కోర్టు విలువైన సమయం వృధా చేస్తారా... | High Court serious note on section-8 petition | Sakshi
Sakshi News home page

కోర్టు విలువైన సమయం వృధా చేస్తారా...

Published Mon, Jul 20 2015 12:30 PM | Last Updated on Fri, Aug 31 2018 9:15 PM

High Court serious  note on section-8 petition

హైదరాబాద్ : హైదరాబాద్లో సెక్షన్ 8 అమలు చేయాలంటూ దాఖలపై పిటిషన్ను హైకోర్టు సోమవారం కొట్టేసింది. అంతేకాకుండా పిటిషన్లో విచారణకు అర్హమైన అంశాలు లేవంటూ పిటిషనర్పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సెక్షన్ 8 అమలు చేయాలంటూ సీమాంధ్ర గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  అయితే కేసు విచారణ జరపాలంటే నగదు డిపాజిట్ చేయాలని కోర్టు సూచించింది. దాంతో కేసు వెనక్కి తీసుకుంటానని పిటిషనర్ న్యాయస్థానానికి తెలపడంతో...  విలువైన సమయం వృధా చేశారంటూ పిటిషనర్పై కోర్టు సీరియస్ అయింది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement