![జానకిరామ్ మృతదేహం](/styles/webp/s3/article_images/2017/09/2/71417888437_625x300.jpg.webp?itok=Sp1Jj6W6)
జానకిరామ్ మృతదేహం
హైదరాబాద్: నందమూరి హరికృష్ణ పెద్దకుమారుడు జానకిరామ్ మృతదేహం హైదరాబాద్ చేరుకుంది. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద ఈ సాయంత్రం జరిగిన కారు ప్రమాదంలో జానకిరామ్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. మృతదేహాన్ని కోదాడ నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఈ రాత్రి డాక్టర్ జనార్ధన్, డాక్టర్ సత్యవతి ఆధ్వర్యంలో వైద్య బృందం పోస్ట్ మార్టం నిర్వహిస్తారు
నందమూరి కుటుంబ సభ్యులతోపాటు పలువురు ఏపీ మంత్రులు, టీడీపి నాయకులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. కొద్దిసేపట్లో మృతదేహానికి పోస్ట్ మార్టం చేస్తారు. ఆ తరువాత మృతదేహాన్ని హరికృష్ణ నివాసానికి తరలిస్తారు.
**