కేంద్ర నేర పరిశోధన సంస్థ(సీబీఐ) తరఫున హైదరాబాద్ జోన్కు పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా వ్యవహరిస్తున్న తోట వెంకటరమణకు బుధవారం పదోన్నతి లభించింది.
సాక్షి, హైదరాబాద్: కేంద్ర నేర పరిశోధన సంస్థ(సీబీఐ) తరఫున హైదరాబాద్ జోన్కు పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)గా వ్యవహరిస్తున్న తోట వెంకటరమణకు బుధవారం పదోన్నతి లభించింది. ఈయన్ను సీబీఐ ముంబై జోన్కు డిప్యూటీ లీగల్ అడ్వైజర్గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరానికి చెందిన రమణ 1995లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ద్వారా సీబీఐలో పీపీగా ఎంపికయ్యారు. ఆపై సీనియర్ పీపీగా పదోన్నతి పొందడంతోపాటు వరుసగా రెండుసార్లు కేంద్రం నుంచి ఉత్తమ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవార్డును అందుకున్నారు. వోక్స్వ్యాగన్, అబ్దుల్ కరీం తెల్గీ నిందితుడిగా ఉన్న నకిలీ స్టాంపుపేపర్ల కుంభకోణాల కేసులతోపాటు మాఫియా డాన్ అబూ సలీం నిందితుడిగా ఉన్న నకిలీ పాస్పోర్ట్ కేసులోనూ రమణ సీబీఐ తరఫున న్యాయస్థానంలో వాదనలు వినిపించారు.