ఓటుకు కోట్లు కేసులో కోర్టుకు సండ్ర | MLA Sandra to the ACB special court on vote for cash case | Sakshi
Sakshi News home page

ఓటుకు కోట్లు కేసులో కోర్టుకు సండ్ర

Published Sat, Apr 1 2017 12:21 AM | Last Updated on Wed, Aug 29 2018 7:31 PM

MLA Sandra to the ACB special court on vote for cash case

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కేసులో నిందితునిగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య శుక్రవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. వీరయ్య హాజరును నమోదు చేసుకున్న కోర్టు తదుపరి విచారణను మే 9కి వాయిదా వేసింది.

మరోవైపు పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్‌రావు దాఖలు చేసిన పరువునష్టం కేసులో నాంపల్లి కోర్టుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హాజరు కావాల్సి ఉంది. అయితే న్యాయవాదులు విధులు బహిష్కరించిన నేపథ్యంలో హాజరుకాలేకపోతున్నట్లు రేవంత్‌ తరఫు న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి కోర్టు అనుమతించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement