‘రేవంత్‌ మాపై బురదజల్లడం సరికాదు’ | AP Depy CM Chinnarajappa fires on Revanth Reddy over his comments on AP TDP leaders | Sakshi
Sakshi News home page

రేవంత్‌ మాపై బురదజల్లడం సరికాదు: చినరాజప్ప

Published Mon, Oct 23 2017 12:35 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

AP Depy CM Chinnarajappa fires on Revanth Reddy over his comments on AP TDP leaders - Sakshi

సాక్షి, భీమవరం : రేవంత్‌రెడ్డి ఒక పార్టీలో ఎదిగి రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉంటూ మా మంత్రులపై బురద జల్లి వెళ్లిపోతాననడం సరికాదని ఏపీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప సూచించారు. కార్తీక సోమవారం సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచారామాన్ని ఆయన సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రేవంత్‌ రెడ్డికి ఏవైనా ఇబ్బందులు ఉంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడితో మాట్లాడి పరిష్కరించుకోవాలన్నారు. అంతే కానీ  అసత్య ప్రచారాలు చేయడం తగదన్నారు.

ఇటీవలి కాలంలో చింతమనేని ప్రభాకర్‌ ఓ కుటుంబంపై దాడి చేసిన విషయం ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లిందని గుర్తు చేశారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నారని తెలిపారు.  కాగా సోమవారం ఉదయం పంచారామ ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగత పలికారు. చినరాజప్ప ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement