హోంశాఖ కార్యదర్శితో తెలుగు రాష్ట్రాల సీఎస్లు భేటీ | L C Goyal to meet AP TS CSs in New Delhi | Sakshi
Sakshi News home page

హోంశాఖ కార్యదర్శితో తెలుగు రాష్ట్రాల సీఎస్లు భేటీ

Published Fri, Jul 31 2015 11:24 AM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM

L C Goyal to meet AP TS CSs in New Delhi

న్యూఢిల్లీ : కేంద్రం హోంశాఖ కార్యదర్శి ఎల్ సీ గోయల్తో తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో గోయల్తో టీ సీఎస్ రాజీవ్ శర్మ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సమావేశమయ్యారు. విద్యుత్ ఉద్యోగుల రిలీవ్ వివాదం, కమలనాథన్ కమిటీపై వారు గోయల్తో చర్చిస్తున్నారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసిన 1253 మంది విద్యుత్ ఉద్యోగులు ఈ రోజు ఉదయం జంతర్మంతర్ వద్ద ధర్నాకు దిగారు. విభజన పూర్తికాకముందే తమను ఉద్యోగాల నుంచి తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేయడం అన్యాయమని విద్యుత్ ఉద్యోగులు జంతర్మంతర్ వద్ద ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement