-
ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని ఆరోపిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, ద్వేషపూరిత ప్రసంగాలు చేశారని ఆరోపిస్తూ మోదీని ఎన్నికల నుంచి నిషేధం విధించాలని ఓ మహిళ న్యాయవాది ఆనంద్ ఎస్ జోంధాలే ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ చేసేందుకు సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. అయితే న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, ఎస్సీ శర్మలతో కూడిన ధర్మాసనం ఫిర్యాదును పరిష్కరించేందుకు సంబంధిత ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలని పిటిషనర్ను కోరింది.మీరు అధికారులను సంప్రదించారా.? మాండమస్ రిట్ కోసం మీరు ముందుగా అధికారులను సంప్రదించాలి అని ధర్మాసనం పేర్కొంది. అయితే పిటిషనర్ ఆ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు -
వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..
-
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టులో రేవణ్ణ పిటిషన్
బెంగళూరు: ఒక మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి హెచ్డి రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. బెయిల్ కోసం బెంగళూరు సెషన్స్కోర్టులో శుక్రవారం(మే3) పిటిషన్ వేశారు. తన తల్లిని రేవణ్ణ ఎత్తుకుపోయారని రేవణ్ణ ఫామ్హౌజ్లో పనిచేసే యువకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని కేఆర్నగర్ పోలీస్స్టేషన్లో రేవణ్ణపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల(సెక్స్ స్కాండల్) వీడియోల కేసులో రేవణ్ణ శుక్రవారం సిట్ ముందుకు రావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. -
‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
న్యూఢిల్లీ: ఎన్నికల్లో ఒకే పేరుతో ఉన్న అభ్యర్థులు ఒకే స్థానం నుంచి పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయ నేతల పేర్లతో ఉన్న వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపలేమని స్పష్టం చేసింది.ఒకే నియోజకవర్గంలో ఒకే పేరుతో ఉన్న వ్యక్తులు పోటీచేయకుండా అనుమతించాలని కోరుతూ పిటిషనర్ సాబు స్టీఫెన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. కీల స్థానాల్లో ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు డూప్లికేట్ అభ్యర్ధులు ఇలా చేస్తున్నారని, ఎక్కువ సంఖ్యలో ఒకే పేరుతో ఉన్న స్వతంత్రులు పోటీ చేయడం వల్ల పేరున్న రాజకీయ నేతలు స్వల్ప తేడాతో ఎన్నికల్లో ఓడిపోతున్నారని పేర్కొన్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాతమైన ఎన్నికల ప్రక్రియ కోసం ఈ ధోరణిని ఆపడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు.ఈ పిటిషన్ ను పరిశఋలించిన జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం.. దీనిపై విచారణకు నిరాకరించింది. ‘తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆ రకమైన పేర్లను పెట్టినప్పుడు ఎన్నికల్లో పోటీకి అదెలా అడ్డంకి అవుతుంది? ఒకవేళ రాహుల్గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్ వంటి పేర్లు పెట్టుకుంటే వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎలా అడ్డుకుంటాం?అది వాళ్ల హక్కులను ఉల్లంఘించినట్లు కాదా?’ అని ప్రశ్నించింది. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు కోర్టు అనుమతించింది. -
కవిత అరెస్టు అక్రమం కాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు అక్రమం కాదని ఈడీ పునరుద్ఘాటించింది. పీఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారమే ఆమెను అరెస్టు చేశామంది. ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు, ఆధారాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని తెలిపింది. ఈడీ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై బుధవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. ఈడీ తరఫు న్యాయవాది జొహెబ్ హొస్సేన్ తన వాదనలు కొనసాగించారు. ‘మద్యం విధానం మొత్తం తమకు అనుకూలంగా, లబ్ధి చేకూరేలా మార్చుకోవడంలో కవిత కీలక పాత్ర పోషించారు.ఈ వ్యవహారంలో క్విడ్ప్రో కో జరిగింది. కమీషన్ 12 శాతానికి పెంచడం వల్ల హోల్సేల్ వ్యాపారులు రూ.581 కోట్లు సంపాదించగా, ఇండో స్పిరిట్స్కు సుమారు రూ.180 కోట్లు వచ్చింది. ఇండో స్పిరిట్స్లో ప్రాక్సీ ద్వారా కవిత వాటాదారుగా ఉన్నారు. మద్యం విధానంలో మార్పుల వల్ల ప్రజలు, ప్రభుత్వానికి నష్టం వాటిల్లింది. పాత పాలసీని పక్కన పెట్టడంతోపాటు మహాదేవ్ డిస్ట్రిబ్యూటర్ను బలవంతంగా తప్పించారు. కొత్త పాలసీని ముందుకు తీసుకెళ్లడంలో కేజ్రీవాల్ అనుచరుడు విజయ్నాయర్, నాటి మంత్రి మనీశ్ సిసోడియా, కవిత బినామీ అరుణ్ పిళ్లై కీలకపాత్ర పోషించారు.పాలసీలో మార్పులు చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు లంచం అందింది. ఢిల్లీ మద్యం వ్యాపారంలో ఎల్1 లైసెన్సు కోసం కవిత తీవ్రంగా యతి్నంచగా, చివరకు నిందితుడు సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, కవితలకు చెరో 33 శాతం వాటా దక్కింది. బుచ్చిబాబు, మాగుంట రాఘవల వాట్సాప్ చాట్లలో ఈ సమాచారం లభ్యమైంది’.. అని జొహెబ్ హొస్సేన్ చెప్పారు. ‘కేజ్రీవాల్, సిసోడియా, కవిత మధ్య రాజకీయ అవగాహన ఉందని బుచ్చిబాబు చెప్పారు. ఆప్తో కవిత సంబంధాలపై మాగుంట శ్రీనివాసులురెడ్డి కీలక వాంగ్మూలం ఇచ్చారు. కేవలం మద్యం వ్యాపారం గురించి మాట్లాడటానికే సచివాలయంలో కేజ్రీవాల్తో మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయ్యారు. దీనిపై కవితను కలవాలని, ఆమే మొత్తం చెప్తారని కేజ్రీవాల్ తనకు చెప్పినట్లు శ్రీనివాసులురెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. కవితతో మాగుంట శ్రీనివాసులు రెడ్డి భేటీ అయినపుడు పాలసీ తమకు అనుకూలంగా మారుతుందని, అయితే ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని కవిత చెప్పారు.ఈ క్రమంలో సొమ్ములు ఇవ్వడం ఆలస్యమైనపుడు మాజీ ఆడిటర్ బుచ్చిబాబు ద్వారా బెదిరింపులకు దిగారు. దీంతో మాగుంట రాఘవ ద్వారా రూ.10 కోట్లు బుచ్చిబాబుకు, రూ.15 కోట్లు అభిషేక్ బోయినపల్లికి అందజేశారు’అని జొహెచ్ హొస్సేన్ చెప్పారు. కవిత ఒత్తిడితోనే ఆరు నెలల తర్వాత వాంగ్మూలం మార్చుకుంటానని పిళ్లై అన్నారన్నారు. కవిత చెప్పిన మార్పులు, చేర్పులతోనే నూతన మద్యం పాలసీ బయటకు వచ్చిందని జొహెబ్ తెలిపారు. ఉద్యోగానికి రాకుండానే రూ.లక్ష జీతం కవిత మేనల్లుడు మేకా శరణ్ను ఇండో స్పిరిట్స్లో ఉద్యోగిగా చూపారని జొహెబ్ హొస్సేన్ తెలిపారు. రూ.లక్ష జీతగాడు అయిన శరణ్ ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాలేదన్నారు. ఢిల్లీ విచారణకు రావాలని పలుసార్లు కోరినప్పటికీ శరణ్ రాలేదని తెలిపారు. విచారణ సమయంలో కవిత ఇచ్చిన ఫోన్ల డాటా డిలీట్ అయిందన్నారు. ఇంటో పనిచేసే వారికి ఫోన్లు ఇచ్చామని చెబుతున్నారని, అయితే తాము నోటీసులు ఇచ్చిన తర్వాత రోజుల్లో డాటా డిలీట్ అయినట్లు ఫోరెన్సిక్లో తేలిందన్నారు. వాదనలు ముగియడంతో తీర్పు రిజర్వు చేస్తున్నామని, మే 6న తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి చెప్పారు. -
Liquor Case: సుప్రీం కోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్
న్యూఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. తన అరెస్ట్ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. దీంతో సర్వోన్నత న్యాయస్థానంలో ఆయన ఈ ఉదయం అత్యవసర పిటిషన్ వేయబోనున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం కోర్టు ప్రారంభం కాగానే చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ఈ పిటిషన్ను స్పెషల్ మెన్షన్ చేయాలని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరేందుకు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సిద్ధమయ్యారు. దీంతో సుప్రీం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ ఆప్ శ్రేణుల్లో నెలకొంది. లిక్కర్ స్కాం కేసులో మనీలాండరింగ్ అభియోగాలపై మార్చి 21వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసింది. అయితే ఆ సమయంలోనే ఆయన సుప్రీం కోర్టులో తన అరెస్ట్ను సవాల్ చేస్తూ ఓ పిటిషన్ వేశారు. అయితే ఢిల్లీ హైకోర్టు, రౌస్ అవెన్యూ కోర్టుల్లో పిటిషన్లు పెండింగ్లో ఉండడం, కింది కోర్టుల్లో విచారణతో క్లాష్ అయ్యే అవకాశం ఉండడంతో ఆ టైంలో ఆయన ఆ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఇక.. మద్యం కుంభకోణంలో కేజ్రీవాల్ అసలైన సూత్రధారిగా ఈడీ ఆరోపిస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఈడీ తమ కస్టడీకి తీసుకొని విచారించగా.. ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా ప్రస్తుతం ఆయన తీహార్ జైలులో ఉన్నారు. అరెస్ట్ చట్టవిరుద్ధం కాదు కేజ్రీవాల్ అరెస్టుకు ఈడీ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని పిటిషన్పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం పేర్కొంది. హవాలా ద్వారా డబ్బు తరలింపుపై ఈడీ ఆధారాలు చూపించిందని, గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని న్యాయస్థానం పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని వ్యాఖ్యానించింది. ‘‘సీఎంకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయం ఉండదు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పనవసరం లేదు. నిందితుడి వీలును బట్టి విచారణ జరపడం సాధ్యం కాదు’’ అని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
లిక్కర్ కేసు: ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లిక్కర్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తనను అరెస్టు చేయడం, అనంతరం ట్రయల్ కోర్టు రిమాండ్ చేయడం చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ దాఖలుచేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీకి నష్టం చేసేందుకే సరిగ్గా సమయం చూసుకుని ఈడీ తనను అరెస్టు చేసిందన్న కేజ్రీవాల్ వాదనను కోర్టు తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ తనను ఈడీ అరెస్టు చేయడం అక్రమమని ఢిల్లీ హైకోర్టులో గత వారం పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్పై ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపించారు. ఈడీ తరపున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజు వాదించారు. వాదనల అనంతరం తీర్పును రిజర్వు చేసిన కోర్టు తాజాగా మంగళవారం(ఏప్రిల్ 9) దానిని వెలువరించింది. ఈ తీర్పులో భాగంగా లిక్కర్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ఢిల్లీ హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. లిక్కర్ స్కామ్కు పాల్పడటం ద్వారా అక్రమ సొమ్ము సంపాదనకు కేజ్రీవాల్ కుట్రపన్నారనేందుకు తగిన ప్రాథమిక ఆధారాలున్నాయని అభిప్రాయపడింది. ఈ కారణంతో లిక్కర్ కేసు దర్యాప్తులో భాగంగా కేజ్రీవాల్ అరెస్టు సబబేనని పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేవీ ఉండవని స్పష్టం చేసింది. సామాన్యులకు, సీఎంకు చట్టం ఒకటేనని తెలిపింది. కాగా, లిక్కర్ స్కామ్కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కేజ్రీవాల్ను అరెస్టు చేసింది. అనంతరం వారం రోజుల పాటు ఈడీ కస్టడీలో ఉన్న తర్వాత కోర్టు కేజ్రీవాల్కు ఏప్రిల్ 15 దాకా జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఇదీ చదవండి..మళ్లీ తీహార్ జైలుకే కవిత -
కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఈ కేసులో కేజ్రీవాల్ ప్రస్తుతం తీహార్ జైల్లోని జ్యూడిషియల్ రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. తనను ఈడీ అరెస్టు చేసి.. రిమాండ్కు తరలించడంపై గతంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఈ పిటిషన్పై మంగళవారం న్యాయస్థానం తీర్పు చెప్పనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ కేసుపై కీలక తీర్పు వెలువరించనున్నారు. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ఆప్ ఎమ్మెలే దుర్గేశ్ పాఠక్తో పాటు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ విభవ్ కుమార్ను సోమవారం ఈడీ ప్రశ్నించింది. సౌత్ గ్రూప్ నుంచి హవాలా రూపంలో తీసుకున్న రూ.45 కోట్లను గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఆప్ వాడిందని ఈడీ ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆ ఎన్నికల్లో గోవాకు పాఠక్ ఇన్చార్జిగా ఉన్నారు. ఎన్నికల వేళ జరిగిన నగదు లావాదేవీలపై ఆయన్ను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ కేసులో కీలక పత్రాలకు సంబంధించిన వివరాల కోసం విభన్ను విచారించింది. పాఠక్ను విచారించడంపై ఢిల్లీ మంత్రి అతిశి మండిపడ్డారు. ఆప్ నేతలను ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేసేందుకే విచారణ పేరుతో బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. -
ఎమ్మెల్సీ కవితను విచారించనున్న సీబీఐ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని, ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కవిత తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో.. అక్కడే విచారిస్తామని కోర్టుకు విన్నవించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన కొందరు కవిత పేరును ప్రస్తావించారని, ఈ నేపథ్యంలో ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది. సీబీఐ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు.. జైలులో కవితను విచారించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితను విచారించేందుకు ఒక రోజు ముందుగానే జైలు అధికారులకు సమాచారం ఇవ్వాలని సీబీఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. విచారణ సమయంలో మహిళా సిబ్బంది తప్పకుండా ఉండాలని.. విచారణకు సంబంధించిన అన్ని నిబంధనలను పాటించాలని సూచించింది. ఇంతకు ముందు ఓసారి విచారణ: ఢిల్లీ లిక్కర్ వ్యవహారంలో.. కేంద్ర హోంశాఖ ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాతోపాటు మరో 14 మందిపై 2022 జూన్ 22న సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అమిత్ అరోరా ఇచ్చిన వాంగ్మూలం, పలు విచారణ అంశాల ఆధారంగా ప్రశ్నించాల్సి ఉందంటూ.. అదే ఏడాది డిసెంబర్ 2న ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు నోటీసులిచ్చారు. డిసెంబర్ 11న హైదరాబాద్లోని ఆమె నివాసానికి వచ్చి ప్రశ్నించారు. తర్వాత ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి విచారణకు రావాలంటూ నోటీసులు జారీ చేశారు. అయితే ఆలోగానే కవితను ఎన్ఫోర్స్మెంట్ ఈడీ అదుపులోకి తీసుకుంది. బెయిల్పై సోమవారం స్పష్టత ఈ కేసులో కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై సోమవారం స్పష్టత రానుంది. ఇక రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై ఈనెల 20న విచారణ చేపడతామని సీబీఐ ప్రత్యేక కోర్టు తెలిపింది. అయితే కవితను ప్రశ్నించేందుకు కోర్టు అనుమతించిన నేపథ్యంలో.. వచ్చే వారం జైలులోనే ఆమెను విచారించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
ప్రణీత్ రావు పిటిషన్ ను కొట్టేసిన తెలంగాణ హై కోర్ట్
-
ప్రణీత్రావు పిటిషన్లో తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు దాఖలు చేసిన పిటిషన్లో వాదనలు ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. కస్టడీ సమయంలో సుప్రీంకోర్టు మార్గదర్శ కాలను పాటించడం లేదని, పీఎస్లో నిద్రపోవడానికి సరైన సౌకర్యాలు లేవని, విచారణ పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరడంతోపాటు పోలీస్ కస్టడీ ఇస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రణీత్ హైకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది గండ్ర మోహన్రావు వాదనలు వినిపిస్తూ.. ‘24 గంటలూ ప్రణీత్రావును పోలీసులు విచారిస్తున్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా.. దాన్ని పాటించడంలేదు. ప్రణీత్ పరువుకునష్టం కలిగించేలా అధికారులు వివరాలు మీడియాకు లీక్ చేస్తున్నారు’ అని చెప్పారు. అనంతరం పీపీ పల్లె నాగేశ్వర్రావు వాదిస్తూ.. ‘పిటిషనర్ న్యాయవాది వాదనలు సరికాదు. 2023లో అక్రమంగా ప్రతిపక్ష పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారు. ఇది చాలా తీవ్ర నేరం. నిబంధనల మేరకే ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తోంది. సాక్ష్యాలను అందించేందుకే రమేశ్ విచారణ జరిగే ప్రాంతానికి వచ్చారు తప్ప.. విచారణలో పాల్గొనలేదు’ అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. గురువారం తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. -
కవిత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
-
‘సీఏఏ’పై స్టే ఇవ్వండి: సుప్రీంలో ఒవైసీ పిటిషన్
న్యూఢిల్లీ: ఇటీవలే అమలులోకి వచ్చిన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్(సీఏఏ)పై స్టే ఇవ్వాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పెండింగ్లో ఉండగా సీఏఏ కింద కొత్తగా ఎవరికీ పౌరసత్వం ఇవ్వవద్దని పిటిషన్లో ఒవైసీ కోరారు. కాగా, 2019లో కేంద్రం తీసుకువచ్చిన సీఏఏ చట్టానికి సంబంధించి తాజాగా కేంద్రం రూల్స్ నోటిఫై చేసి అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి డిసెంబర్ 31,2014కు ముందు దేశంలోకి వలస వచ్చిన నాన్ ముస్లింలకు భారత పౌరసత్వం ఇస్తారు. సీఏఏ పోర్టల్లో దరఖాస్తు చేసిన కొందరు మైగ్రెంట్స్కు ఇప్పటికే భారత పౌరసత్వం కల్పించారు. AIMIM president Asaduddin Owaisi approaches the Supreme Court seeking to stay the implementation of the Citizenship Amendment Act (CAA), 2019 and the Rules, 2024. Owaisi says no applications seeking grant of citizenship status be entertained or processed by the government under… pic.twitter.com/w8uQii4lyn — ANI (@ANI) March 16, 2024 ఇదీ చదవండి.. చైనా, పాక్ స్నేహం భారత్కు సవాలే -
సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్!
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత అరెస్ట్పై ఈడీ ప్రకటన చేసింది. సాయంత్రం 5.20 గంటలకు అరెస్ట్ చేశామని, మనీలాండరింగ్ యాక్ట్ కింద కవితను అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ పేర్కొంది. కవితను అరెస్ట్ చేసినట్లు ఆమె భర్తకు సమాచారం ఇచ్చామని ఈడీ అధికారులు తెలిపారు. రేపు ఉదయం కవితకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టు నుంచి నేరుగా ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. రేపు మధ్యాహ్నం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఈ రోజు రాత్రంత ఢిల్లీ ఈడీ కార్యాలయంలోనే కవిత ఉండనున్నారు. కాగా, తన అరెస్ట్ను సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో కవిత ఛాలెంజ్ పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. మరోవైపు, కవిత భర్త అనిల్ ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తనని అరెస్ట్ చేశారని కవిత ఆరోపించారు. న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. -
వీడ్కోలు సమయాన విన్నపాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తన రెండురోజుల పర్యటన ముగించుకుని ఒడిశాకు వెళ్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సీఎం రేవంత్రెడ్డి తన విన్నపాల చిట్టా అందజే శారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో వేలకోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొన్న ప్రధాని మంగళవారం ఒడిశాకు బయలుదేరారు. సీఎం రేవంత్ బేగంపేట విమానాశ్రయంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ఆయనకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మొత్తం 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ► ఎన్టీపీసీకి 4,000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంది. అయితే గత ప్రభుత్వం 1,600 మెగావాట్లు మాత్రమే సా ధించింది. మిగిలిన 2,400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్రం సహ కరించాలి. రాష్ట్రం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం. ► హైదరాబాద్లో మెట్రో విస్తరణకు, మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి (ప్రక్షాళనకు) సహకరించాలి. ► తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా ప్రధాని జోక్యం చేసుకోవాలి. ► హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ అటవీ ప్రాంతం మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022–23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ.3 కోట్లు మంజూరు చేసింది. రూ.7,700 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ► రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీరు నూటికి నూరు శాతం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు పది లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లాల ద్వారా నీటి సరఫరా జరగడం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలి. ► ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి హైదరాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవాపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1,350 ఎకరాల మిలటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ భూములను (1,038 ఎకరాలు) తిరిగి అప్పగించాలి. ► నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5,259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్తో్తంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ.347.54 కోట్లను విడుదల చేయాలి. ► భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా కల్వకుర్తి–కొల్లాపూర్, గౌరెల్లి–వలిగొండ, తొర్రూర్ – నెహ్రూనగర్, నెహ్రూనగర్–కొత్తగూడెం, జగిత్యాల–కరీంనగర్ ఫోర్లేన్, జడ్చర్ల–మరికల్ ఫోర్లేన్, మరికల్ – డియసాగర్ టెండర్ల ప్రక్రియకు అనుమతులివ్వాలి. ► ఇండియా సెమీ కండకర్ల మిషన్లో భాగంగా తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరించాలి. అత్యవసరంగా 29 ఐపీఎస్ పోస్టులను కేటాయించాలి కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం పెరిగిన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ను సమీక్షించాలి. అత్యవసరంగా 29 పోస్టులను కేటాయించాలి. ఐఐఎం కూడా ఏర్పాటు చేయండి ఐఐటీ, నల్సార్, సెంట్రల్ వర్సిటీతో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్లో ఉన్నాయి. కేంద్రం ఐఐఎంను కూడా ఏర్పాటు చేస్తే అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. మాకే ఓటేయండి.. మంగళవారం బేగంపేట విమానాశ్రయంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసు కుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏకంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డిని బీజేపీకి ఓటేయాలంటూ కోరారు. మంగళవారం ప్రధానికి వీడ్కోలు పలికే సమయంలో క్లిక్మనిపించిన ఈ ఫొటోలో మోదీ, రేవంత్రెడ్డితో పాటు మంత్రి పొన్నం, నాగర్కర్నూల్ ఎంపీ పి.రాములు ఉన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన రాములు.. సీఎం రేవంత్ తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఓటరేనని ఈ సందర్భంగా మోదీకి చెప్పారు. అందుకు రేవంత్ కూడా అవునంటూ బదులిచ్చారు. వెంటనే స్పందించిన మోదీ ‘అయితే ఇంకేంటి.. ఈసారి మా కే ఓటేయండి..’ అంటూ సరదాగా వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే మోదీ సహా ఫొటోలో కనిపిస్తున్న నేతలు ఒక్కసారిగా ఘొల్లున నవ్వారు. – సాక్షి, హైదరాబాద్ -
వలంటీర్లపై మరో పిటిషన్
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గ్రామ, వార్డు వలంటీర్ వ్యవస్థను తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2019లో జారీచేసిన జీఓ–104తో పాటు తదనుగుణంగా జారీచేసిన ఉత్తర్వులను చట్ట విరుద్ధంగా, ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 2.57 లక్షల మంది కార్యకర్తలను గ్రామ, వార్డు వలంటీర్లుగా నియమించారని, దీనిని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ వైఎస్సార్ కడప జిల్లా, రాజంపేటకు చెందిన షేక్ అబూబాకర్ సిద్ధిఖీ ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు ఖజానా నుంచి వలంటీర్లపై ఖర్చుచేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్ని ఆదేశించాలని సిద్ధిఖీ తన వ్యాజ్యంలో కోర్టును కోరారు. అలాగే, రానున్న ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వ్యవహరించకుండా, ఓటర్ల స్లిప్పులను పంపిణీ చేయకుండా వలంటీర్లను నిలువరించాలని కూడా కోర్టును అభ్యర్థించారు. అలాగే, ఎన్నికలు ముగిసేవరకు వలంటీర్ల ద్వారా ప్రభుత్వ పథకాల పంపిణీ జరగకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని సిద్ధిఖీ తన వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామ, వార్డు వాలంటీర్ల శాఖ ముఖ్య కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీఎం వైఎస్ జగన్, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, 9 మంది వాలంటీర్లను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ పిల్పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం వచ్చే వారం విచారణ జరిపే అవకాశాలున్నాయి. గతంలోనే హైకోర్టు నిరాకరణ.. వాస్తవానికి.. గ్రామ వలంటీర్ల నియామకాన్ని అడ్డుకునేందుకు తెలుగుదేశం పార్టీ 2019లోనే ప్రయత్నించింది. అయితే, హైకోర్టు ఆ ప్రయత్నాలను అప్పుడే అడ్డుకుని నియామకాలను నిలుపుదల చేసేందుకు నిరాకరించి అందుకు సంబంధించిన అనుబంధ పిటిషన్ను కొట్టేసింది. వారి నియామకాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి కారణం కనిపించడంలేదని స్పష్టంచేసింది. రాజస్థాన్ ప్రభుత్వం అమలుచేసిన గ్రామ సహాయక్ విధానాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించిన విషయాన్ని కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. సంక్షేమ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చాలన్న ఉద్దేశంతోనే వలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో హైకోర్టు ప్రాథమికంగా ఏకీభవించింది. ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే.. ఇక వలంటీర్లను అడ్డుకునేందుకు 2021లో కూడా టీడీపీ ప్రయత్నించింది. అందుకు అప్పటి ఎన్నికల కమిషనర్ సైతం సహకరించారు. అయితే, టీడీపీ నేతలు, ఎన్నికల కమిషన్ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది. అప్పుడు వివాదాస్పద అధికారిగా పేరుపడ్డ నాటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వలంటీర్లను ఎన్నికలకు దూరంగా ఉంచాలంటూ కలెక్టర్లకు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుబట్టి నిలిపివేసింది. వారు అధికార దుర్వినియోగానికి పాల్పడి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారనేందుకు ఎలాంటి ఆధారాల్లేవని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. ప్రజాశ్రేయస్సు కోసం పనిచేస్తున్న వలంటీర్లను వారి విధుల నిర్వహణకు అనుమతించాలన్నది కోర్టు అభిప్రాయమని తేల్చిచెప్పింది. వలంటీర్ల కార్యకలాపాలను నిలువరించాల్సిన అవసరంలేదంది. తమ ఫోన్లలో ఉన్న లబ్ధిదారుల డేటాను వలంటీర్లు దుర్వినియోగం చేస్తారన్న ఎన్నికల కమిషన్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. డేటాను దుర్వినియోగం చేయాలనుకుంటే అందుకు ఫోన్లే అవసరంలేదని, ఫోన్లు లేకపోయినా కూడా దుర్వినియోగం చేస్తారని, ఈ విషయంలో ఎన్నికల కమిషన్ది అనవసర ఆందోళన మాత్రమేనని కొట్టిపారేసింది. ఎస్ఈసీ ఉత్తర్వులపై ధర్మాసనం ఆందోళన.. ఇక హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సవాలు చేస్తూ ఎన్నికల కమిషన్ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీల్పై విచారణ జరిపిన ధర్మాసనం, సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొద్దిగా సవరించింది. వలంటీర్లు ఎన్నికల సందర్భంగా ఉన్నతాధికారుల వద్ద ఫోన్లను ఉంచాలని, అవసరమైనప్పుడు వాటిని వాడుకోవచ్చునని తెలిపింది. అయితే, ఫోన్లు వాడకుండా వలంటీర్లపై నిషేధం విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది. అలా చేయడం వలంటీర్ల విధులను అడ్డుకోవడమేనని తేల్చిచెప్పింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు మౌఖిక వ్యాఖ్యలు కూడా చేసింది. వలంటీర్లు తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే నేరుగా తామే చర్యలు తీసుకుంటామని అప్పటి ఎన్నికల సంఘం చెప్పడంపై ధర్మాసనం ఆందోళన కూడా వ్యక్తం చేసింది. ఇది తమను అత్యంత ఆందోళనకు గురిచేస్తోందని.. అలా నేరుగా చర్యలు తీసుకునే అధికారం, పరిధి ఎన్నికల కమిషన్కు లేవని స్పష్టంచేసింది. అవసరానికి మించి వలంటీర్లపై ఆంక్షలు విధిస్తున్నారని అభిప్రాయపడింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. -
‘ఒంటెలను ఇవ్వండి’.. పోలీసులకు జడ్జి ఆదేశం!
ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఓ వింత ఉదంతం చోటుచేసుకుంది. హైకోర్టును ఆశ్రయించిన ఓ వ్యక్తి తమ 22 ఒంటెలను పోలీసుల నుంచి తిరిగి ఇప్పించాలని అభ్యర్థించాడు. దీనిపై స్పందించిన కోర్టు.. లిసాడి గేట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నుండి సమాధానం కోరింది. ఈ కేసు రాబోయే మార్చి లో విచారణకు రానుంది. ఈ కేసు 2019 నుంచి నడుస్తోంది. ఆ ఏడాది ఆగస్టు లో ఈద్ సందర్భంగా ఒంటెలను బలి ఇవ్వడాన్ని పోలీసు యంత్రాంగం నిషేధించింది. ఈ నేపధ్యంలో మీరట్లోని మహ్మద్ అనాస్కు చెందిన 22 ఒంటెలను లిసాడి గేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎంతకాలమైనా ఆ ఒంటెలను పోలీసులు తిరిగి ఇవ్వకపోవడంతో అనాస్ 2022లో హైకోర్టును ఆశ్రయించాడు. తన ఒంటెలను తిరిగి ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2023, జనవరి 12న ఒంటెలను అతనికి తిరిగి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిందని, అయితే పోలీసులు కోర్టు ఆదేశాలను పాటించలేదని అనాస్ తరపు న్యాయవాది షామ్స్-ఉ-జమాన్ మీడియాకు తెలిపాడు. ఇప్పుడు ఈ ఉదంతంపై తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. ఈ కేసు మార్చి 18న కోర్టులో విచారణకు రానుంది. ఈ విషయమై సిటీ మేజిస్ట్రేట్ మాట్లాడుతూ అనాస్కు చెందిన 22 ఒంటెలను పోలీసులు తిరిగి అతని ఇవ్వని విషయం తమ దృష్టికి వచ్చిందని అన్నారు. అందుకే లిసాడి గేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి దీనికి తక్షణం సమాధానం కోరామన్నారు. -
సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్పై విచారణ
-
నలుగురికీ చివరి అవకాశం ఈసారి విచారణకు రాకపోతే
-
HMDA మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అవినీతి కేసు
-
ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై సుప్రీంకు
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించకుండా తెలంగాణ సహాయ నిరాకరణ చేస్తే సుప్రీంకోర్టుకు నివేదించాలని కేంద్రం నిర్ణయించింది. గత నెల 17న కేంద్ర జల్ శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. కానీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకోగానే తెలంగాణ అధికారులు మాటమార్చారు. ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత విధి విధానాల ఖరారుకు ఈనెల 1న హైదరాబాద్లో జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ ఉమ్మడి ప్రాజెక్టులకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకరించినట్లు ప్రకటించినా, ఆ తర్వాత తెలంగాణ అధికారులు మరోసారి మాటమార్చారు. ఈ నేపథ్యంలో గత నెల 17న తీసుకున్న నిర్ణయాల అమలుపై ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అధికారులు అంగీకరించకపోయినా లేదా గైర్హాజరైనా అదే అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించి, కోర్టు మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 2021లో ఎగువ నుంచి వరద రాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయ పోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేసి, అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ సర్కారు మాత్రం తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించేందుకు నిరాకరించింది. యథేచ్ఛగా తెలంగాణ జలచౌర్యం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు చేసిన వి/æ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్కు అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తెలంగాణ భూభాగంలో ఉందంటూ ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కారు అధీనంలోకి తీసుకుందని, అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను అధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నారు. తాగు నీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో డిసెంబర్ 1న రెండు రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సంయమనం పాటించాలని ఆదేశించారు. సాగర్పై నవంబర్ 30 నాటి యథాస్థితిని కొనసాగిస్తూ నిర్వహణ బాధ్యతను బోర్డుకు అప్పగించారు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించారు. -
ఈసీపై పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఓటరు గుర్తింపు కార్డు అప్డేట్, కొత్త ఓటరు నమోదు దరఖాస్తుల్లో ఆధార్ సంఖ్యను జత చేయడానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పష్టమైన మార్పులను చేపట్టనందుకు ఎన్నికల సంఘం అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ వేసిన పిటిషన్ను సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. ఈ విషయంలో ఈసీకి మేం డెడ్లైనేదీ పెట్టలేదని పేర్కొంది. -
గంటా రాజీనామా వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయండి
సాక్షి, అమరావతి: విశాఖ తూర్పు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులను నోటిఫై చేస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సోమవారం న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్లతో పాటు గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖను, ఇతర ఆధారాలను తమ ముందుంచాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ వ్యాజ్యంలో శాసనసభ సెక్రటరీ జనరల్ను ప్రతివాదిగా చేర్చాలని గంటా శ్రీనివాసరావును ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. తన రాజీనామాను ఆమోదిస్తూ శాసనసభ స్పీకర్ ఈనెల 23న జారీ చేసిన ఉత్తర్వులు, ఆ ఉత్తర్వులను నోటిఫై చేస్తూ శాసనసభ సెక్రటరీ జనరల్ అదే రోజు జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ను సవాలు చేస్తూ గంటా శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ కృష్ణమోహన్ సోమవారం విచారణ జరిపారు. గంటా వ్యాజ్యానికి విచారణార్హతే లేదు.. గంటా తరఫు న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపిస్తూ, 2021లో సమర్పించిన రాజీనామాను స్పీకర్ మూడేళ్ల తరువాత ఆమోదించారన్నారు. రాజీనామా ఉపసంహరణకు గంటా ఎలాంటి లేఖ ఇవ్వలేదని అంగీకరించారు. రాజీనామాను ఆమోదించడం వెనుక దురుద్దేశాలున్నాయి కాబట్టే, స్పీకర్ ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే రాజీనామా ఆమోదించారని, ఆ ఎన్నికల్లో గంటా ఓటు కీలకమని ఆయన వివరించారు. న్యాయ, శాసన వ్యవహారాల శాఖ కార్యదర్శి తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ, గెజిట్ నోటిఫికేషన్ను సవాలు చేసినప్పుడు, దానిని జారీ చేసిన సెక్రటరీ జనరల్ను ప్రతివాదిగా చేర్చాలని, అయితే ఈ పిటిషన్లో సెక్రటరీ జనరల్ను ప్రతివాదిగా చేర్చలేదన్నారు. సాధారణంగా ఇలాంటి వ్యాజ్యాలు ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. విధి విధానాల ప్రకారమే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించారని తెలిపారు. తరువాత అసెంబ్లీ తరఫు న్యాయవాది మెట్టా చంద్రశేఖరరావు వాదనలు వినిపిస్తూ, అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదన్నారు. ఈ వ్యాజ్యం ధర్మాసనం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. స్పీకర్ అన్నీ అంశాలను పరిగణనలోకి తీసుకునే రాజీనామాను ఆమోదించారన్నారు. శాసనసభ్యుడిగా కొనసాగాలన్న ఉద్దేశం గంటాకు ఉంటే, ఈ మూడేళ్లలో తన రాజీనామాను వెనక్కి తీసుకుని ఉండాల్సిందని, ఈ పని చేయకుండా ఆయనను ఎవరూ ఆపలేదని వివరించారు. రాజీనామాను ఆమోదించే విషయంలో నిర్ధిష్టంగా ఎలాంటి నిబంధనలు లేవన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని రిట్ ద్వారా ప్రశ్నించడానికి వీల్లేదని తెలిపారు. -
బైజూస్పై దివాలా పిటిషన్
న్యూఢిల్లీ: ఎడ్టెక్ సంస్థ బైజూస్పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)–బెంగళూరులో దివాలా పిటిషన్ దాఖలైంది. కంపెనీకి 1.2 బిలియన్ డాలర్ల మేర టర్మ్ లోన్–బీ (టీఎల్బీ) ఇచి్చన రుణదాతల్లో 80 శాతం సంస్థలు కలిసి గ్లాస్ ట్రస్ట్ కంపెనీ ద్వారా దీన్ని దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, దివాలా పిటిషన్ విషయం ఇంకా బహిరంగంగా వెల్లడి కాలేదు. బైజూస్ ఈ వ్యవహారమంతా నిరాధారమైనదని పేర్కొంది. రుణదాతల చర్యలపై అమెరికా కోర్టుల్లో పలు కేసులు నడుస్తుండగా ఎన్సీఎల్టీని ఆశ్రయించడం సరికాదని వ్యాఖ్యానించింది. అనుబంధ సంస్థలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రుణాలను తీర్చేసుకునేందుకు టీఎల్బీ రుణదాతలతో చర్చలు జరుపుతున్నట్లు బైజూస్ చెబుతున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్యాంకులు కాకుండా సంస్థాగత ఇన్వెస్టర్లు ఇచ్చిన రుణాన్ని టీఎల్బీ లోన్గా వ్యవహరిస్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు బైజూస్ అమెరికా విభాగం ఆల్ఫా 2021లో టీఎల్బీ తీసుకుంది. అయితే, కంపెనీ 500 మిలియన్ డాలర్ల మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఇతర అనుబంధ సంస్థలకు బదలాయించిందని, రుణ చెల్లింపులను వేగవంతం చేయాలని రుణదాతలు అమెరికాలోని డెలావేర్ కోర్టును ఆశ్రయించారు. దీన్ని న్యాయస్థానంలో సవాలు చేసిన బైజూస్.. రుణదాతలతో వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నాల్లో ఉంది. -
జోక్యం చేసుకోలేం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఇప్పటికే నోటిఫికేషన్ వచ్చినందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329(బీ) ప్రకారం.. ఈ దశలో జోక్యం చట్టవిరుద్ధమని అభిప్రాయపడింది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన పాడి కౌశిక్రెడ్డి, కడియం శ్రీహరి రాజీనామాలతో ఖాళీ ఏర్పడిన రెండు ఎమ్మెల్సీ సీట్లకు విడివిడిగానే ఎన్నిక నిర్వహించాలని షెడ్యూల్లో ఈసీ పేర్కొంది. రెండింటికీ బ్యాలెట్ పేపర్లను సైతం వేర్వేరు సెట్స్ సిద్ధం చేయాలని, ఒకటి తెలుపు, మరొకటి గులాబీ రంగులో ముద్రించాలని వివరించింది. పోలింగ్ స్టేషన్లనూ విడిగానే ఏర్పాటు చేయాలంది. ఓటర్ల జాబితా కూడా విడివిడిగా రూపొందించాలని నిర్దేశించింది. ఓట్ల లెక్కింపు కూడా విడివిడిగానే జరుగుతుందని పేర్కొంది. ఎన్నికల అధికారులు సహా అన్నీ వేర్వేరుగానే ఉండాలని నిర్దేశించింది. అయితే విడివిడిగా జరిగితే ప్రతి ఎన్నికకు అసెంబ్లీలోని 119 మంది ఎమ్మెల్యేలు ఓటర్లుగా మారుతారు. దీంతో కాంగ్రెస్సే రెండు స్థానాలు గెలిచే అవకాశం ఉంటుంది. ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి పటోళ్ల కార్తీక్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. భారత రాజ్యాంగంలోని ఆర్టీకల్ 171(4), ఎన్నికల ప్రవర్తన నియమావళి 1961లోని రూల్ 70 ప్రకారం.. ఒకేసారి ముగియనున్న (నవంబర్ 30, 2027) ఎమ్మెల్సీ పదవీ కాల పరిమితికి ఉప ఎన్నికలు నిర్వహిస్తే ఒకే ఎన్నిక నిర్వహించాలన్నారు. విడివిడిగా ఎన్నిక జరుపుతామంటూ జనవరి 4.. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఈసీ తరఫున అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 151 ప్రకారమే కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిందని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషన్ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'దేవర' ఫియర్ సాంగ్ వచ్చేసింది
హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
తారక్ అభిమానుల మంచి మనసు.. 'రా ఎన్టీఆర్ 2.0' టీమ్ రక్తదానం
నా ఆల్టైమ్ ఫేవరెట్ క్రికెటర్ అతడే: టీమిండియా స్టార్
సెంటరాఫ్ అట్రాక్షన్గా ఉండాలనే తపన ..!
14 ఏళ్ల వయస్సులోనే కల.. ఎవరీ ‘ఐస్క్రీమ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’
ఎస్బీఐకి మొట్టికాయలు గట్టిగానే పడ్డాయిగా?
నిద్రను దూరం చేసేవి ఇవే! నివారించాలంటే..!
క్లాసెన్ మాస్ క్యాచ్.. బ్యాటర్ మైండ్బ్లాంక్! వీడియో
ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్!.. శుభవార్త చెప్పిన కంపెనీ
తప్పక చదవండి
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement