సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ముగ్గురు హోంగార్డులను మంగళవారం రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని జీఆర్పీ స్టేషన్కి తరలించారు. రైల్వే ప్రయాణికులను బెదిరిస్తూ... వసూళ్లకు పాల్పడుతున్నారని సదరు హోంగార్డులనుపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నిఘా పెంచారు. ఆ క్రమంలో ప్రయాణికుల ఆరోపణలు వాస్తవమని తెలింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముగ్గురు హోంగార్డులను అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నిస్తున్నారు.