వం ప్రజలకు మరింత దూరమవుతోంది. ఐసుగడ్డను ఢీకొని, ముక్కచెక్కలవుతూ, నడిసంద్రంలో మునిగిపోతున్నట్టుగా మారిన ‘తెలుగుదేశం’ నావను భవిష్యత్తీరాలకు చేర్చడానికి.. చుక్కాని పట్టి నడిపించే భావి నేత కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఆ పార్టీలోనే ఉంటే తమ పుట్టి కూడా మునుగుతుందన్న భయంతో ‘తమ్ముళ్లు’ ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. టీడీపీకి గుడ్బై చెప్పి, అత్యంత ప్రజాదరణతో వెలుగొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: పార్టీ నాయకులు ఒక్కొక్కరూ జారిపోతూండడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బేజారెత్తిపోతోంది. అధినేత చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో విసుగు చెందుతున్న పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా చేరుతున్నారు. ఈ పరిణామాలు చూస్తూ కూడా ఇంకా టీడీపీలో కొనసాగడమంటే తమ రాజకీయ భవిష్యత్తుకు తామే సమాధి కట్టుకున్నట్టు అవుతుందనే భయం తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి జారిపోతున్న నేతలను నిలబెట్టుకోలేక టీడీపీ ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న జిల్లాలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ బలహీనపడుతూ వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయమనే స్పష్టమైన సంకేతాలు సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కనిపించాయి. కానీ అప్పటికంటే స్థానిక సంస్థల ఎన్నికలకు తెర లేచిన తరువాతే జిల్లాలో టీడీపీ నుంచి వలసలు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉండి నరనరానా టీడీపీ రక్తమే ప్రవహిస్తోందని బహిరంగంగా చెప్పుకునే నేతలు కూడా బయటకు పోతున్న పరిస్థితులు ఆ పార్టీ అధిష్టానానికి ఒక పట్టాన మింగుడు పడటం లేదు. వలసలను నిరోధించలేక ఆ పార్టీ ముఖ్యనేతలు దిక్కులు చూస్తున్నారు. చదవండి: ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..! ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన త్రిమూర్తులుగా మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేరొందారు. పార్టీ పుట్టి మునిగిపోతున్నా ఈ ముగ్గురూ ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులై చూస్తున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్–2గా పేరొంది, తెర వెనుక పార్టీని నడిపించిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప కనీసం పార్టీ నేతలను నిలువరించలేకపోతున్నారు. ►పార్టీని నమ్ముకున్నా నట్టేట ముంచేశారంటూ వైఎస్సార్ సీపీలో చేరి, తిరిగి ప్రలోభాలతో టీడీపీ పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూదీ అదే పరిస్థితి. వారానికో, 15 రోజులకో ఒకసారి కాకినాడలో మీడియాతో మాట్లాడటానికే ఆయన పరిమితమవుతున్నారే తప్ప టీడీపీకి కాయకల్ప చికిత్స చేయలేకపోతున్నారు. ►సుదీర్ఘ కాలం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన రికార్డుతో పాటు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా పని చేశారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన కూడా దాదాపు కన్నెత్తి చూడడం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం, సొంత నియోజకవర్గం అమలాపురంలో కూడా పార్టీ ముఖ్య నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతూ రాజప్పకు గట్టి షాక్ ఇస్తున్నారు. నాడు హోం మంత్రిగా పార్టీలో తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే తోట వర్గీయులను అమలాపురం పట్టణంలో వెతికి వెతికి మరీ కేసులలో ఇరికించి ఇబ్బందులు పాల్జేసిన నేపథ్యంలో.. వారందరూ ఇప్పుడు టీడీపీని వీడి రాజప్పకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. చదవండి: ఏబీవీ సస్పెన్షన్కు ఆధారాలున్నాయ్ ►తోట త్రిమూర్తులు వైఎస్సార్ సీపీలో చేరడంతో రామచంద్రపురంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ►ఇటు అమలాపురం పట్టణంలో కూడా తోట ప్రభావం, చినరాజప్పపై ఆగ్రహంతో గంగుమళ్ల కాసుబాబు, అరిగెల బుజ్జి తదితరులు మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీఎన్టీయూసీ నాయకుడు, నరనరానా టీడీపీని జీర్ణించుకున్న గల్లా రాము వంటి నాయకులు కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలోకి వచ్చేశారు. అమలాపురం 25వ వార్డు మాజీ కౌన్సిలర్ బండారు సత్యనారాయణ, అంబాజీపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు లోవరాజు(చిన్ని) వైఎస్సార్ సీపీలో చేరారు. ►కాకినాడ రూరల్ కరప మండల టీడీపీ నేత పుల్లా ప్రభాకరరావు, పండూరుకు చెందిన ట్యాంకర్స్ యూనియన్ అధ్యక్షుడు బావిశెట్టి వెంకటేశ్వరరావు మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►తునిలో యనమల సోదర ద్వయం ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిపోయిన టీడీపీ శ్రేణులు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై నమ్మకంతో వైఎస్సార్ సీపీలో చేరారు. ► రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మాజీ జెడ్పీటీసీ యాళ్ళ సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీపీ వినకోటి శ్రీనివాస్ టీడీపీని వీడి ఎమ్మెల్యే వేణు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►రాజమహేంద్రవరంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు, బీసీ సంఘ నాయకుడు కడలి వెంకటేశ్వరరావులు సీఎం జగన్ సమక్షంలో; పెద్దాపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి పార్టీ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►కొత్తపేటలో మందపల్లి శనైశ్చర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సలాది బాబ్జీ, రావులపాలెం మాజీ ఉప సర్పంచ్ కర్రి సుబ్బారెడ్డి, వేమగిరిలో వెలుగుబంటి వెంకటాచలం, దొంతంశెట్టి చినవీరభద్రయ్య, దళిత సంఘం నాయకుడు జంగా బాబురావు.. ఇలా టీడీపీ నేతలు అనేకమంది ఆ పార్టీ మనుగడ కష్టమనే భావనతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ►ఈ నేపథ్యంలోనే జిల్లాలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేక టీడీపీ చేతులెత్తేసింది. ఆ మేరకు వైఎస్సార్ సీపీకి 80 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి. -
పట్టణం మీకు.. ‘మెట్ట’ మాకా..?
‘‘పట్టణం నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని పేదలకు ఇవ్వడమేమిటి? అసలు ఈ స్థలాన్ని పేదలకు ఇవ్వాలని సూచించడమే సరికాదు. వాళ్లకు రామేశంమెట్ట వద్ద జీ+3 ఇళ్లు నిర్మించండి చాలు’’ అంటూ టీడీపీకి చెందిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధికారులపై చిందులు తొక్కడం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. తమపై కత్తి కట్టినట్టుగా ఆయన వ్యవహరించిన తీరుపై ఆ నియోజకవర్గానికి చెందిన పేదలు మండిపడుతున్నారు. ప్రజానురంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది నాటికి పేదలందరికీ ఇంటి స్థలాలు లేదా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ముందుకు సాగుతూంటే.. దానికి మోకాలు అడ్డడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉండే పట్టణాల్లో తమకు గూడు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తూంటే.. తమను ఎక్కడో ఉన్న రామేశంమెట్టకు తరిమేయాలని ఎమ్మెల్యే అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలోని 25 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వడం.. లేదా ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్ డి.మురళీధర్రెడ్డి ఆధ్వర్యాన జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఎంపిక చేసే ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గ కేంద్రమైన పెద్దాపురం మండలం, పట్టణంలో ఉన్న సుమారు 5,401 మంది పేదలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వడివడిగా జరుగుతున్న పనులు అక్కడి ఎమ్మెల్యే చినరాజప్పకు కంటగింపుగా మారాయి. పోనీ ఆ పేదలేమైనా పక్క నియోజకవర్గంలో వారైతే అడ్డు చెప్పారన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ లబ్ధి పొందే వారందరూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో వారే. అయినప్పటికీ ఆయనఅడ్డం పడుతున్నారంటే.. పేదల పట్ల ఆయనకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. పేదలపై దుగ్ధతోనే.. పెద్దాపురం పట్టణం పరిధిలోకి వచ్చే జి.రాగంపేట పంచాయతీ సర్వే నంబర్ 340/1ఎ1లో సుమారు 17 ఎకరాల ఇరిగేషన్ స్థలం ఉంది. ఇందులో 5 ఎకరాల్లో పులిమేరు, తాటిపర్తి, గుడివాడ, సిరివాడ, జి.రాగంపేట గ్రామాల పేదలకు జీ+3 ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అక్కడ గజం రూ.25 వేల వరకూ పలుకుతోంది. పెద్దాపురం నడిబొడ్డున అంత ఖరీదైన భూముల్లో పేదలకు ఇళ్లు ఇవ్వడమెందుకని అక్కడి టీడీపీ నేతలు భావించారు. ఈ విషయాన్ని వారు చెవిలో వేయడంతో ఎమ్మెల్యే చినరాజప్ప పేదలకు లబ్ధి కలిగించే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ ‘గూడు’పుఠానీ పన్నారని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు అనువుగా ఉన్న ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఎందుకని ఎమ్మెల్యే వాదిస్తున్నారు. పేదల కోసం కేటాయించిన ఐదెకరాలు కాకుండా మరో 12 ఎకరాల వరకూ కూడా అక్కడ ఖాళీగానే ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే చెప్పినట్టు అక్కడ నిజంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాల్సి వస్తే మిగిలిన స్థలంలో చేపట్టవచ్చు. కానీ పేదల గూడుకే ఎసరుపెట్టే విధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భూములను పేదలకు ఇవ్వడమేమిటన్న దుగ్ధతోనే టీడీపీ నేతలు ఈవిధంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేకత ఎందుకంటే.. పెద్దాపురం పట్టణంలో పేదల కోసం జీ+3 నిర్మాణాల కోసం కేటాయించిన స్థలానికి ఎదురుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉంది. అక్కడ పేదల ఇళ్లు వస్తే తనకు ఇబ్బంది అవుతుందని బహుశా చినరాజప్ప భావించి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పెద్దాపురం మండలంలోని సుమారు 12 ఏటిపట్టు గ్రామాల్లో మెజార్టీవి గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచాయి. ఈ రెండు కారణాలతోనే ఎమ్మెల్యే తమపై కక్ష సాధిస్తున్నట్టున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఏటిపట్టు గ్రామాల్లోని పేదలకు పట్టణం నడిబొడ్డున ఇళ్లు నిర్మించి ఇస్తే.. వారందరూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వైపు నిలుస్తారన్న భయంతోనే టీడీపీ నేతలు ఈ కుట్రలు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. అలా కాకపోతే తన నియోజకవర్గ పేదలకే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ముందుకు వస్తే ఎమ్మెల్యే వ్యతిరేకించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే.. ప్రజలకు దూరాభారం కట్టమూరు, జె.తిమ్మాపురం గ్రామాలతో పాటు పెద్దాపురం పట్టణ లబ్ధిదారులు 2,826 మందికి రామేశంమెట్ట వద్ద జీ+3 మోడల్ ఇళ్లు నిర్మించనున్నారు. అక్కడే ఏటిపట్టు గ్రామాల వారికి కూడా నిర్మించాలని ఎమ్మెల్యే అంటున్నారు. ఒకవేళ ఆయన చెప్పినట్టే రామేశ్వరం మెట్టలో ఇళ్లు నిర్మిస్తే అది ఏటిపట్టు గ్రామాల ప్రజలకు దూరాభారమే అవుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 20 కిలోమీటర్లు ఉంటుంది. నిబంధనల ప్రకారం పేదలకు 10 కిలోమీటర్ల లోపులోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఈ విషయం ఐదేళ్లు ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఎమ్మెల్యే చినరాజప్పకు తెలియకుండా ఉంటుందా అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పేరు వస్తుందనే వ్యతిరేకిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పేద ప్రజలకు ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను సేకరించారు. దీనిలో భాగంగా సామర్లకోటకు చెందిన విస్తరణ, శిక్షణ కేంద్రంలోని భూములను ఇళ్ల స్థలాల కోసం అధికారులు సేకరించారు. పెద్దాపురం ఇరిగేషన్ కార్యాలయానికి చెందిన భూములు నిరుపయోగంగా ఉండి ఆక్రమణలకు గురవుతున్నాయి. ఆ భూములను ఇళ్లస్థలాలకు ఇవ్వాలని నిర్ణయించాం. అయితే ఎమ్మెల్యే రాజప్ప ఆ భూములను పేదలకు ఇళ్లస్థలాలుగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ భూములు పేదలకు ఇస్తే మా పార్టీకి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఆయన వ్యతిరేకిస్తున్నారు.– దవులూరి దొరబాబు,వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పెద్దాపురం -
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన చినరాజప్ప
సామర్లకోట, (పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్ను మోసం చేశారని ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అఫిడవిట్ ఫారం–26లో 5వ కాలమ్లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా, లేవా.. అనే కాలమ్లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని తెలిపారు. అయితే ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు. అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి.. రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసిందని, తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిందన్నారు. విజయవాడ కోర్టు కూడా 2018 డిసెంబర్ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చిందని ఆమె చెప్పారు. కేసు నమోదు 2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఎన్నికల కమిషన్ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లో దాఖలు చేసిన నకలు ఆధారాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లపై ఈ నెల 5వ తేదీన ఏపీ హైకోర్టులో రాజప్పపై కేసు నమోదైందని.. ఆరు నెలల్లో ఆయనను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుందని.. తదుపరి వచ్చిన మెజార్టీ ఆధారంగా ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని తోట వాణి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులున్నారు. -
'చినరాజప్ప ఎమ్మెల్యేగా అనర్హుడు'
సాక్షి, కాకినాడ : నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్యేగా అనర్హుడని, ఆయన ఎన్నిక చెల్లదని పెద్దాపురం వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ తోట వాణి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తనపై నమోదైన క్రిమినల్ కేసు, అరెస్ట్ వారెంట్లను పొందుపరచకుండా చినరాజప్ప దాచిపెట్టారని ఆమె తెలిపారు. 2007లో ఓబులాపురం మైనింగ్ కేసులో చినరాజప్పతోపాటు మరో ఇరవై మందిపై క్రిమినల్ కేసు నమోదైందని, ఈ కేసుకు సంబంధించి పలుమార్లు రాజప్పకు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్సీ పదవి ద్వారా వస్తున్న పెన్షన్ వివరాలను కూడా అఫిడవిట్లో చిన్నరాజప్ప సమర్పించలేదని, ఈ విధంగా ఎన్నికల సంఘాన్ని మోసం చేసిన చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ తోట వాణి జూలై 5న హైకోర్టును ఆశ్రయించారు. -
మా లెక్కలు మాకున్నాయి..: చినరాజప్ప
సాక్షి, అమరావతి : ఎన్నికలు ముగిసినప్పటికీ అడ్డగోలుగా అధికార దుర్వినియోగం చేస్తున్న టీడీపీ సర్కార్... ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రతిపక్షమే సమస్యలు సృష్టిస్తూ శాంతిభద్రతలు సరిగా లేవని నిందలు వేస్తున్నారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని, కావాలనే లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నారని చినరాజప్ప విమర్శలు గుప్పించారు. గుంటూరులో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైఎస్సార్ సీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డాయని అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో సమస్యలు తలెత్తినా టీడీపీ కోసం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేశారని చెప్పుకొచ్చారు. పోలింగ్ రోజు ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్నా ప్రజల సమస్యలపై సమీక్షలు చేయవచ్చని చినరాజప్ప సమర్థించుకున్నారు. ఇక ఎన్నికల్లో గెలుపు టీడీపీదేనని... ‘మా లెక్కలు మాకున్నాయి...ఖచ్చితంగా 115 నుంచి 120 సీట్లలో గెలుస్తాం.’ అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
చినరాజప్ప గోబ్యాక్..
-
ప్రచారంలో చినరాజప్పకు చుక్కెదురు
సాక్షి, సామర్లకోట (పెద్దాపురం) : తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్పురంలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు చుక్కెదురైంది. ఆయన్ని అడ్డగించిన గ్రామస్తులు ఐదేళ్లుగా తమ సమస్యల్ని ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. రాజప్ప కాన్వాయికి అడ్డంగా బైఠాయించారు. గ్రామంలో ఎవరికీ ఇళ్ల స్థలం ఇవ్వలేదని, గ్రామాన్ని కాలుష్య కోరల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. గ్రామస్తులు సమస్యల్ని వివరిస్తుండగానే చినరాజప్ప వాహనం ముందుకు సాగింది. దీంతో వారు ’రాజప్ప డౌన్ డౌన్, రాజప్ప గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. -
అవినీతి లొల్లి.. కట్టాలా పట్టం మళ్లీ
సాక్షి, సామర్లకోట (పెద్దాపురం): 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోనసీమ నుంచి వలస వచ్చిన నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గంలో పోటీ చేసి ... విజయపతాకం ఎగురవేసి ... ఏకంగా కొండలనే కొల్లగొట్టి రూ. కోట్ల ఆర్జనకు శ్రీకారం చుట్టారు. కీలకమైన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారనుకుంటే అడుగడుగునా ఆయనతోపాటు ఆయన అనుచరులు అందినకాడికి దోచుకొని నియోజకవర్గ ప్రజలను దగా చేశారన్న విమర్శలున్నాయి. పెద్దాపురం మండలం ఆనూరు, కొండపల్లి, కొండలను గుల్ల చేసి గ్రావెల్ తవ్వకాలు జోరుగా చేశారు. ప్రతి రోజు వందలాది వాహనాలలో గ్రావెల్ రవాణా జరగడంతో ఆయా ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోయాయి. ప్రకృతి ఇచ్చిన సంపదను కాపాడాల్సిన అధికారులు, అధికార పార్టీ నేతలకు తొత్తుగా మారి పోయారని ఈ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని కొండలను కొల్లగొట్టి రూ.200 కోట్ల వరకు సంపాదించారనే ఆరోపణలున్నాయి. గత రెండేళ్లుగా ఏకధాటిగా సాగుతున్న కొండల తవ్వకాలపై ఆందోళనలు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దళితుల పొట్టకొడుతూ... పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టపై ఆధారపడి ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరంపాలెం, వాలుతిమ్మాపురం గ్రామాలకు చెందిన సుమారు 800 మంది దళితులు జీవనం సాగిస్తున్నారు. అధికార పార్టీ పెద్దల అండతో మైనింగ్ మాఫియా ఆ భూముల్లోకి ప్రవేశించి దళితుల బతుకులతో ఆటలాడుకుంటోంది. దళితులతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకొని తవ్వకాలు దౌర్జన్యంగా చేస్తున్నారు. సుమారు 50 అడుగుల ఎత్తులో వాలుగా ఉన్న కొండను తవ్వి చదును చేయడంతో రెండు వంతుల భూమిని దళితులు కోల్పోయే అవకాశం ఉంది. కొండల మీదుగా 33 కేవీ విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేయగా వాటిచుట్టూ కూడా గ్రావెల్ తవ్వకాలు చేపట్టేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రామేశ్వరం మెట్టపై ఉన్న 800 ఎకరాల భూమిని పేద దళితులకు పంపిణి చేశారు. తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరో 530 ఎకరరాల భూమిని ఒక్కో కుటుంబానికి ఎకరం 35 సెంట్ల చొప్పున పంపిణి చేశారు. పంటలకు అనువుగా వైఎస్ హయాంలో బోర్ల ఏర్పాటు... వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005–06లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇందిరా క్రాంతి, ఇందిరా జలప్రభ ద్వారా 72 బోర్లు వేయించి డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా పంట పొలాలకు పైపు లైన్లు ఏర్పాటు చేయించారు. దాంతో మెట్టపై జీడి మామిడి, దుంప, అపరాల పంటలు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. ఎకరానికి రూ.30 నుంచి 40 వేల వరకు ఆదాయం వచ్చేదని రైతులు తెలియజేశారు. ఉపాధి హామీ పథకంలో మామిడి, జీడి మామిడి ఈ మెట్టపై వేసుకునేందుకు అధికారులు మొక్కలను పంపిణీ చేశారు. ఈ మొక్కల సంరక్షణ కోసం ప్రతి నెలా రూ.1500 నుంచి మూడు వేల వరకు ఇచ్చేవారు. విద్యుత్తు సదుపాయంతో బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్న మెట్టను ఏ విధంగా తవ్వకాలకు అధికారులు అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో తప్పుడు రికార్డులతో మాఫియా రంగంలోకి దిగి క్వారీ తవ్వకాలు చేస్తోంది. మెట్టపై భూములున్న వారిని బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని మైనింగ్ తవ్వకాలు ప్రారంభించారనే ఆరోపణలు విస్తృతంగా ఉన్నాయి. సొంత భూమిలో గ్రావెల్ తవ్వకానికి అనేక మంది అధికారుల అనుమతి ఉండాలి. కానీ ఎటువంటి అనుమతి లేకుండా ఏడీబీ రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ కొండలో తవ్వకాలు చేస్తున్నా అధికారులు మౌనం వహించడమేమిటని పరిసర ప్రాంత జనం ప్రశ్నిస్తున్నారు. దాదాపు పది పొక్లెయిన్లతో 24 గంటలపాటు తవ్వకాలు చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అభివృద్ధి పనుల్లో అదే రీతి... నియోజకవర్గ పరిధిలో రూ.1,200 కోట్లతో అభివృద్ధి చేశామని చినరాజప్ప తరచుగా చెబుతున్నారని, అందులో అవినీతి భాగం ఎక్కువగా ఉందనే విమర్శలూ లేకపోలేదు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో రూ.80 లక్షలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్డు ప్రారంభం సమయంలోనే గోతులతో నిండిపోయింది. రూ.కోటితో పెద్దాపురం బస్సు కాంప్లెక్స్ నిర్మాణంలోను భారీ అవినీతి తొంగిచూస్తోంది. రేకులతో నిర్మాణం చేసి నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక ‘నీరు చెట్టు’ పథకం అవినీతికి మరో మెట్టుగా మారిపోయింది. సామర్లకోట నీలమ్మ చెరువు అభివృద్ధి పనులు నాసిరకంగా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. రేకుల షెల్టర్లకు రూ. ఐదు లక్షలా! ఐదు నుంచి ఆరుగురు ప్రయాణికులు వేచి ఉండటానికి వీలుగా రేకులతో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక్కో షెల్టర్కు రూ. ఐదు లక్షలు ఖర్చు చేసినట్లు ప్రకటించడంపై ప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారు. రూ.లక్ష కూడా ఖర్చు కాని ఈ షెల్టరుకు రూ.ఐదు లక్షలా అనే విమర్శలున్నాయి. ఇటువంటివి పెద్దాపురంలో మూడు నిర్మాణం చేసి భారీ ఎత్తున నిధులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ విధంగా ప్రతి అభివృద్ధి పనిలోనూ అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అనధికార లేఅవుట్ల జోరు నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామంలోనూ అనధికార లే అవుట్లు జోరందుకున్నాయి. ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు గమనించినా ఏమీ చేయలేని పరిస్థితులున్నాయి. ఈ ప్లాట్లను కొనుగోలు చేసినవారికి ఇళ్ల నిర్మాణానికి ప్లాన్లు మంజూరు కాకపోవడంతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు అభివృద్ధిలో ‘పచ్చ’పాతం చూపిస్తున్నారని పరిసర గ్రామాల ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. -
కమ్మ వాళ్ళకి చంద్రబాబు టికెట్ ఇస్తే నేనూ పోటీలో ఉంటా..
తూర్పుగోదావరి, పెద్దాపురం: పెద్దాపురం తెలుగుదేశం పార్టీలో సామాజిక చిచ్చు రేగింది. అసెంబ్లీ టికెట్ కేటాయింపులో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చిన రాజప్పకు టికెట్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న మార్కెట్ కమిటీ చైర్మన్, సీనియర్ నాయకులు ముత్యాల రాజబ్బాయి కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు టికెట్ ఇవ్వదలచుకుంటే నేనూ పోటీలో ఉంటానంటూ సోమవారం బహిరంగంగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు రెండు రోజుల క్రితం అధిష్టానం కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని చూస్తోందని, ఆరో తేదీలోపు తనకు టికెట్ ప్రకటిస్తుందని ప్రచారం చేస్తుండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన రాజబ్బాయి తాను కూడా ఈ దఫా పోటీలో ఉంటానంటూ ఆర్బీ పట్నంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. దీంతో దాదాపు కమ్మ సామాజిక వర్గంలో కూడా చిచ్చురేగడంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బొడ్డుకు ఈ ప్రకటన చుక్కెదురైనట్టయ్యింది. 1982లో పార్టీ స్థాపించిన నాటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న తనకు కమ్మ సామాజిక వర్గ నాయకుడే అడ్డుపడుతూ ఉన్నాడని రాజబ్బాయి అన్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన తనకు చంద్రబాబు ఈ దఫా చిన రాజప్ప గెలుపునకు కృషి చేస్తే ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికీ ఆయన తనకు న్యాయం చేస్తాననడంతోనే సమన్వయ కమిటీ తరఫున తాను రాజప్పకు మద్దతు ఇచ్చానన్నారు. ఆయనకు కాకుండా కమ్మ సామాజిక వర్గం నుంచే పెద్దాపురం అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే చంద్రబాబు తనకు టికెట్ కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై మరోమారు చంద్రబాబును కలుస్తానని రాజబ్బాయి ప్రకటించారు. సమావేశంలో గ్రామ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
‘దేశం’లో అసంతృప్తి సెగలు
తూర్పుగోదావరి, అమలాపురం: కోనసీమ కేంద్రం అమలాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. కీలక నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పదవులు రాలేదని కొంతమంది కినుక వహిస్తే.. పదవులు పొందినవారు సహితం అసంతృప్తితో ఉండడం విశేషం. అధికారంలో ఉండడంతో నిన్నటివరకూ గుంభనంగా ఉన్న నేతలు.. ఎన్నికల వేళ ఒక్కసారిగా తమ అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నారు. ♦ అల్లవరం మండలంలో పట్టున్న కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు పనిగట్టుకుని విజయవాడ వెళ్లి ఆ ర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలిశారు. ఆనందరావుకు టి క్కెట్ ఇవ్వద్దని కుండబద్దలుగొట్టి మరీ చెప్పారు. సాధారణంగా అమలాపురం టీడీపీ అభ్యర్థి విషయంలో కీలక నిర్ణయం తీసుకునేది ఈ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. అయినప్పటికీ అల్ల వరం నాయకులు యనమలను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ నందరావును రాజప్ప బహిరంగంగా వెనకేసుకు వస్తున్నారనే ఉద్దేశంతో జిల్లాలో సీనియర్ అయిన యనమలను వారు కలిశారు. ఇలా ఎమ్మెల్యే ఆనందరావు తీరుపై నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ♦ ముఖ్యంగా పదవులు దక్కని ద్వితీయ శ్రేణి నాయకులు ఆనందరావు, చినరాజప్పల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉండి, ప్రజారాజ్యం వచ్చిన సమయంలో టీడీపీని వదిలి వెళ్లిన నాయకులకు దక్కిన పదవులు తమకు రాకుండా పోయాయని వారు మండిపడుతున్నారు. ♦ పార్టీలో సీనియర్గా ఉన్న రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మట్ట మహాలక్ష్మి ప్రభాకర్కు నామినేటెడ్ పదవి ఇస్తానని స్వయంగా రాజప్ప హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. నామినేటెడ్ పదవుల పందేరం జరిగిన ప్రతిసారీ ప్రభాకర్ పేరు వినిపించడం తరువాత పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. ♦ అలాగే మున్సిపాలిటీ ఇన్చార్జి చైర్మన్గా, వైస్ చైర్మన్గా ఉన్న పెచ్చెట్టి విజయలక్ష్మికి సైతం తిరిగి వైస్ చైర్మన్ ఇవ్వడం లేదు. జెంటిల్మెన్ ఒప్పందం అమలు కోసం ఆమె పదవిని వదులుకున్నారు. చైర్మన్తోపాటు వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నా ప్రస్తుత చైర్మన్ యాళ్ల నాగసతీష్, మాజీ చైర్మన్ చిక్కాల గణేష్ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వల్ల ఆమెకు పదవి దక్కలేదు. పార్టీ ఆదేశానుసారం పదవికి రాజీనామా చేసినా తిరిగి తనకు పదవి ఇవ్వకపోవడంపై ఆమె అసంతృప్తితో ఉన్నారు. ♦ ఇక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్న పెచ్చెట్టి చంద్రమౌళి తాను ఆశించిన శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ రాలేదన్న అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ♦ కాంగ్రెస్ హయాంలో గోదావరి ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్గా పని చేసి, పార్టీకి సేవలందించిన సత్తి శ్రీను సొంత పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కనీసం నీటిసంఘం అధ్యక్షుడు కూడా కాలేకపోయారు. ♦ పదవులు అనుభవించిన నేతలు సైతం పార్టీ పెద్దలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ♦ అల్లవరం మార్కెట్ కమిటీ చైర్మన్గా రెండేళ్లు పని చేసిన గునిశెట్టి చినబాబు రెండోసారి అవకాశం రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ♦ జెంటిల్మన్ ఒప్పందంలో భాగంగా నిర్ణీత గడువుకన్నా ఎక్కువ రోజులు పదవుల్లో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, అమలాపురం మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు సైతం ఇదే తీరుతో ఉన్నారు. ♦ గత ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఒక ప్రధాన సామాజికవర్గం పట్టణ పార్టీ పెద్దల తీరుపై నిరసన తెలుపుతోంది. వీరిలో కొందరు జనసేన వైపు, మరికొందరు వైఎస్సార్ సీపీ వైపు వెళ్లిపోయారు. వీరే కాకుండా పార్టీ కష్టకాలంలో జెండా మోసిన పలువురిని ఆనందరావు, రాజప్ప పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడే సమయంలో మరింతమంది పార్టీ మారే అవకాశముందని టీడీపీ వర్గాలు భయపడుతున్నాయి. ♦ అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొత్తవారిని తీసుకువస్తారని, ప్రస్తుత ఎమ్మెల్యేకు అవకాశం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో టీడీపీలో అసంతృప్తులు, అసమ్మతి రాగాలు బహిరంగం కావడం రాజప్ప, ఆనందరావులకు మింగుడుపడడం లేదు. -
వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు
తూర్పుగోదావరి, పెద్దాపురం: ఉప ముఖ్యమంత్రి, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం గ్రామంలో భారీ షాక్ తగిలింది. మాజీ సర్పంచి దాసు శివబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో గురువారం రాత్రి పార్టీలో చేరారు. టీడీపీకి ఏకవర్గంగా ఉండే ఈ గ్రామంలో ఒక్కసారి సర్పంచి, బూత్ కమిటీ, పార్టీ కమిటీ నాయకులు వైఎస్సార్ సీపీ గ్రామ నాయకులు ఆకుల వీరబాబు, గళ్లా శ్రీను ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. శివబాబుతోపాటు టీడీపీ గ్రామ బూత్ కమిటీ కన్వీనర్ మదిరెడ్డి చంద్రశేఖర్, మాజీ ఉప సర్పంచి అరవ సత్తిబాబు, గ్రామ కమిటీ నాయకులు, మాజీ వార్డు సభ్యులు పోకల శివ రామకృష్ణ, ఆకాశపు ప్రసాద్, అడబాల దొరబాబు, జున్ను సుబ్రహ్మణ్యం, అడబాల వెంకట్రావు, జున్ను రాంబాబు సహ సుమారు 200 మందికి కో–ఆర్డినేటర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. పార్టీకి లభిస్తున్న ఆదరణను చూడలేక సీఎం చంద్రబాబు అబద్దపు హామీలతో తిరిగి గద్దె ఎక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీలో చేరిన శివబాబు మాట్లాడుతూ గ్రామ ప్రజల నుంచి వచ్చినా స్పందనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ, గోపు నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ మేడిశెట్టి భద్రం, బంగారుకృష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శులు యినకొండ వీర విష్ణుచక్రం, ఆదపురెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ విజయానికి ప్రతిక్క కార్యకర్త కృషిచేయాలని కోరారు. తొలుత దేవాలయాల్లో పూజలు చేసి బహిరంగ సభ వద్ద హిందూ, క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించి వారు పార్టీలో చేరారు. కార్మిక నాయకులు దవులూరి సుబ్బారావు, గోలి దొరబాబు, పార్టీ మండల అధ్యక్షుడు గవరసాని సూరిబాబు, యూత్ అధ్యక్షుడు గోపు మురళి, నల్లల నాగేంద్రబాబు, కొప్పిరెడ్డి రాధాకృష్ణ, తోట అప్పారావు, రెడ్డి లక్ష్మి, కామన రామకృష్ణ.,పల్లా గంగారావు, జోకా సతీష్ తదితరులు పాల్గొన్నారు. దాకోడులో 100 కుటుంబాలు.. అడ్డతీగల (రంపచోడవరం): అడ్డతీగల మండలం దాకోడు పంచాయితీలోని తిరుమలవాడ, జాజిపాలెం, దాకోడు, బందమామిళ్లు, ఎం.భీమవరం గ్రామాల నుంచి పలు పార్టీలకు చెందిన 100 కుటుంబాలకు చెందిన గిరిజనులు వైఎస్సార్ సీపీలో చేరారు. దాకోడు పంచాయతీలో గురువారం నిర్వహించిన ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా పార్టీలో చేరిన వారిని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ్భాస్కర్, నియోజకవర్గ కో ఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వివిధ పార్టీల్లో ముఖ్య నేతలు పల్లాల గోపాలకృష్ణారెడ్డి, పల్లాల రామిరెడ్డి, పల్లాల రవిరాజశేఖరరెడ్డి, వంతల ప్రసాద్ ఆధ్వర్యంలో మొల్ల ప్రేమ్కుమార్, ఒండ్లోపు పెద్దబ్బాయి, పొడుగు పండయ్య, చెదల అశోక్, సడ్డా సోమరాజు, శిరిసిం దుర్గబాబు, సడ్డా మల్లేశ్వర్రావు, జర్తా చిన్నబ్బాయి, చలుమర్తి సోమరాజు, కలింకోట శ్రీను సహ 100 కుటుంబాలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉదయ్భాస్కర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో భాగస్వాములవుతున్న ఇతర పార్టీల నేతల సంఖ్య పెరుగుతోందన్నారు. పార్టీ రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ సర్కారుని అధికారం నుంచి సాగనంపడానికి ప్రజలందరూ కార్యోన్ముఖులై ముందుకు వస్తున్నారని అన్నారు. కన్నబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు.. కాకినాడ రూరల్: చంద్రబాబు పాలనకు స్వస్తి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. రమణయ్యపేట పాత గైగోలుపాడు 49వ డివిజన్ సోమాలమ్మ గుడి వద్ద ఆయన సమక్షంలో చింతపల్లి శ్రీను, పాలిక నర్శింహమూర్తి, పాలిక వెంకటరమణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ‘రావాలి జగన్ – కావాలి కన్నబాబు’నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలిక వీరభద్రరావు, సీహెచ్ అవినాష్, సమ్మంగి రామకృష్ణ, పి.నాని, నున్న సాయి, సీహెచ్ దినేష్, గుత్తుల అన్నవరం, అనసూరి సత్తెమ్మ, వి.పద్మ, వి.సుజాతలకు కన్నబాబు పార్టీ కండువాలు ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు), రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి, కాకినాడ రూరల్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు గీసాల శ్రీనివాసరావు, కోరాడ దుర్గాప్రసాద్, సూరాడ రాజు, వడ్డి మణికుమార్, గుబ్బల విజయ్, పాలిక ప్రకాష్, చిలుకూరి సుజాత, మేడిశెట్టి లక్ష్మి, కర్రి చక్రధర్, కొత్తా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ప్రశ్నకు నోరుమెదపని హోంమంత్రి
సాక్షి, ఏలూరు: బద్ద శత్రువులైన కాంగ్రెస్, టీడీపీల కలయికపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తమ పార్టీ నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో మాట్లాడుతూ.. రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. బీజేపీ అన్యాయం చేయడం వల్లే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఎవరో ఒకరి సహకారం ఉండాలంటూ పాతపాటే పాడారు. బీజేపీ చేసినట్టు కాంగ్రెస్ కూడా మోసం చేస్తే అంటూ విలేకరులు ప్రశ్నించగా.. దానికి మంత్రి సమాధానం దాటవేశారు. రాష్ట్రంలో 3137 పోలీసు పోస్టులు భర్తీ చేయనున్నట్టు చినరాజప్ప తెలిపారు. అదే విధంగా చినరాజప్ప జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ గెలిచిందని అనడంలో అర్ధం లేదన్నారు. పవన్ లేకుండానే స్థానిక సంస్థల్లో విజయం సాధించామంటూ చెపుకొచ్చారు. -
మంత్రి రాజప్పకు సొంతపార్టీ కౌన్సిలర్ ఝలక్
పెద్దాపురం: అధికార పార్టీలో అభివృద్ధే తమదేనంటూ ప్రగల్భాలు పలుకుతున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు ఆ పార్టీ కౌన్సిలర్ సయ్యద్ అమీనా బీబీ ఝలక్ ఇచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో శుక్రవారం కౌన్సిలర్ అమీనాబీబీ, ఆమె భర్త సయ్యద్ కరీమ్ (జానీ)తో పాటు సుమారు 200 మంది ముస్లింలు, వార్డులోని టీడీపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. కో–ఆర్డినేటర్ దొరబాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీలో చేరిన అమీనాబీబీ, జానీ మాట్లాడుతూ ప్రస్తుత టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. అశ్లీల నృత్యాలు ఫేస్బుక్లో అప్లోడు చేసిన వ్యక్తిని మంత్రి రాజప్ప నెత్తిన పెట్టుకున్నారన్నారు. కౌన్సిలర్ భర్తపై పోలీసులు చేయిచేసుకుంటే కనీసం కౌన్సిలర్ కోరిన విధంగా క్షమాపణ కూడా చెప్పించలేని పరిస్థితి ప్రస్తుత పాలకులదన్నారు. ప్రజా పాలనను గాలికి వదిలి అక్రమ మట్టి తవ్వకాలతో సొమ్ములు చేసుకుంటున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. ఎన్నారై దొరబాబు మున్సిపాల్టీకి అందించిన మంచినీటి ట్యాంకర్లు, సేవా కార్యక్రమాలతో ఆకర్షితులం కావడమే కాకుండా జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందనే నమ్మకంతో పార్టీలో చేరామన్నారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం, దవులూరి దొరబాబును ఎమ్మెల్యేగా గెలిపించడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తామన్నారు. సుమారు 200 మంది ముస్లింలు, మహిళలు, వార్డు కార్యకర్తలకు దొరబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి దొరబాబు, దవులూరి సుబ్బారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, కరణం భాను, ఎలిశెట్టి నరేష్, గోకేడ రాజా, ముస్లిం కమిటీ పెద్దలు సర్దార్, పబ్బీర్, నూరీ, బషీర్, జిలాల్, చందు, సందీప్, జాపూర్, ఇస్మాయేలు, రబ్బాని, సంధాని తదితరులు పాల్గొన్నారు. -
షటిల్ ఆడుతూ జారిపడ్డ హోంమంత్రి
-
అయ్యో.. మంత్రి అలా పడిపోయారేంటి?
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కుళాయి చెరువు వద్ద వివేకానంద పార్కును శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి సరదా కలిసి షటిల్ ఆడటానికి సిద్ధమయ్యారు. కొండబాబు కొట్టిన కాక్ను అందుకునే క్రమంలో కాలు జారి షటిల్ కోర్టులో పడిపోయారు. సెక్యురిటీ సిబ్బంది, అక్కడున్నవారంతా కలిసి ఆయనను వెంటనే పైకి లేవదీశారు. మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆయన అందరితో సరదాగా మాట్లాడారు. -
‘కుక్కను ఉసిగొల్పిన హోంమంత్రి మరదలు’
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): దళిత విద్యార్థిపై పెంపుడు కుక్కను ఉసిగొల్పి అతని మృతికి కారణమైన రాష్ట్ర హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తమ్ముడు భార్యను అరెస్టు చేయకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్న బీఎస్పీ నాయకులపై కేసులు పెడుతున్నారని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఏపీ అధ్యక్షుడు పట్టపు రవి అన్నారు. విజయవాడ ప్రెస్క్లబ్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 28న దళిత విద్యార్థి ఎన్.వరుణ్ తోటివారితో కలిసి ఆడుకునేందుకు అమలాపురంలోని హౌసింగ్ కాలనీకి వెళ్లాడని, ఆ సమయంలో హోంమంత్రి మరదలు పెంపుడు కుక్కను ఉసిగొల్పిందన్నారు. దానినుంచి తప్పించుకునే క్రమంలో వరుణ్ పక్కనే ఉన్న ఎర్రకాలువలో పడి మృతిచెందాడని చెప్పారు. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా పోలీసులు స్పందించటంలేదన్నారు. విద్యార్థి మృతికి కారణమైన మహిళను 2 రోజుల్లో అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చలకూర పుష్పరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లంకా కరుణాకర్ దాస్ పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉండదు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్తో టీడీపీ పొత్తు ఉండదని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణతో అనేక విభేదాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పొత్తుపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలకే నిర్ణయాన్ని అప్పగించారని తెలిపారు. చంద్రబాబుపై 24 కేసులు పెండింగ్ ఉన్నాయని, కోర్టులు స్టే విధించాయని పేర్కొన్నారు. ఏపీలో పోలీసులు సరిగా పనిచేయలేదన్న జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. దివాకర్ రెడ్డికి కాంగ్రెస్ వాసన పోలేదని ఎద్దేవా చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ను తామే ప్రోత్సహించామని చెప్పారు. చంద్రబాబుకు సీబీఐ నోటీసులు కేవలం ఊహాగానాలేనన్నారు. -
హరికృష్ణ మరణం టీడీపీకి తీరనిలోటు
అవనిగడ్డ : మాజీ రాజ్యసభ సభ్యులు, సినీనటుడు నందమూరి హరికష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. దివిసీమ పర్యటనకు వచ్చిన ఆయన తన వియ్యంకుడు మాదివాడ విష్ణుమూర్తి స్వగృహంలో హరికృష్ణ రోడ్డు ప్రమాద దృశ్యాలను టీవీలో చూశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ హరికష్ణ తనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారన్నారు. ఎన్టీ రామారావు టీడీపీ స్ధాపించిన తరువాత ఛైతన్యరధంకు హరికృష్ణ సారధిగా వ్యవహరించారని అన్నారు. అప్పటి నుంచే తాను ఆయనతో కలిసి పనిచేసినట్టు చెప్పారు. పాలిట్బ్యూరో సభ్యునిగా ఉన్న సమయంలో ఆయన కూడా సభ్యునిగా ఉన్నారని ఎప్పుడు కనబడినా ఎంతో ఆప్యాయతగా పలుకరించేవారని తెలిపారు. ఎన్టీఆర్ ఛైతన్య రధంకు సారధ్యం వహించి రాష్ట్ర మంతా తిప్పిన ఆయన ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తను తీవ్రంగా కలచి వేసిందన్నారు. సర్పశాంతి హోమంపై ఆరా.... దివిసీమలో పాముకాట్లు పెరిగిన నేపధ్యంలో మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఆధ్వర్యంలో బుధవారం సర్పశాంతి హోమం చేశారని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ హోమంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పాముకాట్లు, తీసుకుంటున్న చర్యలు, సర్పశాంతి హోమం గురించిన విషయాలను హోమంత్రి బుద్ధప్రసాద్ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ యువజన వికాస సమితి ఛైర్మన్ మండలి వెంకట్రామ్ (రాజా), ఎంపీపీ బీవీ కనకదుర్గ, జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, డిఎస్పీ వి పోతురాజు, న్యాయవాది మాదివాడ వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. -
మంత్రి గారికి ఏం పనులున్నాయో..ఏమో?!: చినరాజప్ప
జిల్లా పశుగణాభివృద్ధి కమిటీ అధ్యక్ష ఎన్నిక, ఒక పత్రికలో సర్వే పేరుతో తనకు వ్యతిరేకంగా రాసిన కథనాల నేపథ్యంలో అలక పాన్పు ఎక్కిన మంత్రి గంటా తెలుగుదేశం పార్టీకి మాత్రం అంటీముట్టనట్లే ఉంటున్నారు..ఆ రెండు ఘటనల విషయంలో ఉప ముఖ్యమంత్రి, సీఎంల బుజ్జగింపులతో మంత్రి అలకపాన్పు దిగినట్లు కనిపించినా.. పార్టీ కార్యక్రమాల్లో మాత్రం అంతగా పాల్గొనడం లేదు..నగరంలో గురువారం జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి నగరంలోనే ఉన్నా.. గంటా డుమ్మా కొట్టడం.. ఆయన గైర్హాజరుపై జిల్లా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప, మరో మంత్రి అయ్యన్నపాత్రుడు అసహనంతో వ్యంగ్య బాణాలు విసరడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాఫిక్గా మారింది. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలకమైన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టడం మరోసారి చర్చనీయాంశమైంది. గత రెండు నెలలుగా ఆయన పార్టీ విషయంలో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యత పార్టీ కార్యక్రమాలకు ఇవ్వడం లేదన్న వాదన పార్టీలో బలంగా విన్పిస్తోంది. మంత్రులు పాల్గొనే కీలక అధికారిక సమీక్ష సమావేశాలకు కూడా గైర్హాజరవుతున్నారు. కీలక సమావేశానికి సైతం.. తాజాగా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప అధ్యక్షతన గురువారం జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి గంటా గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడుతో పాటు పార్టీ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి గంటా కోసం ఉదయం 9 నుంచి గంటన్నర పాటు వేచి చూశారు. కానీ ఆయన వచ్చే సూచనలు కన్పించకపోవడంతో 10.30 గంటలకు సమావేశాన్ని ప్రారంభించారు. కీలకమైన ఈ సమావేశానికి గంటా హాజరుకాకపోవడం పట్ల సహచర మంత్రుల్ది్దరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోనీ స్థానికంగా లేరా అంటే.. గంటా జిల్లాలోనే ఉన్నారు. భీమిలిలో తన అనుచరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారని తెలుసుకున్న ఇన్చార్జి మంత్రి చినరాజప్ప పుట్టినరోజు వేడుకలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ఇవ్వకపోవడం పట్ల కొంత అసహనం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి గారికి ఏం పనులున్నాయో..ఏమో?!: చినరాజప్ప ‘మంత్రి గారికి ఏం పనులున్నాయో.. ఏమో ? అని చినరాజప్ప మంత్రి గంటానుద్దేశించి ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో గంటా విషయమై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు మంత్రిలిరువురూ తీవ్ర అసహనంతోనే బదులిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గంటా కూడా సమాచారం ఇచ్చాం. ఆయన రాకపోతే ఏం చేస్తాం అని చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఈ మీటింగ్తో పనేముంది?..ఆయన కోసం ఏం చెబుతాం:అయ్యన్న మంత్రి గారికి బోల్డన్ని పనులు.. ఈ మీటింగ్తో పని ఏముంది అంటూ మరోమంత్రి అయ్యన్నపాత్రుడు వ్యం గ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన తీరు మీకు తెలియదా? అని ప్రశ్నించారు. పార్టీ సమావేశాన్ని కాదని పుట్టిన రోజు వేడుకల్లో గంటా పాల్గొన్నారట..మీ దృష్టికి రాలేదా? అంటూ విలేకర్లు మరోసారి గుచ్చిగుచ్చి ప్రశ్నించగా ఆయన కోసం ఏం చెబుతాం? అంటూ బదులివ్వడానికి కూడా ఇష్టపడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలక వీడలేదా? డీఎల్డీఏ వివాదంతో అలకపాన్పు ఎక్కిన గంటా ఇంకా పాన్ను దిగలేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. మంత్రి అయ్యన్న కోసం డీఎల్డీఏ పదవిని తన అనుచరుడు గాడు వెంకటప్పడుకు దక్కనీయకుండా హోంమంత్రి చినరాజప్ప కలెక్టర్పై ఒత్తిడి తేవడం పట్ల గంటా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చివరికి అదే చినరాజప్ప జోక్యంతో గంటా అనుచరుడే ఆ పదవి చేపట్టడంతో ఆ వివాదానికి తెరపడింది. కాగా ఓ పత్రికలో తనకు వ్యతిరేకంగా వచ్చిన సర్వేను సాకుగా చూపి గంటా కేబినెట్కు సైతం డుమ్మా కొట్టి గత నెలలో మరోసారి అలక బూనడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. జూన్లో జరిగిన పట్టాల పంపిణీకి వస్తున్న సీఎం పర్యటనలో మంత్రి పాల్గొంటారో లేదోనన్న పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అయితే మళ్లీ ఇన్చార్జి మంత్రి చినరాజప్పే గంటా ఇంటికి వెళ్లి బుజ్జగించి తన వెంట తీసుకెళ్లి సీఎం పక్కనే కూర్చొబెట్టారు. సీఎం కూడా బుజ్జగించడంతో ఆయన కాస్త మెత్తబడినట్టు కనిపించారు. కానీ పార్టీ కార్యక్రమాలను మాత్రం పట్టించుకోవడం లేదని.. మరీ ముఖ్యంగా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప పాల్గొన్న కార్యక్రమాలకు గంటా డుమ్మా కొడుతుండడం టీడీపీలోనే చర్చనీయాంశమైంది. -
రాంగ్ పోస్టింగ్లు పెడితే సహించేది లేదు
అమలాపురం: ‘సోషల్ మీడియాలో కొందరు ఉద్దేశపూర్వకంగా రాంగ్ పోస్టులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి వారిని సహించేది లేదు. మాజీ మంత్రి దివంగత డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుపై ఓ టీవీ చానల్లో నేను మాట్లాడిన మాటలు ఫ్లోలో వచ్చినవే తప్ప, మరేమీ కాదు’’ అంటూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వివరణ ఇచ్చారు. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన స్థానిక అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో ఆదివారం జరిగిన నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు సభలో చినరాజప్ప ప్రసంగించారు. ఇటీవల ఓ టీవీ చానల్లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి దివంగత డాక్టర్ మెట్లపై చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ఆ మినీ మహానాడు వేదికపై పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఇలా వివరణ ఇచ్చారు. ‘నాకు డాక్టర్ మెట్ల అంటే గౌరవం ఉంది. అలాగే ఆయన తనయుడు రమణబాబు అంటే అభిమానం’ అని రాజప్ప చెప్పుకొచ్చారు. తమ రెండు కుటుంబాల మధ్య సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని కొందరు పుల్లలు పెట్టాలని చూశారని, వారెవరో తనకు తెలుసునని స్పష్టం చేశారు. సోషల్ మీడియాల్లో తప్పుడు ప్రచారం చేసేవారిపై ఇక నుంచి చర్యలు తప్పవని హెచ్చరించారు. రమణబాబుకు పార్టీపరంగా ఎదిగేందుకు తనవంతు ప్రోత్సాహం, కృషి ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. పార్టీలో నిజాయితీగా కష్ట పడేవారిని గుర్తించాలని ఎమ్మెల్యే ఆనందరావుకు సభలో రాజప్ప సూచించారు. పార్టీ పరిశీలకుడు, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మెంటే పార్ధసారధి, మాజీ ఎమ్మెల్యే చిల్లా జగదీశ్వరి, మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పెచ్చెట్టి చంద్రమౌళి, అల్లవరం మార్కెట్ కమిటీ చైర్మన్ నిమ్మకాయల సూరిబాబు, ఆత్మ చైర్మన్ లింగోలు పెదకాపు, జెడ్పీటీసీ సభ్యులు అధికారి జయ వెంకటలక్ష్మి, వేగిరాజు ప్రవీణ, ఎంపీపీలు యెరుబండి వెంకటేశ్వరరావు, చింతా లక్ష్మీ గౌరీ, తెలుగు రైతు నాయకుడు మట్ట మహాలక్ష్మీ ప్రభాకర్, టీడీపీ నాయకులు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు, జంగా బాబూరావు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీ, అభివృద్ధి పనుల గురించి వివరించారు. -
ముగ్గురు ‘దేశం’ నేతలపై విచారణ
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై సోషల్ మీడియాలో అమలాపురానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు వ్యక్తిగతంగా విమర్శిస్తూ చేసిన కామెంట్లపై పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామ కోటేశ్వరరావు మంగళవారం కూడా విచారించారు. 3వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు దున్నాల దుర్గ, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు రేకపల్లి ప్రసాద్లను మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకుని సుదీర్ఘంగా విచారించారు. రాజప్ప ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ మంత్రి దివంగత డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుపై చేసిన వ్యాఖ్యలపై పట్టణ టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. రాజప్పపై పోస్టులు పెట్టారన్న ఆరోపణలు, ఆధారాలతో కౌన్సిలర్ దుర్గ, పట్టణ తెలుగు యువత అధ్యక్షుడు ప్రసాద్లను విచారించి సాయంత్రం నుంచి పంపించారు. అలాగే మరో టీడీపీ నాయకుడు గంధం శ్రీను, సోషల్ మీడియాలో పోస్టులు క్రియేట్ చేశాడన్న అభియోగంపై ఆర్డీఎస్ ప్రసాద్లను కూడా సాయంత్రం నుంచి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మరోవైపు పట్టణంలో రౌడీ షీటర్లపై కూడా విచారణ జరుగుతోంది. వారి కదిలికపై పోలీసులు దృష్టి పెట్టారు. కొందరు రౌడీ షీటర్లు కూడా సోషల్ మీడియాలో విమర్శనాత్మకమైన పోస్టింగ్లు పెట్టినట్లు ఈ సందర్భంగా పోలీసులు గుర్తించారు. వారిని కూడా బుధవారం అదుపులోకి తీసుకుని విచారించనున్నారు. అలాగే ఈ నలుగురినీ డీఎస్పీ ఏవీఎల్ ప్రసన్నకుమార్ కూడా తన కార్యాలయంలో ప్రత్యేకంగా విచారించారు. అయినవిల్లి మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు పట్టణానికి చెందిన అదే పార్టీకి చెందిన కొందరు టీడీపీ నాయకులపై సోషల్ మీడియాలో రాజప్పకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టింగులపై ఫిర్యాదు చేయడం వల్లే పోలీసులు ఈ విచారణను ముమ్మరం చేశారు. -
అగ్రిగోల్డ్ బాధితులపై మంత్రి అయ్యన్న ఆగ్రహం
సాక్షి, తూర్పుగోదావరి : అగ్రిగోల్డ్ బాధితులపై మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు శనివారం మంత్రులు అయ్యన్నపాత్రుడు, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పలను కలిశారు. ఈ సందర్భంగా వారు తమ బాధలను మంత్రులకు చెప్పుకున్నారు. దీంతో అయ్యన్న పాత్రుడు వారిపై విరుచుకుపడ్డారు. అంతేకాక మమ్మల్ని అడిగి డబ్బులు కట్టారా అని మంత్రి ప్రశ్నించారు. ఆ డబ్బు మొత్తం చంద్రబాబు ఇవాలా అని ఆయన అన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై బాధితులు అభ్యంతరం వ్యక్తం చేవారు. వెంటనే అక్కడే ఉన్న హోంమంత్రి చిన్నరాజప్ప జోక్యం చేసుకున్నారు. అంతేకాక బాధితులు ఆగ్రహించడంతో వారికి చినరాజప్ప సర్ది చెప్పారు. దీంతో సమస్య కొంత వరకూ తగ్గుముఖం పట్టంది. గత కొన్ని రోజులుగా అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలని అధికార పార్టీని కోరుతున్న విషయం తెలిసిందే. -
చినరాజప్ప వివాదాస్పద వ్యాఖ్యలు.. టీడీపీలో కలకలం
నాకు జిల్లాలో ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకడు ఉన్నాడు...మరొకడు వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు శత్రువులు ఎవరంటే ఒకరు బొడ్డు భాస్కర రామారావు, రెండో వ్యక్తి మెట్ల సత్యనారాయణరావు. ఓ టీవీ ఇంటర్వ్యూలో మంత్రి రాజప్ప వ్యాఖ్యపై టీడీపీలోనే ఆగ్రహావేశాలు ముద్రగడకు..నాకు పదేళ్ల నుంచి మాటల్లేవు..ఆయన ఖాళీగా ఉండి సీఎంకు లేఖలు రాస్తారు. కులాన్ని రెచ్చగొడతారు. –కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చ సాక్షి ప్రతినిధి, కాకినాడ : హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పపై టీడీపీలో ఓ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో దివంగత నేత, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావుపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కోనసీమ, మెట్ట రాజకీయాల్లో చిచ్చు రేపాయి. ఎక్కడికి దారితీస్తుందో తెలియదు గాని రాజప్ప వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశమయ్యాయి. తగిన బుద్ధి చెప్పాలన్న కసితో వ్యతిరేక వర్గీయులంతా కత్తులు నూరుతున్నారు. దిష్టిబొమ్మల దహనం, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని భావించినప్పటికీ అధిష్టానం వద్దే తేల్చుకోవాలని కొందరు పెద్దల సూచనతో వెనక్కి తగ్గారు. అసలేం జరిగిందంటే.. నాకు ఇద్దరు శత్రువులు ఉన్నారు. ఒకడు ఉన్నాడు...మరొకడు వెళ్లిపోయాడు. ఆ ఇద్దరు శత్రువులు ఎవరనే ప్రశ్నకు రాజప్ప ఠక్కున సమాధానమిస్తూ ‘ఇంకెవరు బొడ్డు భాస్కర రామారావు, రెండో వ్యక్తి ‘మెట్ల సత్యనారాయణ రావు’ అని చెప్పారు. అందరూ పెద్ద మనిషిగా గౌరవించే డాక్టర్ మెట్ల సత్యనారాయణరావును రాజప్ప ఒకడు వెళ్లిపోయాడని ఏకవచనంలో మాట్లాడడంతో అమలాపురం నియోజకవర్గంలోనే కోనసీమ టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో కలకలం రేపింది. ఇప్పుడా వ్యాఖ్యలు దావనంలా వ్యాపించాయి. ముఖ్యంగా మెట్ల సత్యనారాయణను అభిమానించే నాయకులంతా మనస్తాపానికి గురయ్యారు. సోమవారం రాత్రి...మంగళవారం ఉదయం పట్టణంలోని డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు తనయుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డైరెక్టర్ మెట్ల రమణబాబు స్వగృహంలో టీడీపీ నాయకులంతా సమావేశమయ్యారు. రాజప్ప వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మనస్తాపానికి గురవడమే కాకుండా రాజప్పపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దివంగత డాక్టర్ మెట్ల అనుచరులు, టీడీపీ నాయకులైన మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ, మున్సిపల్ కౌన్సిల్ విప్ నల్లా స్వామి, మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు, దాదాపు 20 మంది టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు సమావేశమయ్యారు. ఇందులో కొందరు మాట్లాడుతూ... పట్టణంలో టీడీపీ కార్యక్రమాల్లో మనమంతా దూరంగా ఉండాలని మాట్లాడగా...మరికొందరు రోడ్డెక్కి దిష్టిబొమ్మల దహనం తదితర రూపంలో ఆందోళన చేద్దామని...మరికొందరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబును దృష్టికి తీసుకుని వెళ్లాలన్నారు. ఇంకొందరు అమలాపురంలో రాజప్ప పాల్గొనే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. మరికొందరు రాజప్పనే నేరుగా నిలదీయాలని స్పష్టం చేశారు. మొత్తం మీద రాజప్ప వ్యాఖ్యలు నియోజకవర్గ టీడీపీలో ఆజ్యం పోశాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మెట్టప్రాంత రాజకీయ కుటుంబీకులతో సంబంధాలున్న మెట్లపై ఏకవచనంతో, చనిపోయిన వ్యక్తి కోసం మాట్లాడటాన్ని ఇక్కడి నేతలు కూడా ఆగ్రహానికి గురైనట్టు తెలిసింది. ముఖ్యంగా మెట్ల సత్యనారాయణతో బంధుత్వం ఉన్న కాకినాడ ఎంపీ తోట నర్సింహం కూడా ఆగ్రహంతో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గుర్రుగా బొడ్డు వర్గీయులు పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బొడ్డు భాస్కరరావునుద్దేశించి మాట్లాడటంతో ఇక్కడ టీడీపీలో ఉన్న బొడ్డు వర్గీయులంతా గుర్రుగా ఉన్నారు. రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బొడ్డు, రాజప్ప మధ్య విభేదాలున్నప్పటికీ ఇలా బాహాటంగా రోడ్డెక్కడం టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాపుల్లో కూడా దుమారం దివంగత మెట్లనే కాకుండా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై విమర్శలు గుప్పించారు. ఆ ఇద్దరి వ్యక్తులపై రాజప్ప చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా చర్చనీయాంశమవుతూ ‘రాజప్ప అలా మాట్లాడకూడ’దన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం మీద రాజప్ప చేసిన వ్యాఖ్యలు అమలాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లోనే మెట్ల, పద్మనాభం ప్రభావం ఉన్న నియోజకవర్గాలన్నింటిలోనూ దుమారం రేపుతున్నాయి. ముద్రగడకు..నాకు పదేళ్ల నుంచి మాటల్లేవు..ఆయన ఖాళీగా ఉండి సీఎంకు లేఖలు రాస్తారు. కులాన్ని రెచ్చగొడతారన్న వ్యాఖ్యలు కూడా ఆ కాపు సామాజిక వర్గంలో తీవ్ర చర్చకు దారితీసింది. -
రాజప్పా.. మీ వెనుక కాపులెందరో?
అమలాపురం టౌన్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మళ్లీ పెద్దాపురం నుంచి పోటీ చేస్తానని చెబుతూనే, అక్కడ టికెట్ బొడ్డు భాస్కర రామారావు అడుగుతున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఉంగరాల చినబాబు అన్నారు. పెద్దాపురం కాకపోతే రాజప్పకు కోనసీమలోని ముమ్మిడివరం, కొత్తపేట నియోజకవర్గాలు ఉన్నాయని, ఆ రెండు స్థానాల్లో ఏదో ఒక చోట పోటీ చేసి తన సత్తా చాటు కోవాలని సూచించారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో తన వెనుక ఎంత మంది కాపులు ఉన్నారో కూడా ఆయన రుజువు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అమలాపురంలోని బీజేపీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోదావరి జలాలను కృష్ణా గోదావరిలో కలిపేందుకు భూసేకరణ చట్టాన్ని అడ్డుపెట్టుకుని తలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టు దోచుకోవడానికేనని చినబాబు అన్నారు. చంద్రబాబు ఏ ప్రాజెక్టు తలపెట్టినా తన కోటరీ బాగుపడేందుకేనని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతి, పాలనాపరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ప్రధాని మోదీపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని పార్టీ రాష్ట్ర కార్యవర్గ మరో సభ్యుడు ఆర్వీ నాయుడు అన్నారు. -
అమీ.. తుమీ
సాక్షి, విశాఖపట్నం: జిల్లా పశుగణాభివృద్ధి సంఘం కొత్త పాలకవర్గ ఎన్నిక వివాదం కొత్త మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షలో ఇరువురు మంత్రులు అమీతుమీకి సిద్ధపడుతున్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు తన అనుచరుడైన గాడు వెంకటప్పడును డీఎల్డీఏ కొత్త చైర్మన్గా ఎన్నికవడాన్ని జీర్ణించుకోలేని మరో మంత్రి అయ్యన్న పాత్రుడు పాతపాలకవర్గాన్ని కొనసాగించాలని తాను ఇచ్చిన సిఫారసు లేఖను పక్కన పెట్టి ఏవిధంగా ఎన్నికలు నిర్వహిస్తారంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన సిఫారసు లేఖ పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికార యంత్రాంగంపై సీఎంవోతో పాటు ఇన్చార్జి మంత్రి చినరాజప్పకు కూడా ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా కలెక్టర్ ప్రవీణ్కుమార్పై తీవ్రస్వరంతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. దీంతో జరిగిన తప్పును సరిదిద్దుకునేందుకు కలెక్టర్ ఆఘమేఘాల మీద ఆ ఎన్నికను నిలుపుదల చేశారు. మంత్రి లేఖ బయట పెట్టారన్న సాకుతో పశుసంవర్ధకశాఖ జేడీ కోటేశ్వరరావు, డీఎల్డీఏ ఈవో సూర్యప్రకాష్లను సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా కొత్త పాలకవర్గ ఎన్నిక కొలిక్కివచ్చే వరకు ఈవోతో పాటు చైర్మన్ బాధ్యతలను జేసీ–2 ఎ.సిరికి అప్పగించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిబంధనల మేరకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైనా కొత్త చైర్మన్ గాడు వెంకటప్పడు బృందం న్యాయపోరాటానికి సిద్ధమైనప్పటికీ మంత్రి గంటాతో ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి విశాఖనగరానికి వచ్చిన గంటాతో వెంకటప్పడు బృందం బేటీ అయ్యేందుకు యత్నించినా మంత్రికున్న కార్యక్రమాల వల్ల వీలు పడలేదు. దీంతో శుక్రవారం ఉదయం మంత్రితో బేటీ అయి జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకే తమ ఎన్నికలు నిర్వహించారని, అలాంటప్పుడు మా ఎన్నిక చెల్లదనడం సరికాదని మంత్రి దృష్టికి తీసుకురానున్నారు.తమకు జరిగిన అన్యాయంపై చినరాజప్ప సమక్షంలో జరిగే సమావేశంలో చర్చించాలని కోరనున్నారు.ఈ వ్యవహారంపై మంత్రి గంటా కూడా సీరియస్గానే ఉన్నారు. ప్రతి చిన్న విషయాన్ని అయ్యన్న పాత్రుడు వివాదం చేస్తున్నారని ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. డీఎల్డీఏ పాత పాలకవర్గం ఇప్పటికే రెండు దఫాలు పనిచేసిందని, పైగా కాంగ్రెస్కు చెందిన వ్యక్తి చైర్మన్గా ఉన్న ఈ పాలకవర్గాన్ని ఇంకా కొనసాగించాలని సిఫారసు చేయడం పట్ల మంత్రి గంటా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మంత్రి సమక్షంలోనే చర్చించాలని భావిస్తున్నారు. మరో వైపు జరిగిన పరిణామాలు..తాను తీసుకున్న చర్యలపై కలెక్టర్ ప్రవీణ్కుమార్ కూడా వివరణ ఇచ్చేం దుకు సిద్దమవుతున్నారు. సమీక్షలో డీఎల్డీఏపై ఇరువురు మంత్రులు సిగపట్లు çపడతారన్న చర్చ పార్టీలోనే జరుగుతుంది. అయితే సమీక్ష సందర్భంగా ఎలాంటి రచ్చ చేయొద్దని, పార్టీ కార్యాలయంలో కూర్చొని సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామన్న ప్రతిపాదన చినరాజప్ప తెచ్చే అవకాశాలు కన్పిస్తు న్నాయి. సమీక్ష పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలపైనే జరగాలని, ఏదైనా సమస్యలుంటే పార్టీ అంతర్గత సమావేశంలో చర్చించుకుందామన్న ప్రతిపాదన పలువురు ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నారు. సమీక్ష అనంతరం పార్టీ కార్యాలయంలో సమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. సమీక్షలో కాకున్నా పార్టీ సమావేశం లోనైనా రచ్చకెక్కిన ఈ అంశంపై చర్చ జరిగే అవకాశాలు లేకపోలేదని పార్టీ నేతలంటున్నారు. -
‘బరి’ తెగించారు
అధికార పార్టీ నేతల దన్నుగా జూదగాళ్లు ‘బరి’ తెగించారు. అనుకున్నట్టుగానే పందెం కోళ్లతో కాళ్లు దువ్వించారు. పదుల సంఖ్యలో బోర్డులు ఏర్పాటు చేసి గుండాటలు నిర్వహించారు. తాత్కాలిక బెల్టు షాపులు పెట్టి మద్యాన్ని ఏరుల్లా పారించారు. చట్టాన్ని అడుగడుగునా అపహాస్యం చేస్తూ చెలరేగిపోయారు. కోర్టు ఆంక్షలు.. పోలీసుల హెచ్చరికలు ఉన్నప్పటికీ జూదాల నిర్వాహకులు కోడి పందేలు.. గుండాటలు నిర్వహించి తమ సత్తాచాటారు. కోడి పందేలు కాకుండా ఈ ఏడాది కొత్తగా ఎనిమిది పుంజుల పందేలు, ... పొట్టేలు పందేలు...సూట్బాల్ పందేలతో ‘కాయ్రాజా కాయ్’ అంటూ స్వైర విహారం చేశారు. అమలాపురం: అటు పందేల్లో కోళ్లు...ఇటు నోట్ల కట్టలు తెగ తెగిపడుతున్నాయి. వేల రూపాయలతో మొదలై లక్షల రూపాయలు దాటాయి. ఒకప్పుడు చాటుమాటుగా సాగే పందేలు ఇప్పుడు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగాయి. కోనసీమలోని నియోకవర్గాల్లో ఈ జోరు ఎక్కువగా కనిపించింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే తంతు సాగింది. ఐ.పోలవరం మండలం మురమళ్లలో పందేలు తారస్థాయికి చేరుకున్నాయి. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు లాంఛనంగా ప్రారంభించారు. తొలిసారి సూట్బాల్ బాల్ పందేలకు శ్రీకారం చుటారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యాపార ప్రముఖులు తరలిరావడంతో అంచనాలకు మించి బెట్టింగులు జరిగాయి. అందరికీ కనిపించే విధంగా ఇక్కడ ఐదు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సుమారు ఐదు వేల మంది కూర్చొనేందుకు వీలుగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. హోంమంత్రి నియోజకవర్గాల్లో... శాంతి భద్రతలు పర్యవేక్షించి.. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన ఉప ముఖ్యమంత్రి, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత నియోజకవర్గమైన పెద్దాపురం, ఆయన సొంత ప్రాంతమైన అమలాపురం నియోజక వర్గాల్లో ఈ ఏడాది పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. ఒక్క పెద్దాపురం నియోజకవర్గంలోనే ఎనిమిది చోట్ల పందేలు జరగడం విశేషం. సామర్లకోట మండలం వేట్లపాలెంలో జోరుగా సాగాయి. వీటికి చిన్నాచితకా పందేలు అదనం. ఈ నియోజకవర్గంలోనే రూ.2.50 కోట్ల వరకూ చేతులు మారాయి. అమలాపురం నియోజకవర్గంలో అల్లవరం, ఉప్పలగుప్తం, అమలాపురం మండలాల్లో పందేలు.. గుండాటలు జోరుగా జరిగాయి. అల్లవరం మండలం గోడి, గోడిలంకల్లో రూ.కోటికి పైగా పందేలు జరిగాయి. ఇక్కడ ఒక్కో పందెం రూ.లక్ష నుంచి రూ.మూడు లక్షల మధ్య సాగింది. ఇవే కాకుండా జిల్లాలో రాజానగరం నియోజకవర్గంలో పుణ్యక్షేత్రం, దివాన్చెరువు, రాజోలు నియోజకవర్గంలో మలికిపురం, లక్కవరం, రాజోలు, చింతలపల్లిలో, మామిడికుదురు మగటపల్లిలో ఆరుచోట్ల పందేలు నిర్వహిస్తున్నారు. పి.గన్నవరం మండలం వాడ్రేవులపల్లి, ఏజెన్సీలోని రంపచోడవరం, మెట్టలోని తుని, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో, మండపేట, రాయవరం, కపిలేశ్వరపురం లంకల్లోనూ ఇదే జోరు కొనసాగింది. కొత్త తరహాలో ఎనిమిది పుంజుల పందెం ఆత్రేయపురం మండలం లొల్ల, వసంతవాడ, పేరవరం, బొబ్బర్లంక, ర్యాలీ, తాడిపూడి, నార్కెడుమిల్లిలో పందేలు శనివారం రాత్రి 11 గంటల నుంచే ఆరంభించారు. ఇక్కడ తొలిసారిగా ఎనిమిది పుంజుల పందేలు జరుగుతున్నాయి. సాధారణంగా రెండు పుంజులను బరిలోకి వదిలి పందెం నిర్వహిస్తారు. కానీ ఇక్కడ ఎనిమిది పుంజులను ఒకేసారి వదిలి పోటీ పెడుతున్నారు. ఇంచుమించు అన్ని పుంజులు మీద పందెం కాస్తారు. కానీ చివరి వరకు నిలిచే పందెం కోడి మీద కాసినవారికి మాత్రమే జూదం గెలుస్తున్నారు. రూపాయి పందెం కాస్తే ఏడు రూపాయిల వరకు వచ్చే అవకాశముండడంతో ఈ పందేలపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఇక్కడ పుంజుమీద రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పందేలు కాస్తున్నారు. గుండాట.. మద్యమే... ప్రధాన ఆదాయం కోడిపందేల నిర్వాహకులకు గుండాటల్లో ఆదాయం కనిపిస్తుండడంతో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో వీటిని ఏర్పాటు చేశారు. జూదగాళ్లు సైతం గుండాటల్లోనే పెద్ద ఎత్తున సొమ్ములు కాస్తున్నారు. మురమళ్లలో జరిగిన గుండాట పందేనికి వచ్చి రూ.30 వేలు కాసిన వారు కూడా ఉన్నారు. మద్యం అమ్మకాలు సైతం జోరుగా సాగుతున్నాయి. తాగినవారికి తాగినంతగా అందుబాటులో ఉంచారు. మురమళ్ల వంటి చోట అందుబాటులో ఖరీదైన మద్యాన్ని కూడా ఉంచడం గమనార్హం. ఖాకీల మౌనం... పందేలు జరగనిచ్చేది లేదంటూ హెచ్చరించిన పోలీసులు శనివారం అర్ధరాత్రి నుంచి మౌనం వహించారు. పందేలను చూసీచూడనట్టుగా వదిలేశారు. హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత జిల్లాలో టీడీపీ పెద్దల ఒత్తిడికి పోలీసులు తలొగ్గారు. విచిత్రమైన విషయం ఏమిటంటే గత ఏడాదికన్నా ఈ ఏడాది పందేల బరులు రెట్టింపు కావడం విశేషం. కోడి పందేలంటే ముందుగా గుర్తుకువచ్చే పశ్చిమ గోదావరి జిల్లాలో మధ్యాహ్నం వరకు పోలీసులు పందేలు జరగకుండా చూడగలిగారు. కానీ ఈ జిల్లాలో మాత్రం శనివారం అర్ధరాత్రి నుంచే ఊపందుకోవడం గమనార్హం. -
రాత్రి వేళ.. రయ్..
మధురపూడి (రాజానగరం): విమానయాన ప్రయాణాలను అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎయిర్నెట్ వర్క్ను విస్తరించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మంగళవారం మధురపూడిలోని రాజమహేంద్రవరం వి మానాశ్రయంలో ఇండిగో విమానయానసంస్థ çసర్వీసులను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇండిగో సంస్థ దేశీ విమానయాన రంగంలో స్థానాన్ని బలపరచుకుందన్నారు. మంగళవారం ఇండిగో రాజమహేంద్రవరం–చెన్నై ద్వారా ఏటీఆర్ ఆపరేషన్స్ను ప్రారంభించారు. మొత్తం నాలుగు సర్వీసులు ఉదయం నుంచి రాత్రివరకు నడుస్తాయన్నారు. ఉదయం 8.20 గంటలకు మొదటిసర్వీసు, మధ్యాహ్నం 12.30 గంటలకు రెండో సర్వీసు, మధ్యాహ్నం 2.35 గంటలకు మూడో సర్వీసు ఉంటాయన్నారు. నైట్ ల్యాండింగ్స్ మొదలు ఇండిగో విమాన సర్వీసులతో నైట్ ల్యాండింగ్స్ ప్రారంభమవుతాయని ఎయిర్పోర్టు డైరెక్టర్ ఎమ్.రాజ్కిషోర్ అన్నారు. రాత్రి 8.40గంటలకు చివరి సర్వీసు చేరుతుంది. దీంతో రాత్రి సర్వీసుల నిర్వహణకు ఎయిర్పోర్టును అభివృద్ధి చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఇండిగోసంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ కస్టమర్ సర్వీసెస్ ఎం.సంజీవ్ రామదాస్ జెండా ఊపి విమాన సర్వీసులను ప్రారంభించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరంఎంపీ మాగంటి మురళీ మోహన్, ఎమ్మెల్యేలు ఆకుల రామకృష్ణ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ చైర్మన్ పంతం రజనీశేష సాయి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, రాజమహేంద్రవరం సబ్ కలె క్టర్ సాయికాంత్ వర్మ, అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు టెర్మినల్ భవనంలో జ్యోతి ప్రజ్వలన, కేక్కటింగ్ జరిగింది. రాజమహేంద్రవరాన్ని కేంద్రం అంగీకరించాలి రాజమహేంద్రవరంగా రాష్ట్ర ప్రభుత్వం నామకరణ చేసింది. ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపినా కేంద్రం అంగీకరించలేదని రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహాన్ ప్రెస్మీట్లో తెలిపారు. ‘‘కేంద్రం అంగీకారం అవసరం. దానికోసం ప్రయత్నిస్తాను. రైల్వేజోన్ సాధనకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బడ్జెట్ సమావేశాలకు ముందే మా ప్రతిపాదనలు తీసుకోవాలి. కాని కేంద్రం (పార్లమెంటరీకమిటీ) ఎంపీలకు అవకాశం ఇవ్వలేదు’’ అని చెప్పుకొచ్చారు. -
హోం మంత్రి చినరాజప్ప ఇంకా అలకవీడలేదు
-
అలకవీడని చినరాజప్ప..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప ఇంకా అలకవీడలేదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి గురువారం హోంమంత్రికి ఆహ్వానం లభించని విషయం తెలిసిందే. దీంతో అవమానంగా భావించిన చినరాజప్ప అప్పటి నుంచి అలకబూనారు. అయితే ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు చినరాజప్పతో ఫోన్లో మాట్లాడారు. మీ శాఖలో మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అధికారుల పట్ల మెతక వైఖరితో ఉండొద్దని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది. శంకుస్ధాపనకు తనని పిలవకుండా అవమానించారని చినరాజప్ప మనస్థాపానికి గురయ్యారు. మంత్రినే పట్టించుకోకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు వ్యవహరించిన తీరు పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. (ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నచంద్రబాబు.. ) -
టీడీపీలో ‘కొండబాబు’ రగడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఆధిపత్యానికి, ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారన్న అక్కసుతో కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) స్వరం పెంచుతున్నారు. ఎమ్మెల్యే అని చూడడం లేదు...మంత్రి అని తగ్గడమూ లేదు... సహ నేతలపై మాటల యుద్ధం ప్రకటిస్తున్నారు. అవినీతి ఆరోపణలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. నువ్వానేనా అన్నట్టుగా ఏదో ఒకటి తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఇదే అదనుగా స్వప్రక్ష ప్రత్యర్థులు కూడా కొండబాబుని లక్ష్యంగా చేసుకొని పావులు కదుపుతున్నారు. కాకినాడ నగరమంతా తనదిగా ఎమ్మెల్యే కొండబాబు భావించడమే కాకుండా ఎంతటి పెద్ద నేతలైనా తన తర్వాతే అన్నట్టుగా వ్యవహరిస్తుండగా జిల్లా కేంద్రమైన కాకినాడ అందరిదీ అనే రీతిలో మంత్రి నిమ్మకాయల చినరాజప్పతోపాటు మిగతా నేతలూ భావిస్తున్నారు. ఆ తరహాలోనే కాకినాడకు వచ్చి పలువురు నేతలు చక్రం తిప్పుతుండడంతో కొండబాబు అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. కొండబాబే లక్ష్యంగా... వాస్తవానికి ఎమ్మెల్యే కొండబాబుపై అనేక ఆరోపణలున్నాయి. ఆయన సోదరుడు సత్యనారాయణైతే సూపర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారన్న విమర్శలున్నాయి. పార్టీలోని ప్రత్యర్థులకు ఇవి అస్త్రాలుగా మారాయి. కాకినాడలో పార్టీకి చెడ్డపేరు వస్తుందన్న ప్రచారానికి ప్రత్యర్థులు తెరలేపారు. ఇదే క్రమంలో కాకినాడ కార్పొరేషన్ మేయర్ గిరీని తన వర్గీయులకు దక్కకుండా మంత్రి రాజప్ప, ఎంపీ తోట నర్సింహం వ్యవహరించారు. కనీసం డిప్యూటీ మేయర్ పదవైనా దక్కించుకోవాలని, ముఖ్యంగా మత్స్యకార సామాజిక వర్గానికి ఇప్పించుకోవాలని కొండబాబు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి వ్యూహాత్మకంగా ఎగరేసుకుపోయారు. కార్పొరేషన్లోని కో ఆప్షన్ పదవులైనా దక్కించుకోవాలని ఆరాటపడుతున్నా అది కూడా ఫలించేలా లేదు. దీంట్లో మంత్రి రాజప్ప జోక్యం చేసుకుని కొండబాబు వశం కాకుండా పావులు కదుపుతున్నారు. ఇలా అడుగుగడుగునా ప్రతికూల పరిస్థితులే ఎదురవుతుండడంతో ఆ వర్గం అయోమయంలో పడింది. రగిలిపోతున్నా అదే బాట... వరుసగా ఎదురవుతున్నా అవమానాలు, వస్తున్న ఆరోపణలతో కొండబాబు రగిలిపోతున్నారు. తానడిగిన మేరకు ఇవ్వకపోగా కాదన్న వాటికి ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపోతున్నారు. దీంతో మొన్నటికి మొన్న రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి దంపతులు లక్ష్యంగా పరోక్ష ఆరోపణలకు దిగగా, తాజాగా మంత్రి రాజప్పపైనే ధ్వజమెత్తుతున్నట్టు తెలిసింది. మంత్రి సోదరుడే ఎక్కువ సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నారంటూ ఆరోపణలు సంధిస్తున్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో రాజప్ప పెత్తనమేమిటని ప్రశ్నించడమే కాకుండా తన నియోజకవర్గంలో ఎవరి జోక్యం అవసరం లేదని పట్టుబడుతున్నారు. అధిష్టానం వద్దే తేల్చుకుంటానని తన అనుయాయుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది. ఒకరిపై ఒకరు ధ్వజమెత్తుతూ సాగుతున్న పోరు టీడీపీలో అసక్తి రేకెత్తిస్తోంది. -
రేవంత్రెడ్డి వ్యాఖ్యలు సరికాదు
భీమవరం : తెలుగుదేశం పార్టీలో అంచెలంచలుగా ఎదిగిన అనుమోలు రేవంత్రెడ్డి తానున్న పార్టీపైనా, మంత్రులు, నాయకులపైనా బురదచల్లే విధంగా విమర్శలు చేయడం అవివేకమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సోమవారం సోమేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ నాయకులు పార్టీలు మారడం షరా మామూలేనని అయితే అనేక పదవులు అనుభవించి పార్టీని వీడే సమయంలో ఆ పార్టీపై, నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రేవంత్రెడ్డికి టీడీపీలో కొనసాగడంలో ఇబ్బందులు ఉంటే నేరుగా పార్టీ మారుతున్నట్టు చెప్పాలి తప్ప మరొకరిపై బురదజల్లడం సరైన పద్ధతి కాదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుతో ఏపీ మంత్రులకు సంబం«ధాలున్నాయని చెప్పడం భావ్యం కాదన్నారు. దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దాడుల వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూసుకుంటారని చినరాజప్ప స్పష్టం చేశారు. -
‘రేవంత్ మాపై బురదజల్లడం సరికాదు’
సాక్షి, భీమవరం : రేవంత్రెడ్డి ఒక పార్టీలో ఎదిగి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటూ మా మంత్రులపై బురద జల్లి వెళ్లిపోతాననడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. కార్తీక సోమవారం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామాన్ని ఆయన సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డికి ఏవైనా ఇబ్బందులు ఉంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. అంతే కానీ అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు. ఇటీవలి కాలంలో చింతమనేని ప్రభాకర్ ఓ కుటుంబంపై దాడి చేసిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారని తెలిపారు. కాగా సోమవారం ఉదయం పంచారామ ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగత పలికారు. చినరాజప్ప ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. -
నాకూ దుస్తులు కుట్టండి
తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం క్రైం: సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాధించే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సోమవారం గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన రాజప్ప మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ కూడా జైల్లో ఉన్నారని, అనంతరం ఆయన జైలులో ఖైదీ సంక్షేమానికి పాటుపడ్డారని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి రూ.20 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. కేంద్ర కారాగారంలో ఖైదీల ఆరోగ్యం కోసం 50 పడకల హాస్పిటల్ నిర్మించేందుకు చర్యటు చేపట్టామన్నారు. గత ఏడాది జైల్ ఉత్పత్తుల ద్వారా రూ.33.63 లక్షల లాభాలు వచ్చాయని తెలిపారు. పెట్రోల్ అమ్మకాల ద్వారా రూ1.45 కోట్ల నికర లాభాలు ఆర్జించినట్టు తెలిపారు. ఖైదీలను కోర్టులకు, హాస్పిటల్స్కు తీసుకువెళ్లేటప్పుడు ఎస్కార్ట్ సమస్య ఉందని దానిని పరిష్కరిస్తామని తెలిపారు. పెరోల్ విషయంలో గడువు 45 రోజులు పెంచామన్నారు. ముందుగా గాంధీజీ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గుడా చైర్మన్ గన్ని కృష్ణ, కోస్తా రీజియన్ జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాసరావు, జైల్ సూపరింటెండెంట్ ఎం.వరప్రసాద్, రెండో డివిజన్ కార్పొరేటర్ పీతాని లక్ష్మీకుమారి, మానసిక వైద్యులు కర్రి రామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం క్రైం: జాతిపిత మహాత్మా గాంధీ జయంతి, ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ను సందర్శించిన హోమ్ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సెంట్రల్ జైల్లో ఉన్న టైలరింగ్ యూనిట్ను పరిశీలించారు. యూనిట్లో ఖైదీలు కుట్టే రెడీమేడ్ దుస్తులను పరిశీలించి వారి నైపుణ్యానికి ముచ్చట పడ్డారు. హోమ్ మంత్రి కూడా తనకు దుస్తులు తయారు చేయాలని కొలతలు ఇచ్చారు. దీనితో ఆయన వెంట ఉన్న నేతలు సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, గన్ని కృష్ణ, తదితరులు కూడా తమతమ కొలతలు ఇచ్చారు. అలాగే ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఖైదీలకు నిర్వహించిన క్రీడల్లో విజేతలకు హోం మంత్రి చినరాజప్ప సర్టిఫికెట్లు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా జైల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అకట్టుకున్నాయి. గాంధీజీ అడుగుజాడల్లో నడవాలి జిల్లా ఎస్పీ విశాల్గున్ని కాకినాడ క్రైం: అహింసాయుత సిద్ధాంతంతో ప్రపంచ ప్రాచుర్యం పొందిన గొప్ప దార్శనికుడు మహాత్మాగాంధీ అని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని తెలిపారు. సోమవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీకి నివాళులర్పించారు. స్వాతంత్య్రం సాధనలో మహాత్మాగాంధీ జాతికి చూపిన అహింసాయుత మార్గం జాతి ఎన్నటికీ మరువదన్నారు. కార్యక్రమంలో ఓఎస్డీ వై.రవిశంకర్రెడ్డి, ఏఎస్పీ ఏఆర్ వీఎస్ ప్రభాకరరావు, ఎస్బీ డీఎస్పీలు ఆర్.విజయభాస్కరరెడ్డి, ఎస్.అప్పలనాయుడు, ఆర్ఐ ఏఆర్ రాజా పాల్గొన్నారు. -
పొరుగు నేతే పవర్ ఫుల్లా
♦ ‘కాకినాడ కదన సారథి’గా మంత్రి ప్రత్తిపాటి ♦ పార్టీ జిల్లానాయకుల్ని పక్కన పెడుతున్న చంద్రబాబు ♦ మొన్న ఎమ్మెల్యే వనమాడి, నేడు డిప్యూటీ సీఎం రాజప్ప ♦ ఆర్థిక మంత్రి యనమలకూ దక్కని ప్రాధాన్యం ♦ జీర్ణించుకోలేకపోతున్న జిల్లా ‘దేశం’ శ్రేణులు సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబుకు పార్టీ జిల్లానేతల సమర్థతపై నమ్మకం సడలింది. వారితో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలను గట్టెక్కలేమనుకుంటున్నారు. ఓటమి భయంతో వారిని పక్కన పెట్టేస్తున్నారు. హుటాహుటిన పొరుగు నేతలను రంగంలోకి దించుతున్నారు. నయానో, నజరానాలతోనూ కార్పొరేషన్ను దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే.. ఆయన తీరును స్థానిక నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. బయటి వారొచ్చి ఇక్కడ ఏం చేస్తారని పెదవి విరుస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరికి కళ్లెం.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎన్నికల బాధ్యతల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుగా అధిష్టానం చూస్తోంది. ఎన్నికల్లో ఆయన వలన కలిసొచ్చేదేమీ ఉండదనే అభిప్రాయం కేడర్లో కూడా ఉంది. ఇక, పార్టీ పరువును మంట గలిపేశారన్న ఆలోచనతో పంపకాల్లోనే సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావును వ్యూహాత్మకంగా పక్కన పెట్టేశారు. మంత్రుల ద్వారా ఎమ్మెల్యేకు చెక్ పెట్టారు. ఆ మంత్రుల్లో ఒకరైన డిప్యూటీ సీఎం, హోంమంత్రి చినరాజప్పకు తాజాగా షాక్ ఇచ్చారు. అవమానకర రీతిలో ఆయన్ని పక్కన పెట్టినట్టు తెలిసింది. సీట్ల పంపకాల్లో అనుసరించిన ధోరణి పార్టీని కుదిపేయడంతో చినరాజప్పకు అసమ్మతి సెగ తాకింది. ఏకపక్షంగా అభ్యర్థులను ఎంపిక చేశారంటూ అసంతృప్తివాదులంతా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు కాపుల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. మరోవైపు నగరంలో పార్టీకి ఆశించినంత పట్టులేదు. ఇంకోవైపు సీట్ల పంపకాల్లో సమతూకం లేకపోవడంతో కొన్ని సామాజిక వర్గాలు దూరమయ్యాయి. ఈ నేపథ్యంలో చినరాజప్పను నమ్ముకుంటే కష్టమన్న అభిప్రాయంతో చంద్రబాబు ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలిసింది. ఆయన స్థానంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజప్ప ఇకపై వెనకుండి నడవడం తప్ప ముందుండి నడిపించే పరిస్థితి లేదని పార్టీలో చర్చ జరుగుతోంది. కాకపోతే, ఎక్కడి నుంచో వచ్చినచ నేతలు ఇక్కడేం చేస్తారని, పార్టీ పరిస్థితి అలా తయారైందని కొందరు పెదవి విరుస్తున్నారు. -
ఎలక్షన్... మంత్రులకు టెన్షన్
♦ అంటీముట్టనట్టుగా మంత్రి యనమల ♦ చిన రాజప్పకు పరీక్ష సాక్షి ప్రతినిధి, కాకినాడ : కార్పొరేషన్ ఎన్నికలు టీడీపీ కీలక నేతలకు కఠిన పరీక్షగా మారాయి. ఓ వైపు ప్రభుత్వ వ్యతిరేకత.. మరోవైపు స్థానిక ప్రజాప్రతినిధుల తీరుపై వెల్లువెత్తుతున్న ఆగ్రహం.. చంద్రబాబు అంటే మండిపడుతున్న కీలక సామాజికవర్గాలు.. అభివృద్ధికి నోచుకోని కాకినాడ స్మార్ట్సిటీ.. ఇలా అన్ని వైపులా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో హఠాత్తుగా వచ్చి పడిన కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు అధికారపార్టీ నేతలకు తలనొప్పిగా మారాయి. ఇక జిల్లాకు చెందిన మంత్రులకైతే అగ్నిపరీక్షే. ప్రజావ్యతిరేకతను ఎదురొడ్డి కాకినాడ కార్పోరేషన్లో పార్టీని విజయతీరాలకు చేర్చడంపై మంత్రులు ముల్లగుల్లాలు పడుతున్నారు. ఆమడ దూరంలో యనమల ఇటు పార్టీలోను.. అటు మంత్రివర్గంలో సీనియర్గా ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖమంత్రి యనమల రామకృష్ణడు కార్పోరేషన్ ఎన్నికలకు అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆయనెప్పుడూ ఇదే పంధాను అనుసరిస్తుంటారు. కాని గత కొంతకాలంగా జిల్లాలో తనమాట చెల్లుబాటు కాని పరిస్థితుల్లో పూర్తిగా దూరంగా ఉండే అవకాశముందని టీడీపీ నేతలంటున్నారు. జెడ్పీ చైర్మన్ విషయంలో ఆయన మాట చెల్లుబాటు కాలేదు. కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల మాటకే అదిష్టానం ప్రాధాన్యత ఇస్తోంది. దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందనే వాదనలు ఈ నేపథ్యంలో కార్పొరేషన్ ఎన్నికలు రావడం యనమల పాత్ర చర్చ జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక అంతా సర్వేలు, ఐవీఆర్ఎస్ విధానంతో ఉంటుందని అధిష్ఠానం తేల్చిచెప్పడం కూడా ఆయన పాత్ర పెద్దగా లేదన్నట్టుగా చేసింది. రాజప్ప చుట్టూ ఉచ్చు... ఇక ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు మాత్రం ఈ ఎన్నిక అగ్నిపరీక్షే. రాజప్ప కార్పొరేషన్ను ఆనుకుని ఉన్న పెద్దాపురం అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ మార్పు వంటి విషయాల్లో చురుగ్గా ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల బాధ్యత కూడా పార్టీ ఆయనకే అప్పగించింది. దీంతో గెలిపించాల్సిన బాధ్యత సహజంగా రాజప్ప మీదనే ఉంది. రాజప్పకు సొంత సామాజికవర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విషయంలోను, ఉద్యమాన్ని ఆణిచివేసే విషయంలో రాజప్ప సొంత సామాజికవర్గం నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. పైగా ముద్రగడను ప్రతీ విషయంలోనూ టార్గెట్ చేస్తూ రాజప్ప మాట్లాడడం ద్వారా కాపువర్గీయులు రాజప్ప పేరు చెబితేనే మండిపడుతున్నారు. టీడీపీపై ఉన్న వ్యతిరేకతను తగ్గించేందుకు ఆ సామాజికవర్గం ఓట్లను పొందేందుకు కాపు మహిళకు మేయర్ పదవి కేటాయిస్తున్నట్టు టీడీపీ ప్రకటించినప్పటికీ పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. కేవలం ఎన్నికల లబ్ధికోసమేనని ఆ సామాజికవర్గం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజప్ప ఆ సామాజికవర్గాన్ని ఎంత వరకు పార్టీ మెప్పించకువస్తారనేది వేచి చూడాల్సిందే. హోమ్... ఆర్థిక వంటి కీలక శాఖలకు మంత్రులుగా ఉన్న రాజప్ప, యనమల ఎన్నికల్లో పార్టీని గెలిపించకపోతే రాజకీయంగా అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వస్తోంది. -
మహిళలపై హోం మంత్రి రాజప్ప చిందులు
► మాట వినకుంటే పింఛన్లు పీకేస్తా ► ఆర్బీపట్నంలో మహిళలకు హోం మంత్రి వార్నింగ్ ఆర్బీపట్నం (పెద్దాపురం): మేం చెప్పిందే వేదం.. మేం చేసిందే అభివృద్ధి.. ఏమనుకుంటున్నారో... వేషాలు వేస్తే మహిళలని చూడం. అవసరమైతే పింఛన్లు పీకేస్తాం. ఇవి ఎవరో తెలుగు తమ్ముడు అన్నమాటలు కావు.. సాక్షాత్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఊగిపోతూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైనమిది. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో మంగళవారం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రాత్రి వేళ గ్రామంలోకి వచ్చిన రాజప్పకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేవారు. తమ ఊరు అభివృద్ధిపై దృష్టి సారించాలని మహిళలు చెప్పే లోపే ఆయన ఆగ్రహంతో ఊగిసలాడిపోయారు. మహిళలని చూడకుండానే ఏదో పార్టీల అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. మేం చేసే అభివృద్ధి పనులకే వత్తాసు పలకాలంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవసరమైతే మీ పింఛన్లు పీకేస్తా.. అభివృద్ధికి సహకరించాలే తప్ప వేషాలు వేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహానికి లోనయ్యారు. దీనిని బట్టి అర్థమౌతోంది మంత్రి రాజప్పకు అభివృద్ధిపై ఎంత ఆసక్తి ఉందో. అంతేగాకుండా ఆ గ్రామానికి అనుకున్న సమయానికి వస్తే మహిళలు ప్రశ్నలు అడుగుతారనే ఆలస్యంగా వచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
301 మండలాల్లో కరవు ఛాయలు
► శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అమరావతి: రాష్ట్రంలోని 301 మండలాల్లో కరవు ఛాయలు అలుముకున్నాయని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో 15, ప్రకాశం 56, నెల్లూరు 27, చిత్తూరు 66, వైఎస్సార్ 32, అనంతపురం 63, కర్నూలు 36, విజయనగరం జిల్లాలో 6 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. తాగునీటి సమస్యను అధిగమించడానికి రూ.60 కోట్లు విడుదల చేశామన్నారు. కరవు ఉపశమనంలో భాగంగా రెయిన్గన్లు, స్ప్రింక్లర్ల కొనుగోలు, నిర్వహణ కోసం రూ.103.50 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కరవు ప్రభావిత మండలాల్లో వంద రోజుల ఉపాధిని పూర్తి చేసిన కుటుంబాలకు మరో 50 రోజులు వేతనంతో కూడిన ఉపాధిని కల్పిస్తున్నామన్నారు. ప్రజా సాధికార సర్వే ద్వారా అసంఘటిత రంగంలో ఇప్పటివరకూ 2.10 కోట్ల మంది కార్మికులను గుర్తించామని, వారిని చంద్రన్న బీమా పరిధిలోకి తెచ్చామని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. సాధారణ మరణం పొందిన 32,182 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున అందజేశామని చెప్పారు. ప్రమాదాల్లో 3,946 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 845 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు తెలిపారు. -
మంత్రులకు,ఐఏఎస్లకు క్యాష్లెస్ పాట్లు
-
అమ్మోనియం గ్యాస్ లీక్: 50 మందికి అస్వస్థత
తూర్పుగోదావరి: తూర్పుగోదారి జిల్లాలోని పెద్దాపురం నెక్కంటి సీఫుడ్స్లో అమ్మోనియం గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో 50 మంది అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. వారిని చికిత్స నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎస్పీ రవిప్రకాశ్ బాధితులను పరామర్శించినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఫొటో ఎందుకు తీసేశారో మరి!
సాక్షి, అమరావతి: ఈ ఫొటో చూస్తే మీకేమనిపిస్తుంది? టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేశ్ ప్రశ్నిస్తుంటే ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప సమాధానం చెప్తున్నట్టుగా లేదూ! కావాలంటే కాస్త జాగ్రత్తగా వారి ముఖకవళికలను గమనించండి.. అక్కడేం జరిగి ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఫేస్బుక్లో తెలుగుదేశం పార్టీ అఫీషియల్ పేజీలో ఈ ఫొటోను చూసిన కొందరు నెటిజన్లు తాము అర్థం చేసుకున్న విషయాన్నే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చిన రాజప్పను లోకేశ్ నిలదీస్తున్నట్లు భావించిన నెటిజన్లు దానిపై విస్తృతమైన చర్చ జరిపారు. పలు న్యూస్ సైట్లలోనూ లోకేశ్ తీరుపై ఫొటోతో సహా పలు కథనాలు వెలువడ్డాయి. ఇదే విషయాన్ని ‘సాక్షి’ ప్రచురించింది. సాక్షి కథనంతో టీడీపీ నేతలు ఉలిక్కిపడ్డారు. ఫేస్బుక్లోని అధికారిక పేజీ నుంచి ఆ ఫొటోను తొలగించారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి విడుదల చేశారు. అయితే ఈ ఫొటోకు సంబంధించిన దృశ్యం ఆ వీడియోలో కనిపించకపోవడం గమనార్హం. మరోవైపు లోకేశ్ తనను ఏమీ అనలేదని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. నెటిజన్ల చర్చను ప్రచురించిన ‘సాక్షి’ని విమర్శిస్తూ లోకేశ్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి లేఖ రాశారు. అసలక్కడేమీ జరగనప్పుడు ఆ ఫొటో ఎందుకు తొలగించారో, ఆ వీడియోలో ఫొటోకు సంబంధించిన దృశ్యం ఎందుకు లేదనే ప్రశ్నలకు సమాధానం మాత్రం లేదు. జగన్కు లోకేశ్ బహిరంగ లేఖ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో తనకు ఉన్నది అభిమానపూర్వక సంబంధాలేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పేర్కొన్నారు. తమ ఇద్దరి సంబంధాలపై వక్రీకరించి ప్రచారం చేస్తున్నారంటూ లోకేశ్ శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. తాను, టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు చిన్నరాజప్ప ఉన్న ఫోటోకు వక్రభాష్యాలు జోడించి ‘సాక్షి’లో నిరాధార వార్తలు ప్రచురించారని లేఖలో తప్పుపట్టారు. పార్టీలో సీనియర్ నాయకులను అవ మానించే కుసంస్కారం తనకు లేదని పేర్కొన్నారు. దుష్ర్పచార రాజకీయాలు మాని నిర్మాణాత్మక రాజకీయాలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
సోషల్ మీడియా దెబ్బకు దిగొచ్చిన లోకేశ్
విజయవాడ: టీడీపీ శిక్షణ తరగతుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు లోకేశ్ వ్యవహరించిన తీరుపట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆయన దిగొచ్చారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పను అవమానించేలా ఉన్న ఫొటోను లోకేశ్ ఫోస్బుక్ నుంచి తొలగించారు. టీడీపీ శిక్షణ తరగతుల్లో లోకేశ్ ముందు చినరాజప్ప నిలబడి మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఫొటో బయటకురావడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. వయసులో, అనుభవంలో తనకంటే పెద్దలైన వారికి లోకేశ్ ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా నిలబెట్టి మాట్లాడటం, నిలదీసినట్లు ప్రశ్నించడంపై నెటిజన్లు విరుచుకుపడ్డారు. పెద్దలను గౌరవించడం లోకేశ్ నేర్చుకోవాలంటూ కామెంట్ చేశారు. నెటిజెన్ల నుంచి విమర్శలు రావడంతో లోకేశ్ ఈ ఫొటోను ఫేస్బుక్ నుంచి తొలగించారు. -
గుంటూరులో వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి
గుంటూరు: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుంటూరు జిల్లా అతలాకుతలమవుతోంది. ఇప్పటికే భారీ వర్షాలకు జిల్లా నుంచి హైదరాబాద్కు వెళ్లే పలు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో అల్ప పీడనం బలపడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు సూచించడంతో.. జిల్లా వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇప్పటివరకూ ఐదుగురు మృతిచెందినట్టు ఏపీ ప్రభుత్వం గురువారం అధికారికంగా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థికసాయాన్ని ప్రభుత్వం ప్రకటించినట్టు ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగానే శిబిరాలకు తరలించినట్టు తెలపారు. గుంటూరు జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని చినరాజప్ప పేర్కొన్నారు. సికింద్రాబాద్- గుంటూరు సెక్షన్ నడికుడిలో 20 సెం.మీ వర్షపాతం నమోదు కాగా అక్కడి ఏడు ప్రాంతాలలో రైలు పట్టాలు మునిగిపోయినట్టు దక్షిణమధ్య రైల్వే జీఎం రవీందర్ గుప్తా తెలిపారు. సత్తెనపల్లి-పిడుగురాళ్ల మధ్య భారీ వర్షాలతో రైలు పట్టాలు మునిగిపోయినట్టు తెలిపారు. బెల్లంకొండ వద్ద రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులను బస్సులలో పంపించినట్టు చెప్పారు. వరద తగ్గిన వెంటనే మరమత్తులు చేపడతామన్నారు. ఆయా రూట్లలో రాకపోకలు సాగించే 41 రైళ్లను రద్దు చేశామని తెలిపారు. రైళ్లను పాక్షికంగా, మరికొన్ని రైళ్లను ఇతర మార్గాల్లో మళ్లించడం జరిగింది. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రైళ్లను నడుపుతున్నామన్నారు. మరమత్తులను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. ఈ ఘటనతో హైదరాబాద్ నుంచి దక్షిణ భారతానికి రైళ్ల రాకపోకలు చాలా వరకు స్తంభించి పోయాయి. ఫలక్నమా రైలు వరద కారణంగా వెనక్కి తిరిగి రావడం జరిగింది. అవసరమైతే పడవలు, హెలీకాప్టర్లను వినియోగించి ప్రయాణికులను సురక్షితంగా తరలిస్తామని చెప్పారు. అంతేకాకుండా అక్కడి ప్రభుత్వ సహకారాన్ని తీసుకుని ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చే ప్రయత్నం చేశామన్నారు. ప్రయాణికులకు ఆహారాన్ని కూడా ఉచితంగా అందజేసినట్టు రవీందర్ గుప్తా తెలిపారు. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల బీభత్సానికి గుంటూరు జిల్లాలోని పలుప్రాంతాలు నీటమునిగాయి. సత్తెనపల్లి, నరసరావుపేట, చిలలూరిపేట, పెదకూరపాడు, గురజాల, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో అనేక గ్రామాల్లో చెరువులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. వరద ఉధృతికి కుప్పగంజ వాగులో నలుగురి గల్లంతు కాగా, బ్రాహ్మణపల్లి చెరువు కట్ట తెగి ఒకరు గల్లంతు కావడంతో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. అనుపాలెం-రెడ్డిగూడెం రైల్వే ట్రాక్పై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. ఇక జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు వద్ద కారు గల్లంతైంది. కారు నుంచి ముగ్గురు వ్యక్తులు బయటపడి ప్రాణాలు కాపాడుకున్నారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు. అటు క్రోసూరు మండలం విప్పర్ల వద్ద ఎద్దువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని అనేక ప్రాంతాలకు బస్సు ల రాకపోకలు సైతం స్తంభించి పోయాయి. పలుచోట్ల వరదల్లో ఆర్టీసీ బస్సులు, కార్లు, ఇరుక్కుపోగా అందరినీ సురక్షితంగా బయటకు తెచ్చారు. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన 160 మంది విద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లలేక పాఠశాలలోనే ఉండిపోయారు. రెంటచింతల మండలంలోని జిడ్డుపాలెం ఆదర్శ పాఠశాల చుట్టూ గోలివాగు, పిల్లివాగు నీరు చేరడంతో.. పాఠశాల నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేక విద్యార్థులు అక్కడే ఉండిపోయారు. విద్యార్థులకు పాఠశాలలోనే భోజన వసతులు ఏర్పాటు చేసి అక్కడే ఉండే విధంగా పాఠశాల సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. పొలం పనులకు వెళ్లిన ముగ్గురు రైతులు నీటిలో చిక్కుకుపోయారు. నర్సరావుపేట సమీపంలోని జొన్నలగడ్డ వద్ద గల బ్రిడ్జ్ నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. మేడికొండూరులో అప్రోచ్ రోడ్డు వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. గుంటూరు మాచర్ల, వినుకొండ వెళ్లే రహదారుల్లో రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. రోడ్లన్నీ జలమయమవడంతో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. కారంపూడి వద్ద ఎర్రవాగు, దాచేపల్లి వద్ద నాగులేరు, మాచర్ల వద్ద చంద్రవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో.. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. -
రెయిన్ గన్లతో రైతుల్ని ఆదుకుంటాం
వర్షాలు లేని ప్రాంతాల్లో రెయిన్ గన్లను ఉపయోగించి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. గురువారం నైవేద్య విరామ సమయంలో ఆయన డీజీపీ సాంబశివరావుతో కలసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల చినరాజప్ప మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో కరువు ప్రాంతాలను గుర్తించి సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాకి నలుగురు మంత్రులను కేటాయించి రైతులకు సహకారం అందించేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఈ మేరకు పీలేరు నుండి రెయిన్ గన్ల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తె లిపారు. శాంతి భద్రతల విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. టీటీడీ సేవలను ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. మంచి వసతులు ఉన్నాయని, కృష్ణ పుష్కరాల్లో టీటీడీ మెరుగైన ఏర్పాట్లు చేసిందని కితాబిచ్చారు. -
8 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు
- నాలుగైదు రోజులపాటు నిర్వహించే అవకాశం - జీఎస్టీ ఫోకస్ పాయింట్ గా సమావేశాలు - సభలో చర్చించే సమస్యలు పెద్దగా లేవు - ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి యనమల అమలాపురం రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 8న ప్రారంభమై, నాలుగైదు రోజులపాటు జరిగే అవకాశం ఉందని రాష్ట్ర ఆర్థిక, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఆయన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ తొలుత అసెంబ్లీ సమావేశాలను అమరావతిలో నిర్వహించాలనుకున్నామని, కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లును వచ్చే నెల 8 తేదీ నాటికి ఆమోదించి పంపాల్సిందిగా కోరడంతో హైదరాబాద్లో నిర్వహిస్తున్నామన్నారు. జీఎస్టీ బిల్లును మన శాసన మండలి, శాసనసభలు ర్యాటిఫై చేయాల్సి ఉందన్నారు. ‘రాజ్యాంగం ప్రకారం సగం రాష్ట్రాలు జీఎస్టీని మండలి, శాసనసభల్లో ఆమోదించాల్సి ఉందని, 2017 ఏప్రిల్ 1 నుంచి దీన్ని అమలు చేయాలని నిర్ణయించిన కేంద్రం రోడ్డు మ్యాప్ తయారు చేసింది’ అని యనమల చెప్పారు. దీనిలో భాగంగా వచ్చేనెల 8వ తేదీలోపు జీఎస్టీని ర్యాటీఫై చేయాలని సూచించిందన్నారు. జేఎస్టీ ఆమోదానికి ప్రతిపక్షం కూడా సహకరించాల్సిన అవసరముందన్నారు. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి, ఏఏ సబ్జెక్టులు చర్చించాలనేది తొలి రోజున బీఏసీ సమావేశం నిర్వహించి ప్రకటిస్తామన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి చైర్మన్గా ఉన్న హైపర్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఈ నెల 30న న్యూఢిల్లీలో సమావేశమై జీఎస్టీ పరిహారం కేటాయింపులపై చర్చిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రానికి రూ.935 కోట్లు బకాయి రావాల్సి ఉందన్నారు. -
దుర్గమ్మను దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
విజయవాడ: నగరంలోని కనకదుర్గ అమ్మవారిని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో చినరాజప్పకు దేవస్థానం ఈవో స్వాగతం పలికారు. అనంతరం బెంజిసర్కిల్లో జరుగుతున్న విశ్వశాంతి ఉద్గీద మహామృత్యుంజయ హోమం కార్యక్రమంలో చినరాజప్ప దంపతులు పాల్గొన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానం చేసిన ఏర్పాట్లు బాగున్నాయన్నారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. -
సలహాలు, సూచనలు ఇస్తే సవరించుకుంటాం'
గుంటూరు: పుష్కర ఘాట్ ఏర్పాట్లలో ఎక్కడైనా తప్పులు జరిగితే.. మీడియా సలహాలు, సూచనలు ఇస్తే సవరించుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం సీతానగరం పుష్కర ఘాట్లను వారు పరిశీలించారు. పుష్కరాల సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా 12 రోజుల పాటు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా పుష్కర ఘాట్ల వరకు అన్ని జిల్లాల నుంచి వచ్చే బస్సులను అనుమతిస్తున్నామని చెప్పారు. బస్సులకు ఎలాంటి అసౌకర్యం కలగదన్నారు. ఒకే రోజు 50 లక్షల మంది వచ్చిన సరిపడే ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆగస్టు 14, 15 సెలవు దినాలు కావడంతో రెట్టింపు మంది భక్తులు పుష్కర స్నానాలకు వచ్చే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. -
మమ అనిపించారు..
‘పంట విరామం’పై రైతులతో సర్కారు చర్చలు సమస్యలకు శాశ్వత పరిష్కారం కోరిన అన్నదాతలు అన్నింటినీ పరిష్కరిస్తామన్న ఉప ముఖ్యమంత్రి రాజప్ప ప్రధాన డిమాండ్లపై నిర్దిష్టమైన హామీలు ఇవ్వని సర్కారు 15 రోజులు చూసి ఉద్యమ కార్యాచరణ : రైతు సంఘాలు అమలాపురం : పంట విరామానికి ఉద్యుక్తులైన కోనసీమ రైతులతో చర్చలు జరిపిన ప్రభుత్వం.. వారి ప్రధాన డిమాండ్లకు సంబంధించి నిర్దిష్టమైన హామీలివ్వలేదు. చర్చలు మొక్కుబడి తంతుగా జరిగాయని అన్నదాతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చర్చలకు వచ్చిన రైతు సంఘం ప్రతినిధుల్లో ఎక్కువ మంది అధికారపార్టీలో పదవులున్నవారు కావడంతో చర్చలు ఏకపక్షంగా సాగిపోయాయంటున్నారు. ఇచ్చిన హామీల అమలుకు 15 రోజులు చూసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని రైతు సంఘాల ప్రతినిధులు అంటున్నారు. కోనసీమ రైతులతో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాస్థాయి అధికారులతో సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో చర్చలు జరిపారు. రైతులు స్వచ్ఛందంగా పంట విరామం ప్రకటించి, తమ సమస్యలపై ప్రభుత్వం చర్చలు జరపకుంటే ఈనెల 30న అమలాపురంలో రైతు సభ నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్న నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు వచ్చింది. అయితే చర్చల్లో ప్రభుత్వం తరపున రాజప్ప చెప్పాల్సింది చెప్పారేకాని మాట్లాడేందుకు రైతులకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. తొలుత ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యల్ని వివరించిన రాజప్ప ఎన్ని సమస్యలనైనా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సాగు జరగకుండా కావాలని ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించే ధోరణిలో మాట్లాడడంతో రైతు సంఘం ప్రతినిధులు నొచ్చుకున్నారు. మే 15కల్లా నీరిచ్చేది కల్లే..! రైతు సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ అధ్వానంగా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ, మే 15 నాటికి సాగునీరు విడుదల చేయకపోవడం, ఇన్పుట్ సబ్సిడీ, పెట్టుబడులకు తగ్గ మద్దతు ధర లేకపోవడం, యూంత్రీకరణ, ధాన్యం కొనుగోలులో నిబంధనల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను లేవనెత్తారు. వీటిలో ఒక్కదానిపైనా నిర్దిష్టమెన హామీ రాలేదు. ముఖ్యంగా మే 15 నాటికి నీరు విడుదల చేయాలన్న మధ్యడెల్టా రైతుల డిమాండ్పై వచ్చే ఏడాది ఇస్తామనే హామీ కూడా రాలేదు సరికదా, జూన్ 15 నాటికే ఇస్తామని రాజప్ప పదేపదే చెప్పడం గమనార్హం. రైతులు నాట్లు వేసేటప్పుడు, కోతల సమయంలో ఉపాధి హామీ పథకం పనులు నిలిపివేసేందుకు చర్యలు తీసుకుంటామని, కూనవరం, రామేశ్వరం మొగల వద్ద డ్రెడ్జింగ్ చేయడం ద్వారా ముంపు సమస్యను పరిష్కరిస్తామని, యాంత్రీకరణకు రూ.2.20 కోట్లు కేటాయించామని చెప్పిన ఆయన కనీస మద్దతు ధర పెంపు, కేంద్రం పెంచకుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి బోనస్, డెల్టా ఆధునికీకరణ, ధాన్యం కొనుగోలు నిబంధనల సడలింపులకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. అవుట్ఫాల్ స్లూయిజ్లను రూ.45 లక్షలతో ఆధునీకరిస్తామని ఎస్ఈ ఎస్.సుగుణాకరరావు చెప్పారు. ఆగ్రహంతో ఊగిపోయిన రాజప్ప.. రైతు పరిరక్షణ సమితి మాజీ అధ్యక్షుడు రంబాల బోస్ మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమాన్ని రాజకీయ కోణంతో చూడవద్దనగా రాజప్ప ఆగ్రహంతో ఊగిపోయారు. ‘మీరే రాజకీయాలు చేస్తున్నా’రంటూ విరుచుకుపడడంతో రైతులు అవాక్కయ్యారు. దాంతో బోస్ ‘కోప్పడకండి. మీ నాన్నగారు, మా నాన్నగారు సాగు చేసిన సమయంలో బస్తా ధాన్యాన్ని 20 మంది కూలీలకు పంచేవారు. ఇప్పుడు బస్తా ధాన్యానికి ముగ్గురు కూలీలు వస్తున్నారా?’అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం దేశానికి ఆహార భద్రతను చూస్తోందే తప్ప రైతుకు ఆర్థిక భద్రతను చూడడం లేదని నిరసించారు. జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి, ఏఎంసీ చైర్మన్ గునిశెట్టి చినబాబు, రైతు సంఘం నాయకులు వా సంశెట్టి సత్యం, జున్నూరి బాబి, రాయపురెడ్డి జానకిరామయ్య, ముత్యాల జమ్మి, ఉప్పుగంటి భాస్కరరా వు, దొంగ నాగేశ్వరరా వు, ఆర్డీవో జి.గణేష్కుమార్, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్ చర్చల్లో పాల్గొన్నారు. నేటికీ వీడని నాటి సమస్యలు.. 2011లో సాగుసమ్మెకు కారణమైన సమస్యల్ని రైతులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నారని రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు. భారతీయ కిసాన్సంఘ్ జాతీయ కార్యవర్గసభ్యుడు జలగం కుమారస్వామి మాట్లాడుతూ డ్రైన్లు సముద్రంలో కలిసే మొగల వద్ద శాశ్వతంగా రాతికట్టడాలు కట్టాలే తప్ప తాత్కాలిక చర్యలతో ప్రయోజనం లేదన్నారు. మే 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లోను సాగునీరు ఇవ్వాలన్న డిమాండ్కు కట్టుబడి ఉన్నామన్నారు. తొలకరి సాగుకు ముందు ప్రతి డివిజన్లో రైతు సమస్యలపై సమావేశం ఏర్పాటు చేయాలని సూచించగా రాజప్ప అంగీకరించారు. కోనసీమ రైతు పరిరక్షణ సమితి అధ్యక్షుడు యాళ్ల వెంకటానందం మాట్లాడుతూ ఇప్పుడున్న రెవెన్యూ డ్రైన్లను మాత్రమే ఆధునీకరిస్తున్నారని, చాలా డ్రైన్లు ఆక్రమణలతో కనిపించకుండా పోయాయన్నారు. ప్రస్తుతం తక్కువ వర్షానికే చేలు మునిగాయని, ముంపు తగ్గి నారుమడి వేయాలంటే పది రోజులు వర్షం కురవకుండా ఎండ కాయూలని అన్నారు. ఎమ్మెల్యే ఆనందరావు కలగజేసుకుని కూనవరం, రామేశ్వరం మొగల మధ్య పూడికను డ్రెడ్జింగ్ చేస్తే ముంపు సమస్య తగ్గుతుందన్నారు. -
తుని ఘటనలో ఆరుగురి అరెస్ట్ : చినరాజప్ప
గుంటూరు : తుని ఘటనలో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. వారందరూ రౌడీషీటర్లు అని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తుని ఘటనపై విచారణ వేగంగా జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. అంతకుముందు తీవ్ర అనారోగ్యంతో గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళ కమిషన్ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారిని ఆయన పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను రాజప్ప ఆరా తీశారు. ఇదిలా ఉంటే... తుని ఘటనలో ప్రమేయం ఉందని ఆరోపిస్తూ 6 మందిని సీఐడీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి... రహాస్య ప్రాంతానికి తరలించి... విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాపు నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అమలాపురం టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ... సదరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అమలాపురంలో భారీగా బలగాలను మోహరించారు. -
'2018 కల్లా పోలవరం పూర్తి చేస్తాం'
రాజమండ్రి: 2018 కల్లా పోలవరం పూర్తి చేస్తామని ఏపీ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రిలో ఆనం కళాకేంద్రంలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు ఏపీ ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నరాజప్ప మాట్లాడుతూ.. సర్ ఆర్థర్ కాటన్ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. -
ఎన్టీఆర్ కాలం నుంచే ఫిరాయింపులు!
భీమవరం: రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయించడం ఎన్టీఆర్ కాలం నుంచే ఉన్నాయని, దీనిపై కొత్తగా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులు చేరడం వల్ల టీడీపీలో అసమ్మతి రాజుకుంటోందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలోని నాయకులు, కార్యకర్తలను ఒప్పించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇతర పార్టీ నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు. హోదా బాధ్యత బీజేపీదే.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే విషయంలో టీడీపీ కంటే బీజేపీకే ఎక్కువ బాధ్యత ఉందని చినరాజప్ప అన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకునపెట్టే బలం తెలుగుదేశానికి లేదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎక్కువ నిధులిస్తున్నట్టు చెబుతున్నా.. ఇప్పటివరకు కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉందనీ, దీంతో అభివృద్ధిలో ముందుకు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. పించన్ల పంపిణీలో ఇబ్బందులున్నాయని, అయినా ప్రతినెలా 87 శాతం పంపిణీని పూర్తి చేస్తున్నామని తెలిపారు. మిగతా వారికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం సాంకేతిక విధానాన్ని సవరిస్తామని పేర్కొన్నారు. -
మీరు చెబితే ప్రత్యేకహోదా తేవాలా?: చినరాజప్ప
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఉప ముఖ్యమంత్రి, హోం శాఖమంత్రి చినరాజప్పను విలేకరులు ప్రశ్నించగా.. మీరు చెబితే తేవాలా అంటూ అసహనం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చెబితే అదే చేస్తానన్నారు. నేరస్తులు తాము చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి టెక్నాలజీని వాడుతున్నారని, అదే టెక్నాలజీతో నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పనిచేయాలని నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కష్టపడి పనిచేసిన ఏపీపీలకు ప్రమోషన్లు ఇచ్చి జడ్జీలను చేస్తామన్నారు. హోటల్ ఐలాపురంలో ‘ సైబర్ క్రైమ్స్ అండ్ డిజిటల్ ఎవిడెన్స్’ అనే అంశంపై రాష్ట్రంలోని 13జిల్లాలకు చెందిన ఏపీపీలతో కృష్ణా జిల్లా డిప్యూటీ డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ బైరా రామకోటేశ్వరరావు అధ్యక్షతన శనివారం ఒకరోజు వర్క్షాపు నిర్వహించారు. ముఖ్యఅతిథి చినరాజప్ప మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్థిక నేరాలతో పాటు మహిళలు, బాలలపై నేరాలు తీవ్రంగా పెరిగాయని, ఆర్థిక నేరాల వల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టం వాటిల్లుతోందన్నారు. ప్రజలకు అధిక వడ్డీ ఆశచూపించి ప్రైవేటు సంస్థలు వారి నుంచి డిపాజిట్ల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసి బోర్డులు తిప్పేస్తున్నాయన్నారు. అలాంటి నేరాలపై ఏపీపీలు స్పందించి వారి ఆస్తులను కోర్టు ద్వారా జప్తుచేయించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. మహిళల హక్కులను పరిరక్షించి వారి స్వేచ్ఛా జీవితానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఏపీపీలు నీతి, నిజాయితీ, జవాబుదారీతనంతో పనిచేయాలని, నేర నిరూపణలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లదే కీలక పాత్ర అని అన్నారు. భారత, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాల తీర్పులను పరిశీలిస్తూ దర్యాప్తులోని లోపాలను చూసుకుని నూతన చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. -
ఏపీలో వడదెబ్బ: 45 మంది మృతి
హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బ కారణంగా ఇప్పటి వరకు 45 మంది మరణించారని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. గురువారం హైదరాబాద్లో వేసవి నేపథ్యంలో రాష్ట్రంలో వడగాల్పులుపై ఉన్నతాధికారులతో మంత్రి చినరాజప్ప సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వడగాల్పుల వల్ల కడప జిల్లాలో అత్యధికంగా 16 మంది మరణించారని చెప్పారు.అలాగే శ్రీకాకుళం జిల్లాలో 2, విజయనగరం జిల్లాలో3, పశ్చిమగోదావరి జిల్లాలో1, కృష్ణాజిల్లాలో2, ప్రకాశం జిల్లాలో 11 , చిత్తూరు జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 4 మరణించారని గణాంకాలతో సహా సోదాహరణగా వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అలాగే వైద్యఅధికారులు ఎప్పటికప్పుడు స్పందించాలని ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప ఆదేశించారు. వడగాల్పులు నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చినరాజప్ప సూచించారు. -
స్వదేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు
♦ ఢిల్లీ నుంచి నేరుగా రాజమహేంద్రవరానికి.. ♦ మాజీ ఎమ్మెల్యే చిట్టిబాబు భౌతికకాయానికి నివాళులు సాక్షి, న్యూఢిల్లీ/శంఖవరం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటన ముగించుకొని ఆదివారం స్వదేశానికి చేరుకున్నారు. మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న సీఎం అక్కడి నుంచి నేరుగా రాజమహేంద్రవరానికి బయల్దేరి వెళ్లారు. ఆదివారం కన్నుమూసిన టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పర్వత శ్రీసత్యనారాయణమూర్తి (చిట్టిబాబు) భౌతికకాయంపై చంద్రబాబు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. శంఖవరంలో చిట్టిబాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిట్టిబాబుకు నివాళులర్పించిన వారిలో మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తదితరులు ఉన్నారు. -
జాతీయ వాలీబాల్ పోటీలు ఆరంభం
అమలాపురం(తూర్పుగోదావరి జిల్లా): ఎన్వీఆర్ వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యాన తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో జాతీయస్థాయి ఇన్విటేషన్ మెన్ అండ్ వుమెన్ డే అండ్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్ సోమవారం ఆరంభమైంది. నాలుగు రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్ను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప లాంఛనంగా ఆరంభించారు. ఈ పోటీల్లో జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు పాల్గొంటున్నారు. ముంబై, గోరఖ్పూర్, కర్ణాటక, చెన్నై, హైదరాబాద్, కేరళ, మైసూర్కు చెందిన పురుషులు, మహిళల జట్లు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా రాజప్ప మాట్లాడుతూ 2019లో రాష్ట్రంలో జాతీయ క్రీడలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో క్రీడాభివృద్ధికి చంద్రబాబు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అర్జున్ అవార్డు గ్రహీత, వెటరన్ వాలీబాల్ క్రీడాకారుడు ఎ.రమణ, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
తుని ఘటనలో అసలు బాధ్యులనే శిక్షిస్తాం
తుని సంఘటనకు సంబంధించిన కేసును సీఐడీకి అప్పగించామని, అసలు బాధ్యులను గుర్తించి శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. కృష్ణా జిల్లా బందరు ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తుని సంఘటనలో బయట వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారనటం అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు. సీఐడీ విచారణలో అసలు బాధ్యులను గుర్తించి శిక్ష విధిస్తామని తెలిపారు. ఎర్ర చందనం, భూకబ్జాలు, చైన్స్నాచింగ్ వంటి ఘటనలపై ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గిరిజనులకు అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బందరు మండలం పెదపట్నం ప్రాంతంలో మెరైన్ అకాడమీని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కాపు రుణమేళాను ఏర్పాటుచేశామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,25,621 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్నాయుడు పాల్గొన్నారు. -
25 నుంచి కాపు కార్పొరేషన్ రుణాలు
రాజమండ్రి : ఈ నెల 25 నుంచి తొలి విడత కాపు కార్పొరేషన్ రుణాలు మంజూరు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి ఎన్.చినరాజప్ప వెల్లడించారు. శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎన్ చినరాజప్ప మాట్లాడుతూ... 25 వేల మందికి రుణాలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. తుని ఘటనపై సీబీఐ విచారణ జరిపించి...బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ చినరాజప్ప స్పష్టం చేశారు. జిల్లాలో రబీ పంటకు ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని చినరాజప్ప తెలిపారు. -
'9 నెలలు ఆగలేడా'
విజయవాడ: కాపులను బీసీల్లో చేర్చడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో ఇవ్వడానికి అభ్యంతరం లేదని, కానీ ఆ జీవో నిలబడదని చెప్పారు. మంత్రి నారాయణతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం కాపులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆయన మాటలు నమ్మొద్దని కాపులను కోరారు. ఎన్నికల్లో హామీయిచ్చిన మేరకు కార్పొరేషన్, కమిషన్ వేశామని చెప్పారు. రిజర్వేషన్ల అమలుకు 9 నెలలు గడువు పెట్టామని, అప్పటివరకు వేచిచూడాలని కదా అన్నారు. 9 నెలలు ఆగలేడా అని ఆవేశంగా ప్రశ్నించారు. కాపు ఐక్య గర్జన సభకు ప్రభుత్వం అన్నివిధాలా సహకరించామని చెప్పారు. ముద్రగడ కాపులను రెచ్చగొట్టి హింసను ప్రోత్సహించారని ఆరోపించారు. అయినా ప్రభుత్వం ఎంతో సంయమనంతో వ్యవహరించిందన్నారు. కాపుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందని చెప్పారు. ఇప్పటివరకు రూ. 100 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. కాపులకు చంద్రబాబు ఎంతో చేశారని, తనను డిప్యూటీ సీఎం చేశారని తెలిపారు. -
సత్యానంద్ బెయిల్తో సంబంధం లేదు
-
'సత్యానంద్ బెయిల్తో సంబంధం లేదు'
గుంటూరు: కాల్మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంతో సంబంధాలుంటే ఎంతటి వారినైనా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఏపీ కేబినెట్ సమావేశం అనంతరం బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాల్ మనీ కేసుకు సంబంధించి నిందితుడిగా ఉన్న సత్యానంద్ బెయిల్ వ్యవహారంతో మాకు సంబంధం లేదని మంత్రి పేర్కొన్నారు. సెక్స్ రాకెట్ వల్ల నష్టపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని చినరాజప్ప హామీ ఇచ్చారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ విదితమే. ఈ కేసుతో సంబంధం ఉన్న సత్యానంద్కు బెయిల్ ఇవ్వడాన్ని రాష్ట్ర ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. -
హోంమంత్రి గారికి 'బంధువుల' బెడద !
డిప్యూటీ సీఎంకు ‘బంధువుల’ బెడద చినరాజప్ప పేరు యథేచ్ఛగా వాడుకుంటున్న నేరగాళ్లు కాల్మనీ కేసుల్లోనూ వాడేస్తున్న వైనం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పకు ‘బంధువుల’ బెడద పట్టుకుంది. అది కూడా నేరగాళ్ల రూపంలో. ‘హోం మంత్రి ఎవరనుకుంటున్నావు? మా బంధువే! చెప్పింది చెయ్యి’ అంటూ తమ నేరాల గురించి ప్రశ్నించిన పోలీసులను సైతం కొందరు బెదిరించిన దాఖలాలున్నాయి! తాజాగా కాల్మనీ కేసుల్లోనూ హోం మంత్రి తమ బంధువంటూ పలువురు నిందితులు చెప్పుకుంటున్నారు. డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తుల పేర్లను ఇలా ఇష్టానుసారం ఉపయోగిస్తే.. రియాక్షన్ కూడా సీరియస్గానే ఉండాలి. కానీ, రాజప్ప సాక్షాత్తూ రాష్ర్ట పోలీసు శాఖకు బాస్ అయినా.. అటువంటి వ్యక్తులపై ఆ స్థాయిలో స్పందిస్తున్న దాఖలాలు కానరావడం లేదు. మెతకగా ఉంటూ కేవలం ఖండనలకే పరిమితమవుతున్నారంటూ ఆయన వైఖరిని పలువురు విమర్శిస్తున్నారు. కాకినాడ : ఇటీవల వివిధ నేరాల్లో నిందితులుగా ఉన్నవారు డిప్యూటీ సీఎం చినరాజప్ప పేరును యథేచ్ఛగా వాడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సౌతిండియా చైర్మన్నని, హోం మంత్రి రాజప్ప బంధువునని హడావుడి చేసిన పేరాబత్తుల అవినాష్ దేవ్చంద్ర గురించి అందరికీ తెలిసిందే. మొదట్లో ఆయనకు సలాం చేసిన అమాయకులు.. పోలీ సులకు పట్టుబడిన తరువాత అతడో మోడగాడని గ్రహించారు. గత ఏడాది మార్చి నెలలో వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అవినాష్ పూర్వీకుల స్వస్థలం కోనసీమలోని పి.గన్నవరం మండలం పోతవరం. చినరాజప్ప కూడా కోనసీమలోని అమలాపురం ప్రాంతానికి చెందినవారే. ఆయన వివరాలన్నీ అవినాష్ చెబుతూండటంతో అంతా రాజప్ప బంధువేనని నమ్మేవారు. కొంతమంది అధికారులు కూడా ఆయనకు బాగానే సహకరించేవారు. ఇదే అదనుగా అతడు తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. గంజాయి, పులిచర్మాల స్మగ్లింగ్ చేసేవాడు. చివరకు పోలీసులకు పట్టుబడడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఆ సమయంలో కూడా హోం మంత్రి ఖండించడం తప్ప అవినాష్పై వ్యక్తిగతంగా ఎటువంటి కేసూ నమోదు చేయించలేదు. తర్వాత ఈ ఏడాదిన్నర కాలంలో అడపాదడపా ఆయన పేరును కొంతమంది వాడుకున్నా పోలీసులు కఠిన చర్యలు చేపట్టలేదు. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలోకన్నా ఆయన నివాసం ఉంటున్న అమలాపురంలోనే ఎక్కువమంది నేరగాళ్లు తాము ఆయన బంధువులమని బాహాటంగా చెప్పుకుంటున్నారు. పోలీసులతో పాటు ప్రభుత్వాధికారులను కూడా బెదిరిస్తున్నారు. కాల్మనీ కేసుల్లోనూ.. జిల్లాలో అమలాపురం కేంద్రంగా వడ్డీ వ్యాపారం భారీస్థాయిలో జరుగుతోంది. వడ్డీ వసూళ్లు, సెటిల్మెంట్లలో వేలు పెట్టే రౌడీషీటర్లు, దందాబాబులకు ఇది అడ్డాగా మారింది. డిప్యూటీ సీఎంకు చెందిన ప్రాంతంలోనే వారు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేరగాళ్లలో చాలామంది ప్రతి చిన్న విషయానికీ రాజప్ప పేరు చెప్పి తప్పించుకుంటున్నారనేది ప్రధాన ఆరోపణ. ఇటీవల విజయవాడలో కాల్మనీ - సెక్స్రాకెట్ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో.. జిల్లాలోనూ పలువురు బాధితులు బయటకొచ్చారు. ఇచ్చిన రుణానికి పదిరెట్లు గుంజుతున్నా, భయపెట్టి ఆస్తులు లాక్కుంటున్నా నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. డిప్యూటీ సీఎం బంధువునంటూ అమలాపురానికి చెందిన వడ్డీ వ్యాపారి ఒకరు, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఎన్.కొత్తపల్లికి చెందిన ఆక్వా రైతు ఏలూరు డీఐజీని ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై రాజప్ప స్పందించినా.. వారు తన బంధువులు కాదంటూ ఖండనకే పరిమితమయ్యారు. తప్పుడు సంకేతాలు ఇలా పలువురు నేరగాళ్లు, క్రిమినల్ కేసుల్లో నిందితులు రాజప్ప పేరు వాడేస్తున్నా.. అటు ఆయన కానీ, ఇటు పోలీసులు కానీ కేసులు నమోదు చేయడంలేదు. ఉప్పలగుప్తం మండలం కూనవరానికి చెందిన రైతు దేశంశెట్టి సత్తిబాబు... గత నెలలో కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన ఆవేదనతో ఫ్లెక్సీ పెట్టిన విషయం తెలిసిందే. ఈమార్రానికే పోలీసులు అతడిని స్టేషన్కు లాగారు. అలాంటిది డిప్యూటీ సీఎం పేరును వాడుకుంటున్నవారిపై కేసులు పెట్టడంలేదు. కనీసం రాజప్ప నుంచి కూడా ఫిర్యాదులు ఉండడంలేదు. ఇలాంటి నేరాల విషయంలో డిప్యూటీ సీఎం వ్యవహార శైలి తప్పుడు సంకేతాలు ఇచ్చేదిగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. -
'హోంమంత్రి బంధువు వేధిస్తున్నాడు'
కాల్మనీ కేసులో హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప బంధువులు వేధిస్తున్నారని ఓ భాధితుడు శనివారం ఏలూరు డీఐజీకి ఫిర్యాదు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పల గుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన నడింపల్లి వెంకట కృష్ణరాజు హోంమంత్రి బంధువు నిమ్మకాయల సత్యనారాయణ వద్ద 25 లక్షల అప్పు తీసుకున్నారు. అప్పు తీర్చేసినా డాక్యుమెంట్లు ఇవ్వకుండా 12 ఎకరాల భూమిని జీపీ చేయించుకుని అక్రమంగా బదలాయించుకున్నారని బాధితుడు ఫిర్యాదు చేశారు. అప్పు తీర్చేశాం కాబట్టి తమ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని.. తమ భూమిని తిరిగి ఇప్పించాలని ఆయన డీఐజీ ని కోరారు. -
కల్తీ మద్యం బాధితులను పరామర్శించిన చినరాజప్ప
కల్తీ మద్యం విక్రయ దారులను చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని ఉప ముఖ్య మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విజయవాడలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన సోమవారం పరామర్శించారు. ఈ సదర్భంగా మీడియాతో మాట్లాడారు. బాధితులకు మద్యం విక్రయదారుల నుంచే నష్ట పరిహరం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. -
ఏపీలో వరద నష్టం రూ.6,750 కోట్లు
అమలాపురం: గత నెలలో వచ్చిన తుపాన్లు, భారీ వర్షాల వల్ల రాష్ట్రంలో దాదాపు రూ.6,750 కోట్ల మేర నష్టం ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వాన్ని రూ.3,750 వేల కోట్ల తక్షణ సాయం కోరామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తుపాన్లు, వర్షాల వల్ల రాష్ట్రంలో ఇప్పటివరకూ 81 మంది మృతి చెందారని, 5 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చినరాజప్ప తెలిపారు. పంటలు, చెరువులకు గండ్లువంటి వాటికి సంబంధించి రూ.3,750 కోట్లు, రోడ్లు, భవనాలు తదితర రంగాలకు రూ.3 వేల కోట్లు నష్టం వాటిల్లిందన్నారు. కేంద్రం బృందం ఇప్పటికే పంటనష్టాలను పరిశీలించిందన్నారు. పంట నష్టాల అంచనాలకు బృందాలను రంగంలోకి దింపుతున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఆస్తి, ప్రాణ నష్టాలు; ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పంట నష్టాలు ఎక్కువగా జరిగాయని వివరించారు. నెల్లూరు జిల్లాలో తెగిపోయిన జాతీయ రహదారి, ఇతర రోడ్లకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేస్తున్నామని తెలిపారు. చెన్నైలో తెలుగు ప్రజలను ఆదుకునేందుకు ప్రత్యేక బృందాలు వర్షాలు, వరదలతో అతలాకుతలమవుతున్న చెన్నైలో తెలుగువారిని కాపాడేందుకు రాష్ట్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపించామన్నారు. రాష్ట్రంలోని ఎన్డీఆర్ఎఫ్ బృందాల్లో కొన్నింటిని ఇప్పటికే చెన్నై తరలించామన్నారు. కాగా, తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర విపత్తుల నివారణ శాఖ కమిషనర్ ధనంజయరెడ్డితో రాజప్ప ఫోనులో సమీక్షించారు. నెల్లూరు జిల్లా పరిస్థితులపై ఆరా తీశారు. చెన్నైలోని తెలుగువారి రక్షణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. -
'వర్షాలతో ఏపీలో 81 మంది మృతి'
భారీ వర్షాల కారణంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పటి వరకూ 81 మంది మృతి చెందారని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అకాల వర్షాల కారణంగా భారీగా పంట నష్టం సంభవించిందని వివరించారు. రూ.6,750 కోట్ల మేర పంట, ఆస్తి నష్టం ఉండవచ్చని ప్రాధమికంగా అంచనాకు వచ్చినట్లు తెలిపారు. మరోవైపు చెన్నైలో ఉన్న తెలుగు వారి సమాచారం ఎప్పటి కప్పుడు తెలుసుకుంటున్నామని అన్నారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన తమిళనాడుకు అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. -
మావోయిస్టుల కదలికలపై నిఘా: చినరాజప్ప
దేవరపల్లి (పశ్చిమ గోదావరి) : రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లో మావోల కదలికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. చోరీలు, దోపిడీల నియంత్రణకు పట్టణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతోపాటు నైట్ బీట్, హై క్లిక్లు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా పోలీస్ స్టేషన్కు వెళ్లకుండా ఇంటి నుంచే నెట్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించనున్నట్టు తెలిపారు. పోలీస్ వ్యవస్థలో ఆక్టోపస్ను విభాగాన్ని బలోపేతం చేస్తామన్నారు. ఇసుక సామాన్యులకు అందుబాటులో లేకుండాపోయిందని, ఈ నేపథ్యంలో ఇసుక మాఫియాను అరికట్టేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఐదు లక్షల హెక్టార్లలో ఎర్రచందనం ఉందని, 90 శాతం అక్రమ రవాణాను నిలువరించగలిగామని చెప్పారు. ఎర్రచందనం ఉన్న ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నకిలీ కరెన్సీ చలామణీపై నిఘా పెట్టామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. సమావేశంలో గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
అమలాపురం మున్సిపల్ చైర్మన్ మృతి
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మున్సిపల్ చైర్మన్ యాళ్ల మల్లేశ్వరరావు (68) అనారోగ్యంతో ఆదివారం ఉదయం కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూశారు. నెల రోజులుగా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ మృతి చెందారు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. దేవాదాయ శాఖ అధికారిగా పదవీ విరమణ చేసిన మల్లేశ్వరరావు 2005లో జరిగిన మునిసిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది చైర్మన్ అయ్యారు. మల్లేశ్వరరావు మృతిపట్ల డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సంతాపం ప్రకటించారు. -
'రాష్ట్రంలో 196 కరువు మండలాలను గుర్తించాం'
విజయవాడ: రాష్ట్రంలో 196 కరువు మండలాలను గుర్తించామని ఏపీ హోమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. మంగళవారం ఆయన కరువు పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇంకా కరువు పరిస్థితులపై కలెక్టర్లతో నివేదిక తెప్పించుకుంటున్నామని చెప్పారు. కరువు నివారణ కేంద్రం ఇప్పటికే 330 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. మరో 110 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. కరువు మండలాలు పెరిగితే.. 1400 కోట్ల రూపాయల మేర కేంద్రాన్ని సహాయం కోరతామని అన్నారు. రంగా అంశాన్ని హరిరామ జోగయ్య ఇప్పుడు ప్రస్తావించడం పద్దతి కాదని చినరాజప్ప చెప్పారు. -
హోంమంత్రిని అడ్డుకున్న మహిళలు
సామర్లకోట: గ్రామంలో జనావాసాల మధ్య ఉన్న బ్రాందీ షాపును అక్కడి నుంచి తరలించాలని కోరుతూ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పను మహిళలు అడ్డుకున్నారు. మంత్రి చినరాజప్ప ఆదివారం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంకు వెళ్లారు. దీంతో మహిళలు ఆయన్ను అడ్డుకుని బ్రాందీ షాపును అక్కడి నుంచి తరలించాలని ఆయనను డిమాండ్ చేశారు. అయితే ఈ విషయంపై స్పందించిన హోంమంత్రి ఎక్సైజ్ శాఖ అధికారులతో మాట్లాడారు. పది రోజుల్లో షాపును అక్కడి నుంచి తరలిస్తామని అధికారులు చెప్పడంతో ఆ మేరకు చినరాజప్ప వారికి హామీ ఇచ్చారు. దీంతో వారు తమ ఆందోళనను విరమించుకున్నారు. -
ఏపీ అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సలహాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధికి ప్రవాసాంధ్రుల సలహాలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన బుధవారం న్యూజెర్సీలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజధాని నగరమైన అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాజధాని నిర్మాణంతోపాటు రాష్ట్రఅభివృద్ధికి ప్రవాసాంధ్రుల సలహాలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. -
శ్రీహరికోట షార్ భద్రతపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్ : శ్రీహరికోటలోని షార్ కేంద్రం భద్రత విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి ఎన్. చినరాజప్ప వెల్లడించారు. శనివారం విజయవాడలో చినరాజప్ప తీరప్రాంత భద్రతపై ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ... తీర ప్రాంతంలోని మెరైన్ పోలీసులు పని చేసే పోలీస్ స్టేషన్ పరిధిలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. తీరప్రాంత భద్రతను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని చినరాజప్ప హెచ్చరించారు. తీరప్రాంతంలో జరిగే ఘటనలకు సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందని చినరాజప్ప తెలిపారు. -
'అన్ని యూనివర్సిటీల్లో పోలీస్ ఔట్ పోస్టులు'
గుంటూరు: అన్ని విశ్వవిద్యాలయాల్లో పోలీస్ ఔట్ పోస్టులు ఏర్పటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రిషితేశ్వరి కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. కొత్త రాజధానిలో పోలీసు కమిషనరేట్ ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా పట్టిసీమను మూడు నెలల ముందే ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నామని హోంమంత్రి చినరాజప్ప ఈ సందర్భంగా తెలియజేశారు. -
'ఆంధ్రప్రదేశ్లో 340 కరువు మండలాలు'
పెద్దాపురం (తూర్పుగోదావరి జిల్లా): ఆంధ్రప్రదేశ్లో 340 కరువు మండలాలుగా గుర్తించామని హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప చెప్పారు. సోమవారం ఇక్కడి క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరువు మండలాల్లో శాశ్వత కరువు నివారణ కోసం చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఇంకా ఏవైనా కరువు పీడిత మండలాలు ఉంటే సంబంధిత జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. -
హోంశాఖ వద్దంటున్న చినరాజప్ప?
-
హోంశాఖ వద్దంటున్న చినరాజప్ప?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తన శాఖ మార్చాలని సీఎం చంద్రబాబును కోరినట్టు విశ్వసనీయ సమాచారం. పోలీసు శాఖ వరుస వైఫల్యాలపై శాఖ మార్చుకోవాలని ఆయన నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరగడం, ఓటుకు నోటు వ్యవహారంలో ఇంటెలిజెన్స్ వైఫల్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చినరాజప్ప చాలా రోజులుగా తన శాఖలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం మానేశారు. పోలీసు శాఖలో కొత్తగా ఒక్క సంస్కరణ కూడా ఆయన చేపట్టలేకపోయారు. ఆగస్టు 15 తర్వాత కేబినెట్ లో మార్పులు, చేర్పులు ఉంటాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత కేబినెట్ లో మార్పులు ఉండొచ్చని అధికార వర్గాలు అంటున్నాయి. చినరాజప్పను మారిస్తే హోంశాఖను ఎవరికి అప్పగిస్తారనే దానిపై టీడీపీలో చర్చలు మొదలైనట్టు సమాచారం. హోంశాఖను బీసీ కోటాలో తనకు కేటాయించాలని అచ్చెన్నాయుడు, తాను కూడా పోటీలో ఉన్నానని నారాయణ అంటున్నట్టు తెలుస్తోంది.