promotion
-
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బెట్టింగ్ విషాదాలు
-
ఇంటర్ విద్యలో వింత పోకడ!
సాక్షి, అమరావతి: ఏదైనా ప్రభుత్వ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉన్న ఉద్యోగికి పదోన్నతి ఇస్తే సినియర్ అసిస్టెంట్ అవుతారు. సీనియర్ అసిస్టెంట్ నుంచి సెక్షన్ సూపరింటెండెంట్ అవుతారు. కానీ ఇంటర్మీడియట్ విద్యా మండలి(Board of Intermediate Education)లో జూనియర్ అసిస్టెంట్ నుంచి నేరుగా సూపరింటిండెంట్గా పదోన్నతి ఇచ్చేస్తారు. ఇదేలా సాధ్యమంటారా? ఇది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. ఏదైనా సాధ్యమే. ఇంటర్మీడియట్ విద్యా మండలిలో కొందరు జూనియర్ లెక్చరర్లకు ఏకంగా జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు (డీవీఈవో)లుగా పదోన్నతులిచ్చేందకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి జూనియర్ లెక్చరర్ల (జేఎల్)కు సీనియారిటీ ప్రకారం ప్రిన్సిపల్స్గా పదోన్నతి ఇస్తారు. ప్రిన్సిపల్స్కు డీవీఈవోగా పదోన్నతి ఇస్తారు. కానీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2008లో ఇచ్చిన వివాదాస్పద జీవో నం.283లోని ‘ఇనిషియల్ గెజిటెడ్ ర్యాంక్’ పాయింట్కు కొత్త భాష్యం చెబుతూ కొందరు జేఎల్లకు డీవీఈవోలుగా నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ జీవో ఇచ్చిన సందర్భం, పదోన్నతుల నిబంధనలతో సంబంధం లేకుండా చేస్తున్న ఈ ప్రక్రియ బోర్డు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకునేలా ఉంది. మరోపక్క ప్రస్తుతం పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ప్రిన్సిపల్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లేని పోస్టుల కోసం ఇచ్చిన జీవోతో లబ్ధి చేసేలా.. ఇంటర్ విద్యా శాఖలో ఒకేషనల్ కోర్సుల పర్యవేక్షణకు 2002–03లో జేఎల్తో సమానమైన కేడర్తో డిప్యూటీ డీవీఈవో (డీవైడీవీఈవో) పోస్టులు భర్తీ చేశారు. డీవీఈవోలుగా జేఎల్లకు పదోన్నతి కల్పించాలని ఉమ్మడి రాష్ట్రంలో 2008లో జీవో 283ని నాటి ప్రభుత్వం జారీ చేసింది. ఇలా జేఎల్లను నేరుగా జిల్లా అధికారులుగా నియమించడంపై తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం ఆ జీవో అమలును నిలిపివేసింది. 2012లో డీవైడీవీఈవోలకు పదోన్నతులిచ్చినా, ఈ జీవోను కాకుండా ప్రిన్సిపల్ సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంది. ఆ తర్వాత డిప్యూటీ డీవీఈవో పోస్టులను భర్తీ చేయలేదు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఈ కేడర్లో ఎవరూ పనిచేయడం లేదు. 16 ఏళ్లుగా అమలు కాని ఈ జీవోను ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొందరికి లబ్ధి చేకూర్చేలా ముందుకు తెచ్చింది. జీవోలో ఉన్న లోపాలను అవకాశంగా తీసుకొని ప్రస్తుతం తక్కువ సర్వీసు ఉన్న ప్రిన్సిపల్స్ కోర్టుకెళ్లి జీవోను అమలు చేయాలని ఇంటర్ విద్యా కమిషనర్పై ఒత్తిడి తెస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ జీవో అమలైతే ఎన్నో ఏళ్లుగా ప్రిన్సిపల్స్గా పనిచేస్తున్న వారికి తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదముంది. ఏపీపీఎస్సీ ద్వారా నేరుగా జేఎల్స్ అయినవారు, టీచర్లు, ఇతర కేడర్ల నుంచి జేఎల్స్గా పదోన్నతులు పొందిన వారి మధ్య ఇప్పటికే సీనియారిటీ వివాదం కొనసాగుతోంది. ఇప్పుడు వివాదాస్పద జీవోను తెరపైకి తెచ్చి ప్రభుత్వం మరో కొత్త సమస్య తెచ్చిపెడుతోంది.జీవో 283ఏం చెబుతోంది?మూడేళ్ల సర్వీసు ఉన్న ప్రిన్సిపల్స్కు, మూడేళ్ల సర్వీసు ఉన్న డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఒకేషనల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లకు కలిపి కామన్ సీనియారిటీ చేసేటప్పుడు వారి ‘ఇనిషియల్ గెజిటెడ్ కేడర్ సర్వీస్’ని పరిగణనలోకి తీసుకోవాలి. ఎవరి యూనిట్ సీనియారిటీ దెబ్బతినకుండా చూడాలి. కానీ ప్రస్తుతం డిప్యూటీ డీవీఈవో కేడర్లో లబ్దిదారులు లేకపోవడంతో ఈ జీవోను అమలు చేయాల్సిన అవసరం లేదన్నది సీనియర్ ప్రిన్సిపల్స్ వాదన.ఈ రెండు కేడర్లలో అర్హులైన వారు ఉంటేనే జీవోను అమలు చేయాలి. ఒక కేడర్లో పనిచేసే లబ్దిదారులు లేకుండా ఉమ్మడి సీనియారిటీ ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ విద్యా శాఖలో రూల్ 34, జీవో 283ని కొందరి స్వార్థం కోసం ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని చెబుతున్నారు.సీనియర్ ప్రిన్సిపల్స్కు అన్యాయం సర్వీసు నిబంధనల ప్రకారం జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ కావాలంటే జేఎల్స్ గెజిటెడ్ ఆఫీసర్ టెస్ట్ (జీవోటీ), ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టెస్ట్ (ఈవోటీ) పాసవ్వాలి. డీవీఈవోలుగా పదోన్నతి పొందాలంటే తప్పనిసరిగా ప్రిన్సిపల్ అయ్యుండాలి. అంటే జూనియర్ లెక్చరర్లలో సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా ఎవరైతే జీవోటీ, ఈవోటీ పాసవుతారో వారే ప్రిన్సిపల్స్గా పదోన్నతి పొందుతారు. జీవో 283లో పేర్కొన్న ‘ఇనిషియల్ గెజిటెడ్ కేడర్ సర్వీస్’ అనేది కేవలం డిప్యూటీ డీవీఈవోలు, ప్రిన్సిపల్స్కు మాత్రమే ఉద్దేశించింది. కానీ ఈ అంశాన్ని ఇప్పుడు జేఎల్గా సర్వీసులో చేరినప్పటి నుంచి సీనియారిటీని లెక్కించాలని కొందరు కొత్త భాష్యం చెబుతూ ప్రస్తుతం డీవీఈవోల పదోన్నతులకు దీనినే పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. దీనివల్ల అన్ని టెస్టులు పాసై, అర్హతలు సాధించిన సీనియర్ ప్రిన్సిపల్స్ డీవీఈవోలుగా పదోన్నతి పొందే అవకాశం కోల్పోతున్నారు. జూనియర్ ప్రిన్సిపల్స్ లబ్ధి పొందుతున్నారని సీనియర్లు వాపోతున్నారు. హైకోర్టు సైతం యూనిట్ సీనియారిటీకి నష్టం జరగకుండా పదోన్నతులివ్వాలని చెప్పినా ఇనిషియల్ సీనియారిటీనే పరిగణనలోకి తీసుకుంటున్నారని, ఇదే జరిగితే తాము పూర్తిగా పదోన్నతులకు దూరమవుతామని ప్రిన్సిపల్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అందరికీ సమన్యాయం చేయాలని కోరుతున్నారు. -
జిల్లా జడ్జిలకు హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి
సాక్షి,న్యూఢిల్లీ:నలుగురు జిల్లా జడ్జిలకు తెలంగాణ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. శ్రీమతి రేణుకా యార, నందికొండ నర్సింగ్ రావు, తిరుమలాదేవి, మధుసూదనరావులను హైకోర్టు జడ్జిలుగా సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. దీంతోపాటు ఏపీ హైకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జిలను కొలీజియం సిఫారసు చేసింది. ఏపీలో జిల్లా జడ్జిలుగా పనిచేస్తున్న అవధానం హరిహరణాధ శర్మ,డాక్టర్ యడవల్లి లక్షణరావులకు ఏపీ హైకోర్టు జడ్జిలుగా పదోన్నతి లభించింది. రాష్ట్రపతి ఆమోదంతో వీరి నియామకాలు అమలులోకి వస్తాయి. ఇదీ చదవండి: కేంద్రమంత్రికి మెటా క్షమాపణలు -
సందర్శకులను ఆకర్శించేలా మహా ‘బ్రాండ్’ మేళా!
‘మహా కుంభమేళా(Maha Kumbh Mela 2025)’ కేవలం ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే క్రమంలో ప్రముఖ కంపెనీలు తమ బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడానికి ఒక అవకాశంగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నాయి. దేశంలోని భక్తులు మాత్రమే కాదు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తారు. ప్రముఖులు, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, సీఈఓలు.. ఇలా విభిన్న రంగాలకు చెందినవారు హాజరవుతారు. ఈ తరుణంలో కార్పొరేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంతకంటే మెరుగైన అవకాశం మరొకటి ఉండదని భావిస్తున్నాయి. దాంతో విభిన్న ప్రచారపంథాను అనుసరిస్తున్నాయి.భారీగా భక్తుల తాకిడి..పన్నెండేళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళాను గంగా, యమునా, సరస్వతి నదులు ఒకేచోట కలిసే ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్నారు. జనవరి 14న మొదలై ఫిబ్రవరి 26తో ఈ కార్యక్రమం ముగుస్తుంది. ప్రయాగ్రాజ్లో స్నానాలు ఆచరిస్తే పుణ్యం కలుగుతుందని విశ్వసిస్తారు. ఈసారి దాదాపు 40 కోట్ల మంది మంది ఈ మహా కుంభమేళాకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్ కంపెనీలు దీన్ని అవకాశం మలుచుకుని తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలని చూస్తున్నాయి. అందుకోసం విభిన్న మార్గాలను అనుసరిస్తున్నాయి.బ్రాండ్ ప్రచారంకొన్ని కంపెనీలు తమ బ్రాండ్ను ప్రచారం చేసుకునేందుకు దుస్తులు మార్చుకునే గదులు, ఛార్జింగ్ పాయింట్లు, విశ్రాంతి గదులు, సెల్ఫీ జోన్ల(Selfie Zones)ను ఏర్పాటు చేస్తున్నాయి. ఉదాహరణకు, డాబర్ ఆమ్లా, వాటికా స్నానాల ఘాట్ల వద్ద మహిళల కోసం దుస్తులు మార్చుకునే గదులను ఏర్పాటు చేశాయి. డాబర్ లాల్ తేల్ ప్రత్యేక శిశు సంరక్షణ గదులను ఏర్పాటు చేసింది.ప్రకటనలకు భారీగా ఖర్చుభక్తులు నివసించే ప్రదేశాలు, షాపింగ్ చేసే ప్రాంతాల్లో హోర్డింగ్లు, ఫ్లెక్స్ బోర్డులు, ఎల్ఈడీ స్క్రీన్(LED Screens)లు వంటి విభిన్న ప్రకటన మాధ్యమాలను ఉపయోగిస్తున్నాయి. 45 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో భక్తులకు తమ బ్రాండ్ల విజిబిలిటీ కోసం రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు ఖర్చు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. హోర్డింగ్లు/ ఫ్లెక్స్ ప్రింటింగ్ ప్రదర్శించాలని ఆసక్తి ఉన్నవారు కనీసం రూ.10 లక్షలు వెచ్చించాల్సి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఎల్ఈడీ స్క్రీన్పై 10 సెకన్ల యాడ్ కోసం కనిష్టంగా రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉందని చెబుతున్నారు.సాంస్కృతిక సమైక్యతకంపెనీలు తమ బ్రాండ్ను మార్కెటింగ్ చేసే వ్యూహాల్లో సంప్రదాయం, సంస్కృతిని మిళితం చేస్తున్నాయి. ఉదాహరణకు ఐటీసీ బ్రాండ్ బింగో.. లోకల్ సాంగ్స్పై రీల్స్ చేయాలని నిర్ణయించింది. కుకు ఎఫ్ఎం తన ఓటీటీ యాప్ ‘భక్తి’ని లాంచ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.ఇదీ చదవండి: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలపై లీగల్ చర్యలు?సామాజిక బాధ్యతకార్పొరేట్ కంపెనీలకు వచ్చే లాభాల్లో నిబంధనల ప్రకారం ‘కార్పొరేట్ సమాజిక బాధ్యత(CSR)’ కింద కొన్ని నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. అది ఈ కుంభమేళాలో వెచ్చించనున్నారు. దాంతో కంపెనీలకు పబ్లిసిటీతో పాటు, సీఎస్ఆర్ నిధులు ఖర్చు అవుతాయి. అందులో భాగంగా హెల్ప్ డెస్క్లు, పోలీసు బారికేడ్లు, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అత్యవసర సేవలను అందించడం ద్వారా సంస్థలు ఈ కార్యక్రమానికి పెద్దపీట వేస్తున్నట్లు తెలిసింది. మహా కుంభమేళా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తుంది. వివిధ దేశాల నుంచి సందర్శకులు, భక్తులు పెద్ద సంఖ్యలో రాబోతున్నారు. అంతర్జాతీయంగా తమ బ్రాండ్లను ప్రమోట్ చేయాలనుకునేవారికి ఇదో మంచి అవకాశంగా భావిస్తున్నారు. -
‘ప్రమోట్’కు ఒకటే ప్రమాణం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లోనూ ఒకే తరహా ప్రమోషన్ విధానం తీసుకురావాలని ప్రభుత్వం సాంకేతిక విద్య విభాగానికి సూచించింది. ఇంజనీరింగ్లో కనీసం 20 క్రెడిట్స్ ఉంటేనే తర్వాతి ఏడాదికి ప్రమోట్ చేసే విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. దీనిపై త్వరలో అన్ని వర్సిటీల వీసీలతో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సమావేశం నిర్వహించనున్నారు. ఈ ఏడాది నుంచే దీనిని అమల్లోకి తేవాలని భావిస్తున్నారు. ఇప్పటికే క్రెడిట్ పాయింట్లను బట్టి మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి ప్రమోట్ చేస్తున్నారు. అయితే ఈ విధానం ఒక్కో యూనివర్సిటీలో ఒక్కో రకంగా ఉంది. దీంతో కొన్ని వర్సిటీల విద్యార్థులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో ఉస్మానియా, మహాత్మాగాంధీ, జేఎన్టీయూహెచ్, కాకతీయ యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. ప్రస్తుతం ఒక్కో చోట ఒక్కో విధానం వర్సిటీల్లో ఒక్కో సెమిస్టర్కు 20 చొప్పున, ఏడాదికి 40 క్రెడిట్స్ ఉంటాయి. ఉస్మానియా, మహాత్మాగాంధీ యూనివర్సిటీల్లో బీటెక్ మొదటి ఏడాది నుంచి రెండో ఏడాదికి వెళ్లాలంటే విద్యార్థి మొదటి సంవత్సరంలో 50 శాతం క్రెడిట్స్ సాధించాలి. కానీ జేఎన్టీయూహెచ్, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో 25 శాతం క్రెడిట్స్ పొందితే సరిపోతుంది. మిగతా సంవత్సరాల విషయంలోనూ ఒక్కో వర్సిటీలో ఒక్కో క్రెడిట్ విధానం ఉంది. నాలుగేళ్లకు కలిపి మొత్తం 160 క్రెడిట్ పాయింట్లు ఉంటాయి. 4వ సంవత్సరంలో 160 క్రెడిట్స్ సాధించాల్సి ఉంటుంది. అయితే యూనివర్సిటీలకు వేర్వేరు సిలబస్ ఉండటం వల్ల కూడా క్రెడిట్ విధానంలో తేడా ఉంటోంది. సిలబస్, పీరియడ్స్ను బట్టి 3 లేదా 4 చొప్పున క్రెడిట్స్ ఉంటాయి. జేఎన్టీయూహెచ్లో ఫస్టియర్ ఇంజనీరింగ్లో ఐదు థియరీ సబ్జెక్టులు, మూడు ల్యాబ్లు ఉంటాయి. విద్యార్థి పాసయ్యే ఒక్కో సబ్జెక్టుకు దానికి సంబంధించిన క్రెడిట్ పాయింట్లు అతని ఖాతాలో పడతాయి. విద్యార్థులు ఎక్కడ తేలికగా ప్రమోట్ అవుతారో చూసుకుని ఆ వర్సిటీని ఎంచుకుంటున్నారు. -
8 నెలల్లోనే ప్రమోషన్.. రూ.80 లక్షల బోనస్
గూగుల్ కంపెనీలో మూడేళ్లకు పైగా పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి.. తన ప్రమోషన్ గురించి, 30 శాతం పెంపు ఎలా వచ్చింది అనే విషయాన్ని గురించి థ్రెడ్లో వెల్లడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన 'జెర్రీ లీ' అనే వ్యక్తి 2018లో గూగుల్లో చేరాడు. ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే సీనియర్ స్ట్రాటజీ అండ్ ఆపరేషన్స్ మేనేజర్గా ఎదిగారు. తన పోస్ట్లో..తన సహచరులు ఎక్కువగా తనను బాధ్యతగా భావించారని వెల్లడించాడు.గూగుల్లో నా మొదటి రెండు నెలలు? నిజాయితీగా, అవి విచిత్రంగా సాగాయని వివరించాడు.పనిని సులభంగా తీసుకో అని చెప్పడం, ఉచిత భోజనం తినమని చెప్పడం, క్యాంపస్ చూడమని చెప్పడం చేసేవారు. ఎందుకంటే నేను కంపెనీలో ఉన్న ఇతరుల కంటే చిన్నవాడిని. ఆరు ఏళ్లు దాటిన వారితో కూడిన బృందంలో వారు నన్ను మొదటి కొన్ని నెలలపాటు నెగిటివ్గా చూశారని భావించినట్లు పేర్కొన్నాడు.రెండు నెలలు గడిచినా ఏమీ చేయకపోవడంతో విసుగు వచ్చిందని, ఎలాగైనా తన విలువ పెంచుకోవాలని భావించానని చెప్పాడు. నేను ప్రాజెక్ట్ల కోసం అడగడం మొదలుపెట్టాను. చివరగా నా మేనేజర్లలో ఒకరు, మీరు ఈ మార్కెట్ ల్యాండ్స్కేప్ విశ్లేషణను ఎందుకు చూడకూడదు? అని చెప్పారు. నేను దానిని గమనించాను.ఇదీ చదవండి: అక్కడ భారీగా బయటపడ్డ తెల్ల బంగారంఆ తరువాత ఇద్దరు ప్రాజెక్ట్ మేనేజర్లు, ఆరుగురు ఇంజనీర్లు, మరో ఐదుగురు విశ్లేషకులు, కార్యకలాపాలు, చట్టపరమైన విభాగాలకు చెందిన ఇతర ఉద్యోగులతో కలిసి ఒక ప్రాజెక్ట్ను నడిపిస్తున్నట్లు నన్ను గుర్తించారు. దీంతో కంపెనీలో చేరిన ఎనిమిది నెలల తరువాత 80 లక్షల బోనస్ అందుకోవడం మాత్రమే కాకుండా.. ప్రమోషన్ కూడా పొందినట్లు పేర్కొన్నాడు. -
ఇంక్రిమెంట్లు, బోనస్ల పవర్ తెలుసా..?
ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ల రూపంలో సంపాదన పెరిగినప్పుడు విలాసాలకు, అనవసర ఖర్చులకు డబ్బు వృథా చేయకూడదని నిపుణులు తెలియజేస్తున్నారు. వచ్చే దసరా, దీపావళి వంటి పండగలకు చాలా కంపెనీలు బోనస్ను ప్రకటిస్తుంటాయి. ఈ డబ్బును పొదుపు చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.బోనస్, ఇంక్రిమెంట్, ప్రమోషన్ రూపంలో అదనంగా సమకూరే డబ్బును దీర్ఘకాల రాబడులిచ్చే ఈక్విటీ మార్కెట్లోకి మళ్లించాలి. ఇప్పటికే నెలవారీ క్రమానుగత పెట్టుబడి విధానంలో ఇన్వెస్ట్ చేస్తున్న వారికి ఇది మరింత డబ్బు సంపాదించేందుకు ఉపయోగపడుతుంది. దీర్ఘకాలిక మదుపునకు అదనంగా జోడించే ఐదుశాతం భవిష్యత్తులో పెద్ద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు మీ నెల జీతం యాభైవేల రూపాయలు అనుకుందాం. ప్రతినెలా రూ.10 వేలు మ్యుచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారనుకుందాం. ఏటా ఐదు శాతం ఇంక్రిమెంటును పరిగణనలోకి తీసుకుందాం. మన ఇన్వెస్ట్మెంట్స్పై 12 శాతం వార్షిక రాబడి ఉంటుందనే అంచనాకు వద్దాం. అప్పటి దాకా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక మదుపును ఏటా ఐదు శాతం పెంచుకోవడం వల్ల జీవనశైలిలో పెద్దగా మార్పు ఉండదు. రోజువారీ ఖర్చుల విషయంలో రాజీ పడాల్సిన అవసరమూ రాదు. కానీ, ముప్పై ఏళ్ల తర్వాత.. రూ.3.7 కోట్ల స్థానంలో అక్షరాలా రూ.5.2 కోట్లు అందుకుంటారు. అంటే, ఏటా ఐదుశాతం అదనంగా ఇన్వెస్ట్ చేస్తే రూ.1.5 కోట్లు ఎక్కువగా సమకూరుతాయి.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని హెచ్చరిక! -
ఐదుగురు ఐపీఎస్లకు డీజీలుగా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిలో 1994 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారులు కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, బి.శివధర్రెడ్డి, అభిలాష బిస్త్, సౌమ్యా మిశ్రా, శిఖాగోయల్ ఉన్నారు. అయితే, వీరిలో కేడర్ కేటాయింపు వివాదం కొనసాగుతున్న ఐపీఎస్ అధికారి అభిలాష బిస్త్కు మాత్రం డీఓపీటీ నుంచి తెలంగాణ కేడర్కు కేటాయించినట్టు నిర్ధారణ అయిన తర్వాతే పదోన్నతి వర్తిస్తుందని స్పష్టం చేశారు. డీజీలుగా పదోన్నతి పొందిన ఐదుగురు అధికారులను తిరిగి ప్రస్తుత పోస్టింగ్లలోనే డీజీపీ హోదాలో కొనసాగిస్తున్నట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు. వీరిలో కొత్తకోట శ్రీనివాస్రెడ్డి హైదరాబాద్ సీపీగా, బి.శివధర్రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీపీ, అభిలాష బిస్త్ను తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్, డీజీపీ ట్రైనింగ్గా, డా.సౌమ్యా మిశ్రా జైళ్లశాఖ డీజీగా, శిఖాగోయల్ సీఐడీ డీజీపీగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా, టీజీఎఫ్ఎస్ఎల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జి డైరెక్టర్గా కొనసాగుతున్నారు.కాగా, పదోన్నతి పొందిన వారిలో హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సర్వీస్ వచ్చే ఏడాది ఆగస్టు వరకు, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్రెడ్డి సరీ్వస్ 2026 ఏప్రిల్ వరకు, జైళ్లశాఖ డీజీ సౌమ్యా మిశ్రా సరీ్వస్ 2027 డిసెంబర్ వరకు, శిఖాగోయల్ సర్వీస్ 2029 మార్చి వరకు ఉంది. -
‘వర్క్ ఫ్రమ్ హోమ్’ కోసం డెల్ ఉద్యోగులు చేస్తున్న రిస్క్ ఏంటి?
వర్క్ ఫ్రమ్ హోమ్కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రప్పించడం కంపెనీలకు కత్తిమీద సాములా మారింది. ఎన్ని ఆంక్షలు పెట్టినా, కఠిన నిబంధనలు తీసుకొస్తున్నా ఉద్యోగులు జంకడం లేదు. ఆఫీస్కు రావడానికి ససేమిరా అంటున్నారు. ప్రముఖ టెక్నాలజీ కంపెనీ డెల్ ఉద్యోగులైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ప్రమోషన్లు సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు.డెల్ కంపెనీ గత ఫిబ్రవరిలో రిటర్న్-టు-ఆఫీస్ తప్పనిసరి నిబంధనను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. హైబ్రిడ్గా పనిచేస్తారా.. లేక రిమోట్గా పనిచేస్తారా అన్నది అధికారికంగా తెలియజేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ను ఎంచుకున్న ఉద్యోగులు ప్రమోషన్ లేదా పాత్ర మార్పులకు అర్హులు కాదని కంపెనీ పేర్కొంది.హైబ్రిడ్ను ఎంచుకున్న ఉద్యోగులకు త్రైమాసికానికి 39 రోజులు, వారానికి సుమారు మూడు రోజులు ఆఫీసులో హాజరును కంపెనీ తప్పనిసరి చేసింది. వారి హాజరును కలర్-కోడ్ సిస్టమ్ ద్వారా పర్యవేస్తుంది. బిజినెస్ ఇన్సైడర్ ప్రకారం.. డెల్ ఫుల్టైమ్ యూఎస్ ఉద్యోగులలో దాదాపు 50 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ను ఎంచుకున్నారు.దీని అర్థం ఈ ఉద్యోగులు పదోన్నతికి అర్హులు కాదు. ఇక అంతర్జాతీయ సిబ్బందిలోనూ మూడింట ఒక వంతు మంది వర్క్ ఫ్రమ్ హోమ్నే ఎంచుకున్నారు. ఆఫీసుకు వెళ్లడం కన్నా ఇంటి నుంచి పనిచేయడంలోనే తమకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని చాలా మంది ఉద్యోగులు భావిస్తున్నారు. దీంతో ప్రమోషన్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యారు. -
జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. ఉక్కిరి బిక్కిరవుతున్న ఉద్యోగులు
ప్రపంచ జాబ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ధోరణులు పుట్టుకు రావడం సర్వసాధారణంగా మారింది. కోవిడ్-19 సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ తర్వాత మూన్లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ పేరుతో జాబ్ మార్కెట్లో కొత్త ట్రెండే నడిచింది. అవేవి చాలవన్నట్లు తాజాగా ‘డ్రై ప్రమోషన్’ అనే కొత్త పదం తెరపైకి వచ్చింది. కోవిడ్-19 తర్వాత జాబ్ మార్కెట్లు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడా బడా టెక్ కంపెనీల వరకు ప్రాజెక్ట్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఖర్చు విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. లేఆఫ్స్, రిమోట్ వర్క్, కృత్తిమ మేధ వినియోగం పేరుతో పొదుపు మంత్రాన్ని జపిస్తున్నాయి. డ్రై ప్రమోషన్ పేరుతో ఇప్పుడు ఉద్యోగుల జీతాల విషయంలో డ్రై ప్రమోషన్ విధానాన్ని అవలంభిస్తున్నాయి. కంపెనీలు ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాయి. అందుకు తగ్గట్లుగా జీతాల్ని పెంచవు. బరువు, బాధ్యతల్ని పెంచుతాయి. ఇప్పుడు దీన్ని డ్రై ప్రమోషన్ అని పిలుస్తున్నారు. 900 కంపెనీల్లో జరిపిన సర్వేలో ప్రముఖ కాంపన్సేషన్ కన్సల్టెన్సీ సంస్థ పర్ల్ మేయర్ డ్రై ప్రమోషన్పై ఓ నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం.. దాదాపు 13 శాతం కంపెనీలు తమ ఉద్యోగులకు వేతన పెంపులేని ప్రమోషన్లు ఇవ్వడానికి సిద్ధమయ్యాయి. 2018లో ఈ సంఖ్య 8శాతం మాత్రమే అని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. మరో కన్సల్టెన్సీ సంస్థ మెర్సెర్ అనే సంస్థ 900 కంపెనీలపై జరిపిన సర్వేలో 2023తో పోలిస్తే 2024లో ఎక్కువ శాతం కంపెనీలు ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తేలింది. లేఆఫ్స్ ఆపై ప్రమోషన్లు అంతకుముందు, ఉద్యోగుల కొరతను ఎదుర్కొన్న కంపెనీలు వారిని నిలుపుకునేందుకు భారీగా వేతనాలు పెంచింది. అదే సమయంలో ఉద్యోగాల్ని తొలగించింది. వారి స్థానంలో కొత్త ఉద్యోగుల్ని తీసుకోకుండా.. ఉన్న వారికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రమోషన్ పేరుతో కొత్త ట్రెండ్కు తెరతీశాయి ఆయా సంస్థలు కంపెనీలకు వరమేనా? ఈ విధానంపై ఉద్యోగులు డైలామాలో ఉన్నారు. ఓ వర్గం ఉద్యోగులు ప్రమోషన్ తీసుకుని మరో సంస్థలో చేరితే అధిక వేతనం, ప్రమోషన్లో మరో అడుగు ముందుకు పడుతుందని భావిస్తుండగా.. రేయింబవుళ్లు ఆఫీస్కే పరిమితమై కష్టపడ్డ తమకు తగిన ప్రతిఫలం లేకపోవడం ఏంటని మరో వర్గం ఉద్యోగులు నిట్టూరుస్తున్నారు. మొత్తానికి డ్రై ప్రమోషన్ విధానం కంపెనీలకు ఓ వరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నవారు లేకపోలేదు. -
గూగుల్ నాకందుకే ప్రమోషన్ ఇవ్వలేదు: మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోపణలు
Google employee: వివక్షపూరితమైన పని సంస్కృతిపై ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న టెక్ దిగ్గజం గూగుల్పై ఒక మాజీ ఉద్యోగి తీవ్ర ఆరోణలు చేశారు. తన శరీర రంగు తెలుపు అయినందుకే గూగుల్ తనకు ప్రమోషన్ తిరస్కరించినట్లు ఆరోపించారు. కాలిఫోర్నియాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో మూడు సంవత్సరాలు పనిచేసిన షాన్ మాగైర్.. 2019లో ప్రమోషన్ ఇవ్వకపోవడంతో కంపెనీ నుంచి వైదొలిగారు. "తెల్లవాడిగా ఉన్నందుకు నాకు ప్రమోషన్ రాదన్నారు. ఆ కథేంటో పబ్లిక్గా చెప్పమంటారా?" అంటూ మాగైర్ గతేడాది డిసెంబర్లో ‘ఎక్స్’ (ట్విటర్)లో ఓ పోస్ట్ పెట్టారు. గూగుల్ తన ఏఐ చాట్బాట్ జెమిని పనితీరుతో జాతి వివక్ష విమర్శలకు దారితీసిన తర్వాత గూగుల్లో తాను ఎదుర్కొన్న వివక్ష గురించి మాగైర్ తాజాగా వివరించారు. తాను తెల్లగా ఉన్నందుకు ప్రమోషన్ నిరాకరించిన కంపెనీగా గూగుల్ని మాగ్యురే పేర్కొన్నాడు. తాను అత్యధిక పనితీరు కనబరుస్తున్న వ్యక్తులలో ఒకడిని అయినప్పటికీ తనను ప్రమోట్ చేయలేనని అతని సూపర్వైజర్ చెప్పినట్లు మాగైర్ పేర్కొన్నాడు. ‘నాకు వేరే కోటా ఉంది.. నేను ఈ విషయం నీకు చెప్పనక్కరలేదు. ఇది తెలిస్తే నన్ను తొలగిస్తారు’ అతని బాస్ స్పష్టంగా చెప్పినట్లు వివరించాడు. అయితే ఈ ఆరోపణలను గూగుల్ ప్రతినిధి ఖండించారు. “వ్యవస్థాపకులు, బోర్డు.. సిబ్బంది విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. షాన్ ప్రతిభావంతుడైన ఇన్వెస్టర్. సెక్వోయాలో అతనికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అయితే గూగుల్ అతని ప్రమోషన్, కెరీర్ పురోగతికి సంబంధించిన జాతి లేదా లింగ బేధాలను పరిగణనలోకి తీసుకోలేదు” అని ఆ ప్రతినిధి చెప్పారు. మాగైర్ 2016 నుంచి 2019 మధ్య గూగుల్లో పని చేశారు. ప్రస్తుతం ఆయన సెక్వోయా క్యాపిటల్లో భాగస్వామిగా ఉన్నారు. -
చెట్టంత చేయూత
సాక్షి, అమలాపురం: వయసు మళ్లిన కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవతో ఉద్యాన శాఖ ప్రోత్సాహం అందిస్తోంది. కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు (సీడీబీ) పాత చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకునేందుకు ఆర్ అండ్ ఆర్ (రీ ప్లాంటింగ్ అండ్ రెజువెనేషన్) పథకంలో భాగంగా హెక్టారుకు రూ.53,500 చొప్పున అందించనుంది. ఈ సొమ్ముతో తోటల్లో దిగుబడి తక్కువగా వస్తున్న.. తెగుళ్లు అధికంగా సోకి దెబ్బతిన్న కొబ్బరి చెట్ల స్థానంలో కొత్తవి పాతుకునే వీలుంటుంది. కోనసీమలో 1.10 లక్షల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతోంది. ఇప్పుడున్న తోటల్లో మూడో వంతు తోటల వయసు 60 ఏళ్లకు పైబడింది. దేశవాళీ కొబ్బరి చెట్ల వయసు 60నుంచి వందేళ్లు ఉంటోంది. కానీ.. 60 ఏళ్లు దాటిన తరువాత వీటిలో దిగుబడి 40 శాతానికి పడిపోతోంది. అలాగే కొబ్బరి తోటలు సహజ సిద్ధమైన శక్తిని కోల్పోయి తెగుళ్లు, పురుగుల్ని తట్టుకోలేకపోతున్నాయి. వీటి స్థానంలో కొత్తవి వేసుకోవాల్సి ఉంది. అధిక దిగుబడి ఇచ్చే కొత్త వంగడాలు, హైబ్రీడ్, పొట్టి రకాల చెట్లు వేసేందుకు ఇదే మంచి సమయం. దీనివల్ల దిగుబడి, కొబ్బరి కాయ సైజు పెరిగి ఉత్తరాది మార్కెట్లో తమిళనాడు, కేరళ, కర్ణాటక నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకునే అవకాశం ఉంటుంది. ప్రోత్సాహం ఇలా.. కొత్త చెట్లను పాతుకునే విషయంలో కోనసీమ రైతులు పూర్తిగా వెనుకబడ్డారు. పాత చెట్లను యథాతథంగా ఉంచి.. పక్కనే కొత్త చెట్లు పాతుతుంటారు. ఇలా చేయడం వల్ల కొబ్బరి తోటలో చెట్ల సంఖ్య పెరిగి అంతర పంటలు వేసుకునే అవకాశం ఉండటం లేదు. మరోవైపు దిగుబడి సైతం తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్ని గుర్తించిన కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు, ఆర్ అండ్ ఆర్ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకం కింద హెక్టారుకు 32 చెట్లను తొలగించి కొత్త చెట్లు పాతుకోవాల్సి ఉంటుంది. చెట్టు తొలగింపు, ఆ ప్రాంతంలో మందులు వేసి భూమిని బాగు చేయడంతోపాటు కొత్త చెట్టు పాతుకోవాల్సి ఉంటుంది. హెక్టారుకు 32 చెట్లు తొలగింపునకు చెట్టుకు రూ.వెయ్యి చొప్పున రూ.32 వేలు, ఎరువులు, ఇతర వాటికి రూ.17,500 వినియోగిస్తారు. రూ.4 వేలను మొక్కలు నాటుకునేందుకు ఇస్తారు. చెట్టు పాతిన తరువాత రెండేళ్ల పాటు ఎరువులకు సైతం ఈ నిధులనే వినియోగించాల్సి ఉంటుంది. దిగుబడే కాదు.. కాయ సైజు తగ్గింది గతంలో ఎకరాకు సగటు దిగుబడి ప్రతి దింపులో 1,200 కాయలు వచ్చేవి. ఇప్పుడు 800 మించడం లేదు. ఏడాదికి ఆరు దింపులకు గాను సగటు 4,800 కాయలకు రూ.40,800 వరకూ వస్తుంటే.. దింపు కూలీకే రూ.9,600 వరకూ ఖర్చవుతోంది. తోటలకు పెట్టుబడులు సైతం పెరిగిపోయాయి. మరోవైపు పెద్ద వయసు చెట్లను తెగుళ్లు, పురుగులు ఆశించి నిలువునా గాయం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల వల్ల కొబ్బరి దిగుబడితోపాటు కాయ సైజు గణనీయంగా తగ్గిపోతోంది. దీంతో రైతులకు కనీస ఆదాయం కూడా రావడం లేదు. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలంటే.. రైతులు కొత్త చెట్లను నాటాల్సిన అవసరం ఏర్పడింది. -
గురుకులంలో 317 చిక్కులు
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. దాదాపు ఏడాదిన్నర క్రితమే కేటగిరీల వారీగా ఉద్యోగుల స్థానికత ఆధారంగా జోన్లు, మల్టీజోన్లు కేటాయించినప్పటికీ వారంతా ఇంకా పాత స్థానాల్లోనే కొనసాగుతున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలోనే నూతన కేటాయింపులు జరిపినప్పటికీ... విద్యా సంవత్సరం మధ్యలో మార్పులు జరిపితే బోధన, అభ్యసనలకు ఇబ్బందులు కలుగుతాయనే ఉద్దేశంతో కాస్త గడువు ఇచ్చింది. కేటాయింపులు పూర్తయినప్పటికీ స్థానచలనం కలిగిన ఉద్యోగులు 2023–24 విద్యా సంవత్సరం మొదటి రోజు నుంచి నూతన పోస్టింగ్లలో చేరాలని స్పష్టం చేసింది. అయితే నూతన కేటాయింపులపై వివిధ వర్గాల ఉద్యోగులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఎక్కడి ప్రక్రియ అక్కడే నిలిచిపోయింది. మొత్తంగా, రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన నూతన జోనల్ విధానానికి అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు అమలు పూర్తి చేయగా... సంక్షేమ గురుకులాల్లో మాత్రం ఈ ప్రక్రియ ముందుకు సాగలేదు. అన్నింటికీ అడ్డంకులే సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో వెయ్యికి పైబడి విద్యా సంస్థలున్నాయి. రాష్ట్రంలో ఐదు గురుకుల సొసైటీలు ఉండగా... సంక్షేమ శాఖల పరిధిలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(ఎంజేపీటీబీడబ్ల్యూ ఆర్ఈఐఎస్)లు కొనసాగుతున్నాయి. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ(టీ ఆర్ఈఐఎస్) మాత్రం విద్యాశాఖ పరిధిలో ఉంది. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యా సంస్థల్లో ప్రస్తుతం 35వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. మరో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సాగుతోంది. ఈ ప్రక్రియ పూర్తయితే గురుకుల సొసైటీ ఉద్యోగుల సంఖ్య భారీగా పెరగనుంది. కొత్తగా గురుకుల విద్యా సంస్థల్లో నియామకాలు జరగాలన్నా.... ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్నా నూతన జోనల్ విధానం ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ పూర్తి కావాల్సిందే. నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితేనే ఏయే జోన్లు, ఏయే మల్టీ జోన్లు, ఏయే జిల్లాల్లో ఉద్యోగ ఖాళీలు, పనిచేస్తున్న ఉద్యోగులు, సీనియార్టీ తదితరాలు స్పష్టంగా తెలుస్తాయి. ఆ జాబితాకు అనుగుణంగా బదిలీలు, పదోన్నతులు, కొత్తగా నియామకాలు పూర్తి చేస్తారు. కానీ గురుకులాల్లో ఉద్యోగుల కేటాయింపులు పూర్తికాకపోవడంతో గందరగోళంగా మారింది. బదిలీలకు ఐదేళ్లు పూర్తి... గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టి ఐదేళ్లు పూర్తయింది. 2018–19 విద్యా సంవత్సరం ప్రారంభంలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలకు అవకాశం కల్పించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మళ్లీ బదిలీలు జరగలేదు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని వివిధ కేటగిరీల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావడం, ప్రమోషన్ పోస్టులు సైతం పెద్ద మొత్తంలో ఉండటంతో పదోన్నతుల ప్రక్రియ సైతం చేపట్టాల్సి ఉంది. ఇవికాకుండా గురుకులాల్లో 12వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించిన అర్హత పరీక్షలు పూర్తయ్యాయి. అతి త్వరలో మెరిట్ జాబితా... అర్హుల గుర్తింపు పూర్తయితే వారికి పోస్టింగ్లు ఇవ్వాలి. ఎక్కడెక్కడ ఖాళీలున్నాయో స్పష్టత వస్తే తప్ప నియామక ఉత్తర్వులు ఇచ్చే వీలు లేదు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి సాధారణంగా మూడు, నాలుగు కేటగిరీల్లోని ప్రాంతాల్లోనే నియమిస్తారు. ప్రస్తుతం ఉద్యోగుల కేటాయింపులు పూర్తయితే తప్ప ఖాళీలపై స్పష్టత రాదని అధికారవర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. -
ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: ఏపీలో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు. ఐజీలుగా పదోన్నతి పొందిన వారిలో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, విశాఖపట్నం రేంజ్ డీఐజీ హరికృష్ణ, ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఆక్టోపస్ డీఐజీ రాజశేఖర్ బాబు, అడ్మిన్ డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏసీబీ డీఐజీ పీహెచ్డీ రామకృష్ణ. హోం స్పెషల్ సెక్రటరీ జి.విజయకుమార్, ఎస్ఇబి డీఐజీ రవిప్రకాష్, డీజిపీ ఆఫీస్ డీఐజీ మోహనరావు.. సెంట్రల్ డిప్యూటేషన్లో ఉన్న ఆకే రవికృష్ణ, జయలక్ష్మి ఉన్నారు. -
15మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలకు పదోన్నతిపై డీఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: ఎస్.వహీద్ బాషా( సీఐడీ), ఎం.హనుమంతరావు(సీఐడీ), టీవీ రాధా స్వామి (ఎస్బీ, గుంటూరు), డి.శ్రీహరిరావు (ఏసీబీ), జి.రాజేంద్ర ప్రసాద్ (ఇంటెలిజెన్స్), బి.పార్థసారథి ( సీఎస్బీ, విజయవాడ), కె.రసూల్ సాహెబ్ (సీఐడీ), ఎం.కిశోర్ బాబు ( విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), డీఎన్వీ ప్రసాద్ (ఇంటెలిజెన్స్), జి.రత్న రాజు ( పోలవరం), పి.రవిబాబు (ఇంటెలిజెన్స్), షేక్ అబ్దుల్ కరీమ్ (పీసీఎస్ అండ్ ఎస్), ఎస్. తాతారావు (విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), కోంపల్లి వెంకటేశ్వరరావు(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), సీహెచ్.ఎస్.ఆర్.కోటేశ్వరరావు(ఏసీబీ). -
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త జడ్జీలు
న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందనున్నారు. సీజేఐ జస్టిస్ డీ వై చంద్రచూడ్ సారథ్యంలోని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి ఈ మేరకు సిఫార్సు చేసింది. ఈ జాబితాలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా ఉన్నారు. ప్రతిభ, సామర్థ్యం, నిజాయితీ, విశ్వసనీయత, నేపథ్యం తదితరాలను జాగ్రత్తగా మదింపు చేసిన అనంతరం సుప్రీం న్యాయమూర్తులుగా వారి పేర్లను సిఫార్సు చేసినట్లు కొలీజియం తెలిపింది. వారి నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 34కు పెరుగుతుంది. న్యాయమూర్తులపై పెరుగుతున్న విపరీతమైన పని భారం దృష్ట్యా సుప్రీంకోర్టులో ఎప్పుడూ ఒక్క ఖాళీ కూడా ఉండకుండా చూడాల్సిన అవసరం ఉందని కొలీజియం అభిప్రాయపడింది. -
నేతన్నకు భరోసా వస్త్ర ప్రదర్శనలతో మార్కెటింగ్కు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: చేనేత వస్త్రాలకు ప్రచారం, విక్రయాలను విస్తృతం చేసేలా ఎగ్జిబిషన్(వస్త్ర ప్రదర్శన)లు దోహదం చేస్తాయనడంలో ఏమాత్రం సందేహంలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చేనేత రంగానికి సంక్షేమ రంగులు అద్దుతున్న రాష్ట్ర ప్రభుత్వం నేతన్నకు మార్కెటింగ్కు అవసరమైన సహకారం అందిస్తోంది. సంస్కృతికి ప్రతీకలుగా నిలిచే చేనేత వస్త్రాలను అపురూప నైపుణ్యం, సృజనాత్మకతతో అందించే నేతన్నలకు భరోసాగా నిలవడంలో ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేస్తోంది. గత నాలుగేళ్లలో 23 భారీ చేనేత వస్త్ర ప్రదర్శనలు(ఎగ్జిబిషన్) నిర్వహించగా, 392 చేనేత సహకార సంఘాలు పాల్గొన్నాయి. మొత్తం ఎగ్జిబిషన్లలో రూ. 21.62 కోట్లు విక్రయాలు జరిగేలా రాష్ట్ర చేనేత జౌళి శాఖ ప్రత్యేక చొరవ తీసుకోవడం విశేషం. కోవిడ్ సమయంలో చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్కు కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ మిగిలిన సమయంలో వా టిని విరివిగా నిర్వహించి చేనేత సహకార సంఘా లకు తమ ఉత్పత్తుల అమ్మకాలకు ఊతమిచ్చింది. ప్రతి యేటా అంతర్జాతీయ చేనేత దినోత్సవం రోజైన ఆగస్టు 7 నుంచి వారం పాటు రాష్ట్ర వ్యాప్తంగా హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాక, జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యా తులు గడించిన చేనేత ఉత్పత్తి సంఘాలు తమ స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నాయి. ఇదే సందర్భంలో ఫ్యాషన్ షో నిర్వహించి చేనేత వస్త్రాలు ప్రదర్శించి వస్త్ర ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. వారంలో ఒక రోజైన చేనేత వస్త్రాలను ధరించాలని అధికారులు, సిబ్బందికి ప్రభుత్వం సూచించింది. దేశంలో వ్యవ సాయ రంగం తర్వాత అత్యధిక జనాభాకు ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగానికి ఊతమిచ్చేలా ఆన్లైన్ మార్కెటింగ్, ఆప్కో షోరూమ్లతో పాటు వస్త్ర ప్రదర్శనలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. -
సోషల్ మీడియాలో బ్రాండింగ్ ప్రమోషన్ చేస్తున్నారా? అలా చేస్తే శిక్షార్హులు అవుతారు!
సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు వ్యూవర్స్ని యాడ్స్ ద్వారా ప్రభావితం చేస్తుంటారు. వీరితో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ద్వారా వెలుగులోకి వస్తున్నవారు కూడా ఇ–కామర్స్ సంస్థల బ్రాండ్స్ను ఎలా ప్రచారం చేయాలో తెలుసుకోవాలి. ప్రకటనదారులు ఇన్ఫ్లుయెన్సర్లకు కానుకల ఆశ చూపి, తమ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా మార్చుకుంటారు. ఇవి తెలియని ఇన్ఫ్లుయెన్సర్లు ఉత్పత్తులకు, సేవలకు ప్రచారకర్తలుగా మారిపోతారు. వీరు చెప్పే బ్రాండ్స్ను గుడ్డిగా నమ్మి వ్యూవర్స్ వాటిని కొనుగోలు చేసి, మోసపోవచ్చు. అందుకే, భారత ప్రభుత్వం వినియోగదారుల రక్షణ చట్టం –2019 అమలులోకి తీసుకు వచ్చింది. ఉత్పత్తులు, సేవల గురించి తప్పుడు ప్రచారాలు చేసి, ప్రజలను మోసం చేస్తే వారు శిక్షార్హులు అవుతారని చెబుతోంది. వ్యూవర్లను, సబ్స్రైబర్లను పొందాలంటే.. సాధారణంగా ఇన్ఫ్లుయెన్సర్లు సోషల్మీడియా ఛానెల్స్లో పోస్ట్ చేసిన వాటి విషయంలో ఈ పరిస్థితి తలెత్తదు. వాటిలో స్వీయప్రచారం లేదా సబ్స్రైబర్స్కి ఏదైనా సూచన ఇవ్వడం కనిపిస్తుంది. లాంగ్టైమ్ ఇన్ఫ్లుయెన్సర్లలో ఒకరిగా సక్సెస్ కావాలంటే ఉపయోగకరమైన సమాచారాన్ని తెలియజేసే వ్యక్తిగానే ఉండాలి. ►అర్ధవంతమైన కంటెంట్, సంభాషణను ప్రదర్శించాలి. ► సబ్స్రైబర్లు, ఫాలోవర్లను కట్టిపడేలా మీ కంటెంట్ సమయాన్ని పెంచుకోవచ్చు. వ్యూవర్స్ అన్ని కామెంట్స్కు ప్రత్యుత్తరం ఇవ్వడం మర్చిపోవద్దు. ► సబ్స్క్రైబర్ల దృష్టి కోణం నుండి మీ పోస్ట్ ఉండేలా చూసుకోండి. కృత్రిమమైన డ్రామాను ప్లే చేయకూడదు. ► మీ ఛానెల్ను ఫాలో అవమని వ్యక్తులను అడగడంలో మీరు ఎంత పెద్దవారైనప్పటికీ సిగ్గుపడకూడదు. సబ్స్రైబర్లను కొనుగోలు చేయడం కంటే సోషల్మీడియా ఛానెల్లో ప్రమోషన్కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ► మీ పోటీదారులు ఎవరు, వారు సోషల్ మీడియాలో ఏమేం చేస్తున్నారు, ఎంత బాగా చేస్తున్నారో చూడండి. వారిని ఫాలో అవడం ద్వారా మీ లోపాలను సులభంగా గుర్తించి, సరి చేసుకోవచ్చు. అంతేకాదు, సబ్స్క్రయిబర్లను పెంచుకునే వ్యూహాన్ని రూపొందించుకోవచ్చు. ► ప్రతిరోజూ ఉండాలి కదా అని ఏదో ఒకటి పోస్ట్ చేయకండి. అది మీ వ్యూవర్స్ని పెంచదు. ప్రతి పోస్ట్ మీ లక్ష్యానికి చేరువ చేస్తుందా అని నిర్ధారించుకోండి. క్వాలిటీ కంటెంట్పైనే దృష్టి పెట్టండి. ► సాధారణంగా కొందరు రెచ్చగొట్టే చర్చలను, వివాదాలను సృష్టించడానికి ట్రోల్ చేస్తారు. దీనివల్ల సబ్స్క్రైబర్లు, ఫాలోవర్లను సంతోషపెట్టలేరు. అలాగని, మీపై ట్రోల్ చేయడంలో వారి పూర్తి పాయింట్ అదే కాబట్టి ట్రోల్లను విస్మరించకూడదు. ► అన్ని సామాజిక ఛానెల్స్ కంటెంట్ను మానిటైజ్ చేస్తున్నందున జాగ్రత్తపడాలి. వార్తలు, వినోదం కోసం ఫేస్బుక్, బ్లాగ్ పోస్ట్లకు ట్విటర్, ఫోటోలు, వీడియోలకు ఇన్స్టాగ్రామ్, ఇండస్ట్రీలకు సంబంధించిన కథనాలకు లింక్డ్ ఇన్.. ఇలా దేనికది ఎంచుకోవాలి. ► మీ ప్రతిస్పందనలోనూ నిజాయితీగా ఉండండి. సోషల్మీడియా ఉనికికి సంబంధించిన ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఇది మీకు సహాయం చేస్తుంది. ► హాష్ట్యాగ్ల విషయాలపై సరైన పరిశోధన చేయండి. లేకుంటే, హ్యాష్ట్యాగ్లు మీ ప్రతిష్ఠను దెబ్బతీసే అవకాశం ఉంది. ప్రకటనలు ఎలా చేయాలి? ప్రకటనలు స్పష్టంగా, ప్రముఖంగా, మిస్ చేయడం చాలా కష్టంగా ఉండే విధంగా ఎండార్స్మెంట్ సందేశంలో ఉంచాలి. హ్యాష్ట్యాగ్లు లేదా లింక్ల సమూహంతో యాడ్స్ను బహిర్గతం చేయకూడదు. వ్యూవర్స్ గమనించే విధంగా ప్రకటనల ఎండార్స్ మెంట్ ఇమేజ్పై ఉంచాలి. ప్రకటనలు ఆడియో, వీడియో ఫార్మాట్లో చేయాలి. ప్రకటనలు మొత్తం లైవ్స్ట్రీమ్లో ప్రదర్శించాలి. సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్ ఉండాలి. తగిన శ్రద్ధ .. ►సెలబ్రిటీలు/ఇన్ఫ్లుయెన్సర్లు ప్రకటనలో చూపిన విధంగా ఆ ఉత్పత్తులను తాము వాడి, ప్రయోజనం పొందేలా కూడా ఉండాలి. ఉత్పత్తి, సేవ తప్పనిసరిగా ఎండార్సర్ ద్వారా ఉపయోగించబడి ఉండాలని కూడా సిఫార్సు చేయబడింది. ► ఒక ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను సంప్రదించి వారి ఉత్పత్తులను ప్రమోట్ చేయడానికి తమ బ్రాండ్ దుస్తులను ధరించమని, ఆన్లైన్ ప్లాట్ఫారమ్ల కోసం కంటెంట్ను రూపొందించమని కోరాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్లో కంటెంట్ను పోస్ట్ చేస్తే ఆ బ్రాండ్స్ను ఎలాంటి పక్షపాతం లేకుండా ప్రమోట్ చేస్తున్నట్లు కనిపించాలి. ► సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు తమ మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయనట్లయితే, వారి అభిప్రాయం పక్షపాతంగా లేదా తప్పుదారి పట్టించేదిగా ఉందనుకోవాలి. ► ఏదైనా మెటీరియల్ కనెక్షన్ ను బహిర్గతం చేయడంలో ఇన్ఫ్లుయెన్సర్లు ఫెయిల్ అయితే వినియోగదారుల రక్షణ చట్టం – 2019 కింద చట్టం ప్రకారం కఠిన చర్యలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే, తగిన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. ఉచిత ఉత్పత్తుల వల్ల.. వ్యూవర్స్ నిర్ణయాలు లేదా అభిప్రాయాలను ప్రభావితం చేసే శక్తి ఉన్న ప్రముఖ వ్యక్తులు కొన్ని రంగాలకు మాత్రమే పరిమితం కాదు. వ్యూవర్స్ అభిప్రాయాలపై బలమైన ప్రభావంతో ఉత్పత్తుల, సేవలను ప్రకటించే సృష్టికర్తలు మాత్రమే. ప్రకటనల కంపెనీలు వారికి ప్రోత్సాహకాలు ప్రకటిస్తుంటాయి. ట్రిప్స్ లేదా హోటల్ వసతి, ఉచిత ఉత్పత్తులు, అవార్డులు.. మొదలైనవి జత చేస్తారు. ఇక, వర్చువల్ ఇన్ఫ్లుయెన్సర్లు కంప్యూటర్ సృష్టించిన వ్యక్తులు. వీటి ద్వారా కూడా యాడ్ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రచారం చేస్తుంటాయి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఉద్యోగులకు బంపర్ ఆఫర్: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన
రక్షణ మంత్రిత్వ శాఖలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగుల ప్రమోషన్కు అవసరమైన కనీస అర్హత సర్వీస్ నిబంధనలను మంత్రిత్వ శాఖ సవరించింది. 7వ పే కమీషన్ పే మ్యాట్రిక్స్ అండ్ పే లెవెల్స్ను అనుసరించే వేతనాలు చెల్లించే రక్షణ పౌర ఉద్యోగులకు ఈ సవరించిన నిబంధనలు వర్తిస్తాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 3 శాతం డీఏ పెంపుపై భారీ ఆశలు డియర్నెస్ అలవెన్స్ పెంపునకు సమయం దగ్గర పడుతుండడంతో లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కేంద్రం ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం విశేషం. మరోవైపు ఈ సారి 3 శాతం డీఏ పెంపుపై ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం తన కోటి మందికి పైగా ఉద్యోగులు ,పెన్షనర్లకు కరువు భత్యాన్ని (DA) 3 శాతం నుండి 45 శాతానికి పెంచవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. జూలైలో దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల గరిష్ఠ స్థాయిని దాటిన నేపథ్యంలో ఈ పెంపు ఉంటుందని అంచనా. తాజా పెంపు డియర్నెస్ అలవెన్స్ జూలై 1, 2023 కి వర్తిస్తుంది. డీఏను చివరిసారిగా మార్చి 2023లో 4 శాతం పెంచి 42 శాతానికి చేర్చారు. (వర్క్ ఫ్రం హోం: అటు ఎక్కువ పని, ఇటు హ్యాపీలైఫ్ అంటున్న ఐటీ దిగ్గజం) డీఏ పెంపు ఎలా ? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల కోసం డియర్నెస్ అలవెన్స్ ప్రతి నెలా లేబర్ బ్యూరో ద్వారా విడుదల చేయబడిన పారిశ్రామిక కార్మికుల కోసం (CPI-IW) తాజా వినియోగదారుల ధరల సూచికలోని అంశాల ఆధారంగా లెక్కిస్తారు. ఉద్యోగులు, పెన్షనర్ల ప్రస్తుత జీతాలపై పెరుగుతున్న ధరల భారం ఆధారంగా కేంద్రం డియర్నెస్ అలవెన్స్ను మంజూరు చేస్తుంది. ( వర్క్ ఫ్రం హోం: ఐటీ ఉద్యోగులకు భారీ ఝలక్) -
నకిలీ టీచర్లకు ప్రమోషన్లు.. దర్జాగా విద్యార్థులకు పాఠాలు.. 14 ఏళ్ల ముసుగు తొలగిందిలా!
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ పోలీసులు ఇద్దరు నకిలీ టీచర్లను అరెస్టు చేశారు. వీరు నకిలీ డాక్యుమెంట్ల సహాయంతో 14 ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. ఈ టీచర్లిద్దరూ కాన్పూర్లోని దేహాత్ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఇంతేకాదు వీరిద్దరికీ ప్రభుత్వం ప్రమోషన్లు కల్పించి, హెడ్మాస్టర్లను చేసింది. ఈ విషయం వెల్లడికావడంతో అటు విద్యావిభాగంతో పాటు ఇటు సామాన్యులలోనూ కలకలం చెలరేగింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 2009లో నకిలీ విద్యార్హతల ధృవపత్రాలతో అనిల్ కుమార్, బ్రజేంద్ర కుమార్లు టీచర్ ఉద్యోగాలు సంపాదించారు. దేహాత్ పరిధిలోని ఝీంఝక్లో ఉంటున్న అనిల్ ములాయి ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్. అలాగే బ్రజేంద్ర కుమార్ షాహ్పూర్ మోహ్రా ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్గా ఉన్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. బర్రా పోలీస్ ఇన్స్పెక్టర్ నూర్య బలిపాండే మీడియాతో మాట్లాడుతూ బర్రాకు చెందిన సందీప్ రాథౌడ్ ఏడాది క్రితం అంటే 2022లో గ్వాలియర్లో ఉంటున్న అతని బంధువు రాజీవ్ తనను మోసగించాడంటూ ఫిర్యాదు చేశాడన్నారు. రాజీవ్తో పాటు అతని తల్లి, సోదరి కలసి తనకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 34 లక్షలు తీసుకున్నారనని సందీప్ తన ఫిర్యాదులో ఆరోపించాడు. ఈ పనిలో కాన్పూర్కు చెందిన రామ్శరణ్, అతని దగ్గర పనిచేసే ధర్మేంద్రల హస్తం కూడా ఉన్నదని పేర్కొన్నాడు. వీరంతా తాను టీచర్ అయ్యేందుకు కావలసిన నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారని తెలిపాడు. అయితే ఇలా దొంగ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగం చేసేందుకు సందీప్ నిరాకరించాడు. ఫలితంగా తన డబ్బు కూడా తిరిగి రాలేదని సందీప్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసుల దర్యాప్తులో మరిన్ని కొత్త విషయాలు వెలుగు చూశాయి. రాజీవ్ నకిలీ ధృవపత్రాలతో ఇద్దరికి టీచర్ ఉద్యోగాలు ఇప్పించినట్లు పోలీసులు గుర్తించారు. వారు అనిల్ కుమార్, బ్రజేంద్రలుగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ గత 14 ఏళ్లుగా కాన్పూర్లోని దెహాత్ పాఠశాలలో టీచర్లుగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. పోలీసులు వీరికి సంబంధించిన రికార్డులు చెక్ చేయగా, వీరి దగ్గరున్నవి దొంగ సర్టిఫికెట్లని గుర్తించారు. దీంతో వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఈ విషయమై ఏడీసీపీ అశోక్ కుమార్ సింగ్ మాట్లాడుతూ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారని, వారు నకిలీ పత్రాలతో ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు పొందారని గుర్తించామని తెలిపారు. అయితే వీరికి ఉద్యోగాలు ఇప్పించిన రాజీవ్ సింగ్ హైకోర్టు నుంచి అరెస్టు వారెంట్పై స్టే తెచ్చుకున్నాడన్నారు. ఈ ఉదంతంతో ప్రమేయం ఉన్న రామ్ కశ్యప్ను కొద్ది రోజుల క్రితమే అరెస్టు చేసి, జైలుకు తరలించామన్నారు. ఇది కూడా చదవండి: ‘హార్మోనియం’ను నెహ్రూ, ఠాగూర్ ఎందుకు వ్యతిరేకించారు? రేడియోలో 3 దశాబ్దాల నిషేధం వెనుక.. -
నర్సరీ పెట్టు.. కాసులు పట్టు
కడప అగ్రికల్చర్: తక్కువ పెట్టుబడితో అనతికాలంలో అధిక ఆదాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కిసాన్ మల్బరీ నర్సరీ సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈ కిసాన్ మల్బరీ నర్సరీ సాగుతో ఆరు నెలల్లో పెట్టుబడికి రెట్టింపు ఆదాయం పొందే అవకాశం కల్పిస్తుంది. ఇందుకు చేయూతగా నర్సరీ సాగుకు ప్రభుత్వం సబ్సిడీని కూడా అందిస్తుంది. మల్బరీ సాగుకు అయ్యే ఖర్చులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీ, ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీ అందిస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు నర్సరీ సాగుకు ముందుకు రావాలని సూచిస్తోంది. జిల్లాలో మల్బరీ సాగుకు మొక్కల కోసం ముందుగా నర్సరీని ఏర్పాటు చేసి మొక్కలను పెంచి రైతులకు అందించేందుకు ప్రోత్సహిస్తోంది. ఎకరాకు నర్సరీకి 1,60,000 మొక్కలు... మల్బరీకి సంబంధించి ఒక ఎకరా కిసాన్ నర్సరీలో 1,60,000 మొక్కలను నాటితే ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుంది. ఈ నర్సరీలో 4 నుంచి 5 నెలలపాటు మల్బరీ మొక్కలను పెంచి తరువాత రైతులు మొక్కలను విక్రయించాల్సి ఉంటుంది. నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలను రైతు తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు నర్సరీలో ఒక్కో మొక్కకు రైతు రూ. 2 చెల్లించి కొనుగోలు చేయాలి. తెచ్చుకున్న మొక్కలను తమ పొలంలో సాగు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు ఎకరాకు సాగుకు మొక్కలను నాటేదాన్ని బట్టి 4500 నుంచి 10 వేల మొక్కల వరకు నాటి సాగు చేస్తారు. ప్రభుత్వ సబ్సిడీ ఇలా.. నర్సీరీ మొక్కల సాగుకు ప్రభుత్వం ఒక యూనిట్కు రూ.1,50,000 అందిస్తుంది. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు 90 శాతం సబ్సిడీతో రూ.1,35,000 ఉచితంగా అందిస్తుంది. అలాగే ఓసీ, బీసీలకు 75 శాతం సబ్సిడీతో రూ.1,12,500 ఉచితంగా అందిస్తుంది. మిగతా మొత్తాన్ని రైతు భరించాల్సి ఉంటుంది. నర్సరీ సాగు పూర్తయ్యాక (ఓసీ, బీసీ రైతులకు) రైతుకు ఒక్కో మొక్కను 2 రూపాయలతో విక్రయిస్తే రూ.2,40,000 రాబడి వస్తుంది. అలాగే ప్రభుత్వం అందించే సబ్సిడీ రూ.1,12,500 కలుపుకుని మొత్తం రూ.3,12,500 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను నికరంగా రైతుకు రూ.2,02,500 లాభం వస్తుందని మల్బరీ అధికారులు తెలిపారు. అలాగే (ఎస్సీ, ఎస్టీ రైతులకు) సంబంధించి రైతు రాబడి రూ.2,40,000, ప్రభుత్వ సబ్సిడీ రూ.1,35,000 కలుపుకుని మొత్తం రూ.3,75,000 కాగా ఇందులో రూ.1,50, 500 ఖర్చు పోను రైతుకు నికరంగా రూ.2,25,000 లాభం వస్తుందని అధికారులు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ నర్సరీల ద్వారా... మల్బరీ నర్సరీ మొక్కల సాగుకు సంబంధించి ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో రెండు నర్సరీ కేంద్రాలలో పెంపకాన్ని చేపడుతున్నారు. ఇందులో ఒకటి కడప నగర శివార్లలోని ఊటుకూరు కేంద్రంలో ఒక దానిని, మైదుకూరు మండలం వనిపెంట పట్టు పరిశ్రమలశాఖ క్షేత్రంలో మరొక మల్బరీ నర్సరీ సాగును చేపడుతున్నారు. ఇందులో భాగంగా 2023–24 సంవత్సరానికి ప్రతి నర్సరీలో 2 లక్షల మల్బరీ మొక్కలను సాగు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. ఇందులో ఊటుకూరు క్షేత్రంలో ఇప్పటికే 1,50,000 మొక్కలను నాటించారు. త్వరలో వనిపెంట నర్సరీలో కూడా నాటించనున్నారు. ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగు లక్ష్యంగా ప్రభుత్వం కేటాయించింది. ఈ రెండు నర్సరీల ద్వారా రైతులకు కావాల్సిన మొక్కలను అందజేయనున్నారు. ఇందులో ఒక్కో మొక్క రూ. 2కు అందజేస్తారు. వ్యాధి రహిత పట్టు పురుగుల పెంపకం.. వ్యాధి రహిత పట్టు పురుగులను( చాకీ పురుగుల పెంపకం) అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మైసూరులోని జాతీయ పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్రం నుంచి గుడ్లు తెప్పించి పెంచుతోంది. ఇందులో 100 గుడ్లను 13 వందలకు తెప్పించి వనపెంటలోని సీడ్ఫామ్లో పెంచుతారు. అక్కడ 13 రోజుల తరువాత పగిలి చాకీ పురుగులు బయటకు వస్తాయి. వాటికి ఉదయం 6 గంటలకు, సాయంత్రం 6 గంటలకు ఇలా 3 రోజులపాటు 6 మేతలను అందిస్తారు. ఈ తరుణంలో వాటికి మొదటి జ్వరం వస్తుంది. తరువాత 2వ మేతను రెండున్నర రోజులు అందిస్తారు. తర్వాత 2వ జ్వరం వస్తుంది. తరువాత రైతులకు ఈ చాకీ పురుగులను సరఫరా చేస్తారు. ఇందులో 100 పట్టు గుడ్ల రేటు రూ.1300 కాగా 100 పట్టు పురుగులను 9 రోజులపాటు పెంచి ఇచ్చినందుకు ఈ ఖర్చు అవుతుంది. ఇలా రైతుకు 100 చాకీ పురుగులను అందించాలంటే రూ.2600 రైతు చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత చాకీ పురుగులను కడపతోపాటు గిద్దలూరు, ప్రకాశం ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నారు. ఈ ఏడాది 4 వందల ఎకరాలు ఈ ఏడాది జిల్లాలో 4 వందల ఎకరాల మల్బరీ సాగును లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందు కోసం కడప ఊటుకూరుతోపాటు వనిపెంట నర్సరీలో మల్బరీ మొక్కల పెంపకాన్ని చేపట్టాము. ఇప్పటికే ఊటుకూరు నర్సరీలో 1,50,000 మొక్కలను సాగు చేశాము. మిగతా వాటిని కూడా త్వరలో నాటి కావాల్సిన రైతులకు అందిస్తాము. – అన్నపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, జిల్లా పట్టు పరిశ్రమలశాఖ అధికారి. -
Tamannaah White Corset Top Photos: తమన్నా అందాల విందు.. అస్సలు తగ్గట్లేదుగా! (ఫొటోలు)
-
పుజారాకు షాక్ పాండ్యకు ప్రమోషన్
-
'ఆదిపురుష్' మూవీ.. ప్రభాస్ అందుకే సైలెంట్గా ఉన్నాడా?
'ఆదిపురుష్' థియేటర్లలో రిలీజైంది. ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దుమ్ముదులిపేస్తోంది. కొందరికి సినిమా నచ్చింది, మరికొందరికి నచ్చలేదు. ఇది వాళ్లే చెప్పారు. మరోవైపు గత రెండు రోజుల నుంచి ఎవరిని కదిపినా, ఎక్కడ చూసినా 'ఆదిపురుష్' గురించి ఒకటే డిస్కషన్. ఇంత జరుగుతున్నా సరే హీరో ప్రభాస్ మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. పూర్తి సైలెంట్ అయిపోయాడు. ఇంతకీ ఏంటి విషయం? గత కొన్నేళ్లలో సినిమాల విషయంలో విపరీతమైన మార్పులొచ్చాయి. స్టోరీ దగ్గర నుంచి ప్రమోషన్స్ వరకు మూవీ టీమ్ సరికొత్తగా ఉండేలా చూసుకుంటోంది. రిలీజ్ దగ్గర పడుతుందంటే చాలు.. ఇంటర్వ్యూలు, ఈవెంట్స్, సోషల్ మీడియాలో ప్రమోషన్స్ తో హోరెత్తించేస్తుంటారు. హీరోలు ఇందులో కీ రోల్ ప్లే చేస్తారు. తమ సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు అక్కడా ఇక్కడా తిరుగుతూ తెగ కష్టపడతారు. 'ఆదిపురుష్' విషయంలో మాత్రం ఇలా జరగలేదే అనే అనిపిస్తుంది. (ఇదీ చదవండి: 'ఆదిపురుష్' రెండో రోజు కలెక్షన్స్.. ఆ మార్క్ దాటేసింది!) ఎందుకంటే 'ఆదిపురుష్' కి తెలుగుతో పాటు వేరే ఏ భాషలోనూ ప్రమోషన్స్ చేయలేదు. జూన్ 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అదిరిపోయే రేంజులో నిర్వహించారు. దీనికి రూ.2 కోట్లకు పైగానే ఖర్చయిందని టాక్. ఆరోజు వైట్ అండ్ వైట్ డ్రస్ లో సందడి చేసిన ప్రభాస్.. స్పీచ్ కూడా సింపుల్ గా తేల్చేశాడు. అదే రోజు ఫైనల్ ట్రైలర్ రిలీజ్ చేయగా, దాన్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. 'ఆదిపురుష్' గురించి ప్రభాస్ పెట్టిన లాస్ట్ పోస్ట్ అదే. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన ప్రభాస్.. రిలీజ్ ముందు గానీ తర్వాత గానీ ఎలాంటి పోస్ట్, కామెంట్స్ చేయలేదు. ఈ షూటింగ్స్, ప్రమోషన్స్ హడావుడి నుంచి కాస్త రిలీఫ్ తీసుకుని ట్రిప్ ని ఎంజాయ్ చేస్తుండటమే దీనికి కారణమని తెలుస్తోంది. గతంలో 'సాహో' విడుదల టైంలోనూ ఇలానే చేశాడని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటన్నారు. ఏదేమైనా 'ఆదిపురుష్' విషయంలో ప్రభాస్ సైలెంట్ గా ఉండటం చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: మేము తీసింది రామాయణం కాదు. . ఆదిపురుష్ రచయిత సంచలన కామెంట్స్!) -
పుజారాకు షాక్ పాండ్యకు ప్రమోషన్..!
-
ఉద్యోగి క్రిమినల్ కేసు నుంచి విముక్తి పొందాకే పదోన్నతి
సాక్షి, అమరావతి: క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి ఆ కేసు నుంచి పూర్తిగా విముక్తి పొందాకే పదోన్నతి పొందేందుకు అర్హుడని హైకోర్టు స్పష్టం చేసింది. క్రిమినల్ కేసులో కింది కోర్టులో జరుగుతున్న విచారణపై హైకోర్టు స్టే ఇచ్చినా, ఆ స్టే ఉత్తర్వులను చూపుతూ పదోన్నతి కోరజాలరని తేల్చిచెప్పింది. ఉద్యోగిపై శాఖాపరమైన విచారణ మొదలుపెట్టినా లేదా క్రిమినల్ కేసు, అభియోగాలు, అభియోగపత్రం దాఖలైనా ఆ ఉద్యోగికి పదోన్నతినివ్వడాన్ని వాయిదా వేయొచ్చని 1991లో ప్రభుత్వం జీవో 66 జారీ చేసిందని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో క్రిమినల్ కేసుపై స్టే విధించినా తనకు పదోన్నతి ఇవ్వడం లేదంటూ ఓ ఉద్యోగిని దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఇటీవల తీర్పు వెలువరించారు. నకిలీ సర్టిఫికెట్లతో.. కర్నూలుకు చెందిన నాగరాణి 1996లో కారుణ్య నియామకం కింద ఏపీఎస్పీ కర్నూలు రెండో బెటాలియన్లో జూనియర్ అసిస్టెంట్గా తాత్కాలిక ప్రాతిపదికన నియమితులయ్యారు. నియామకపు తేదీ నుంచి మూడేళ్లలో ఇంటర్ పూర్తి చేయాలని అధికారులు ఆమెకు స్పష్టం చేశారు. ఇంటర్ పూర్తికి తనకు మరో మూడేళ్ల గడువునివ్వాలని ఆమె అభ్యర్థించగా ప్రభుత్వం అనుమతినిచ్చింది. 2001లో నాగరాణి బీఏ సర్టిఫికెట్లను సమర్పిస్తూ వీటి ఆధారంగా తన సర్వీసును క్రమబద్ధీకరించాలని కోరారు. బెటాలియన్ కమాండెంట్ ఆ సర్టిఫికెట్లు నిజమైనవో, కావో తేల్చాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి పంపారు. వాటిని పరిశీలించిన వర్సిటీ అధికారులు నకిలీవని తేల్చారు. దీంతో నాగరాణిని సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తూ కమాండెంట్ ఉత్తర్వులిచ్చారు. శాఖాపరమైన శిక్ష కింద ఏడాది పాటు ఇంక్రిమెంట్ను వాయిదా వేశారు. 2002లో ఆ సస్పెన్షన్ను ఎత్తివేశారు. అదే ఏడాది ఆమెకు అభియోగాలకు సంబంధించి మెమోరాండం ఇచ్చారు. మరోవైపు నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంపై కర్నూలు నాలుగో టౌన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. కాగా 2004లో జూనియర్ అసిస్టెంట్గా ఆమె సర్వీసులను క్రమబద్ధీకరించారు. ఇదే సమయంలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారంలో కర్నూలు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్.. నాగరాణిని దోషిగా తేలుస్తూ ఆమెకు మూడు నెలల జైలుశిక్ష, రూ.2,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ తీర్పుపై ఆమె 2008లో కర్నూలు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సెషన్స్ కోర్టు ఆమెకు విధించిన జైలుశిక్షను రద్దు చేసింది. తిరిగి సరైన అభియోగం నమోదు చేసి ఆమె వాదనలు విని తీర్పు వెలువరించాలని కింది కోర్టుకు సూచించింది. దీనిపై నాగరాణి 2009లో హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. కర్నూలు స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు జరుపుతున్న విచారణపై స్టే విధించింది. పదోన్నతినిచ్చేలా ఆదేశాలివ్వండి.. కాగా తనపై కోర్టు కేసు పెండింగ్లో ఉందన్న కారణంతో తనకు ఆఫీస్ సూపరింటెండెంట్గా పదోన్నతి ఇవ్వడం లేదని, దీనిని చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ 2021లో నాగరాణి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు. ఇరువైపుల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించారు. నాగరాణిపై క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నంత వరకు ఆమె పదోన్నతికి అర్హురాలు కాదని తేల్చిచెప్పారు. చదవండి: టీడీపీ ట్రాప్లో బీజేపీ.. అమిత్షా వ్యాఖ్యలపై వైవీ సుబ్బారెడ్డి స్పందన -
AP: ప్రభుత్వ ఉపాధ్యాయులకు శుభవార్త..
సాక్షి, అమరావతి: మండలానికి ఒక బాలికల జూనియర్ కాలేజీ అనే మాటను నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీల్లో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు దాదాపు 7 వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ)కు పదోన్నతి కల్పించి హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా నియమించనుంది. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్ (జూనియర్ కాలేజీ స్థాయి) స్థాయికి పెంచుతూ ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే.కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), జూనియర్ కళాశాలలు లేనిచోట ‘ప్లస్’ స్కూళ్లను గుర్తించి బాలికలకు ఇంటర్మీడియెట్ విద్యాబోధన ప్రారంభించింది. ఈ క్రమంలో 2022–23 విద్యా సంవత్సరంలో 177 ప్లస్ హైస్కూల్స్లో ప్రవేశాలు చేపట్టింది. వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన 115 ‘ప్లస్’ స్కూళ్లలోనూ ఇంటర్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అన్నిచోట్లా పూర్తి స్థాయి బోధన సిబ్బందిని నియమించే ప్రక్రియను చేపట్టింది. చదవండి: సమస్యలు తీర్చే 'సేవకులం' 7 వేల ఎస్జీటీలు.. 1,752 ఎస్ఏలకు అవకాశం 2023–24 విద్యా సంవత్సరంలో జూన్ 1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం హైస్కూల్ ప్లస్ స్థాయిలో ఇంటర్ తరగతుల బోధనకు 1,752 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఇందులో ఎంపీసీ, బైపీసీ, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు అవసరముంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో సేవలందిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల(ఎస్ఏ)లో సీనియారిటీతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) అర్హతలున్నవారిని హైస్కూల్ ప్లస్లో నియమించనున్నారు. ఇంతకాలం పాఠశాల స్థాయి బోధనలో ఉన్నవారు కాలేజీ స్థాయిలో బోధనకు ఎంత వరకు అనువుగా ఉన్నారో ఇంటర్ బోర్డు ద్వారా పరీక్షించనున్నారు. అనంతరం ఎంపికైన 1,752 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇచ్చి జూనియర్ కాలేజీల్లో బోధనకు నియమించనున్నారు. కాగా, దాదాపు 6 వేల నుంచి 7 వేల మంది ఎస్జీటీలకు పదోన్నతిని సైతం ప్రభుత్వం కల్పించనుంది. వీరిని హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు నిపుణులుగా నియమించనుంది. పదోన్నతులు, పోస్టుల భర్తీ ప్రక్రియను మే నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది. చదవండి: సీఐతో ఎమ్మెల్యే నిమ్మల దురుసు ప్రవర్తన -
ప్రాణాల మీదికి ‘పదోన్నతి’.. శిక్షగా మారుతున్న ప్రమోషనల్ ట్రైనింగ్
కానిస్టేబుల్ నుంచి హెడ్కానిస్టేబుల్గా పదోన్నతి పొందేందుకు, పొందిన... ప్రీ/పోస్టు ప్రమోషనల్ శిక్షణలో హఠాన్మరణం చెందిన వారి జాబితా ఇది. గత ఆరేళ్ల కాలంలో ఈ ‘శిక్ష’ణ ఐదుగురిని బలిగొనగా.. పదుల సంఖ్యలో సిబ్బందిని అస్వస్థతకు గురిచేసింది. సరీ్వసులో చేరిన పాతికేళ్ల తర్వాత, యాభై ఏళ్ల పైబడిన వయసులో ఇచ్చే ఈ ట్రైనింగ్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పటికే పోలీసు విభాగంలో సుదీర్ఘకాలం పని చేసిన, నామమాత్రపు దర్యాప్తు అధికారులుగా వ్యవహరించే ఈ సిబ్బందికి ఇప్పుడు కొత్తగా నేర్పేది ఏమిటన్నది సర్వత్రా ఎదురవుతున్న ప్రశ్న. సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ స్థాయి వారికి కెరీర్లో ఒక్కసారి వచ్చే పదోన్నతి వారి ప్రాణాల మీదికి తెస్తోంది. పోలీసు విభాగంలో ఎస్సైగా అడుగుపెట్టిన అధికారి పదవీ విరమణ చేసే నాటికి కనిష్టంగా రెండు, డీఎస్పీగా చేరిన వారికి నాలుగు, ఎస్పీ హోదాలో రిపోర్టు చేసిన ఐపీఎస్ అధికారికి నాలుగు నుంచి ఐదు వరకు పదోన్నతులు దక్కుతాయి. కానిస్టేబుళ్ల వద్దకు వచ్చేసరికి ఇలాంటి పరిస్థితులుండవు. 1996లో కానిస్టేబుల్గా పోలీసు విభాగంలో అడుగుపెట్టి, ప్రస్తుతం 50 ఏళ్లకు అటు ఇటు ఉన్న వాళ్లు ఇటీవలే ఒక్క మెట్టు ఎక్కి హెడ్కానిస్టేబుళ్లు అయ్యారు. పై స్థాయిలో ఉండే అధికారుల సంఖ్య తక్కువ కావడం, కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుళ్లే 80 శాతానికి పైగా ఉండటమూ ఈ పదోన్నతుల ఆలస్యానికి ఒక కారణం. ఫలితంగా కానిస్టేబుల్ స్థాయి వారిలో 95 శాతం వరకు పదోన్నతి పొందకుండానే పదవీ విరమణ చేస్తుంటారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఎన్ని హామీలిచి్చనా ఇది మారకుండా.. పరిష్కారానికి నోచుకోకుండా ఉంటోంది. వీళ్లు కొత్తగా నేర్చుకునేది శూన్యం పోలీసు విభాగంలో అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలపాటు పనిచేసిన కానిస్టేబుళ్లు కేసుల దర్యాప్తు, సమాచారం సేకరణ, కోర్టు వ్యవహారాలు, నిందితుల వేట తదితర అంశాల్లో కీలకపాత్ర పోషించి ఆయా అంశాల్లో నిష్ణాతులుగానే ఉంటారు. ఎస్సై, ఆపై స్థాయి అధికారులు సైతం తమ ఠాణాల్లో సీనియర్ కానిస్టేబుళ్లకే ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇలాంటి సీనియర్ అధికారులకు పదోన్నతులు ఇస్తున్నామనో, ఇచ్చామనో శిక్షణకు పిలిచి కొత్తగా నేర్పేది ఏమిటన్నది ఏళ్లుగా ఎదురవుతున్న ప్రశ్న. ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొందిన వారికి లేని ఈ శిక్షణ తమకే ఎందుకని కానిస్టేబుళ్లు ప్రశి్నస్తున్నారు. పదోన్నతి శిక్షణ తీసుకున్నప్పటికీ తాము నిర్వర్తించేది రొటీన్ విధులేనని అంటున్నారు. అనారోగ్యాలకు కేరాఫ్ ఇతర వాటితో పోలిస్తే వృత్తిపరమైన అనారోగ్యాలు పోలీసు విభాగంలో అధికం. దాదాపు 70% మంది ఊబకాయం, బీపీ, షుగర్, హృద్రోగంతోపాటు ఆస్తమా, ఇతర వ్యాధులతో బాధపడుతుంటారు. సర్వకాల సర్వావస్థల్లోనూ అందుబాటులో ఉండాల్సి రావడం, వేళాపాళా లేని తిండి, నిద్ర కారణంగా ఈ రుగ్మతలు వీరికి తప్పట్లేదు. 50 ఏళ్లకు దగ్గరగా ఉన్న వారికి ఈ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటి వారిని శిక్షణ పేరుతో పని చేస్తున్న ప్రాంతానికి దూరంగా పంపడం, తెల్లవారుజాము 4.30 గంటల వరకు స్వల్ప విరామాలతో ఇండోర్, ఔట్డోర్ శిక్షణ ప్రాణాల మీదికి తెస్తోంది. ఒకప్పుడు ఈ శిక్షణ 3 నెలలు ఉండగా... తర్వాత దాన్ని 45 రోజులకు కుదించారు. అయితే ఇదంతా కాకుండా వీరికి కేవలం చట్టం, ఇతర కీలకాంశాలు బోధించడానికి వారం రోజుల రిఫ్రెష్మెంట్ క్లాసులు సరిపోతాయని మాజీ పోలీసు అధికారులు చెబుతున్నారు. డ్రిల్స్ పునరుద్ధరిస్తే ఉత్తమం కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్ విధుల్లో వ్యత్యాసం ఉంటుంది. ఈ కారణంగానే పదోన్నతి సమయంలో శిక్షణ అనివార్యం. నిబంధనల ప్రకారం ప్రతి పోలీసుస్టేషన్లోనూ వారంలో రెండుసార్లు (ఒకసారి సాధారణ, మరోసారి ఆయుధాలతో) డ్రిల్ చేయాలి. బందోబస్తు భారం, పని ఒత్తిడితోపాటు ఇతర కారణాలతో ఇవి జరగట్లేదు. కేవలం ఇన్స్పెక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే ఓ వారం ముందు నుంచి డ్రిల్స్ చేస్తున్నారు. ఈ కారణంగా శారీరక వ్యాయామానికి పోలీసులు పూర్తిగా దూరమవుతున్నారు. అందువల్ల డ్రిల్స్ను పునరుద్ధరిస్తే శిక్షణకు వెళ్లినప్పుడు ఇలాంటి అపశ్రుతులను నివారించవచ్చు. – బి.రెడ్డన్న, రిటైర్డ్ ఎస్పీ ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు పోలీసు విభాగంలో అనేక మంది వివిధ రకాలైన అనారోగ్యాల బారినపడతారు. కొందరికి దీర్ఘకాలిక సమస్యలుంటాయి. దైనందిన విధులతో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం కూడా దీనికి కారణమే. నిర్లక్ష్యానికి తావు లేకుండా అనునిత్యం వ్యాయామం చేయడం, ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుని డాక్టర్ సలహా తీసుకుంటే ఇలాంటి ఉదంతాలకు తావుండదు. – ఎన్.ప్రకాష్, వైద్యుడు చదవండి: విశ్వనగరానికి వీధికుక్కల బెడద.. మూడు రెట్లు పెరిగిన ఘటనలు -
AP: సీఎస్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్రంలో పరిశ్రమలు, కంపెనీలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీలకు ప్రభుత్వపరంగా సమకూర్చాలిన భుములు, వివిధ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల కల్పన అంశాలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా పరిశ్రమల శాఖలో ప్రత్యేక ఫ్యాకేజీ ఇన్సెంటివ్లకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలతో పాటు విధాన నిర్ణయాలకు చెందిన అంశాలపైన కమిటీ సమీక్షించింది. అదే విధంగా ఐటి అండ్ సి శాఖకు సంబంధించి ఎనిమిది అజెండా అంశాలు, ఇంధన శాఖకు సంబంధించిన అజెండా అంశాలపైన సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆయా పరిశ్రమలు, కంపెనీలకు అందించాల్సిన ప్రోత్సాకాలు తదితర అంశాలపై చర్చించి విధాన పరమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకా ఈ సమావేశంలో పలు అంశాలపై కూడా సీఎస్ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో చర్చించారు. చదవండి: ఏంటి లోకేశా ఇదీ?.. నరాలు కట్ అయిపోతున్నాయ్..! ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కరికల వలవన్, కె.ప్రవీణ్ కుమార్, ఎస్ఎస్ రావత్ పాల్గొనగా దృశ్య మాధ్యమం ద్వారా ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ పాల్గొన్నారు. అలాగే ఈసమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, ఎంఏయుడి కమిషనర్ ప్రవీణ్ కుమార్, పరిశ్రమల శాఖ కమిషనర్ సృజన, ఏపీ మారిటైమ్ బోర్డు సీఇవో షన్మోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
AP: పలువురు ఐపీఎస్లకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: ఏపీ కేడర్కు చెందిన పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఐపీఎస్–1993 బ్యాచ్కు చెందిన ముగ్గురు అడిషనల్ డీజీలకు డీజీపీ ర్యాంక్ ఇచ్చింది. వారిలో ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్కుమార్, డిప్యూటేషన్పై కేంద్ర సర్వీస్లో ఉన్న మహేష్ దీక్షిత్, అమిత్గార్గ్ ఉన్నారు. ఐపీఎస్–1998 బ్యాచ్కు చెందిన మహేష్ చంద్రలడ్డాకు అడిషనల్ డీజీగా పదోన్నతి కల్పించింది. లడ్డా ప్రస్తుతం డిప్యుటేషన్పై కేంద్ర సర్వీసులో ఉన్నారు. డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులో ఉన్న ఎస్.శ్యామ్సుందర్, గుంటూరు రేంజ్ డీజీ సీఎం త్రివిక్రమవర్మ, ఏలూరు రేంజ్ డీఐజీ జి.పాలరాజులకు ఇన్స్పెక్టర్ జనరల్(ఐజీ)గా పదోన్నతి కల్పించింది. విశాఖపట్నం ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ కోయ ప్రవీణ్, డిప్యూటేషన్పై కేంద్ర సర్వీసులో ఉన్న భాస్కర్ భూషణ్, ఏపీ డీజీపీ కార్యాలయంలో శాంతిభద్రతల ఏఐజీగా ఉన్న ఆర్ఎన్ అమ్మిరెడ్డికి డీఐజీ(సూపర్ టైమ్ స్కేల్)గా, విజయనగరం ఎస్పీ ఎం.దీపిక, ఏసీబీ ఎస్పీ బి.కృష్ణారావు, సీఐడీ ఎస్పీ అమిత్బర్దర్లకు జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్(సెలక్షన్ గ్రేడ్)కు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. వీరందరి పదోన్నతులు 2023, జనవరి ఒకటో తేదీ నుంచి వర్తిస్తాయని పేర్కొన్నారు. చదవండి: (Araku MP: మొదట రైతు బిడ్డ.. తరువాతే ఎంపీ!) -
ఫస్ట్ టైం మూవీ ప్రమోషన్స్లో నయనతార ( ఫొటోలు )
-
AP: 66 మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 66 మంది తహసీల్దార్లు, సెక్షన్ అధికారులు, సూపరింటెండెంట్ క్యాడర్ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇచ్చింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళవారం జీవోఎంఎస్ నంబర్ 747 జారీచేశారు. వివిధ శాఖల్లో డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ అధికారుల అవసరం పెరగడం, కొత్తగా 24 రెవెన్యూ డివిజన్ కేంద్రాల ఏర్పాటు, జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం రెవెన్యూ శాఖలో 66 కొత్త డిప్యూటీ కలెక్టర్ పోస్టులను మంజూరు చేసింది. ప్రస్తుతం జిల్లాల్లో పనిచేస్తున్న తహసీల్దార్లు, రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర హెచ్వోడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న సెక్షన్ అధికారులు, సూపరింటెండెంట్లకు పదోన్నతులు ఇచ్చి ఈ పోస్టుల్ని భర్తీచేసింది. పదోన్నతుల కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున అధికారుల పేర్లను ఎంపికచేసి 198 మందితో 2022–23 సంవత్సరం అడ్హాక్ ప్యానల్ తయారు చేసింది. ఈ నెల 8వ తేదీన జరిగిన డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశంలో ఈ జాబితా నుంచి 66 మందిని డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికచేశారు. ఆ జాబితాను ప్రభుత్వం ఆమోదించింది. పదోన్నతులు తాత్కాలికమని జీవోలో పేర్కొన్నారు. పదోన్నతులు పొందిన అధికారులంతా వెంటనే వెలగపూడి సచివాలయంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్టు చేయాలని జీవోలో స్పష్టం చేశారు. ఒకేసారి ఇంతమంది తహసీల్దార్ క్యాడర్ అధికారులకు పదోన్నతులు రావడం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది డిప్యూటీ తహసీల్దార్ల నుంచి తహసీల్దార్లుగా ప్రభుత్వం పెద్దఎత్తున పదోన్నతులు ఇచ్చింది. వీటికోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూడగా చివరికి వైఎస్ జగన్ ప్రభుత్వం వారి కోరిక నెరవేర్చింది. తాజాగా తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు ఇవ్వడం ద్వారా ఎంతోకాలంగా వాటికోసం ఎదురుచూస్తున్న వారి కలను నెరవేర్చింది. -
సుప్రీం జడ్జీలుగా ఐదుగురికి పదోన్నతి
న్యూఢిల్లీ: పేరుకుపోతున్న కేసుల సత్వర పరిష్కారానికి సర్వోన్నత న్యాయస్థానం మరో ముందడుగు వేసింది. ఐదుగురు హైకోర్టు జడ్జీలను సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రప్రభుత్వానికి సిఫార్సు చేసింది. అంతకుముందు ఢిల్లీలో మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమైంది. ఆ తర్వాత సంబంధిత జడ్జీల పేర్ల జాబితాను కేంద్రానికి పంపింది. ఈ వివరాలను సుప్రీంకోర్టు తన వెబ్సైట్లో పొందుపరిచింది. రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ పంకజ్ మిట్టల్, పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కరోల్, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్ కుమార్, పట్నా హైకోర్టులో మరో జడ్జి జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ మనోజ్ మిశ్రాలను సుప్రీంకోర్టులో జడ్జీలుగా ఎంపికచేయాలంటూ కేంద్రానికి సిఫార్సుచేసింది. ఈ సిఫార్సులకు కేంద్రం ఆమోదముద్ర వేస్తే సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కు పెరుగుతుంది. మరోవైపు, ఉత్తరాఖండ్ హైకోర్టులో జడ్జి జస్టిస్ సంజయకుమార్ మిశ్రాను జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గువాహటి హైకోర్టు జడ్జి ఎన్ కోటీశ్వర్ సింగ్ను జమ్మూకశ్మీర్, లద్దాఖ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ కె.వినోద్ చంద్రన్ను గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుచేసింది. -
‘లెహరాయి’ టీంతో ‘బిగ్బాస్’ సరయు చిట్ చాట్
-
మట్టి కుస్తీ మూవీ టీంతో " స్పెషల్ చిట్ చాట్ "
-
మసూద మూవీ టీంతో " సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ "
-
'నేను 'గే' అయినందు వల్లే జడ్జిగా ప్రమోషన్ ఇవ్వట్లేదు'
సీనియర్ న్యాయవాది సౌర్భ్ కిర్పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను స్వలింగ సంపర్కుడు(గే) అయినందు వల్లే జడ్జిగా పదోన్నతి కల్పించడం లేదని పేర్కొన్నారు. న్యాయమూర్తల నియామక ప్రక్రియపై కేంద్రం దృష్టిసారించిన నేపథ్యంలో సీనియర్ అడ్వకేట్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. వాస్తవానికి సౌరభ్ కిర్పాల్ 2017లోనే జడ్జి కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఆ ప్రతిపాదనలు ఆమోదానికి నోచుకోలేదు. కేంద్రమే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే జడ్జిగా పదోన్నతి లభించకపోవడానికి తన లైంగిక ధోరణే ప్రధాన కారణమని భావిస్తున్నట్లు సౌరభ్ కిర్పాల్ పేర్కొన్నారు. ఒక గేను న్యాయమూర్తిగా నియమించేందుకు కేంద్రం సుముఖంగా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: శ్రద్ధ హత్యకేసు.. అఫ్తాబ్కు ఐదు రోజుల కస్టడీ.. ఉరితీయాలని డిమాండ్ -
భారత్-పాక్ మ్యాచ్పై స్పందించిన డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజం
చిరకాల ప్రత్యర్థులు టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్కు అంతా సిద్ధమైంది. అక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. గతేడాది టి20 ప్రపంచకప్లో పాక్ చేతిలో ఓటమికి టీమిండియా బదులు తీర్చుకుంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. టి20 ప్రపంచకప్ ఆరంభమైనప్పటికి ఈ రెండు జట్ల మధ్య జరిగే పోరుతోనే వరల్డ్కప్ పీక్స్టేజీకి చేరుకోనుందడంలో సందేహం లేదు. తాజాగా హాలీవుడ్ సూపర్స్టార్(డబ్ల్యూడబ్ల్యూఈ లెజెండ్ 'ది రాక్') డ్వేన్ జాన్సన్ టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ డీసీ సూపర్ హీరో ప్రస్తుతం తన సినిమా బ్లాక్ ఆడమ్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు. అక్టోబర్ 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ తన సినిమా ప్రమోషన్ కోసం స్టార్ స్పోర్ట్స్ చానెల్తో ఒప్పందం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే స్టార్స్పోర్ట్స్ యాజమాన్యం టీమిండియా-పాకిస్తాన్ మ్యాచ్పై డ్వేన్ జాసన్ చేసిన వ్యాఖ్యలను వీడియో రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం రాక్ మాట్లాడిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారాయి. ''ఇద్దరు గొప్ప ప్రత్యర్థులు తలపడుతున్నారంటే ప్రపంచం మొత్తం ఆ ఇద్దరినే చూస్తుంది. టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరిగేది ఒక మ్యాచ్ కాదు.. అంతకుమించి. ఇట్స్ టైమ్ ఫర్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్. డోంట్ మిస్'' అంటూ డ్వేన్ జాసన్(ది రాక్) పేర్కొన్నాడు). ఇక ఐసీసీ మేజర్ టోర్నీల్లో(వన్డే వరల్డ్కప్, టి20 ప్రపంచకప్) పాకిస్తాన్పై టీమిండియాకు మంచి రికార్డు ఉంది. వన్డే ప్రపంచకప్లో ఇరుజట్లు తలపడిన ఏడుసార్లు టీమిండియాదే విజయం. ఇక టి20 ప్రపంచకప్లోనూ ఆరుసార్లు తలపడితే టీమిండియా నాలుగుసార్లు, పాక్ ఒక్కసారి మాత్రమే నెగ్గింది. మరో మ్యాచ్లో ఫలితం రాలేదు. ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్లో మాత్రం టీమిండియా పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. .@TheRock is #ReadyForT20WC and will kickstart the #GreatestRivalry in style on 23rd Oct, 7 AM onwards on #CricketLive#IndvPak | #BelieveInBlue | ICC Men’s #T20WorldCup | #Blackadam pic.twitter.com/KawbyLbNGM — Star Sports (@StarSportsIndia) October 18, 2022 చదవండి: 'భారత్లో జరిగే వరల్డ్కప్ను బాయ్కాట్ చేస్తాం' 'ఎంపిక చేయలేదన్న కోపమా.. కసిని చూపించాడు' var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4911494512.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ట్రోలింగ్పై మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన తాజా చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సన్నీ లియోన్, పాయల్ రాజ్పుత్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్లో బిజీగా గడుపుతున్నారు విష్ణు. తాజాగా ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆయన తనపై ట్రోలింగ్ చేస్తున్నది ఎవరన్నదానిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ బడా హీరో తనను కావాలనే టార్గెట్ చేస్తూ ట్రోలింగ్ చేయిస్తున్నట్లు విష్ణు కొన్నిరోజుల క్రితం ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ బడా హీరో ఎవరన్నది బయటపెట్టే ఉద్దేశం ఉందా అని అడగ్గా.. ఆ హీరో ఎవరో ఇండస్ట్రీలో అందరికీ తెలుసని, తన నోటితో చెప్పాలనుకోవడం లేదని చెప్పుకొచ్చారు. 'మా ఎలక్షన్స్ టైం నుంచి నాపై ట్రోలింగ్ మొదలయ్యింది. మనుషులను పెట్టి పెయిడ్ ట్రోలింగ్ చేయిస్తున్నాడు. ఒక ప్రముఖ హీరో ఇదంతా చేయిస్తున్నాడని తెలిసింది. అతని ఎవరో మీడియాకు కూడా తెలుసు. కాబట్టి నేను ఆయన పేరు రివీల్ చేయడం లేదు' అంటూ కామెంట్స్ చేశారు. దీంతో విష్ణు వ్యాఖ్యల వెనకున్న ఆ బడా హీరో ఎవరన్నదానిపై నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నారు. -
ఏడుపుగొట్టు సీఈఓ.. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్కే!
'హైపర్ సోషల్' సీఈఓ బ్రాడెన్ వాలెక్ అంటే లింక్డ్ఇన్లో దాదాపు తెలియని వారుండురు. ఈయన గతంలో ఓసారి సంస్థలోని ఉద్యోగులను మూకుమ్మడిగా తొలిగించిన అనంతరం ఏడుస్తున్న పోట్ షేర్ చేయడం వైరల్గా మారింది. ఇప్పుడు మరోసారి ఆయన అలాంటి ఫోటోనే షేర్ చేశారు. తన గ్రాండ్మా చనిపోయిందని అమ్మ నుంచి మెసేజ్ వచ్చిందని బ్రాడెన్ ఓ పోస్టు పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ ఘటన వర్క్, లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరాన్ని తనకు తెలియజేసిందని చెప్పుకొచ్చాడు. తాను హైపర్సోషల్ను ప్రారంభించింది కూడా ఇందుకే అని పేర్కొన్నాడు. హైపర్ సోషల్తో వ్యాపారాన్ని సులభంగా చేసుకోవచ్చని, దీని వల్ల కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడిపే అవకాశం ఉంటుందని వివరించాడు. బ్రాడెన్ పోస్టుపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. బామ్మ చావును కూడా కంపెనీ ప్రమోషన్ కోసం ఉపయోగించుకుంటున్నారు, ఇది వెరీ సాడ్ పోస్టు అని ఓ లింక్డ్ఇన్ యూజర్ విమర్శించాడు. సీఈఓ పోస్టు ట్విట్టర్లో కూడా చర్చనీయాంశమైంది. ఈ ఏడుపు గొట్టు సీఈవో కంపెనీ ప్రచారం కోసం ఏమైనా చేసేలా ఉన్నాడు అని నెటిజన్లు ఫైర్ అయ్యారు. చదవండి: ‘కోహినూర్’పై బకింగ్హామ్ ప్యాలెస్ సమీక్ష.. భారత్కు అప్పగిస్తారా? -
సోషల్ మీడియా ప్రమోషన్లకు కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ: సామాజిక మాధ్యమాల్లో వివిధ ఉత్పత్తులు, సేవల విషయమై వినియోగదారులను ప్రభావితం చేసేలా వ్యవహరించే వారికి (ప్రభావ శీలురు) కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కొత్త నిబంధనలను తీసుకురానుంది. ఏదైనా ఉత్పత్తికి వారు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు అయితే ఆ విషయాన్ని బయటకు వెల్లడించడాన్ని తప్పనిసరి చేయనుంది. ఏవి చేయాలి? ఏవి చేయకూడదు? అనే వివరాలు కొత్త నిబంధనల్లో పొందుపరచనున్నట్టు అధిక వర్గాలు వెల్లడించాయి. వచ్చే రెండు వారాల్లో వీటిని విడుదల చేయవచ్చని పేర్కొన్నాయి. ఇన్స్ట్రాగామ్, టెలిగ్రామ్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా వేదికల ద్వారా లక్షలాది మందిని ప్రభావితం చేసే వారు మనదేశంలో వేల సంఖ్యలో ఉన్నారు. వివిధ అంశాలపై వీరు పోస్ట్లు పెట్టడంతోపాటు వీడియోలు చేస్తుంటారు. ఈ సందర్భంగా కొన్ని బ్రాండ్ల నుంచి డబ్బులు తీసుకుని అనుకూల ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం యూజర్లలో కొద్ది మందికే తెలుసు. తాము చూసే వీడియో ఫలానా బ్రాండ్కు ప్రమోషన్ అని యూజర్లకు తెలిసేలా చేసి, లాభ, నష్టాలపై అవగాహన కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని అధికార వర్గాలు వెల్లడించాయి. పోస్ట్లు, వీడియోల్లో ఫలానా బ్రాండ్కు ఇది పెయిడ్ ప్రమోషన్ అని ముందే వెల్లడించాలని కొత్త నిబంధనలు నిర్ధేశించనున్నాయి. -
ఛార్మితో రిలేషన్ బయటపెట్టిన పూరి జగన్నాథ్
పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి కౌర్ తెలుగులో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ఇప్పుడు నిర్మాతగా కొనసాగుతుంది. పూరి జగన్నాథ్తో కలిసి పూరి కనెక్ట్స్ పేరుతో సినిమాలు చేస్తుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో పూరి-ఛార్మిల మధ్య ఏదో ఉందన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఛార్మి ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని వార్తలు వస్తున్నాయి. చదవండి: చేతిలో రూపాయి లేకపోయినా ఆఫర్ను రిజెక్ట్ చేశా : ఛార్మి తాజాగా ఛార్మితో తనకున్న రిలేషన్ షిప్ను బయటపెట్టారు పూరి జగన్నాథ్. ఓ ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. 'ఛార్మీ 13 ఏళ్ల వయసప్పటి నుండి తనకు తెలుసని, దశాబ్దాలుగా ఆమెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపారు. ఛార్మీకి నాకు ఏదో అఫైర్ ఉందని ఏదేదో మాట్లాడుకుంటారు. ఆమె ఇంకా యంగ్గా ఉండటం వల్లే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. అదే అదే ఛార్మికి 50ఏళ్లు ఉంటే ఇలా మాట్లాడేవారు కాదు. ఆమెకు వేరేవాళ్లతో పెళ్లి జరిగినా పట్టించుకునేవారు కాదు. చదవండి: రాజకీయాల్లోకి హీరోయిన్ త్రిష? ఎంజీఆర్, జయలలిత దారిలో.. కానీ తామిద్దరం ఒకే ఇండస్ట్రీలో ఉండటం, ఎన్నో సంవత్సరాలుగా ట్రావెల్ అవుతుండటంతో ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటున్నారు. ఒకేవళ అఫైర్ ఉన్నా అది ఎక్కువరోజులు నిలబడదు. ఆకర్షణ అనేది కొన్నిరోజుల్లోనే చచ్చిపోతుంది. స్నేహమే శాశ్వతం. తామిద్దరం మంచి ఫ్రెండ్స్' అంటూ పుకార్లకు పూరి ఫుల్ స్టాప్ పెట్టారు. -
ఎంపీడీఓల కల నెరవేరిన వేళ.. కొత్త పోస్టుల్లో చేరిక
గుంటూరు ఎడ్యుకేషన్: మూడున్నర దశాబ్దాలుగా ఒకే కేడర్లో పనిచేసిన మండల పరిషత్ అభివృద్ధి అధికారుల (ఎంపీడీఓల) కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాకారం చేశారు. ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఉద్యోగులకు సీనియార్టీ ప్రకారం ఉద్యోగోన్నతులు కల్పించడమనేది పరిపాలనలో సాధారణంగా జరిగే ప్రక్రియ. ఎంపీడీఓల విషయంలో ఇది అమలుకు నోచుకోలేదు. గత ప్రభుత్వాలు అవలంబించిన నిర్లక్ష్య వైఖరి వల్ల ఉద్యోగోన్నతి లేక తీవ్ర నిరాశ, నిస్పృహల మధ్య ఎంపీడీఓలు విధులు నిర్వర్తించేవారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో వారిలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 మంది ఎంపీడీఓలు జెడ్పీ డెప్యూటీ సీఈవో, డీఎల్డీవో, డ్వామా ఏపీడీలుగా ఉద్యోగోన్నతి పొందారు. మొత్తం 21 మందికి ప్రమోషన్ కల్పించగా, నలుగురు పదోన్నతిని వదులుకున్నారు. ఉద్యోగోన్నతి పొందిన వారిలో కొందరు ఇప్పటికే కొత్త స్థానాల్లో సంతోషంగా విధుల్లో చేరారు. (క్లిక్: బాలయ్యా... గుర్తున్నామా!) 35 ఏళ్ల తరువాత ఉద్యోగోన్నతులు ఎంపీడీఓలకు ఉద్యోగంలో చేరిన 35 ఏళ్ల తరువాత ఉద్యోగోన్నతులు లభించాయి. ప్రమోషన్లు పొందిన ఎంపీడీఓలందరూ కొత్త స్థానాల్లో విధుల్లో చేరి, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి. – డాక్టర్ జి.శ్రీనివాసరెడ్డి, జెడ్పీ సీఈఓ -
‘కార్తికేయ 2’కు వినూత్న ప్రచారం.. కాంటెస్ట్లో గెలిస్తే బంగారు కృష్ణుడి విగ్రహం
Nikhil Karthikeya 2 Movie Treasure Hunt Promotion: ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో వచ్చి హిట్ కొట్టిన చిత్రం 'కార్తికేయ'. ఈ సినిమాకు సీక్వెల్గా 'కార్తికేయ 2' వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అత్యంత భారీ అంచనాల మధ్య ఆగస్టు 12న విడుదలకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ను విభిన్నంగా చేపట్టారు దర్శకనిర్మాతలు. ఇందుకోసం సెపరేటుగా ఒక కాంటెస్ట్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, తిరుపతిలో ఈ కాంటెస్ట్ను నిర్వహిస్తున్నారు. ఈ మిస్టికల్ టెస్ట్లో గెలుపొందిన విజేతలకు రూ. 6 లక్షల విలువ గల శ్రీకృష్ణుడి బంగారు విగ్రహాలను ప్రైజ్ మనీగా పొందవచ్చని దర్శక నిర్మాతలు ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్లో మొదటి క్లూ విడుదల చేశారు. ఒక్కొక్కటిగా మరికొన్ని క్లూస్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ ప్రచారంతో సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచేలా చేశారు. చదవండి: ప్రియుడితో బర్త్డే వేడుకలు!.. ఫొటోలతో దొరికిపోయిన హీరోయిన్ Soo many of u have cracked the first clue and have moved on to the next clue 🕵️♂️ The quest for the Lord Krishna Gold Idol is getting interesting 😃 You can be the lucky winner of #KarthikeyaQuest ❤️ Waiting for the one who finds the Gold Idol first#Karthikeya2 @actor_Nikhil https://t.co/WH4K16ibcy pic.twitter.com/akiO5p3DWv — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్కు అద్భుతమైన స్పందన వచ్చింది. కమర్షియల్ చిత్రాలతో పాటు విభిన్నమైన కథలతో నిర్మాణాన్ని కొనసాగిస్తూ విజయాలు సొంతం చేసుకుంటున్న క్రేజీ నిర్మాణ సంస్థలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బేనర్స్ పై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మధ్యే 'కార్తికేయ 2' సెన్సార్ కార్యక్రమాలు ముగిసాయి. ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమాలోని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, కాన్సెప్ట్ చూసి సెన్సార్ సభ్యులు ప్రశంసల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. చదవండి: కాజోల్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం.. అజయ్ దేవగణ్ స్పెషల్ పోస్ట్ A lot of you have found out the location from the #KarthikeyaQuest’s 1st clue, Congratulations! But the job is half done. Head out to that location to find the clue for the next location which will lead you to the Lord Krishna Gold Idol ❤️ Good Luck!#Karthikeya2 @anupamahere pic.twitter.com/FzG84v2k7e — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 U cud be right. But have u checked the second clue that is placed there at the location ? https://t.co/ekRLdGV4or — Nikhil Siddhartha (@actor_Nikhil) July 31, 2022 Hyderabad 🚨 Here's the first clue to win Lord Krishna Gold Idol in the #KarthikeyaQuest ❤️ “Vishwam Oka Poosala Danda… Nidhi nee Bhagyam lo undi ante Bhagyanagarapu Nadiboddu lo unna Janala Poosala Dandani cheruko” Get searching 🔥#Karthikeya2 @actor_Nikhil pic.twitter.com/vzP8CGdnor — People Media Factory (@peoplemediafcy) July 31, 2022 -
విజయవాడలో ‘పక్కా కమర్షియల్’ ప్రమోషన్ (ఫొటోలు)
-
డబుల్ ధమాకా ఆఫర్! 15 వేలు ఇస్తే ప్రమోషన్...కోరిన చోట పోస్టింగ్
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ‘డియర్ బ్రదర్స్... మీ నోట్ ఫైల్ అయిపోయింది. మేడమ్ (రీజనల్ డైరెక్టర్) సంతకం కోసం పెండింగ్లో ఉన్న సంగతి మీకందరికీ తెలిసినదే. అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ ఏఎంఓ (అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్)ల ఫైల్ కూడా రెడీ అయిపోయింది. వారికి ఎస్ఆర్లు కాల్ఫర్ చేస్తున్నారు. వాళ్లది అయిన (ప్రమోషన్లు ఇచ్చిన) తర్వాత పెడితే బాగుంటుందని కొంతమంది బ్రదర్స్ కాల్ చేస్తున్నారు. మీరు ఏదో ఒకటి డిసైడ్ అవ్వండి. ఇప్పుడీ పదహారు (16 మంది ఎంపీహెచ్ఎస్లకు ప్రమోషన్)కూ కాల్ఫర్ చేయించేయాలా? ఏఎంఓలు అయిన తర్వాత ఐదు ఖాళీలైతే అప్పుడు పెట్టించుకుంటారా? పది మంది అలా అడుగుతున్నారు. పది మంది ఇలా చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడైతే బాగుంటుంది. ఏదో ఒకటి చెబితే ఈరోజు పెట్టించేయాలా (సంతకం)? ఆపాలా? అనేది నేను డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు చెప్పేదాని కోసమే వెయింటింగ్ ఇక్కడ...’ ఇదీ విశాఖలోని కేజీహెచ్లో పనిచేస్తున్న ఓ హెల్త్ విజిటర్ (హెచ్వీ) వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లకు పంపిన వాయిస్ మెయిల్. వారికే కాదు విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లోని ప్రాథమిక వైద్య కేంద్రాల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు అదే తరహాలో సందేశం వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే రూ.15 వేలు ఫార్మాల్టీ ఇస్తే వారికి ప్రమోషన్తో పాటు కోరుకున్న చోట పోస్టింగ్ కూడా ఇప్పిస్తామని! ఈ డబుల్ ధమాకా ఆఫర్తో ఆకర్షితులైన చాలామంది ఆ శాఖ ఉద్యోగులు పైకం సమర్పించుకున్నారనే గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు, బదిలీలు పారదర్శకంగా, అవినీతికి ఆస్కారం లేకుండా జరగాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పదేపదే చెబుతున్నా దిగువస్థాయిలో మాత్రం ఆయన ఆశయానికి కొంతమంది గండికొడుతున్నారు. జోన్–1 పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఇటీవల ఏర్పాటైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు కూడా ఉన్నాయి. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో వైద్యారోగ్య శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తర్వాత ప్రమోషన్ల ఫైళ్లు కూడా కదిలాయి. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఏఎన్ఎం)లుగా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్ (ఎంపీహెచ్ఎస్)/హెల్త్ విజిటర్ (హెచ్వీ)లుగా ప్రమోషన్ ఇవ్వాల్సి ఉంది. అలాగే, ఎంపీహెచ్ఎస్గా పనిచేస్తున్నవారికి మల్టీపర్పస్ హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (ఎంపీహెచ్ఈవో)లుగా ప్రమోషన్ ఇస్తారు. వారిలో ఎవరైనా బీఎస్సీ (బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ–బీజడ్సీ) డిగ్రీ ఉన్నవారైతే అసిస్టెంట్ మలేరియా ఆఫీసర్ (ఏఎంవో)గా నియమించవచ్చు. ఈ ప్రమోషన్ల జాబితాలన్నింటికీ రీజినల్ డైరెక్టర్ (ఆర్డీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఓ ఉద్యోగిని చక్రం... జాబితాలో పేరుంది. రూ.15 వేలే కదా ఫార్మాల్టీ ఇచ్చేస్తే ప్రమోషన్కు ప్రమోషన్... తర్వాత కోరుకున్న చోటుకు పోస్టింగ్ వస్తుందని చెబుతూ కొంతమంది ఉద్యోగులే వసూళ్లపర్వానికి తెరలేపారు. గతంలో విజయనగరం జిల్లా బొద్దాం పీహెచ్సీలో పనిచేసి ప్రస్తుతం కేజీహెచ్లో హెచ్వీ పోస్టులో ఉన్న ఓ ఉద్యోగిని చక్రం తిప్పుతోందని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు. ఏదో ఒకటి డిసైడ్ చేసుకొని చెబితే ఆర్డీ సంతకం చేయించేస్తానంటూ రికార్డు చేసిన వాయిస్ను ఏకంగా వాట్సాప్లోనే పోస్టు చేయడం గమనార్హం. అంతేకాదు ఫార్మాల్టీలే ప్రసాదంగా భావించే ఆర్డీ కార్యాలయంలో ఓ ఉద్యోగి పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. జాబితాలు వాట్సాప్లో చక్కర్లు... జోన్–1లోని పీహెచ్సీల్లో పనిచేస్తున్నవారిలో 87 మంది ఎంపీహెచ్ఏ (ఫిమేల్)లకు ఎంపీహెచ్ఎస్లుగా ప్రమోషన్ ఇచ్చేందుకు జాబితా తయారైంది. వారిలో 45 మంది విజయనగరం, పార్వతీపురం–మన్యం జిల్లాల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు. అలాగే, 16 మంది ఎంపీహెచ్ఎస్లకు ఎంపీహెచ్ఈవో/ఏఎంవోలుగా పదోన్నతి ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఆ జాబితాలు ఇంకా ఆర్డీ కార్యాలయంలో పెండింగ్లో ఉన్నాయి. ఆర్డీ డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి సంతకం చేయకుండా ఉన్న జాబితాలు మాత్రం కార్యాలయం నుంచి బయటకు వచ్చేశాయి. ప్రమోషన్ కోసం చూస్తున్నవారి వాట్సాప్కు అవి చేరాయి. ఫార్మాల్టీలతో పబ్బం... ఫార్మాల్టీ ఇచ్చేస్తే ఎలాంటి పని అయినా అయిపోతుందని ఎర వేస్తూ వైద్యారోగ్య శాఖలో కొంతమంది తోటి ఉద్యోగులే పబ్బం గడుపుకుంటున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా కొంతమంది జూనియర్ అసిస్టెంట్లను కొత్త జిల్లాలైన పార్వతీపురం–మన్యం, అల్లూరి సీతారామరాజు (పాడేరు)కు పంపించారు. వారిలో ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు పాడేరు నుంచి మళ్లీ వెనక్కి తీసుకురావడానికి రూ.70 వేలు చొప్పున సమర్పించుకున్నారని ఆ శాఖ ఉద్యోగులే చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే, విజయనగరం జిల్లాలో ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ ఇస్తూ జాబితా సిద్ధమైంది. రేపో మాపో దానికి ఆమోదముద్ర పడనుంది. అందుకోసం వారు కూడా రూ.15 వేలు చొప్పున ఫార్మాల్టీ చెల్లించుకోవాల్సి వచ్చిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమోషన్లు ఫైనల్ చేయలేదు అందరి దగ్గరా ఎస్ఆర్ (సర్వీసు రిజిస్టర్)లు మాత్రమే కాల్ఫర్ చేశాం. వారి దగ్గర డబ్బులు వసూలు చేసినట్లు నా దృష్టికి రాలేదు. ఏఎన్ఎంలు కూడా ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదు. వసూళ్లు చేసినవారెవ్వరో నాకు చెబితే వారికి వార్నింగ్ ఇస్తా. – డాక్టర్ యు.స్వరాజ్యలక్ష్మి, ఆర్డీ, వైద్యారోగ్య శాఖ, విశాఖపట్నం (చదవండి: సర్వశ్రేయో నిధితో ఆలయాల అభివృద్ధి) -
ఉద్యోగ విరమణకు ఒక్కరోజు ముందు పదోన్నతి
కేయూ క్యాంపస్: ఈ నెల 31న ఉద్యోగ విరమణ ఉండగా 30వ తేదీన ప్రమోషన్ ఇచ్చారు కాకతీయ వర్సిటీ అధికారులు. యూనివర్సిటీలో పదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వివిధ విభాగాల ప్రొఫెసర్లకు సీనియర్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించాలని అకుట్ బాధ్యులు విన్నవించినా అధికారులు జాప్యం చేస్తూ వచ్చారు. దీంతో అర్హులైన ముగ్గురు ప్రొఫెసర్లు పదోన్నతి పొందకుండానే ఉద్యోగ విరమణ చేశారు. జియాలజీ ప్రొఫెసర్ కె.డేవిడ్ కూడా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్నారు. దీంతో ఎట్టకేలకు వర్సిటీ అధికారులు సోమవారం సబ్జెక్టు ఎక్స్పర్ట్ను పిలిపించి ఇంటర్వ్యూ నిర్వహించి సీనియర్ ప్రొఫెసర్గా పదోన్నతి కల్పించారు. వీసీ తాటికొండ రమేశ్, పాలక మండలిసభ్యుల సమక్షంలో రిజిస్ట్రార్ వెంకట్రామ్రెడ్డి సోమవారం సాయంత్రం డేవిడ్కు పదోన్నతి ఉత్తర్వులు అందజేశారు. రమేశ్ వీసీగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరం గడిచినా, సీనియర్ ప్రొఫెసర్ల ప్రమోషన్స్లో జాప్యం చేసి ఉద్యోగ విరమణకు ఒకరోజు ముందు పదోన్నతి కల్పించడం యూనివర్సిటీలో చర్చనీయాంశంగా మారింది. -
భవీశ్.. నువ్వు సామాన్యుడివి కాదు!
బిజినెస్కి, సినిమాలకు బ్రాండ్ ఇమేజ్, ప్రమోషన్ ఎంతో ముఖ్యం. అందుకే సినిమా లేదా ప్రొడక్టు రిలీజ్కు ముందు చాలా హంగామా చేస్తారు. కానీ ఎలాంటి హాడావుడి చేయకుండా కేవలం సోషల్ మీడియా ద్వారానే బ్రాండ్ని ప్రమోటై బాహుబలి ఓ కొత్త ట్రాక్ వేసింది. ఇప్పుడదే దారిలో నడుస్తున్నాడు ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్. చిత్రవిచిత్ర ప్రయోగాలు చేస్తూ అందరి చేతా ఔరా అనేలా ఓలాను ప్రమోట్ చేస్తున్నారు. ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి యంగ్ ఎంట్రప్యూనర్ భవీశ్ అగర్వాల్ అనుసరిస్తున్న సరికొత్త ప్రచార పంథా స్టార్టప్లకు స్పూర్తిగా నిలుస్తోంది. కేవలం సోషల్ మీడియాను వేదికగా చేసుకుని బ్రాండ్ ప్రమోషన్ చేయడమే కాకుండా విపత్కర పరిస్థుల్లోనూ తన యూనికార్న్ కంపెనీ బ్రాండ్ ఇమేజ్కి భంగం కలగకుండా జాగ్రత్త పడుతున్న తీరు బిజినెస్ సర్కిళ్లలో సంచలనంగా మారింది. మంటల్లో బ్రాండ్ ఇమేజ్ వేసవి ఆరంభం కావడం మొదలు అకస్మాత్తుగా దేశవ్యాప్తంగా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు చెలరేగాయి. కొన్ని సందర్భాల్లో స్కూటర్లు అగ్నికి ఆహుతి అవగా మరికొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా జరిగింది. అనేక కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మంటల్లో చిక్కుకుంటూ వాటి భద్రతపై సందేహాలు రేకెత్తించాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఓలా స్కూటర్లపైనే నెగటీవ్ ప్రచారం మొదలైంది. సంచలన రీతిలో దేశవ్యాప్తంగా ఆకట్టుకున్న ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్కి ఇది ఓ రకంగా అశనిపాతమే. కమ్యూనిటీ ర్యాలీ ఓలా బ్రాండ్ ఇమేజ్కి జరుగుతున్న నష్టాన్ని అదుపు చేసేందుకు ఈ కంపెనీ ఫౌండర్ కమ్ సీఈవో భవీశ్ అగర్వాల్ రంగంలోకి దిగాడు. స్కూటర్ల భద్రతపై తాను ఎన్ని హామీలు ఇచ్చినా వేస్టని గ్రహించాడు. అందుకే ఓలా స్కూటర్లు వాడుతున్న కస్టమర్ల చేతనే ఆ మాట చెప్పించాలని నిర్ణయించాడు. అందులో భాగంగా తెర మీదకు వచ్చిందే ఓలా కమ్యూనిటీ ర్యాలీలు. ముంబై నుంచి మొదలు పెట్టి చెన్నై, పూనే ఇలా ఒక్కో నగరంలో ఈ ర్యాలీను నిర్వహిస్తూ తాజాగా హైదరాబాద్లో కూడా పూర్తి చేశారు. ఓలా స్కూటర్లు ఎంత భద్రమైనవో కస్టమర్ల చేతనే రివ్యూ ఇప్పించాడు. ఇదంతా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా సృష్టించాడు. Thank you Hyderabad! What energy from the Ola community here. I couldn’t make it but clearly I missed all the fun🙂 pic.twitter.com/8ZzjisS2R8 — Bhavish Aggarwal (@bhash) May 29, 2022 మైలేజీ మ్యాజిక్ ఇక ఓలా స్కూటర్ల మైలేజీ ఎంత వస్తుందనే అంశంపై ఉన్న సందేహాలను పటాపంచాలు చేసేందుకు మరో కాంటెస్ట్ నిర్వహించారు. సింగిల్ ఛార్జ్తో అత్యధిక మైలేజీ పొందిన వారికి గెరువా రంగు స్కూటర్లు ఫ్రీగా బహుమతిగా ఇస్తానంటూ మరో కంటెస్ట్ పెట్టాడు. దీని మీద జరిగిన హాడావుడితో మైలేజీ మీద కూడా నమ్మకం కలిగించాడు భవీశ్. ఆఖరికి కర్నాటకలో ఉన్న కాషాయ ట్రెండ్ను అనుసరించి గెరువా (కషాయ రంగులో) కలర్లో కొత్త స్కూటర్ను మార్కెట్లోకి తెచ్చాడు భవీశ్. @OlaElectric Can you check and look into this am not any response for this challenge. Am sending multiple tweets but no one has responded on this challenge. https://t.co/8JdLxeysZq — Jayanth Kumar (@jayanth_rudra) May 29, 2022 ఫస్ట్టైం ఇన్ హిస్టరీ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ విషయంలో ఆది నుంచి భవీష్ భిన్నమైన మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించాడు. ఆటోమొబైల్ చరిత్రలోనే తొలిసారిగా షోరూమ్లు లేని వెహికల్గా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందు ఆన్లైన్లో స్కూటర్ల బుకింగ్ మొదలెట్టి లక్షకు పైగా ప్రీ బుకింగ్స్ సాధించి రికార్డు సృష్టించాడు. ప్రీ బుకింగ్స్లో అడ్వాన్స్ చెల్లించిన వారు డెలివరీ విషయంలో జరుగుతున్న ఆలస్యంపై నిందలు వేస్తుండటంతో.. హ్యాపీ మూమెంట్స్ పేరుతో స్కూటర్ డెలివరీ ప్రచారానికి తెర తీశాడు. . మూవ్ఓఎస్ 2 విషయంలోనూ సోషల్ మీడియాను గణనీయంగా వాడుకున్నాడు భవీశ్. విమెన్ స్పెషల్ సాధారణంగా బైకులు మగవాళ్లు ఇష్టపడితే ఆడవాళ్లు స్కూటర్లకే పరిమితం అవుతుంటారు. దీంతో ఓలా స్కూటర్ల విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ సృష్టించేందుకు మరో ఎత్తుగడను అనుసరించాడు భవీశ్. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కర్మగారంలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాడు. మహిళా సాధికారతకు ఓలా అద్దం పడుతుంది అంటూ విస్త్రృత ప్రచారం చేయగలిగాడు ఈలాన్తో పోలిక త్వరలో ఓలా నుంచి ఎలక్ట్రిక్ కార్లను తెచ్చే ప్రయత్నంలో ఉన్నాడు భవీశ్. ఇప్పటికే ప్రోటోటైప్ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ కారుకు కూడా బజ్ తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు భవీశ్. అందులో భాగంగా ఇండియాకు టెస్లా కార్లు తెచ్చే విషయంలో ఒక అడుగు ముందుకు రెండు అడగులు వెనక్కి వేస్తున్న ఈలాన్ మస్క్ వ్యవహార తీరుపై సెటైరిక్గా స్పందించాడు భవీశ్. ఇండియాకు రానందుకు థ్యాంక్స్, బట్ నాట్ థ్యాంక్స్ అంటూ టెస్లాకు పోటీగా ఓలా ఉందనే ఫీల్ను తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు భవీశ్. చదవండి: మనోడు గట్టొడే! ఏకంగా ఈలాన్ మస్క్ మీదే వేశాడు పెద్ద పంచ్ -
ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారాలా? విశ్వక్సేన్పై ఫైర్
హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’.విద్యాసాగర్ చింత దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే6న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడు పెంచిన చిత్ర బృందం తాజాగా తమ సినిమా ప్రమోషన్స్ కోసం చేయించిన ప్రాంక్ వీడియోపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. విశ్వక్ సేన్ ఫిలింనగర్ రోడ్డులో వెళుతుంటే ఓ యువకుడు కారుకు అడ్డంగా పడుకొని నడిరోడ్డుపై హల్చల్ చేశాడు. అల్లం అర్జున్ కుమార్ (అశోక వనంలో అర్జున కళ్యాణంలో విశ్వక్ సేన్ పేరు)కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు కదా సార్. నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకే పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా అంటూ డ్రామాలాడాడు. విశ్వక్సేన్ కూడా ఇదంతా తనకేం తెలియనట్లు ఆ డ్రామాను రక్తి కట్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడతుంది. సినిమా ప్రమోషన్స్ కోసం ఇంత దిగజారి ఆలోచించాలా అంటూ చిత్ర యూనిట్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సినిమా బాగుంటే ఆడుతుంది. లేకపోతే ఆడియెన్స్ చూడరు. ఇలాంటి జిమ్మిక్కులు వర్కవుట్ కావని ఎప్పుడు తెలుసుకుంటారు? ప్రాంక్ పేరుతో పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ చేయడం ఏంటి అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. https://t.co/VXk5VSKO4y#VishwakSen and His Fan Hulchal On #Road | #AshokaVanamLoArjunaKalyanam | Filmylooks #Tollywood — MrB Celeb News (@mrbcelebnews) May 1, 2022 -
30 ఏళ్ల తర్వాత ముఖంపై ఆనందం
సాక్షి, ఆదిలాబాద్: మూడు దశాబ్దాల తర్వాత పోలీస్ కానిస్టేబుళ్ల మోములో ఓ ఆనందం.. తమకు పదోన్నతి లభించిందన్న దరహాసం.. మంగళవారం ఉదయం ప్రమోషన్లకు సంబంధించి ఉత్తర్వులు వెలుబడ్డాయని తెలియడంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఎన్నాళ్లో వేచిన ఉదయంలా.. వారి సంతోషానికి హద్దులు లేకుండాపోయాయి. తమ సహచరులు, తెలిసినవారందరికీ ఫోన్చేసి నేను హెడ్కానిస్టేబుల్ అయ్యానని చెప్పుకుంటూ మురిసిపోయారు. స్వీట్లు పంచుకున్నారు. ఇన్నాళ్ల తమ శ్రమకు ఎట్టకేలకు ఫలి తం లభించిందన్న భావన వారిలో కనిపిస్తోంది. 211 మందికి.. బాసర జోన్ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల పోలీసు కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుల్గా పదోన్నతి కల్పిస్తూ నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్(సీపీ) నాగరాజు నుంచి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. 1990 నుంచి 1996 బ్యాచ్లకు చెందిన కానిస్టేబుళ్లకు ఈ పదోన్నతులు కల్పించారు. నిజామాబాద్ జిల్లా కానిస్టేబుళ్లకు ఇదివరకే పదోన్నతులు కల్పించడంతో ఈ జోన్ పరిధిలోని మిగతా మూడు జిల్లాల కానిస్టేబుళ్లకు సీనియారిటీ ఆధారంగా పదోన్నతి కల్పించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 136 కానిస్టేబుళ్లు పదోన్నతి పొందారు. నిర్మల్ జిల్లాకు చెందినవారు 55, జగిత్యాల జిల్లాకు చెందిన 20 మంది ఉన్నారు. నాలుగు జిల్లాల పరిధిలో పోస్టింగ్.. హెడ్కానిస్టేబుల్గా పదోన్నతి పొందిన వారికి బాసర జోన్–2 పరిధిలోని నాలుగు జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాలలో పోస్టింగ్ ఇచ్చారు. సీనియారిటీ ఆధారంగా వారికి ఆయా ప్రాంతాలు కేటాయించారు. 15 రోజుల్లో వారు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత సమయంలో వారు చేరని పక్షంలో పదోన్నతి కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ గడువు తర్వాత పోలీసు శాఖ కానిస్టేబుళ్ల ఖాళీలపై ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుంది. పదోన్నతుల కారణంగా పలు కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలు ఏర్పడ్డాయి. దీంతో లాండ్ ఆర్డర్ పరంగా కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్న భావన పోలీసు అధికారుల్లో వ్యక్తమవుతోంది. పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతన రిక్రూట్మెంట్ ద్వారా పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది. పదోన్నతి పొందిన వారికి అభినందన నిర్మల్చైన్గేట్: నిర్మల్రూరల్ సర్కిల్ పరిధిలో కానిస్టేబుల్ నుంచి హెడ్ కా నిస్టేబుల్గా పదోన్నతి పొందిన వారిని సీఐ వెంకటేశ్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
'ఆర్ఆర్ఆర్' ప్రిరిలీజ్ ఈవెంట్ ఖరారు.. ముఖ్య అతిథిగా ఆ ముఖ్యమంత్రి !
Karnataka CM As Chief Guest In RRR Movie Promotional Event: ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతరామారాజుగా రామ్ చరణ్ నటించారు. తారక్ సరసన ఒలివియా మోరీస్, చెర్రీకి జోడిగా అలియా భట్ కనువిందు చేయనున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్, పెన్ స్టూడియోస్, లైకా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు. మార్చి 25న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లను భారీగానే ప్లాన్ చేసింది జక్కన్న టీం. స్పెషల్ ఇంటర్వ్యూలు, ప్రత్యేక ఈవెంట్లతో భారీగా సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: 'ఆర్ఆర్ఆర్' సెలబ్రేషన్స్ సాంగ్.. పూర్తి పాట వచ్చేసింది.. ఈ క్రమంలో మార్చి 19న బెంగళూరులోని చిక్కబల్లాపూర్లో 'ఆర్ఆర్ఆర్' ప్రిరిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరగనుంది. ఈ ఈవెంట్లో మూవీ ప్రమోషన్స్ కోసం ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ముఖ్య అతిథిగా విచ్చేయనున్నట్లు ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కర్ణాటక సీఎంతోపాటు ఆరోగ్య శాఖ మంత్రి, సూపర్ స్టార్ శివరాజ్ కుమార్లు కూడా ముఖ్య అతిథులుగా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా ఈ వేడుకను దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్కు అంకితం ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. చదవండి: 'ఆర్ఆర్ఆర్' దక్కిన అరుదైన గౌరవం.. ఆ దేశంలో విడుదల -
గుర్తుపట్టలేనంతగా మారిన ఎంఎస్ ధోని.. ఏం జరిగింది
టీమిండియా మాజీ ఆటగాడు ఎంఎస్ ధోని గుర్తుపట్టలేనంతగా తయారయ్యాడు. అదేంటి ధోనికి ఏమైంది అని కంగారుపడకండి. విషయంలోకి వెళితే.. ఐపీఎల్ 2022 ప్రమోషన్లో భాగంగా ధోని న్యూలుక్తో దర్శనమిచ్చాడు. ఐపీఎల్ను ప్రసారం చేసే స్టార్స్పోర్ట్ బ్రాడ్కాస్టింగ్ ఈ ప్రమోషన్ను రూపొందించింది. ఖాకీ చొక్కా.. అదే కలర్ ప్యాంటు.. వేసుకొని మెలితిప్పిన మీసంతో ధోని అదరగొట్టాడు. ఇంకా చెప్పాలంటే చెన్నై బస్డ్రైవర్ యునిఫామ్ వేసుకొని.. చేతిలో మైక్ పట్టుకొని ఆటకు వేళాయే అన్నట్లుగా లుక్ ఉంది. ఇక చివర్లో కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బస్ స్టార్ట్ చేస్తూ ధోని ఇచ్చిన లుక్ హైలెట్గా నిలిచింది. సరిగ్గా గమనిస్తే తప్ప ధోనిని గుర్తుపట్టలేం. అంతలా మారిపోయాడు.. ఈ మాస్టర్ మైండ్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోనూ స్టార్స్పోర్ట్స్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఇక ఎంఎస్ ధోని ఐపీఎల్ ఆడడం ఇదే చివరిసారి అని చాలా మంది భావిస్తున్నారు. గత సీజన్లో సీఎస్కేను నాలుగోసారి చాంపియన్స్గా నిలిపిన ధోని.. మరోసారి అదే కసితో బరిలోకి దిగుతున్నాడు. మరి ఐదోసారి సీఎస్కేను విజేతగా నిలిపి పర్ఫెక్ట్ ముగింపు ఇస్తాడేమో చూడాలి. కాగా బీసీసీఐ.ఐపీఎల్–15 సీజన్ షెడ్యూల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. మార్చి 26 న ప్రారంభమవ్వగా ఫైనల్ మ్యాచ్ మే 29న జరగనుంది. మొత్తం 10 టీమ్లు 72 మ్యాచ్లు ఆడే విధంగా షెడ్యూల్ను రూపొందించింది. ముంబైలోని వాంఖడే (20 మ్యాచ్లు), బ్రబౌర్న్ (15), డీవై పాటిల్ (20) స్టేడియాలతో పాటు పుణెలోని ఎంసీఏ స్టేడియం (15)ను వేదికలుగా ఎంపిక చేశారు. ఈ సారి ఏ టీం ఎన్నిసార్లు టైటిల్ గెలిచింది. ఏ టీం ఎన్ని సార్లు ఫైనల్ కు చేరిందనేది దృష్టిలో పెట్టుకుని 10 టీంలను రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు. గ్రూప్ ‘ఎ’: ముంబై ఇండియన్స్ (సీడింగ్–1), కోల్కతా నైట్రైడర్స్(3), రాజస్తాన్ రాయల్స్ (5), ఢిల్లీ క్యాపిటల్స్ (7), లక్నో సూపర్ జెయింట్స్ (9). గ్రూప్ ‘బి’: చెన్నై సూపర్ కింగ్స్ (2), సన్రైజర్స్ హైదరాబాద్ (4), రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (6), పంజాబ్ కింగ్స్ (8), గుజరాత్ టైటాన్స్ (10). చదవండి: Rohit Sharma: టి20 కెప్టెన్గా రోహిత్ శర్మ కొత్త రికార్డు Harbhajan Singh-Geeta Basra: 'బ్రేకప్ చెప్పేసుకున్నారు.. కానీ పెళ్లి చేసుకున్నారు' View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) View this post on Instagram A post shared by Star Sports India (@starsportsindia) -
మార్పింగ్ కు సచిన్ టెండూల్కర్ బలి
-
‘కుర్చీ’ మార్చరా? నాలుగేళ్లుగా ఒకే పోస్టులో..
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో ఐపీఎస్ అధికారుల పరిస్థితి విచిత్రంగా తయారైంది. పదోన్నతి లభించినా పాత పోస్టులోనే ఏళ్ల తరబడి కొనసాగాల్సిన పరిస్థితి నెలకొంది. బదిలీపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు ప్రతిపాదనలు వెళ్లినా అటకెక్కడం తప్ప పోస్టింగ్లపై ఆదేశాలు వచ్చిన దాఖాలాలు లేవు. ఇటీవల కొందరు ఐపీఎస్ల బదిలీ జరిగినా ఇంకా చాలామేరకు పెండింగ్లో ఉన్నాయి. దీంతో నాలుగేళ్లుగా ఒకే పోస్టులో ఉన్న ఐపీఎస్లు తలలు పట్టుకుంటున్నారు. పరిస్థితి మారదా? ►సీఐడీ చీఫ్గా ఉన్న గోవింద్సింగ్ అదనపు డీజీపీగా పదోన్నతి పొందినా నాలుగున్నరేళ్లుగా ఇదేపోస్టులో ఉన్నారు. కొద్ది రోజులపాటు ఏసీబీ, విజిలెన్స్ ఇన్చార్జి డీజీగా బాధ్యతలు నిర్వర్తించారు. ►శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా జితేందర్ సైతం నాలుగేళ్లుగా అదే పోస్టింగ్లో కొనసాగుతున్నారు. అదనంగా జైళ్ల శాఖను పర్యవేక్షిస్తున్నారు. ►ఇంటలిజెన్స్ చీఫ్గా ఐజీ ర్యాంకు నుంచి పోలీస్ శాఖలోని పర్సనల్ విభాగానికి బదిలీపై వచ్చిన శివధర్రెడ్డి నాలుగున్నరేళ్లుగా అదేపోస్టులో ఉన్నారు. అదనపు డీజీపీగా పదోన్నతి వచ్చినా పాత స్థానంలోనే కొనసాగుతున్నారు. ►ప్రొవిజినల్, లాజిస్టిక్ ఐజీగా నాలుగేళ్ల క్రితం వచ్చిన సంజయ్కుమార్ జైన్ ఇటీ వల అదనపు డీజీపీగా పదోన్నతి పొం దిన ఇంకా అక్కడే కొనసాగిల్సిన పరిస్థితి ఏర్పడింది. అగ్నిమాపకశాఖతోపాటు డిజాస్టర్ మేనేజ్మెంట్కు డైరెక్టర్గా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ►అపరేషన్స్ విభాగాలుగా ఉన్న గ్రేహౌం డ్స్, ఆక్టోపస్ యూనిట్లకు అదనపు డీజీపీగా శ్రీనివాస్రెడ్డి ఐదేళ్లకుపైగా అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. ఐజీగా బదిలీపై వెళ్లిన ఆయన అదనపు డీజీపీగా పదోన్నతి పొంది రెండేళ్లు దాటినా ఇంకా పాత స్థానంలోనే కొనసాగాల్సి వస్తోంది. ►సీనియర్ ఐపీఎస్ రవిగుప్తా, పోలీస్ టెక్నాలజీ, కంప్యూటర్ సర్వీసెస్ అదన పు డీజీపీతోపాటు హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీపై వెళ్లి మూడున్నరేళ్లు కావస్తోంది. డైరెక్టర్ జనరల్గా పదోన్నతి పొందినా బదిలీకి నోచుకోలేదు. ►పోలీస్ ఆర్గనైజేషన్ అదనపు డీజీపీగా సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ మూడున్నరేళ్లుగా అక్కడే విధులు నిర్వర్తిసున్నారు. ►రోడ్ సేఫ్టీ అదనపు డీజీపీ సందీప్ శాండిల్యా దాదాపు నాలుగేళ్లుగా అదే పోస్టులో కాలం వెళ్లదీస్తున్నారు. ►రాచకొండ కమిషనర్గా మహేష్ భగవత్ దాదాపు నాలుగున్నరేళ్లుగా అక్కడే ఐజీగా, ప్రస్తుతం అదనపు డీజీపీగా కొనసాగుతున్నారు. ►హైదరాబాద్ కమిషనరేట్లో అదనపు సీపీగా ఉన్న దేవేంద్రసింగ్ చౌహాన్ మూడున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల పదోన్నతి పొందినా అక్కడే తిరిగి విధులు నిర్వర్తిస్తున్నారు. ►నార్త్జోన్ (వరంగల్) ఐజీగా వై. నాగిరెడ్డి మూడున్నరేళ్లుగా అక్కడే కొనసాగుతుం డగా స్టీఫెన్ రవీంధ్ర బదిలీతో వెస్ట్జోన్ (హైదరాబాద్) ఐజీ బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తిసున్నారు. ఇటీవల అదన పు డీజీపీగా పదోన్నతి పొందినా ఐజీ ర్యాంకు పోస్టులోనే విధులు నిర్వర్తిస్తున్నారు. ►కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన సీనియర్ ఐపీఎస్, అదనపు డీజీపీ విజయ్కుమార్ ఇంకా వెయిటింగ్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులపాటు హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్గా నియమించినా మళ్లీ ఆయన్ను బదిలీ చేసి డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ►ఇంటెలిజెన్స్లో డీఐజీగా నాలుగేళ్లు, ప్రస్తుతం ఐజీగా పదోన్నతి పొందిన శివకుమార్ అక్కడే నాలుగున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. ఇదే విభాగంలో ఎస్పీ, డీఐజీగా, ఐజీగా రాజేష్కుమార్ విధులు నిర్వర్తిస్తున్నారు. దాదాపుగా ఐదున్నరేళ్లుగా ఆయన ఇక్కడే విధులు నిర్వర్తించడం గమనార్హం. ►వీబీ కమలాసన్రెడ్డి ఇటీవలే ఐజీగా పదోన్నతి పొందినా వెయిటింగ్లోనే ఉన్నారు. అంతకుముందు ఐదేళ్లపాటు కరీంనగర్ కమిషనర్గా పనిచేసి ఆయన రికార్డు సృష్టించారు. ►డీసీపీ (ఎస్పీ ర్యాంకు)లో నగర కమిషనరేట్లోని ఈస్ట్జోన్కు బదిలీపై వెళ్లిన ఎం రమేష్రెడ్డి, డీఐజీగా పదోన్నతి పొంది దాదాపు మూడున్నరేళ్లు కావస్తోంది. ఇంకా ఆయన డీసీపీ పోస్టులో జాయింట్ సీపీగా పనిచేస్తున్నారు. ►డీఐజీ రమేష్నాయుడు, ఎస్పీ నవీన్కుమార్ పోలీస్ అకాడమీలోనే కాలం వెళ్లదీస్తున్నారు. వాళ్లు బదిలీపై వెళ్లి దాదాపు నాలుగున్నరేళ్లు కావస్తోంది. ►ఎస్పీగా సీఐడీకి బదిలీ అయిన ఐపీఎస్ శ్రీనివాస్, డీఐ జీగా పదోన్నతి రెండేళ్లు అయినా ఇప్పటివరకు స్థానచలనం రాలేదు. అలాగే సీఐడీకి వచ్చి మూడేళ్లు కావస్తున్న ఐపీఎస్ పరిమళహనా నూతన్కు సైతం స్థానచలనం కలగలేదు. డీఐజీగా ఉన్న సుమతి మూడేళ్లుగా సీఐడీ నుంచి అటాచ్మెంట్లో ఉమెన్ సేఫ్టీ వింగ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ►కొత్తగా ఐపీఎస్ కన్ఫర్డ్ పదోన్నతి పొందిన ఆరుగురు అధికారులు వెయిటింగ్లోనే ఉన్నారు. మరో ఐదుగురు సీనియర్ ఐపీఎస్లు సైతం నెలల తరబడి వెయిటింగ్లో ఉన్నారు. -
TS: పలువురు ఐపీఎస్ అధికారుల పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలువురు ఐపీఎస్ అధికారులకు ప్రమోషన్ లభించింది. రాష్ట్రంలోని 12 మంది ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.1997 బ్యాచ్కు చెందిన నలుగురు ఐపీఎస్ అధికారులు.. విజయ్ కుమార్, నాగిరెడ్డి, డీఎస్. చోహన్, సంజయ్ కుమార్ జైన్లకు అడిషనల్ డీజీపీగా ప్రమోషన్ దక్కింది. 2005 బ్యాచ్కు చెందిన ఐదుగురు ఐపీఎస్ అధికారులు.. తరుణ్ జోషి, వి.శివ కుమార్, కమలసన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, ఏఆర్. శ్రీనివాస్లకు ఐజీగా పదోన్నతి లభించింది. 2008 బ్యాచ్ కు చెందిన తఫ్సర్ ఇక్బాల్కు డీఐజీగా, 2009 బ్యాచ్కు చెందిన రేమ రాజేశ్వరి, అంబారి కిషోర్ ఝాలకు సెలెక్షన్స్ గ్రేడ్ ఆఫీసర్స్ కింద ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
సీనియర్ ఐపీఎస్లకు డీజీలుగా ప్రమోషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐపీఎస్లకు డీజీలుగా ప్రమోషన్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన వారిలో సీనియర్ ఐపీఎస్లు అంజనాసిన్హా, మాదిరెడ్డి ప్రతాప్, మహ్మద్ అసన్రేజా, పీఎస్ఆర్ ఆంజనేయులు, కే రాజేంద్రనాథ్రెడ్డి, నళిని ప్రభాత్ గజరవు భూపాల్, పేముషీ, గోపీనాథ్ జెట్టి, సెంథిల్కుమార్, గ్రీవల్ నవదీప్సింగ్, నవీన్గులాటి, కాంతిరాణా టాడా, ఎల్కేవీ రంగారావు, పి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. చదవండి: (దివాలా ముంగిట్లో రఘురామ కంపెనీ) -
నాన్కేడర్ నుంచి ఐపీఎస్
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర పోలీస్ శాఖలో నాన్కేడర్ ఎస్పీలుగా పనిచేస్తున్న అధికారులకు ఐపీఎస్ హోదా దక్కింది. 20 మంది అధికారులకు ఐపీఎస్ పదోన్నతి కల్పిస్తూ కేంద్ర హోంశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. 2007లో గ్రూ ప్–1లో డీఎస్పీలుగా చేరిన అధికారులతోపా టు ఎస్ఐగా కేరీర్ ప్రారంభించి నాన్కేడర్ ఎస్పీలుగా ఉన్న వారికీ కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి కల్పించింది. రాష్ట్రానికి కేడర్ అలాట్మెంట్లో భాగంగా ఇచ్చిన ప్రమోషన్ కోటాలో ఖాళీగా ఉన్న 23 ఐపీఎస్ పోస్టులకు సంబంధించి ఈ నెల 11న సెలెక్షన్ కమిటీ స మావేశం నిర్వహించింది. రాష్ట్రం నుంచి 23 మంది పేర్లను ప్రతిపాదించగా ముగ్గురిపై క్రమశిక్షణ చర్య లు పెండింగ్లో ఉండటంతో కమిటీ వారి పేర్లను పెండింగ్లో పెట్టింది. దీంతో మిగిలిన 20 మంది నాన్కేడర్ ఎస్పీలకు ఐపీఎస్ హోదా పదోన్నతి కల్పిస్తూ ఆమోదముద్ర వేసింది. యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీ ఈనెల 17న జాబితాను కేంద్ర సిబ్బంది, వ్యవహారాల విభాగంతోపాటు కేంద్ర హోంశాఖకు పంపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ జాబితాను ఆమోదిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోన్నతి పొందిన అధికారులు 2016 సంవత్సరం జాబితాలో ఎన్.కోటిరెడ్డి, ఎల్.సుబ్బారాయుడు, కె.నారాయణరెడ్డి, డీవీ శ్రీనివాస్రావు, టి.శ్రీనివాస్రావు, టి.అన్నపూర్ణ, పీవీ పద్మజ, జానకీ ధరావత్, 2017 జాబితాలో పి.యాదగిరి, 2018 కోటా కింద కేఆర్ నాగరాజు, ఎం.నారాయణ, 2019 జాబితాలో వి.తిరుపతి, ఎస్.రాజేంద్రప్రసాద్, డి.ఉదయ్కుమార్ రెడ్డి, కె.సురేష్కుమార్, 2020 జాబితాలో బి.అనురాధ, సి.అనసూయ, షేక్ సలీమా, ఆర్.గిరిధర్, సీహెచ్ ప్రవీణ్కుమార్ ఐపీఎస్ పదోన్నతి పొందారు. క్రమశిక్షణ చర్యలు పెండింగ్లో ఉండటం వల్ల జానకీ షర్మిల, వై.సాయిశేఖర్, వి.భాస్కర్రావు పదోన్నతి రాకుండా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఇంటిగ్రెటి సర్టిఫికెట్ తీసుకొని యూపీఎస్సీకి సమర్పిస్తే వీరికి కూడా పదోన్నతులు కల్పించనున్నట్టు కేంద్ర హోంశాఖ పేర్కొంది. ఐదేళ్ల పోరాటంతో ఫలితం.. రాష్ట్ర విభజనకు ముందు జరిగిన సీనియారిటీ జాబితా వివాదంతో కన్ఫర్డ్ ఐపీఎస్ పదోన్నతి ఐదేళ్ల నుంచి వాయిదా పడుతూ వచ్చింది. ప్రతీ ఏటా ఖాళీల భర్తీకి హోంశాఖ ప్యానల్ నోటిఫికేషన్ ఇస్తూ వచ్చినా సీనియారిటీ సమస్య పరిష్కారం కాకపోవడంతో పదోన్నతి ఆలస్యమైంది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారుల చొరవతో ఎట్టకేలకు ఈ ఏడాది మొదట్లోనే సీనియారిటీ సమస్యను పరిష్కరించడంతో 2016 నుంచి పెండింగ్లో ఉన్న ప్యానల్ పదోన్నతులను యూపీఎస్సీ, కేంద్ర హోంశాఖ ఒకేసారి క్లియర్ చేశాయి. -
ఈవీ కంపెనీల నిధుల వేట
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్, ప్రోత్సాహం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ–వాహనాల కంపెనీలు నిధులు సమకూర్చుకోవడంపై మరింతగా కసరత్తు చేస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ బైక్ల తయారీ సంస్థ అల్ట్రావయొలెట్ ఆటోమోటివ్లో ద్విచక్ర వాహనాల దిగ్గజం టీవీఎస్ మోటార్స్ మరిన్ని పెట్టుబడులు పెట్టింది. జోహో కార్పొరేషన్తో కలిసి ఇన్వెస్ట్ చేసినట్లు తెలిపింది. అయితే, పెట్టుబడి పరిమాణాన్ని వెల్లడించలేదు. భారీ సామర్థ్యం ఉండే ఎలక్ట్రిక్ మోటార్సైకిల్ ఎఫ్77 తయారీ, విక్రయాలకు ఈ నిధులను అల్ట్రావయొలెట్ ఉపయోగించుకోనుంది. బెంగళూరులోని ఎలక్ట్రానిక్స్ సిటీలో అల్ట్రావయొలెట్ తమ తయారీ, అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎఫ్77 బైక్ల తొలి బ్యాచ్ను వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రయత్నాల్లో ఉంది. మరోవైపు, బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న మొబిలిటీ సేవల సంస్థ బౌన్స్ కూడా భారీ ఎత్తున నిధులను సమీకరిస్తోంది. ’బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1’ ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీకి సంబంధించి మరో 200 మిలియన్ డాలర్లు సమకూర్చుకోవాలని యోచిస్తోంది. బౌన్స్ ఇప్పటిదాకా యాక్సెల్, సెకోయా, బి క్యాపిటల్ గ్రూప్ వంటి ఇన్వెస్ట్మెంట్ సంస్థల నుంచి 220 మిలియన్ డాలర్ల దాకా పెట్టుబడులు దక్కించుకుంది. ఈ ఏడాదే దాదాపు 7 మిలియన్ డాలర్లు వెచ్చించి 22మోటార్స్ సంస్థలో 100 శాతం వాటాలు కొనుగోలు చేసింది. దీనితో రాజస్తాన్లోని భివాడీలో ఉన్న అధునాతన తయారీ ప్లాంటు కంపెనీ చేతికి వచ్చింది. ఇందులో వార్షికంగా 1,80,000 స్కూటర్లను ఉత్పత్తి చేయొచ్చు. దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరగబోయే డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని దక్షిణ భారతదేశంలో దాదాపు 5,00,000 వాహనాల తయారీ సామర్థ్యంతో మరో ప్లాంటును కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో బౌన్స్ ఉంది. ఇందుకోసం వచ్చే ఏడాది వ్యవధిలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారం కోసం 100 మిలియన్ డాలర్లను పక్కన పెట్టింది. ఒబెన్లో ఉయ్ ఫౌండర్ సర్కిల్ ఇన్వెస్ట్మెంట్లు అటు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్టార్టప్ సంస్థ ఒబెన్ ఈవీ 1.5 మిలియన్ డాలర్ల నిధులు సమకూర్చుకుంది. ప్రారంభ దశ సంస్థల్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల గ్రూప్ అయిన ఉయ్ ఫౌండర్ సర్కిల్తో పాటు లైఫ్ ఎలిమెంట్ కో–ఫౌండర్ రాకేశ్ సొమానీ, ప్రముఖ ఏంజెల్ ఇన్వెస్టర్లు సుమీత్ పాఠక్, మిలన్ మోదీ తదితరులు ఈ విడత ఇన్వెస్ట్ చేశారు. తమ బైక్ను మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు, కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేసేందుకు, ఎక్స్పీరియన్స్ సెంటర్లను విస్తరించేందుకు ఒబెన్ ఈ నిధులు వినియోగించుకోనుంది. ఒక్కసారి చార్జి చేస్తే 200 కి.మీ. దాకా ప్రయాణించగలిగే ఎలక్ట్రిక్ బైక్ను తయారు చేసే ప్రయత్నాల్లో ఒబెన్ ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 100 కి.మీ.లుగా ఉంటుంది. వచ్చే రెండేళ్లలో వివిధ విభాగాల్లో నాలుగు కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ చెబుతోంది. మరో ఆరు నెలల్లో తొలి ఉత్పత్తిని ఆవిష్కరించనున్నట్లు సంస్థ వివరించింది. -
కబడ్డీ పోటీలు: పాట పాడిన ఎమ్మెల్యే భూమన
తిరుపతి తుడా: లే..పంగా..లే..పంగా అంటూ కబడ్డీ ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ప్రో కబడ్డీని ఉన్నత స్థానానికి చేర్చిన బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ గానం అప్పట్లో ఓ మైలురాయిగా నిలిచింది. తిరుపతి వేదికగా నిర్వహిస్తోన్న జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు మరింత ప్రాచుర్యాన్ని కల్పించేందుకు ‘తెగువకు తెగువకు రణరణ సమరం..లే..పంగా కబడ్డీ కబడ్డీ ఖే లో కబడ్డీ’ అంటూ నూతనంగా రచించిన ఈ గీతాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆలపించగా తిరుపతి మేయర్ శిరీష, కమిషనర్ గిరీష, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు గొంతు కలిపారు. చదవండి: శభాష్ విజయ్.. యోగాలో గిన్నిస్ రికార్డ్ తిరుపతిలోని ఓ రికార్డింగ్ స్టూడియోలో ఈ పాటను ఆదివారం రికార్డు చేశారు. తిరుపతిలో జరిగే జాతీయ కబడ్డీ పోటీలకు విస్తృత ప్రచారం కల్పించేందుకు ఈ పాటను విడుదల చేయనున్నారు. ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ కబడ్డీ క్రీడ పౌరుషానికి ప్రతీక అని చెప్పారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా జరిగే ఈ పోటీలు డే అండ్ నైట్ మ్యాచ్లుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఫ్లెడ్లైట్ల వెలుగులో జరిగే ఈ మ్యాచ్లు నగర వాసులకు కొత్తదనాన్ని అందించనున్నాయన్నారు. -
ప్రమోషన్ వచ్చేలోపే ఒకరు.. 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టించుకుని మరొకరు
న్యూఢిల్లీ: జనరల్ బిపిన్ రావత్కు సహాయక సిబ్బందిగా ఏడాదికాలంగా విధుల్లో ఉన్న సెకండ్ జనరేషన్ ఆర్మీ అధికారి, బ్రిగేడియర్ లఖ్వీందర్ సింగ్ లిడ్డర్ పదోన్నతి అర్ధంతరంగా ఆగింది. బుధవారం హెలికాప్టర్లో రావత్తో పాటు ప్రయాణిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారిలో లఖ్వీందర్ ఉన్నారు. హరియాణాలోని పంచకులకు చెందిన లఖ్వీందర్ గతంలో కశ్మీర్లో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలో, చైనాతో సరిహద్దు వెంట ఆర్మీ బ్రిగేడ్కు నేతృత్వం వహించారు. కజక్స్తాన్లో భారత సైనిక బృందంలో పనిచేశారు. సేనా మెడల్, విశిష్ట్ సేవా మెడల్ ఆయనను వరించాయి. త్రివిధ దళాల విధుల్లో విశేష అనుభవముంది. దాంతో రావత్కు సహాయక సిబ్బందిలో డిఫెన్స్ అసిస్టెంట్గా నియమితులయ్యారు. సెకండ్ జనరేషన్ ఆర్మీ ఆఫీసర్గా ఉన్న ఆయనకు త్వరలోనే మేజర్ జనరల్ పదవిని కట్టబెట్టనున్నారు. ప్రమోషన్ జాబితాలో ఉన్న ఆయన ఆ పదోన్నతి పొందకుండానే వీరమరణం పొందారు. లఖ్వీందర్కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. (చదవండి: బెంగళూరు ఆస్పత్రికి వరుణ్ తరలింపు.. 48 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం) విహార యాత్రకు తీసుకెళ్తామన్నారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన హవాల్దార్ సత్పాల్ రాయ్ సొంతూరు పశ్చిమబెంగాల్లోని డార్జిలింగ్ జిల్లా తక్దాలో విషాదం అలుముకుంది. రాయ్కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సైన్యంలో పనిచేస్తున్నారు. ‘చివరిసారిగా దీపావళికి వచ్చారు. ఏప్రిల్లో వస్తానని మాట ఇచ్చారు. అందర్నీ విహారయాత్రకు తీసుకెళ్తానన్నారు. ఇంతలో ఘోరం జరిగింది’ అని రాయ్ భార్య కన్నీటిపర్యంతమయ్యారు. మరోవైపు, ప్రమాదంలో మరణించిన కో–పైలట్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ అంత్యక్రియల ఏర్పాట్లు రాజస్తాన్లోని సొంతూరు ఘర్దానా ఖుర్ద్లో మొదలయ్యాయి. కాగా, లెఫ్టినెంట్ కల్నల్ హర్జిందర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనున్నాయి. (చదవండి: సాయి తేజ చివరి మాటలు: ‘‘పాప దర్శిని ఏం చేస్తోంది.. బాబు స్కూల్కు వెళ్లాడా’’) 31 ఏళ్ల తర్వాత రాఖీ కట్టారు ఒక సోదరి ముంబైలో ఉండటంతో ఇన్నాళ్లూ కుదరక, ఎట్టకేలకు ముగ్గురు అక్కలతో కలసి 31 ఏళ్ల తర్వాత ఇటీవల రాఖీ పండుగ జరుపుకున్న తన కుమారుడు ఇప్పుడు లేడని, హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన వింగ్ కమాండర్ పృథ్వీ సింగ్ చౌహాన్ తండ్రి వాపోయారు. ఐదుగురు సంతానంలో ఇతనే చిన్నవాడని పృథ్వీ జ్ఞాపకాలను ఆయన గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన పృథ్వీ కుటుంబం ప్రస్తుతం ఆగ్రాలో నివసిస్తోంది. పృథ్వీ 2000లో హైదరాబాద్లో భారత వాయుసేనలో చేరారు. -
శ్రేయా ఘోషల్కు క్షమాపణలు చెప్పిన టాప్ హీరోయిన్
బాలీవుడ్ సినిమా 'ఆత్రంగి రే'లోని ఫస్ట్సాంగ్ ‘చకా చక్’ పాట ఇప్పటికే యూట్యూబ్ను షేక్ చేస్తుంది. ఈ పాటలో సారా అలీ ఖాన్ గ్రీన్, పింక్ కాంబినేషన్ ఉన్న చీర ధరించి మంచి స్టెప్పులేస్తూ అదరగొట్టారు. తాజాగా ఆమె ఒక ఇంటర్య్వూలో పాల్గొన్నారు. అక్కడ 'ఆత్రంగి రే' సినిమాలోని ‘చకా చక్’ పాటను పాడి అక్కడి వారిలో మరింత జోష్ను నింపారు. నిజానికి ఈ సినిమాలో చకాచక్ పాటను శ్రేయా ఘోషల్ పాడారు. దీంతో సారా అలీఖాన్ పాటను పాడిన తర్వాత.. శ్రేయా ఘోషల్కి నవ్వుతూ.. క్షమాపణలు తెలిపారు. మీ అంత బాగా పాడలేకపోతున్నా.. అంటూ చమత్కరించారు. మరో ప్రమోషన్ కార్యక్రమంలోనూ సారా అలీఖాన్ ఎంతో జోష్గా పాల్గొన్నారు. ఫ్యాన్స్ కోరిక మీద పాట పాడుతూ స్టెప్పులతో అదరగొట్టారు. కాగా ఈ సినిమాలో ధనుష్, అజయ్ దేవ్గణ్ నటించాడు. ఎఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. 'ఆత్రంగి రే' చిత్రం డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్స్టార్లో విడుదల కానుంది. చదవండి: ఆకట్టుకుంటున్న నాగశౌర్య ‘లక్ష్య’ మూవీ ట్రైలర్ -
భీమవరంలో ‘అనుభవించు రాజా’ టీం సందడి
భీమవరం (ప్రకాశంచౌక్): ఈ నెల 26న విడుదలవుతున్న ‘అనుభవించు రాజా’ సినిమాను ఓటీటీలో కాకుండా థియేటర్లో చూసి ఆదరించాలని సినిమా హీరో రాజ్ తరుణ్ కోరాడు. సినిమా ప్రమోషన్ లో భాగంగా శుక్రవారం చిత్ర యూనిట్ భీమవరం వచ్చింది. ముందుగా ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో చిత్ర యూనిట్ విద్యార్థులతో ముచ్చటించింది. అనంతరం క్లాస్మో క్లబ్ లో జరిగిన సమావేశంలో హీరో మాట్లాడుతూ అనుభవించు రాజా సినిమా చక్కని ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులకు 100% వినోదాన్ని పంచుతుందన్నారు. సినిమా చిత్రీకరణ కూడా భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో జరిగిందని చెప్పారు. చదవండి: Bigg Boss Telugu 5: ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినా సన్నీనే ఎలిమినేట్ అవుతాడు! -
AP: గ్రామ,వార్డు మహిళా పోలీసులకు వరం.. సీఐ వరకు పదోన్నతి..!
సాక్షి, అమరావతి: గ్రామ/వార్డు మహిళా పోలీసుల ఉద్యోగాలను త్వరలో క్రమబద్ధీకరించనున్న నేపథ్యంలో ప్రభుత్వం మరింత ప్రోత్సహించనుంది. క్షేత్రస్థాయిలో మహిళల రక్షణ కోసం కీలకంగా వ్యవహరించే మహిళా పోలీసులకు పదోన్నతులు కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకోసం ముసాయిదా బిల్లును రూపొందించింది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. పోలీసు శాఖలో ప్రత్యేక వ్యవస్థగా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్కు వచ్చేందుకు మహిళలు వెనుకంజ వేస్తున్నందున వారి సమస్యలను స్థానికంగానే గుర్తించి పరిష్కరించేందుకు గ్రామ/వార్డు సచివాలయాల్లో దాదాపు 15వేలమంది మహిళా పోలీసులను నియమించారు. వారికి కానిస్టేబుల్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసింది. వారి సర్వీసులను ప్రభుత్వం త్వరలోనే క్రమబద్ధీకరించనుంది. అందుకోసం రాతపరీక్ష, ప్రాజెక్టు వర్క్లు ఇప్పటికే పూర్తి చేసింది కూడా. ప్రస్తుతం మహిళా పోలీసులు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్నారు. మహిళా పోలీసులకు కానిస్టేబుల్ హోదా ఇవ్వడంతో ఇప్పటికే వారు హోం శాఖ పరిధిలోకి వస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ వారి హాజరు, సెలవుల మంజూరు, జీతాల చెల్లింపు అంశాలు సంబంధిత మున్సిపాలిటీలు/ పంచాయతీల పరిధిలోనే ఉన్నాయి. దాంతో క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు వస్తున్నాయని ప్రభుత్వం గుర్తించింది. మరోవైపు సాధారణ పోలీసుల ఎంపిక ప్రక్రియ నిబంధనలు ప్రత్యేకంగా ఉన్నాయి. కానీ సామాన్యులతో మమేకం అయ్యేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహిళా పోలీసుల ఎంపిక ప్రక్రియ వేరేగా ఉంది. దాంతో సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా మహిళా పోలీసుల సర్వీసులను క్రమబద్ధీకరించాల్సి ఉంది. అందుకోసం సాధారణ పోలీసులుగా కాకుండా మహిళా పోలీసులను ప్రత్యేక వ్యవస్థగా ఏర్పాటు చేయనుంది. సాధారణ పోలీసులకు సమాంతరంగా మహిళా పోలీసు వ్యవస్థ ఉండనుంది. పదోన్నతి అవకాశాలు కూడా.. ►మహిళా పోలీసులకు పదోన్నతులపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ప్రస్తుతం వార్డు/ గ్రామ సచివాలయం పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులకు పదోన్నతుల కోసం ‘హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సీఐ’ పోస్టులను ఏర్పాటు చేస్తారు. ►పట్టణ ప్రాంతాల్లో అయితే కొన్ని వార్డులకు, గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ ఉంటారు. ►పోలీస్ సర్కిల్ స్థాయిలో మహిళా ఏఎస్ఐ ఉంటారు. ►పోలీస్ సబ్–డివిజన్ స్థాయిలో మహిళా ఎస్ఐ ఉంటారు. ►పోలీస్ జిల్లాస్థాయిలో మహిళా సీఐ ఉంటారు. ఈ పదోన్నతుల అంశంపై మరింతగా సమీక్షించి హోం శాఖ తుది ముసాయిదాను ఖరారు చేయనుంది. అనంతరం బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించాలన్నది ప్రభుత్వం భావిస్తోంది. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లకు దారి చూపండి.. సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: ఏళ్లుగా ప్రధాన స్రవంతికి దూరంగా ఉండిపోయినా వారికి... రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రిజర్వేషన్లు రూపంలో సమాన అవకాశాలు కల్పించాలని చూస్తున్నామని, దీనికి తగిన దారి చూపించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. పదోన్నతుల సమయంలో ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్రాలు, కేంద్రానికి కచ్చితమైన మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లపై జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కేంద్రం తరఫు అటార్నీ జనరల్ వాదనలు వినిపిస్తూ... పదోన్నతుల్లో రిజర్వేషన్లపై తగిన మార్గదర్శకాలు రూపొందించకపోతే సమస్యలు తీవ్రం అవుతాయని, ఎప్పటికీ ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని తెలిపారు. చదవండి: (గుడ్ న్యూస్: విదేశీ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా) ‘‘పదోన్నతులు మెరిట్ ఆధారంగా తప్ప భర్తీ చేయడం లేదు. కానీ ఏళ్ల తరబడి ఓ వర్గం వెనకబడిపోయింది. దేశప్రయోజనాలు, రాజ్యాంగ ప్రయోజనాల దృష్ట్యా సమానత్వం తీసుకురావాలి. దామాషా ప్రాతినిధ్యంతోనే సమానత్వం వస్తుంది’’ అని వేణుగోపాల్ తెలిపారు. పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ఓ సూత్రం కావాలని, ఒక వేళ నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేస్తే సమస్య మళ్లీ మొదటికి వస్తుందని వేణుగోపాల్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు రిజర్వు చేసింది. -
డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్పై ట్రోలింగ్
Regina Cassandra Trolled For Promoting Whiskey: సాధారణంగా సెలబ్రిటీలు ఓవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు యాడ్స్ చేస్తూ రెండు వైపులా సంపాదిస్తుంటారు. అయితే ఒక్కోసారి వాళ్లు చేసే ప్రమోషన్స్ వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా హీరోయిన్ రెజీనా కసాండ్రాకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఓ కంపెనీ అల్కహాల్ను ప్రమోట్ చేస్తూ చేతిలో మందు గ్లాసు పట్టుకొని స్టైల్గా ఫోజిచ్చిన రెజీనా ఇన్స్టా పోస్ట్పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా అంటూ ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. మధ్యపానం అనారోగ్యమని తెలిసినా డబ్బుల కోసం ఇలా ప్రమోట్ చేస్తారా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో నెటిజన్ అయితే.. ఈ ఫోటో చూశాక మీ మీద గౌరవం పోయింది. ఇప్పుడే మిమ్మల్ని అన్ఫాలో అవుతున్నాను అంటూ కామెంట్ చేశారు. ఇక ఇటీవలె పొగాకు బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్నందుకు అమితాబ్పై విమర్శలు రావడంతో ఆ యాడ్ నుంచి ఆయన తప్పుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Regina Cassandra (@reginaacassandraa) -
ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
-
ఏపీలో 40 మంది డీఎస్పీలకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో 40 మంది డీఎస్పీ (సివిల్)లకు అదనపు ఎస్పీ (సివిల్)లుగా రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. 2012 బ్యాచ్కు చెందిన ఈ డీఎస్పీల పదోన్నతుల అంశం ఐదేళ్లుగా పెండింగ్లో ఉంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో డీఎస్పీలు ఈ విషయం గురించి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 40 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పించాలని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీని నియమించింది. ఆ కమిటీ సిఫార్సు మేరకు పదోన్నతి కల్పించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంశంపై కోర్టులో లేదా ట్రిబ్యునల్లో ఏవైనా కేసులు పెండింగ్లో ఉంటే.. వాటిపై తీర్పుకు లోబడి ఈ ఉత్తర్వులు అమలు చేస్తామని పేర్కొన్నారు. అదనపు ఎస్పీలుగా పదోన్నతి పొందిన డీఎస్పీలు వీరే.. సి.జయరాంరాజు, ఇ.నాగేంద్రుడు, జి.వెంకటేశ్వరరావు, ఏవీ సుబ్బరాజు, కె.శ్రీలక్ష్మి, జి.రామకృష్ణ, ఆర్.రమణ, ఎ.శ్రీనివాసరావు, లింగాల అజయ్ప్రసాద్, ఏవీఆర్ పీవీ ప్రసాద్, బి.నాగభూషణరావు, పి.మహేశ్, జి.స్వరూపరాణి, టి.ప్రభాకర్ బాబు, జేవీ సంతోష్, నడికొండ వెంకట రామాంజనేయులు, డి.శ్రీ భవానీ హర్ష, డి.సూర్య శ్రావణకుమార్, వీబీ రాజ్ కమల్, కె.శ్రావణి, ఎం.చిదానందరెడ్డి, దిలీప్ కిరణ్ వండ్రు, కె.నాగేశ్వరరావు, అనిల్ కుమార్ పులపాటి, కె.సుప్రజ, జి.వెంకట రాముడు, హస్మా ఫరీణ్, పి.సౌమ్యలత, బి.విజయభాస్కర్, డి.ప్రసాద్, జె.కులశేఖర్, కె.శ్రీనివాసరావు, పూజిత నీలం, ఎం.స్నేహిత, జె.వెంకట్రావ్, సీహెచ్ సౌజన్య, ఏటీవీ రవికుమార్, మహేంద్ర మాతే, ఎ.రాజేంద్ర, బి.శ్రీనివాసరావు. -
Telangana:రెండేళ్ల సర్వీసుకే పదోన్నతుల గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు అవసరమైన కనీస సర్వీసు కాలాన్ని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల గడువు మంగళవారంతో ముగియనుంది. దీంతో తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు ఈ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 31తో ముగియనున్న 2020–21 పదోన్నతుల ప్యానెల్ ఈయర్ కోసం మాత్రమే ఈ అవకాశం కల్పించారు. అయితే తాజా నిర్ణయంతో ప్యానెల్ ఇయర్తో సంబంధం లేకుండా తదుపరి ఆదేశాలు జారీ వరకు ఈ వెసులుబాటు అమలు కానుంది. ఈ నిర్ణయాన్ని తెలంగాణ గ్రూప్–1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ స్వాగతించారు. -
సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం తొమ్మిది మంది పేర్లను కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ తొమ్మిది మందిలో ముగ్గురు మహిళలు, బార్ నుంచి ఒకరు ఉన్నారు. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్, సిక్కిం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీటీ రవికుమార్, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎం సుందరేశ్, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న, గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి బేలా త్రివేది, బార్ నుంచి సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. వీరిలో జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ బీవీ నాగరత్న, సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కానున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ ఏఎం ఖాన్వీల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన కొలీజియం మంగళవారం సమావేశమైంది. కొలీజియం చేసిన సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. ఈ సిఫార్సులను బుధవారం రాత్రి అధికారికంగా సుప్రీంకోర్టు వెబ్సైట్లో పొందుపర్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి 21 నెలల తర్వాత కొలీజియం సమావేశమైంది. సుప్రీంకోర్టులో 34 మంది న్యాయమూర్తులకు గాను ప్రస్తుతం 25 మంది ఉన్నారు. బుధవారం జస్టిస్ నవీన్ సిన్హా పదవీ విరమణ చేయడంతో ఖాళీల సంఖ్య 10కి చేరింది. కొలీజియం సిఫార్సులను రాష్ట్రపతి ఆమోదిస్తే న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుతుంది. మొదటిసారి ముగ్గురు మహిళలు ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందుతుండడం ఇదే తొలిసారి. వీరి నియామకం తర్వాత సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తుల సంఖ్య నాలుగుకు చేరనుంది. ప్రస్తుతం జస్టిస్ ఇందిరా బెనర్జీ ఒక్కరే ఉన్నారు. 1950లో సుప్రీంకోర్టు ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా కేవలం ఎనిమిది మంది మాత్రమే మహిళా న్యాయమూర్తులు నియమితులయ్యారు. 1989లో ఫాతిమా బీవీ సుప్రీంకోర్టులో నియమితురాలైన తొలి మహిళా న్యాయమూర్తిగా రికార్డులకెక్కారు. కాబోయే తొలి మహిళా సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా(సీజేఐ) తొలిసారిగా ఒక మహిళా న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీ నాగరత్న 2027లో సీజేఐ కానున్నారు. ఆమె 1987లో బెంగళూరులో న్యాయవాద వృత్తి ప్రారంభించారు. కాన్స్టిట్యూషనల్ లా, కమర్షియల్ లా, బీమా, సేవలు, కుటుంబ చట్టాలు, ఆర్బిట్రేషన్లకు సంబంధించి కేసుల్లో మంచి పేరు సంపాదించారు. కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా 2008 ఫిబ్రవరి 18న నియమితులైన జస్టిస్ బీవీ నాగరత్న 2010 ఫిబ్రవరి 17న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1989లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ ఎనగలగుప్పే వెంకటరామయ్య కుమార్తె జస్టిస్ బీవీ నాగరత్న. ‘‘ఏదైనా బ్రాడ్కాస్టింగ్ చానల్ నిజాయితీగా వార్తలు ప్రసారం చేయాలని భావించినప్పుడు ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్లతో సంచలనాలను నిలిపివేయాలి’’ అని 2012లో ఓ కేసు విషయంలో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యానించారు. బార్ నుంచి తొమ్మిదో న్యాయవాది కొలీజియం సిఫార్సు చేసిన సీనియర్ న్యాయవాది పీఎస్ నరసింహ బార్ నుంచి న్యాయమూర్తి అవుతున్న తొమ్మిదో వారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా బార్ నుంచి నియమితులైన వారే. కృష్ణా జిల్లా గణపవరానికి చెందిన ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.కోదండరామయ్య కుమారుడు పీఎస్ నరసింహ. ఆయన హైదరాబాద్లో పుట్టి పెరిగారు. విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేశారు. యూపీఏ–2 ప్రభుత్వ హయాంలో అదనపు సొలిసిటర్ జనరల్గా నియమితులైన ఆయన పదవీ కాలం పూర్తికాక ముందే రాజీనామా చేశారు. అయోధ్య కేసులో రాంలల్లా విరాజ్మాన్కు ప్రాతినిధ్యం వహిస్తూ మహంత్ రామచంద్రదాస్ తరఫున పీఎస్ నరసింహ వాదనలు వినిపించారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యుడిగా సేవలందిస్తున్నారు. బీసీసీఐ కార్యకలాపాల్లో భారీ మార్పులకు అమికస్ క్యూరీగా సేవలందించారు. బార్ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి న్యాయవాది జస్టిస్ ఎస్.ఎం.సిక్రీ కూడా 13వ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఇటీవల పదవీ విరమణ చేసిన జస్టిస్ రోహింటన్ ఫాలీ నారీమన్ కూడా 2014లో బార్ నుంచి సుప్రీం కోర్టు న్యాయయూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ఉన్న జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ లావు నాగేశ్వరరావు కూడా బార్ నుంచి నియమితులైన వారే. నాలుగో తరం న్యాయవాది తమ పూర్వీకుల పరంపరను కొనసాగిస్తూ నాలుగో తరంలో న్యాయవాది వృత్తి చేపట్టారు జస్టిస్ విక్రమ్నాథ్. గుజరాత్లోని కౌశంబి జిల్లాకు చెందిన ఆయన అలహాబాద్ హైకోర్టులో 17 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2004లో అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 సెప్టెంబరు 10న గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. గతంలో ఒకసారి సుప్రీంకోర్టు కొలీజియం ఆయన పేరును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదు. కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో ఆన్లైన్ ద్వారా కోర్టు కార్యకలాపాలు చేపట్టి లైవ్ స్ట్రీమ్కు జస్టిస్ విక్రమ్ నాథ్ నాంది పలికారు. జస్టిస్ హిమా కోహ్లి ప్రస్థానం జస్టిస్ హిమా కోహ్లి 1959 సెప్టెంబర్ 2న ఢిల్లీలో జన్మించారు. 1984లో ఢిల్లీ బార్ కౌన్సిల్ సభ్యురాలయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1999 నుంచి 2004 వరకూ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ న్యాయవాదిగా పనిచేశారు. ఢిల్లీ ప్రభుత్వ న్యాయవాదిగా సేవలందించారు. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి సహా పలు విభాగాలకు న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయ సేవల కమిటీలో పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ హిమా కోహ్లి 2007 ఆగస్టు 29న న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2021 జనవరి 7న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పోందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైతే 2024 సెప్టెంబర్ వరకు సేవలు అందించనున్నారు. -
సీఎం జగన్ మా పాలిట దైవం: ఎంపీడీఓ భావోద్వేగం
‘‘25 ఏళ్లుగా ఎంపీడీఓగా పనిచేస్తున్నా.. ఇప్పటివరకూ ఉద్యోగోన్నతి లేదు. ప్రమోషన్ సాధించాలనేది మా ఎంపీడీఓల కల. ఆ కలను సాకారం చేసిన దేవుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి’’ అంటూ గుంటూరు జిల్లా దాచేపల్లి ఎంపీడీఓ వై.మహాలక్ష్మి భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం ఎంపీడీఓల ఉద్యోగోన్నతికి గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో మహాలక్ష్మీకి కూడా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా దాచేపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రెండుచేతులూ జోడించి నమస్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీలు కటకం బ్రహ్మనాయుడు, కందుల జాను, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మూలగొండ్ల ప్రకాశ్రెడ్డి, ఈఓపీఆర్డీ మంగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ జాకీర్హుస్సేన్, మునగా పున్నారావు తదితరులు పాల్గొన్నారు. - దాచేపల్లి -
సెకండియర్కు ప్రమోట్ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా విద్యాసంవత్సరాన్ని నష్టపోయిన 2019 బ్యాచ్ మెడికల్ విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్ చేసి బ్యాక్లాగ్స్ రాసుకునే అవకాశం కల్పించాలని ఏపీ మెడికల్ విద్యార్థుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కోరారు. ఈ మేరకు ఏపీకి చెందిన బాధిత విద్యార్థులు, తల్లిదండ్రుల బృందం ఢిల్లీలోని నేషనల్ మెడికల్ కమిషన్కు విజ్ఞప్తి చేసింది. శనివారం మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు అండర్ గ్రాడ్యుయేట్ విభాగం ప్రెసిడెంట్ అరుణ వానికర్ను కలిసిన ఈ బృందం కోవిడ్ కారణంగా 2019 మెడికల్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జరిగిన నష్టాన్ని వివరించింది. జాతీయస్థాయిలో నీట్ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు మొదటి సంవత్సర పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కష్టతరం కాదని తూతిక శ్రీనివాస విశ్వనాథ్ అన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ పరంగా, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పరంగా తీసుకున్న విధానపరమైన లోపాల కారణంగా విద్యార్థులు నష్టపోయారని చెప్పారు. పరీక్షా పేపర్ సెట్టింగ్ విధానంలో వర్సిటీ చేసిన తప్పు కారణంగా విద్యార్థులు 20 మార్కులు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. కోవిడ్ కారణంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల నష్టపోయిన విద్యార్థులందరికీ న్యాయం జరగాలంటే విద్యార్థులను రెండో సంవత్సరానికి ప్రమోట్ చేసి బ్యాక్లాగ్స్ రాసుకోవడానికి అవకాశం కల్పించాలని కోరారు. లేదా కరోనా ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని గ్రేస్ మార్కులను కలిపి విద్యార్థులను పాస్ చేయాలని బోర్డు ప్రెసిడెంట్ అరుణ వానికర్కు, ప్రధాని కార్యాలయంలో, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయంలో లేఖ అందించారు. -
వాఫీ డే .. ప్రత్యేకత ఏంటో తెలుసా ?
హైదరాబాద్: పెద్దలు కాఫీలను ఇష్టపడితే చిన్న పిల్లలు వాఫీలను ఇష్టపడుతారు. అందుకే ప్రతీ ఏడు జులై 3న వాఫీ డేను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డ్యూక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరంలో వాఫీ డే వేడుకలు నిర్వహించారు. వాఫీ రుచులను ప్రతిబింబించేలా పలు కార్యక్రమాలను చేపట్టింది. క్షేత్రస్థాయిలో కార్యక్రమాలతోపాటు డిజిటల్ , రేడియో మాధ్యమాల ద్వారా వాఫీ డే ప్రచారాన్ని డ్యూక్ నిర్వహిస్తోంది. వాఫీ డే స్పెషల్ డ్యూక్స్ బ్రాండ్ బిస్కట్స్.. మొదటిసారిగా 1999 జూలై 3న వాఫీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. బేకరీ ఐటమ్స్ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న వాటిలో వాఫీ కూడా ఒకటిగా నిలిచింది. అందుకే వాఫీ మార్కెట్లోకి వచ్చిన రోజును ‘వాఫీ డే’గా జరుపుతున్నారు. 9 రుచుల్లో డ్యూక్స్ వాఫీ 9 రకాల రుచుల్లో లభిస్తోంది. క్రీమ్తో నిండిన వాఫీలు చిరువేడుకల్లో, ప్రయాణాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎఫ్పీఎల్) ఆధ్వర్యంలో డ్యూక్స్ బ్రాండ్ పేరుతో వాఫీలు ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆదరాభిమానాలు అందుకుంటోంది. -
దిశ యాప్ డౌన్లోడ్ ఇలా..
మహిళల భద్రత విషయంలో ఏపీ సర్కారు కట్టుదిట్టమైన చర్యలకు సిద్ధమైంది. హామీలు ఇవ్వడం, పథకాలు ప్రారంభించడంతోనే కాదు వాటిని పక్కాగా అమలు చేయడంలో అదే అంకిత భావం చూపిస్తోంది. అందుకు దిశ యాప్ ప్రమోషనల్ కార్యక్రమం మరో ఉదాహరణ. అమరావతి: ఏపిలో దిశ చట్టం అమల్లోకి తేవడంతో పాటు దిశ యాప్ని కూడా రూపొందించారు. 2020 ఫిబ్రవరిలో ఈ యాప్ను ఆండ్రాయిడ్, ఆపిల్ ఫోన్లలలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ యాప్ ద్వారా వచ్చిన కాల్స్, మేసేజ్లకు సంబంధించి ఇప్పటి వరకు 850 పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఇందులో 160 సందర్భాల్లో ఎప్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇంచుమించు వెయ్యి మంది మహిళలు, అమ్మాయిలను ప్రమాదాల బారి నుంచి దిశ యాప్ రక్షించింది. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ యాప్ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో స్వయంగా సీఎం జగన్ దిశ యాప్ అవగాహన సదస్సులో పాల్గొని ప్రతీ ఒక్క మహిళ చేత ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. డౌన్లోడ్ ఇలా ► ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో ప్లే స్టోర్, ఆప్ స్టోర్ నుంచి దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ► యాప్ డౌన్లోడ్ పూర్తైన తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయగానే ఓటీపీ నంబర్ వస్తుంది ► ఓటీపీ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత.. పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, ప్రత్యామ్నాయ నంబరు, అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కాంటాక్ట్ నంబర్లు తదితర వివరాలు నమోదు చేయాలి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ► అక్కాచెల్లెమ్మలు ఆపదలో ఉన్నామని భావించిన వెంటనే దిశ యాప్లో ఉన్న అత్యవసర సహాయం (SOS) బటన్ నొక్కితే వారి ఫోన్ నంబరు, చిరునామా, వారున్న లోకేషన్తో సహా వారి వాయిస్తో పాటు 10 సెకన్ల వీడియో రికార్డ్ చేసి దిశ కమాండ్ కంట్రోల్ రూమ్కి పంపేలా దిశ యాప్కి రూపకల్పన చేశారు. ► అక్కాచెల్లెమ్మల నుంచి అలెర్ట్ రాగానే కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది అప్రమత్తమై సమీప పోలీస్ స్టేషన్కి సమాచారం చేరవేస్తారు. పోలీసులు తక్షణం అక్కడికి చేరుకుని వారికి రక్షణ కల్పిస్తారు. దిశతో ప్రయోజనాలు ► యువతులు, మహిళలు ఆపదలో ఉన్నామని భావించినప్పుడు పోలీసులతో పాటు ఐదుగురు కుటుంబ సభ్యులు, స్నేహితులకు సమాచారం ఇచ్చే వెసులుబాటు ► ప్రయాణ సమయంలో రక్షణ, మార్గ నిర్దేశం కోసం ‘ట్రాక్ మై ట్రావెల్’ ఆప్షన్ ఏర్పాటు. ఈ ఆప్షన్లో తాము చేరాల్సిన గమ్యస్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్ జరుగుతుంది. ప్రయాణిస్తున్న వాహనం దారి తప్పితే వెంటనే ఆ సమాచారాన్ని దిశ కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు బంధు మిత్రులకు చేరవేస్తుంది. ► దిశ యాప్లో 100, 112 వంటి అత్యవసర నంబర్లతో పాటు సమీపంలోని పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, మెటర్నిటీ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, ట్రామాకేర్ సెంటర్లు, మెడికల్ షాపుల వివరాలు కూడా ఉంటాయి. ► కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పుష్ బటన్ ఆప్షన్ ద్వారా పోలీసులు ఏకకాలంలో దిశ యాప్ ఉపయోగించే వారందరికి సలహాలు, సూచనలు ఇస్తూ జరగబోయే ప్రమాదాలను నివారిస్తారు ► విపత్కర పరిస్థితుల్లో దిశ యాప్ ఓపెన్ చేసేందుకు తగిన సమయం లేకపోతే ఫోన్ను గట్టిగా అటుఇటూ ఊపితే చాలు .. యాప్ ద్వారా పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఆపద సందేశం చేరుతుంది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ఫోన్కి కాల్ చేసి వివరాలు సేకరిస్తారు. పోలీసుల ఫోన్కి ఎవరూ స్పందించకపోతే పోలీస్ వెహికల్స్లో అమర్చిన మొబైల్ డేటా టెర్మినల్ సహాయంతో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బాధితులు ఉన్న లోకేషన్కి పోలీసులు వేగంగా చేరుకునేలా ఏర్పాటు. దిశ యాప్ లింక్: https://play.google.com/store/apps/details?id=com.likhatech.disha చదవండి : ప్రతి మహిళతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించాలి: సీఎం జగన్ -
ఈమె మా అమ్మ
మధుప్రియ పేదింటి అమ్మాయి. కష్టపడి చదివింది. సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడిక ప్రమోషన్ కూడా వచ్చింది. ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంటుందని చుట్టుపక్కల అందరికీ తెలుసు. అయితే ప్రియకు తన తల్లి గురించి ఈమధ్యే .. అదీ నాన్న చెబితే.. ఒక నిజం తెలిసింది. అంత నిజం తెలిశాక మధుప్రియ ఊరుకుంటుందా? ‘చూడండి ఈ తల్లి కూతుర్నే నేను..’ అని లోకానికి చెప్పడం కోసమే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చుని తక్కెడ పట్టుకుంది. ఇంతకీ ప్రియకు తెలిసిన నిజం ఏమిటి? మధుప్రియకు పెద్ద ప్రమోషనే వచ్చింది. గత రెండేళ్లుగా చెన్నైలోని ఎఫ్.పి.ఎస్. ఇన్నొవేషన్స్ ల్యాబ్లో సీనియర్ హ్యూమన్ రిసోర్స్ అసోసియేట్గా పని చేస్తున్న ఈ అమ్మాయి ఇప్పుడు అదే కంపెనీకి అసోసియేట్ మేనేజర్ అయింది. యూఎస్ కంపెనీ అది. పెద్ద జీతం. ఇక ప్రమోషన్ అంటే ఇంకా పెద్ద జీతం. మధుప్రియ ఇంట్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆడపిల్లలెవరూ లేరు. తనే మొదటి అమ్మాయి. డిగ్రీ చదువుతుండగానే క్యాపస్ ప్లేస్మెంట్స్లో సెలక్ట్ అయింది. ఎఫ్.పి.ఎస్. (ఫుల్ పొటెన్షియల్ సొల్యూషన్స్) లోనే. సాఫ్ట్వేర్ కంపెనీ అది. అయితే ఇప్పుడొచ్చిన ప్రమోషన్ కన్నా పెద్ద ప్రమోషన్ ఆమె జీవితంలో మరొకటి ఉంది. ‘‘ఈమె మా అమ్మ’’ అని గర్వంగా చెప్పుకోవడమే ఆమె తనకు తను ఇచ్చుకున్న ప్రమోషన్. ప్రియ తల్లి కూరగాయలు అమ్ముతుంది. తండ్రికి చిన్న ఉద్యోగం. వాళ్లిద్దరి రోజువారి సంపాదనను బట్టి చూస్తే ప్రియ పేదింటి అమ్మాయే. కష్టపడి చదివింది. మంచి ఉద్యోగం సంపాదించింది. ఇందులో విశేషం ఏమీ లేదు. ‘‘ఇప్పుడు నేను సాధించిన ప్రమోషన్లో కూడా విశేషం లేదు’’ అంటోంది ప్రియ! అలా ఆమె అనడానికి ఓ కారణం ఉంది. ఆ కారణం కూడా తండ్రి చెబితేనే ఆమెకు తెలిసింది. చిన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్కి తండ్రి వెళ్లేవాడు. తల్లి ఆలస్యంగా వెళ్లేది! ఆలస్యంగా అంటే.. మీటింగ్ అయిపోయాక. ఎప్పుడూ అంతే. ‘‘ఎందుకమ్మా ఆలస్యంగా వస్తావ్’’ అని ప్రియ అడిగేది. ‘‘ఇప్పటికి పనైందమ్మా’’అని తల్లి చెప్పేది. అయితే.. తన బిడ్డ కూరగాయలమ్మే ఆమె కూతురు అని తక్కిన పిల్లలకు తెలియకుండా ఉండటం కోసం ఆమె కావాలని ఆలస్యంగా చేసేదని తండ్రి చెప్పినప్పుడు ప్రియ కళ్ల వెంబడి నీళ్లు తిరగాయి. వెళ్లి తల్లిని కావలించుకుంది. అక్కడితో ఆగలేదు. ‘ఈమె మా అమ్మ’ అని చెప్పాడానికే అన్నట్లు.. వెళ్లి అమ్మ పక్కన కూర్చొని తక్కెడ పట్టుకుంది. ప్రమోషన్ వచ్చి ఇప్పుడు పెద్ద మేనేజర్ అయినా కూడా అమ్మతో కలిసి కాసేపైనా కూరగాయలు అమ్ముతుంది! ఈ అమ్మ కూతుర్నని చెప్పుకోవడాన్ని మించిన ప్రమోషన్ ఏముంటుంది అని నవ్వుతుంది. ‘‘ఈ ప్రమోషన్ మా అమ్మకే అంకితం’’ అంటోంది. ∙ -
పోస్టుల్లేకపోయినా పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా మండలిలో పదోన్నతులు వివాదాస్పదమవుతున్నాయి. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు అవసరమైన పోస్టులు లేవని, వారు పని చేస్తున్న పోస్టులనే అప్గ్రేడ్ చేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉన్నత విద్యా మండలికి చెందిన పాలక మండలి ఆమోదం కానీ, అటు ప్రభుత్వ ఆమోదం తీసుకోకుండానే ఇష్టానుసారంగా పదోన్నతులు కల్పించారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 12 మందికి పదోన్నతులు మండలిలో జాయింట్ సెక్రటరీ పోస్టు లేకపోయినా ప్రస్తుతం పనిచేస్తున్న డిప్యూటీ సెక్రటరీకి జాయింట్ సెక్రటరీ స్థాయిలో పదోన్నతి కల్పించి, ఆయనకు ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు కట్టబెట్టారని, అది నిబంధనలకు విరుద్ధమనే వాదనలు విన్పిస్తున్నాయి. అలాగే మండలిలో ప్రస్తుతం ఒకటే అసిస్టెంట్ సెక్రటరీ పోస్టు ఉంది. దానికి తోడు మరొక పోస్టును అసిస్టెంట్ సెక్రటరీ పోస్టుగా అప్గ్రేడ్ చేసి ఆ పోస్టుల్లో ఇద్దరికి పదోన్నతులు కల్పించినట్లు తెలిసింది. అలాగే సూపరింటెండెంట్ పోస్టు ఒకటే ఉన్నప్పటికీ, మరో నాలుగు పోస్టులను అప్గ్రేడ్ చేసి మొత్తంగా ఐదుగురికి పదోన్నతులు కల్పించారు. అయితే అందులో ఇద్దరు ఆ పదోన్నతులను తిరస్కరించినట్లు తెలిసింది. ఇలా మొత్తంగా 12 మందికి పదోన్నతులు కల్పించారు. అయితే 1994 ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉన్నత విద్యా మండలి పోస్టుల భర్తీ విధానానికి సంబంధించిన జీవో 51 లో ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు భర్తీ ప్రక్రియ ఉంది. ఆ పోస్టును డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వారికి పదోన్నతి కల్పించి భర్తీ చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు మండలిలో లేదు. దీంతో ఆ పోస్టు జోలికి ఎవరూ వెళ్లలేదు. ఏ పోస్టునూ అప్గ్రేడ్ చేయలేదు: కార్యదర్శి ఈ వ్యవహారంపై ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావును వివరణ కోరగా.. ప్రభుత్వం అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించాలని చెప్పిందన్నారు. అందులో భాగంగానే తాము ఏడేళ్లుగా పనిచేస్తున్న తమ సిబ్బందికి పదోన్నతులు కల్పించామని తెలిపారు. ఏ పోస్టును కూడా ఆప్గ్రేడ్ చేయలేదని, వ్యక్తిగత పదోన్నతులు మాత్రమే ఇచ్చామని చెప్పారు. -
అద్దం ముందు సమంత చేసిన వీడియో వైరల్
ఫ్యాషన్ ఐకాన్గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు క్లోతింగ్ బిజినెస్లోనూ సమంత ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 'సాకి' పేరుతో లాంఛ్ అయిన ఈ క్లోతింగ్ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. దీంతో ఈ దుస్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్మేందుకు సిద్ధమైంది. 'సాకి' ఆన్లైన్ స్టోర్కు విదేశాల నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయిని, దీంతో అమెరికా, సింగపూర్, మలేషియా దేశాలకు వీటిని షిప్పింగ్ చేస్తున్నట్లు సమంత తన ఇన్స్టాగ్రామ్లో పేర్కొంది. దీనికి సంబంధించిన ప్రమోషన్ను ఎప్పటిలాగే కొత్తగా ఆవిష్కరించింది. 'సాకి' బ్రాండ్కు చెందిన దుస్తులను అద్దం ముందు నిలబడి ఒక్కొక్కటిగా మార్చుకుంటూ కెమెరాకు ఫోజిచ్చింది. 'ఇన్స్టా' రీల్తో మరింత అందంగా రూపొందించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఈ వీడియోకు 10 లక్షలకు పైగానే లైక్స్ వచ్చాయి. 'సమంత ఏం చేసినా కొత్తగానే ఉంటుంది..సూపర్భ్ సామ్' అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే సినిమాలో సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ ఇటీవలె గ్రాండ్గా లాంఛ్ అయింది.ఇందులో టైటిల్ రోల్ సమంత పోషిస్తుండగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ కనిపించనున్నారు. 2022లో ఈ సినిమా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) చదవండి :వైరల్: అద్భుతమైన డ్యాన్స్తో అదరగొడుతున్న సమంత ఈ సారి సాయి పల్లవి కాదు మంగ్లీ స్టెప్పులేసింది! -
కాగ్నిజెంట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బోనస్లు, ప్రమోషన్లతో వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది. 2019తో పోలిస్తే ఎక్కువగా తాజా బోనస్ను ప్రకటించింది. అలాగే 24,000 మందికి పైగా ఉద్యోగులను భారీగా ప్రమోట్ చేయనుంది. సంస్థ అట్రిషన్ (కంపెనీల మార్పు) తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా. దేశీయంగా 24వేల మందికి ప్రమోషన్లతో పాటు ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ నంబియార్ ప్రకటించారు. అలాగే సీనియర్ అసోసియేట్స్, అంతకంటే కింది స్థాయి ఉద్యోగులకు ఇకనుంచి ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. 2021 జూన్ త్రైమాసికంనుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షా అరవై వేల మంది ఉద్యోగులకు బోనస్లను ఇవ్వనున్నామని నంబియార్ చెప్పారు. (కాగ్నిజెంట్ తీపికబురు : భారీ ఉద్యోగావకాశాలు) కాగా కాగ్నిజెంట్ డిసెంబర్ 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 4,184 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కరెన్సీపరంగా ఇది వార్షిక ప్రాతిపదికన 3 శాతం క్షీణించింది. భారతదేశంలో 2.9 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. 2020 క్యూ 3 ముగింపు నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,89,500. సంస్థ మొత్తం అట్రిషన్ 19 శాతంగా ఉంది. -
మూడు కాదు.. రెండేళ్లే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతులకు కనీస సర్వీసు వ్యవధిని ప్రభుత్వం మూడేళ్ల నుంచి రెండేళ్లకు తాత్కాలికంగా కుదించింది. ఈ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం సంతకం చేశారు. ఆ వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒక కేటగిరీ/ క్లాస్/ గ్రేడ్ నుంచి మరో కేటగిరీ/ క్లాస్/ గ్రేడ్కు పదోన్నతి, లేదా పదోన్నతి ద్వారా బదిలీ కోసం కనీసం 2 ఏళ్ల సర్వీసు వ్యవధి ఉండాలనే తాత్కాలిక నిబంధన(అడ్హక్ రూల్)ను అమల్లోకి తెస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2020–21 ప్యానెల్ సంవత్సరం ముగిసే వరకు అనగా.. 2021, ఆగస్టు 31 వరకు ఈ తాత్కాలిక నిబంధన అమల్లో ఉంటుందని తెలిపారు. అర్హులైన వ్యక్తులు లేక చాలా వరకు ఖాళీగా ఉన్న పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయలేకపోతున్నామని, అందుకే కనీస సర్వీసు వ్యవధిని మూడేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. త్వరగా నివేదిక ఇవ్వండి.. ఉద్యోగుల వేతన సవరణ నివేదిక(పీఆర్సీ)పై అధ్యయనం, ఉద్యోగ సంఘాలతో చర్చల ప్రక్రియలను సత్వరంగా పూర్తి చేసి తనకు నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. టీఎన్జీవోల సంఘంఅధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, త్రిసభ్య కమిటీ సమక్షంలో సోమవారం ఆయన ప్రగతిభవన్లో పదోన్నతులకు కనీస సర్వీసు వ్యవధిని రెండేళ్లకు కుదిస్తూ సంబంధిత ఫైల్పై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన సీఎస్ సోమేశ్కుమార్కు పలు సూచనలు చేశారు. ఈ నెల మూడో వారంలో వేతన సవరణ, పదవీ విరమణ వయస్సు పెంపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ దగ్గర పడిందని, వీటిపై నివేదిక ఇవ్వాలని కోరారు. నివేదిక వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటానని సీఎం పేర్కొన్నారు. -
మూడు నెలల్లో 76 మంది పిల్లల్ని....
సాక్షి, న్యూఢిల్లీ: తెలిసీ తెలియక, క్షణికావేశంతోను, కుటుంబ సభ్యులు వేధింపులు తట్టుకోలేక చాలామంది పిల్లలు ఇంటినుంచి పారిపోతూ ఉంటారు. అలా తప్పిపోయిన చిన్నారులను, బాలలను తిరిగి తమ ఇంటికి చేర్చిన ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ వారి జీవితాల్లో వెలుగులు నింపారు. దీంతో అటు ఉద్యోగరీత్యా ప్రోత్సాహకాలతోపాటు, విధి నిర్వహణలో ఒక మహిళగా తల్లి మనసు చాటుకున్నారంటూ నెటిజనుల ప్రశంసలుకూడా అందుకున్నారు. తప్పిపోయిన చిన్నారులను, కాపాడినందుకు ఢిల్లీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రోత్సాహక పురస్కారాన్ని అందుకున్నారు. 12 నెలల్లో 76 మంది పిల్లలను కనిపెట్టినందుకుగాను సీమా ధాకా ఔట్-ఆఫ్-టర్న్ ప్రమోషన్ అందుకున్నారు. వారిలో 56 మంది 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. దీంతో అసాధారణ్ కార్యా పురస్కర్ అవార్డుకు సీమాను ఎంపిక చేసినట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న 50లేదా అంతకంటే ఎక్కువమంది పిల్లలను (వీరిలో కనీసం 8 సంవత్సరాల లోపు చిన్నారులండాలి)12 నెలలో వ్యవధిలో రక్షించే ఏ కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్కు ప్రోత్సాహక పథకం కింద అవుట్-టర్న్ ప్రమోషన్ ఇవ్వనున్నట్టు పోలీసు విభాగం ఆగస్టు 7న ప్రకటించింది. దీంతో రికార్డుస్థాయిలో పిల్లలను కాపాడి ఈ పురస్కారాన్ని అందుకోనున్న మొదటి పోలీసుగా సీమా నిలిచారు. దీంతో పాటు ఇతర అదనపు ప్రోత్సాహకాలను మంజూరు చేస్తున్నట్లు ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఎస్.ఎన్. శ్రీవాస్తవ ప్రకటించారు. కేవలం 3 నెలల్లో 56 మంది పిల్లలను కాపాడిన సీమాకు అభినందనలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. కేవలం ఢిల్లీనుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ఈ పిల్లలను రక్షించామని సీమా చెప్పారు.పశ్చిమ బెంగాల్కు చెందిన ఇద్దరు, పంజాబ్లోని హోషియార్పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు, గుర్గావ్, ఘజియాబాద్, నోయిడా, పానిపట్, బిహార్ నుంచి తదితరులను కాపాడినట్టు తెలిపారు. 2018లో ఒక మహిళ తన ఏడేళ్ల కుమారుడి తప్పిపోయిన ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఆ మహిళ తన చిరునామాను, మొబైల్ నంబర్ను మార్చేశారు. దీంతో ఆమెను గుర్తించడం చాలా కష్ట మైందన్నారు. చివరకు 2020 అక్టోబర్లో పశ్చిమ బెంగాల్లోని తల్లి వద్దకు చేర్చినట్టువెల్లడించారు. అలాగే సవతి తండ్రి హింస, వేధింపులను తట్టుకోలేక ఇంటినుంచి పారిపోయిన ఒక బాలుడు తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా లేడంటూ తన అనుభవాలను పంచుకున్నారు సీమా. కాగా సీమా జూలై 3, 2006 న ఢిల్లీలోపోలీసు ఉద్యోగంలో చేరారు. ఆమె 2014 లో పదోన్నతి పొంది హెడ్ కానిస్టేబుల్ అయ్యారు. 2012 వరకు అక్కడే పనిచేసిన ఆమెను 2012 లో బయటి జిల్లాకు, అక్కడి నుంచి రోహిణికి, తరువాత బయటి-ఉత్తర ప్రాంతానికి బదిలీ చేసినట్లు పోలీసులు తెలిపారు -
రెండేళ్లకే ‘పదోన్నతి’?
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతి సర్వీసు కాలాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పదోన్నతి పొందాలంటే సదరు ఉద్యోగి కనీసం 3 ఏళ్లు ప్రస్తుత హోదాలో పనిచేసి ఉండాలనే నిబంధన ఉండేది. దీని ప్రకారం మూడేళ్ల సర్వీసు పూర్తయిన ఉద్యోగులకే పదోన్నతు లకు అవ కాశం ఉండేది. ఇప్పుడు ఆ సర్వీసు కాలాన్ని రెండేళ్లకు తగ్గించే ప్రతి పాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనికి వచ్చే ఉద్యోగుల్లో ఎంత మంది రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు, అందులో ఎంత మంది పదోన్న తులకు అర్హులవుతారో వివరాలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలను ఆర్థిక శాఖ కోరింది. ఈ వివరాలను పంపాలని ఇటీవల శాఖల హెచ్వోడీలకు లేఖ రాసింది. -
ప్రమోషన్ నాన్నకు అంకితం
ఖుష్బూ మీర్జా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి. ఆమె ఇస్రోలో సైంటిస్ట్. గత నెల 25వ తేదీన ఆమె ఇస్రోలో డైరెక్టర్గా పదోన్నతి పొందారు. ఆమె గతంలో చంద్రయాన్, చంద్రయాన్–2 ప్రాజెక్టుల్లో పని చేశారు. ఈ ప్రాజెక్టుల్లో ఆమె అందించిన కీలకమైన సేవలకు గుర్తింపుగా 2015లో ‘ఇస్రో టీమ్ ఎక్స్లెన్స్ అవార్డు’ అందుకున్నారు. ఖుష్బూ మీర్జాది ఉత్తరప్రదేశ్లోని అమ్రోహ. ఆమె అలీఘర్ ముస్లిమ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసి 2006లో ఇస్రోలో ఉద్యోగంలో చేరారు. ఖుష్బూ ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమె తండ్రి సికందర్ మీర్జా మరణించారు. సికందర్ ఇంజనీర్. వాళ్ల కుటుంబానికి పెట్రోల్ పంప్ వ్యాపారం ఉండేది. సికిందర్ మరణం తర్వాత ఖుష్బూ తల్లి ఫర్హాత్ మీర్జా వ్యాపార బాధ్యతలు చేపట్టారు. తల్లి ఫర్హాత్తో ఖుష్బూ మీర్జా ఖుష్బూ చిన్నప్పటి నుంచి చురుకైన విద్యార్థి. స్కూలు, కాలేజీల్లో ఆమె ఎప్పుడూ టాపర్. మంచి క్రీడాకారిణి కూడా. బ్యాడ్మింటన్, వాలీ బాల్ ఆటలు బాగా ఆడేవారు. అలీఘర్ యూనివర్సిటీలో సీటు కూడా స్పోర్ట్స్ కోటాలోనే వచ్చింది. ఖుష్బూ తండ్రికి తన పిల్లలు ఇంజనీర్లు కావాలని, దేశం గర్వించే స్థాయిలో దేశానికి సేవలందించాలనే కోరిక ఉండేది. అతడి కోరికను పిల్లలకు చెబుతూ పెంచారు ఫర్హాత్. అయితే పిల్లలందరిలో తండ్రి కల కోసం అంకితమైంది ఖుష్బూ మాత్రమే. ఆమె సోదరుడు ఇంజనీరింగ్ చదివి తల్లికి వ్యాపారంలో సహాయంగా ఉండిపోయాడు. ఇద్దరు చెల్లెళ్లు పెళ్లి చేసుకుని గృహిణులుగా స్థిరపడ్డారు. ఖుష్బూ ఉద్యోగంలో కూడా చురుగ్గా ఉండేవారు. అనేక సైన్స్ సదస్సుల్లో పాల్గొన్నారు. 2012లో జాతీయ స్థాయి ఇస్రో సదస్సులోనూ, 2018లో వరల్డ్ జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సదస్సులోనూ ప్రసంగించారు. -
వేతన పెంపు, ప్రమోషన్లకు రెడీ
ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టిస్తున్న కోవిడ్-19 నేపథ్యంలో పలు రంగాలు, కంపెనీలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. దీంతో కొన్ని కంపెనీలు సిబ్బందిని తొలగిస్తుంటే.. మరికొన్ని సంస్థలు వేతనాలలో కోతలను అమలు చేస్తున్నాయి. అయితే ఇలాంటి కష్టకాలంతో ఉద్యోగులను ఆదుకునేందుకు సిద్ధమంటూ కొన్ని బ్లూచిప్ కంపెనీలు ప్రకటిస్తున్నాయి. జాబితాలో ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీసీబీ, బీఎస్హెచ్ హోమ్ అప్లయెన్సెస్, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ తదితరాలున్నాయి. వివరాలు చూద్దాం.. కంపెనీ విధానాలివి కరోనా వైరస్ సవాళ్లు విసురుతున్నప్పటికీ ఈ ఏడాదిలో సైతం కంపెనీలో పనిచేస్తున్న సిబ్బంది వేతనాల పెంపు, పనితీరు ఆధారంగా ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవ్వనున్నట్లు సాఫ్ట్వేర్ సేవల సంస్థ సీఎస్ఎస్ కార్ప్ సీఈవో మనీస్ టాండన్ పేర్కొన్నారు. కంపెనీలో పనిచేస్తున్న 7,000 మంది ఉద్యోగులకు ఇప్పటికే వీటిని అమలు చేసినట్లు తెలియజేశారు. కష్టకాలంలో సిబ్బందికి అండగా నిలవడం ద్వారా సంస్థలపట్ల భరోసా కల్పించేందుకు కోవిడ్-19 ద్వారా అవకాశం లభించినట్లేనని బీఎస్హెచ్ హోమ్ అప్లయెన్సెస్ ఎండీ నీరజ్ బల్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లను చేపట్టినట్లు వెల్లడించారు. అయితే మార్కెటింగ్, ట్రావెలింగ్ వ్యయాలలో కోత పెట్టడంతోపాటు.. కొత్తగా సిబ్బందిని తీసుకోవడాన్ని నిలిపివేసినట్లు తెలియజేశారు. పరిస్థితులకు అనుగుణంగా లాక్డవున్ అమలు, డిమాండ్ పడిపోవడం, ఉత్పత్తి, లాజిస్టిక్స్ సమస్యలు వంటి పలు సవాళ్లను వివిధ రంగాలు, కంపెనీలు ఎదుర్కొంటున్నట్లు ఆర్థికవేత్తలు తెలియజేశారు. దీంతో బిజినెస్ అవసరాలకు అనుగుణంగా కొన్ని కంపెనీలు సిబ్బంది, పంపిణీ వంటి అంశాలలో చర్యలు తీసుకుంటున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. వాస్తవిక పరిస్థితుల ఆధారంగా కంపెనీలు ప్రణాళికలు అమలు చేస్తుంటాయని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. లాక్డవున్ కారణంగా మార్చి నుంచి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పటికీ ఉద్యోగుల వేతనాలలో కోతలు లేదా సిబ్బందిని తొలగించడం వంటి చర్యలను చేపట్టడంలేదని ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ సీఈవో వినయ్ బన్సల్ ఈ సందర్భంగా చెప్పారు. వెనకడుగులో కోవిడ్-19 నేపథ్యంలో ఇటీవల సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్తోపాటు.. పీడబ్ల్యూసీ ఇండియా తదితర కంపెనీలు వేతన పెంపును వాయిదా వేసేందుకు నిర్ణయించాయి. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓయో రూమ్స్, టీవీఎస్ మోటార్స్ జీతాలలో కోతలు విధించనుండగా.. ఓలా, ఉబర్, జొమాటో, ఐబీఎం తదితర కంపెనీలు కొంతవరకూ సిబ్బందిని తగ్గించుకుంటున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. వివిధ రంగాలు, కంపెనీలకు ఎదురవుతున్న సమస్యల ఆధారంగా నిర్వహణపరమైన నిర్ణయాలు తీసుకుంటుంటాయని తెలియజేశారు. కన్జూమర్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, ఫుడ్ప్రాసెసింగ్ వంటి రంగాలలో డిమాండ్ కనిపిస్తుంటే.. ఆటో, కన్స్ట్రక్షన్ తదితర రంగాలు డీలాపడినట్లు వివరించారు. దీంతో బిజినెస్పరంగా ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న కంపెనీలు వేతన పెంపు, బోనస్లు వంటివి ప్రకటించకపోవచ్చని తెలియజేశారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని కంపెనీలు వేతన పెంపు వంటివి చేపడుతున్నట్లు డెలాయిట్ ఇండియా అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఏడాది వేతన పెంపు తదితరాలను చేపట్టినట్లు హెచ్యూఎల్ అధికారి ఒకరు తెలియజేశారు. ఈ బాటలో భారత్పే, మింత్రా పనితీరు ఆధారిత ఇంక్రిమెంట్లు ఇచ్చినట్లు వెల్లడించాయి. ఇక కోక కోలా బాట్లింగ్ భాగస్వామి హెచ్సీసీబీ ఉద్యోగులకు ఈ ఏడాది 7-8 శాతం వేతనపెంపును చేపట్టగా.. ఏషియన్ పెయింట్స్ సైతం సిబ్బంది జీతభత్యాలను పెంచినట్లు తెలుస్తోంది. -
పదోన్నతుల కోటాలోనూ అన్యాయమే!
భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కానీ, వాటి అమలులో నిర్లక్ష్యం వహించడం కానీ చాలా తీవ్రమైన తప్పులుగా భావించాలి. ఉద్యోగాల్లో ప్రమోషన్ల అంశం ప్రాథమిక హక్కు కాదనీ, ఈ విషయంలో జోక్యం చేసుకోబోమంటూ వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి. పైగా రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలను, కులాలను సంతృప్తిపరిచే చర్యగా చాలా మంది భావిస్తున్నారు. ఇదేరకమైన అభిప్రాయం న్యాయనిపుణులలో కూడా ఉండడం విచారకరం. ఇప్పుడు భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు స్వాతంత్య్రం ముందునుంచే అమలులో ఉన్నాయి. తరతరాలుగా సమాజ వృద్ధిలో రక్తం, చెమటను ధారపోసిన దళితుల పట్ల ఇలాంటి తీర్పులను వెలువరించడం బాధాకరమైన విషయం. ‘మీరు ఇస్తున్న తీర్పుల పట్ల నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. మీరు ఇచ్చే తీర్పులను అంగీకరించవచ్చు. కానీ గౌరవించలేననే విషయాన్ని నేను చాలాసార్లు కరాఖండిగా చెప్పాను. అదే సమయంలో ప్రతి న్యాయవాదికీ అట్లా చెప్పే స్వేచ్ఛ ఉండాలని నేను విశ్వసిస్తున్నాను. సరిగ్గా అదే అభిప్రా యాన్ని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపైన వ్యాఖ్యానించదల్చుకు న్నాను’ అంటూ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగానికి జరిగిన మొదటి సవరణపై 1951, మే 18వ తేదీన పార్లమెంటులో ప్రసం గిస్తున్న సందర్భంలో చేసిన వ్యాఖ్యలివి. అప్పటికి ఆయన కేంద్ర న్యాయశాఖా మంత్రిగా ఉన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం పునాదిగా ఏర్పర్చుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడాది దాటక ముందే ఎస్సీ, ఎస్టీలకు అందిస్తున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్పై హైకోర్టు, సుప్రీంకోర్టులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. రిజర్వేషన్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 29ని ఉల్లంఘిస్తున్నాయని న్యాయస్థానాలు తీర్పులిచ్చాయి. అయితే అప్పటికే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టికల్ 15కు సవరణ చేయాలని భావించింది. ఆ సంద ర్భంలోనే బాబాసాహెబ్ అంబేడ్కర్ పైవిధంగా మాట్లాడారు. ఇది నేటి పరిస్థితులకు నూటికి నూరుపాళ్లూ వర్తిస్తుందని నా భావన. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చిన ప్రతీసారీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయాల్సి వచ్చింది. అయితే వారం క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరింత ఆందోళనకరంగా ఉన్నది. ఎస్సీ,ఎస్టీల ఉద్యోగాలలో ప్రమోషన్ల విష యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోబోదనీ, అయితే ఉద్యోగాల్లో ప్రమోషన్ల అంశం అసలు ప్రాథమిక హక్కు కాదనీ, రాష్ట్ర ప్రభు త్వాలకు తాము ఆదేశాలివ్వలేమనీ, రాష్ట్రాలు తమకు తాముగా నిర్ణ యాలు తీసుకోవచ్చనీ సుప్రీంకోర్టు ఒక అనూహ్యమైన తీర్పు నిచ్చింది. ఇందులో రెండు విషయాలున్నాయి. ప్రమోషన్ల విషయం పేర్కొన్న ఆర్టికల్ 16(4)ఎ ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ప్రభుత్వ సర్వీసులలో తగినంత ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావించినట్లయితే అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకొని తగువిధమైన నిబంధనలు రూపొందించడానికి ప్రభుత్వానికి ఎటు వంటి ఆటంకాలు ఉండకూడదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 నుంచి 35 వరకు ప్రాథమిక హక్కులుగా పరిగణిస్తున్నాం. ఇందులో ఆర్టికల్ 32 ప్రకారం, పౌరులెవరికైనా పైన పేర్కొన్న ఆర్టికల్స్ అమలు చేసే విష యంలో ప్రభుత్వాలు విఫలమైనా, నిర్లక్ష్యం వహించినా జోక్యం చేసుకునే హక్కు హైకోర్టు, సుప్రీంకోర్టులకు ఉంటుందనే విషయం న్యాయశాస్త్రం చదివిన ఎవరికైనా అర్థం అవుతుంది. అంతేకాకుండా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం కానీ, వాటి అమలులో నిర్లక్ష్యం వహించడం కానీ చాలా తీవ్రమైన తప్పు లుగా భావించాలి. అయితే వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ విషయాలను పూర్తిగా విస్మరించిందనే చెప్పాలి. అసలు రిజర్వేషన్లు అనేవి కొన్ని వర్గాలను, కులాలను సంతృప్తి పరిచే చర్యగా చాలా మంది భావిస్తున్నారు. ఇదేరకమైన అభిప్రాయం సాధారణ వ్యక్తులతోపాటు, న్యాయనిపుణులలో కూడా ఉండడం విచారకరం. భారతదేశంలో ఎస్సీ, ఎస్టీలకు అమలు జరుగుతున్న విద్య, ఉద్యోగ రిజర్వేషన్లు స్వాతంత్య్రం ముందునుంచే అమలులో ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేడ్కర్ 1942లో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో కార్మిక శాఖామంత్రిగా ఉన్నప్పుడు, అప్పటి ప్రభుత్వా ధినేతలను ఒప్పించి, విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించారు. కానీ ఆరంభం నుంచి ఇప్పటి దాకా ఎస్సీ, ఎస్టీల విద్య, ఉద్యోగ అవకాశాల విషయంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత, ద్వేషం సమాజంలో నెలకొని వుంది. దాని ప్రభావం అధికారయంత్రాంగం, న్యాయవ్యవస్థ మీద పడుతున్నది. అందువల్లనే ఇప్పటికీ ఎన్నో తీర్పులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రావడం మనం చూడవచ్చు. నిజానికి ఏ దేశంలోనైనా కొన్ని వర్గాలకు, తెగలకు ప్రత్యేకమైన రాయితీలు ఉంటాయి. ఇవన్నీ కూడా సామాజిక వివక్షను రూపుమాప డానికి చేసిన, చేస్తున్న ప్రయత్నాలు. వాటి వల్ల ప్రజల మధ్య అంత రాలు తగ్గుతాయన్న ఆశాభావంతో ఆనాటి నుంచి ఈనాటి వరకూ సమాజం ఉంది. అదే ఉద్దేశ్యంతో భారతదేశంలో కూడా అంటరాని కులాలైన ఎస్సీలకూ, అడవుల్లో, కొండల్లో నివసించే ఆదివాసీలైన ఎస్టీలకూ రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. కొన్ని పథకాలను రూపొందించారు. అయితే సమాజంలో ఆధిపత్య కులాల్లో ఉన్నవాళ్ళకు అంటరాని కులాల కోసం అమలు చేస్తున్న రిజర్వేషన్ల పట్ల చాలా ఆగ్రహం ఉన్నది. తమ ఉద్యోగాలను, తమ చదువులు, సీట్లనూ, తమ అవకాశాలనూ వీళ్ళు కొల్లగొడుతున్నారని వారు భావి స్తున్నారు. ముఖ్యంగా గత ఇరవై, ముప్ఫై ఏళ్లలో వచ్చిన యువతరం ఇటువంటి భావాన్ని కలిగి ఉన్నారు. అంతకన్నా ముందుతరం చాలా వివక్షను ప్రదర్శించింది. అప్పుడు ఉద్యోగాల్లో అంత ఎక్కువ మంది కనిపించలేదు. ఇప్పుడు ఉద్యోగాల్లో విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీలు ఎదిగి వస్తున్నారు. ఇదే కొందరికి మింగుడుపడడంలేదు. సమాజ పరిణామక్రమంపట్ల అవగాహన లేకపోవడం, ఒకవేళ తెలిసినా దానిని అంగీకరించే స్థాయిలేకపోవడం, వాళ్ళ ప్రవర్తనకు కారణం కావచ్చు. ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా, ఒక మనిషిని అంటు కోకూడదనే భావన మన దేశంలోనే ఉన్నది. వాళ్ళను ముట్టుకుంటే మైలపడతామనే భావన అందరికీ నరనరానా వ్యాపించి ఉన్నది. ఇప్పటికే గ్రామాల్లో దేవాలయాల్లోకి రానివ్వకపోవడం, దళితులు వంట చేసినా, వస్తువులు అమ్మినా తీసుకోకపోవడం, ఎవరైనా అమ్మా యిలు, అబ్బాయిలు కులాంతర వివాహాలు చేసుకుంటే కూతుళ్ళని కూడా చూడకుండా హత్యచేయడం రోజూ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇవి వేల ఏళ్ళుగా సాగుతున్న అత్యాచారాలు, అంతేకాకుండా వేలమందిని అమానుషంగా హత్యలు చేసిన సమాజం ఇది. అయితే ఇన్ని ఘోరాలకు బలవుతూ కూడా వేల ఏళ్ళ నుంచి సమాజాభివృద్ధికి తమ ప్రాణాలను ధారపోశారు. యాంత్రీకరణ జర గక ముందు అన్ని రకాల వృత్తులకు తోలు పరికరాలను అందించింది అంటరానివారే. చెరువులను నిర్మించి, నిర్వహించి, ప్రాణాలకు తెగించి చెరువులను రక్షించిన వాళ్లూ అంటరానివాళ్ళే. దహన కార్య క్రమాలూ, ఖనన కార్యక్రమాలూ చేసింది వారే. వీధులనూ, వాకి ళ్ళనూ శుభ్రంచేసి యావత్ సమాజం ఆరోగ్యాన్ని కాపాడి, మానవ జాతి మనుగడకు కారణమైందీ ఈ అంటరానివారే. అంటే వ్యవసాయ యుగంలో ప్రాణాలను, ఆరోగ్యాలను ఫణంగా పెట్టింది కూడా ఈ అంటరానివారే. పైగా, పారిశ్రామిక రంగానికి ప్రథమ అవసరాలైన రైల్వేలు, గనులలో ఎండనకా, వాననకా, రక్తాన్ని చెమటగా ధారపో సింది కూడా ఈ అంటరానివారే. 1938లో ఇల్లందు బొగు ్గగనిలో ప్రమాదం జరిగి 42 మంది మరణిస్తే, అధికారులు మినహా మిగతా 37 మంది అంటరానివారే. ఇప్పటికీ మల మూత్రాలను ఒంటినిండా పులుముకొని, ప్రాణాలకు తెగించి మ్యాన్హోల్స్లో దిగుతున్నది కూడా వాళ్లే. నిజానికి వాళ్లు సమాజానికి చేసిన సేవతో పోలిస్తే ప్రస్తుతం అమలుచేస్తున్న రిజర్వేషన్లు ఏ మూలకూ సరిపోవు. ఒకవైపు సమాజ వృద్ధిలో రక్తం, చెమటను ధారపోసిన వీళ్ళను వేల ఏళ్ళుగా పశువుల కన్నా హీనంగా చూస్తున్నారు. అభివృద్ధిపథంలో దూసుకెళు తున్నామనుకుంటోన్న ఈ ఆధునిక, నవీన యుగంలో కూడా ఇలాంటి తీర్పులను వెలువరించడం బాధాకరం. ‘హీరోషీమా, నాగసాకిలపై బాంబులు వేసి, మారణహోమం సృష్టించినందుకు జపాన్ వెళ్ళిన ప్రతి అమెరికా అధ్యక్షుడూ, ఆప్రాంతానికి వెళ్ళి జపాన్ ప్రజలకు క్షమాపణ చెప్పడం ఆనవాయితీ, అమృ త్సర్లోని స్వర్ణదేవాలయం మీద భారత సైన్యం చేసిన దాడిపట్ల పశ్చాత్తాపంతో స్వర్ణదేవాలయాన్ని సందర్శించి ప్రతిప్రధాని విచారం వ్యక్తం చేస్తారు. కానీ రెండువేల ఏళ్ళకుపైగా నూటికి 25 శాతం మంది మీద అమానుషమైన వివక్ష, హత్యలను, అత్యాచారాలను చేస్తున్న హిందూ సమాజంలో మాత్రం ఎటువంటి సానుభూతి కనిపించక పోవడం, కనీసం విచారం వ్యక్తం చేయకపోవడం బాధకలిగిస్తున్నది. ఒక హిందువుగానే నేను తలవంచి దళితులకు క్షమాపణలు చెబు తాను’ అన్న మాజీ ఐఏఎస్ అధికారి కె.ఆర్. వేణుగోపాల్గారి మాట లను హిందూ సమాజం ఒకసారి అవలోకనం చేసుకుంటే యావత్ సమాజం దళితులు, అంటరానివారిపట్ల గౌరవాన్ని ప్రదర్శించగలుగుతుంది. తమ ప్రవర్తన పట్ల పునరాలోచించుకోగలుగుతుంది. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
మరో హామీ నిలబెట్టుకున్న సీఎం జగన్
సాక్షి, అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో పాదయాత్ర హామీని నిలబెట్టుకున్నారు. వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజాసంకల్పయాత్ర సందర్భంగా జగన్ను కలిసిన వీఆర్ఏలు తమకు పదోన్నతి కల్పించాలని పలుమార్లు కోరిన విషయం తెలిసిందే. వారి వినతిపై స్పందించిన జగన్.. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమోషన్లు కల్పిస్తామని అప్పట్లోనే వారికి హామీని ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎంగా ప్రమాణం చేసిన ఎనిమిది నెలల్లోనే వీఆర్ఏలకు వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించారు. దీని ద్వారా వీఆర్ఏలకు ఇచ్చిన మాటాను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలు ఎదురుచూస్తున్న పదోన్నతిని సీఎం చేసి చూపించారు. నాలుగు వేల మంది గ్రామ సహాయకుల జీవితాల్లో సీఎం వెలుగులు నింపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఎం జగన్ను గ్రామ సహాయకులు దేవుడిలా భావిస్తున్నారని, సీఎం నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. -
‘ప్రతిరోజూ పండుగే’ ప్రమోషన్లో గొడవ
సాక్షి, గుంటూరు ఈస్ట్: ‘ప్రతిరోజూ పండుగే’ చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆదివారం గుంటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశం రసాభాసగా మారింది. ఈ నెల 20న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ యాత్రలో భాగంగా గుంటూరు భాస్కర్ థియేటర్కు హీరో సాయిధరమ్ తేజ్, కథానాయకి రాశీఖన్నా వచ్చారు. వారి వెనుకే అభిమానులు పెద్ద సంఖ్యలో బౌన్సర్లను తోసుకొచ్చారు. సాయిధరమ్ తేజ్ మైకు తీసుకోగా ఆకతాయిలు అల్లరి చేయడం మొదలెట్టారు. దీంతో హీరో హీరోయిన్లు థియేటర్ పైఅంతస్తుకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు, అభిమానుల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి సద్దుమణిగిన తర్వాత అంధ విద్యార్థులకు చెక్కుల పంపిణీ చేశారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు నిర్మించిన ‘ప్రతిరోజూ పండుగే’ సినిమాకు మారుతి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు. సత్యరాజ్, రావు రమేశ్, విజయ్కుమార్, నరేశ్, ప్రభ ముఖ్యపాత్రల్లో నటించారు. -
ఏపీలో 8మంది అడిషనల్ ఎస్పీలకు పదోన్నతులు
సాక్షి, అమరావతి : ఏపీ పోలీసుశాఖకు చెందిన ఎనిమిది మంది అడిషనల్ ఎస్పీలకు నాన్ కేడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా టీవీ నాగరాజు, ఏసీబీ ఎస్పీగా జె.భాస్కర్రావు, విజయవాడ ఇంటలిజెన్స్ ఎస్పీగా కె. బాల వెంకటేశ్వరరావులను నియమించింది. ప్రస్తుతం టాస్క్ఫోర్స్ ఏసీపీగా పనిచేస్తున్న కె. సూర్యచంద్రరావును పదోన్నతిపై విజయవాడ లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2018 జూన్ 18 నుంచి 2019 జూలై 16వ తేదీ వరకే విధి నిర్వహణలో మృతి చెందిన హోంగార్డులకు నష్ట పరిహారం విడుదల చేస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 13 జిల్లాల్లో 63 మంది హోంగార్డు కుటుంబాలకు రూ. 3కోట్ల 15 లక్షల పరిహారం అందించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
కార్గిల్ యుద్ధ వీరుడికి డబుల్ ప్రమోషన్!
చండీగఢ్: భారతదేశ చరిత్రలో కార్గిల్ యుద్ధానికి ప్రత్యేకం స్థానం ఉంది. మంచుకొండలపై మాటు వేసి భారత్ను దొంగ దెబ్బ తీయాలన్న పాక్ పన్నాగాన్ని మన సైన్యం సమర్థంగా ఎదుర్కొని ఆ దేశాన్ని చావుదెబ్బ కొట్టింది. కార్గిల్ యుద్ధంలో మన జవాన్లు చూపిన అసమాన పోరాటమే భారత్కు విజయాన్ని అందించింది. అమర జవాన్ల పోరాటాన్ని స్మరించుకునేందుకు భారత్ ఏటా జులై 26న ‘విజయ్ దివస్’ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నాడు దేశం కోసం వీరోచితంగా పోరాడిన యుద్ధ వీరుడు సత్పాల్ సింగ్ గురించి మీడియాలో ప్రత్యేక కథనాలు వెలువడ్డాయి. నాడు యుద్ధంలో సత్పాల్ చూపిన ధైర్యసాహసాలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనకు ‘వీర్ చక్ర’ అవార్డు కూడా ప్రదానం చేసింది. సైన్యం నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రస్తుతం సత్పాల్ సింగ్ పంజాబ్లోని ఓ చిన్న పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. నిన్న కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ సత్పాల్ గురించి ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అది కాస్త పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ దృష్టికి వెళ్లడం.. ఆయన వెంటనే సత్పాల్కు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ ఇస్తూ ఆదేశాలు జారీ చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. అంతేకాక సత్పాల్ కొడుకు పీజీ పూర్తి చేసి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. సత్పాల్ కథనానికి స్పందించిన ఓ విద్యాసంస్థల చైర్మన్, కూల్ డ్రింక్స్ కంపెనీలు సత్పాల్ కొడుకుకు ఉద్యోగం ఇవ్వడానికి ఆసక్తి చూపాయి. దీని గురించి ఇప్పటికే సత్పాల్ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడినట్లు సమాచారం. దీంతో సత్పాల్ కొడుకు కూడా త్వరలోనే ఉద్యోగంలో చేరనున్నట్లు తెలుస్తోంది. Glad to report that Punjab CM @capt_amarinder has just announced that Head Constable Satpal Singh, Vir Chakra has immediately been promoted Assistant Sub Inspector.@IndianExpress https://t.co/idpTIuj9H0 — Man Aman Singh Chhina (@manaman_chhina) July 26, 2019 -
‘పర్సనల్’లో ప్రమోషన్లు లేనట్లేనా..!
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణిలోని పర్ససల్ విభాగం ప్రమోషన్లలో మైనింగ్ అధికారులు మోకాలడ్డుతున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సింగరేణి సంస్థలో సుమారు 34 విభాగాల నిర్వహణలో కొనసాగుతుంది. ఈక్రమంలో మైనింగ్ విభాగం అధికారులు పోకల్ పోస్టుల్లో అధికసంఖ్యలో ఉండగా, మిగతా సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ వంటి పోస్టుల్లో మాత్రం కొంతకాలం గా పర్సనల్ విభాగంలో ఏజీఎం ర్యాంకు ఉన్నవారికి జీఎంగా ప్రమోషన్ కల్పించటం ఆనవాయితీ గా వస్తుంది. అయితే జీఎం ఎడ్యుకేషన్ పోస్టులో 2016 వరకు పర్సనల్ విభాగం అధికారులే జీఎం గా పనిచేశారు. 2016లో పర్సనల్ విభాగంలో ఏజీఎం ర్యాంకు వారు లేరనే సాకుతో ఆ పోస్టులో మైనింగ్ అధికారిని నియమించారు. ఈ సారి పర్సనల్ విభాగం అధికారులు ఏజీఎం ర్యాంకు లో ముగ్గురు, నలుగురు ఉన్నప్పటికి వారిని కాదని తిరిగి మైనింగ్ అధికారిని నియ మించటం పట్ల పర్సనల్ విభాగం అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సెక్యూ రిటీ జీఎంగా పర్సనల్ విభాగం అధికారి పనిచేస్తున్నారు. ఈయన ఆగస్ట్ మాసంలో ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈ ఉన్న ఒక్క పోస్టును కూడా మైనింగ్ వారికే కేటాయించాలని అధికారులు సంస్థ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనివల్ల పర్సనల్ విభాగంలో 30 సం వత్సరాలకు పైగా పనిచేస్తున్న ఏజీఎంలు గాని, డీవైజీఎంలు గాని ప్రమోషన్లు రాక ఆ కేడర్ తోనే దిగిపోవాల్సిన పరిస్థితి నెలకొందని పర్సనల్ విభాగం అధికారులు ఆరోపిస్తున్నారు. సింగరేణి లోని ప్రతి విభాగంలో ఫీల్డ్ వర్క్, ఎంక్వైరీ వర్క్, డ్రాప్టింగ్æవర్క్, సింగరేణి వ్యాప్త బదిలీలు, రిక్రూట్మెంట్ వంటి కీలక పనులు, కార్మిక సంక్షేమం వంటి పనులన్నీ పర్సనల్ విభాగం వారు చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వారు ఎం తటి సీనియర్ అయినా, జూనియర్ అయినా మైనింగ్ అధికారులతో పోల్చుకుంటే వారికి ప్రమోషన్లలో వెనుకబడి ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి సమయంలో వారికి ప్రమోషన్లు కూడా జాప్యం అవుతున్న నేపథ్యంలో యాజమాన్యం వారికి కేటాయించిన రెండు విభాగాల జీఎం పోస్టులకు కూడా మైనింగ్ అధికారులను నియమించాలనుకోవడం సరైన విధానం కాదని వాపోతున్నారు. పర్సనల్ విభాగంలో జీఎంకు ఎంత సీనియారిటీ ఉన్నా జీఎంగానే రిటైర్మెంట్.. సింగరేణిలో సీనియారిటీ ఉన్నవారిలో కొంత మందికైనా డైరెక్టర్లుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అది కూడా కీలకమైన ఆపరేషన్స్, డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ విభాగాలు. కానీ పర్సనల్ విభాగంలో ఎంత సీనియారిటీ ఉన్నా జీఎంగానే రిటైర్మెట్ కావాల్సిందే. వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ డైరెక్టర్ అయ్యే అవకాశం లేదు. సింగరేణి అపాయింట్మెంట్ అయిన నాటి నుంచి వారు నిత్యం కార్మికుల వెల్ఫేర్ కార్యక్రమాల్లో కీలకమైన పను లు చేయిస్తూ సంస్థ అభివృద్ధికి పరోక్షంగా సహా యాన్ని అందిస్తున్నారు. అలాంటి సమయంలో ఎక్కువ సీనియారిటీ ఉన్నవారికి పర్సనల్ డైరెక్టర్గా లేని పక్షంలో కనీసం డైరెక్టర్ పాగా నైనా ప్రమోషన్లు కల్పించాలని పలువురు పర్సనల్ విభాగం అధికారులు కోరుతున్నారు. -
ఐఎఫ్ఎస్ అధికారిణి శోభకు పీసీసీఎఫ్గా పదోన్నతి
సాక్షి, హైదరాబాద్: అదనపు పీసీసీఎఫ్గా పనిచేస్తున్న ఆర్.శోభ (ఐఎఫ్ఎస్)కు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్)గా పదోన్నతి కల్పించారు. ఇక్కడి ప్రధాన కార్యాలయంలో పీసీసీఎఫ్ ఎఫ్సీఏగా ఆమెకు పోస్టింగ్ ఇచ్చారు. ఈమేరకు శనివారం సీఎస్ ఎస్.కె.జోషి ఉత్తర్వులు జారీచేశారు. ఈ పదోన్నతితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో పీసీసీఎఫ్ ర్యాంకు పొందిన తొలి ఐఎఫ్ఎస్ అధికారిణిగా శోభ నిలిచారు. -
కాంగ్రెస్లో జోష్
సాక్షి, శంషాబాద్: కనీస ఆదాయ వాగ్దాన సభ విజయవంతం కావడంతో జిల్లా కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. సభను సక్సెస్ చేయడానికి కాంగ్రెస్ నేతలు మూడు రోజులుగా శంషాబాద్ క్లాసిక్ త్రీ కన్వెన్షన్లో ఏర్పాట్లు చేశారు. చేవెళ్ల, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున పార్టీ శ్రేణులను తరలించారు. తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, ఎల్బీనగర్, మహేశ్వరం నుంచి కార్యకర్తలు మధ్యాహ్నం 3 గంటల నుంచే వేదిక వద్దకు చేరుకున్నారు. శంషాబాద్ పట్టణంలో ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున హోర్డింగ్లు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. సభావేదికపై రాహుల్ ప్రసంగానికి పార్టీ శ్రేణుల నుంచి మంచి స్పందన కనిపించింది. కార్యకర్తలు శ్రద్ధగా వింటూ పెద్దఎత్తున కరతాళ ధ్వనులు చేశారు. కనీస ఆదాయం పథకాన్ని ప్రతి ఒక్కరికి వర్తింపజేస్తామన్న ఆయన హామీపై పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేశారు. వీఐపీలకు తిప్పలు వేదికకు ఎదురుగా ఉన్న స్థలంలో వీఐపీలకు కోసం ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు. వీఐపీ పాస్ ఉన్న వారు అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించినా పోలీసులు వారిని అడ్డుకున్నారు. పాస్లు ఉన్నా వీఐపీ గ్యాలరీకి అనుమతించకపోవడంతో పలువురు పార్టీ నాయకులు వారి నేతల వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. దీంతో వీఐపీ పాస్లు ఉన్నవారిని అనుమతించాలంటూ మాజీ మంత్రి ప్రసాద్కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్ మైకుల్లో పోలీసులకు పదేపదే సూచించారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యుడు వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం మీద సభ సక్సెస్ కావడంతో పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. వచ్చే ఎన్నికల్లో విజయం తమదేననే ధీమాతో కనిపించారు. -
'మహా నాయకుడు' టిక్కెట్లు ఫ్రీ
-
'మహా నాయకుడు' కోసం టీడీపీ తిప్పలు
సాక్షి, గుంటూరు: నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన 'మహా నాయకుడు' సినిమాను ప్రమోట్ చేసేందుకు టీడీపీ నాయకులు తంటాలు పడుతున్నారు. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని సాక్షాత్తూ టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో అధికార పార్టీ నాయకులకు తిప్పలు తప్పడం లేదు. అధినేత ఆదేశాలను శిరసావహించేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో వారిని ధియేటర్లకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జుల ద్వారా ఉచితంగా టికెట్లు పంపిణీ చేసి ప్రేక్షకులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఉచితంగా టిక్కెట్లు ఇచ్చినా సినిమా చూడటానికి ఆసక్తి చూపకపోవడంతో బతిమాలి జనాన్ని ధియేటర్లకు పంపుతున్నారు. అంతేకాదు జనాన్ని తరలించేందుకు వాహనాలు కూడా సమకూర్చారు. ప్రేక్షకులకు టిక్కెట్లు పంపిణీ చేస్తూ గుంటూరు ఆరండల్పేటలో గురువారం కొందరు టీడీపీ నాయకులు ‘సాక్షి’ కెమెరా కంటపడ్డారు. ఎన్టీఆర్ జీవిత కథను రెండు భాగాలు తెరకెక్కించి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం కావడంతో బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయినట్టు వార్తలు వస్తున్నాయి. గతవారం విడుదలైన 'మహా నాయకుడు' కూడా బాక్సాఫీస్ వద్ద నిరసపడటంతో దీన్ని ప్రమోట్ చేసే బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు. తన పాత్రను సానుకూలంగా చూపించి, నాదెండ్ల భాస్కరరావు క్యారెక్టర్ను ప్రతికూలంగా చూపించడంతో ఈ సినిమాను ప్రమోట్ చేయాలని టీడీపీ నాయకులను చంద్రబాబు స్వయంగా ఆదేశించారు. టీడీపీ డబ్బులిస్తుంది: బచ్చుల అర్జునుడు చంద్రబాబు ఆదేశానుసారం ఎన్టీఆర్ మహనాయకుడు సినిమాకు సంబంధించి ప్రతి నియోజకవర్గ పరిధిలోని ధియోటర్లలో 50 శాతం టికెట్లు కేటాయించే విధంగా డిస్ట్రిబ్యూటర్లతో పార్టీ అధినాయకత్వం మాట్లాడటం జరిగిందని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు వెల్లడించారు. పార్టీలో అన్ని విభాగాల నాయకులకు, కార్యకర్తలకు సినిమాను చూపించాలని కోరారు. 50 శాతం టిక్కెట్లకు పార్టీ డబ్బులు చెల్లిస్తుందని టీడీపీ కార్యకర్తలకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. టిక్కెట్లు సరిగా పంచుతున్నారా, లేదా అనే దానిపై విజిలెన్స్ పర్యవేక్షణ కూడా ఉంటుందని తెలిపారు. ‘యన్టిఆర్ మహానాయకుడు’ మూవీ రివ్యూ -
సకల విద్యాప్రాప్తిరస్తు!
ఈ ఆధునిక యుగంలో సమస్తానికీ మూల కారణం విద్య ఒక్కటే. చక్కటి విద్య కారణంగానే పిల్లలు సభ్యమానవులై, మంచి జీవితాన్ని గడపగలుగుతారు. భాషాజ్ఞానం, వాక్పటుత్వం, వాక్చాతుర్యం ద్వారానే వారు ఇతరులపై తమదైన ముద్ర వేయగలుగుతారు. పవిత్రంగా, మనస్ఫూర్తిగా, నిర్మలమైన మనస్సుతో అమ్మను ఆరాధిస్తే చాలు ఆ చదువుల తల్లి ప్రసన్నమై కోరిన విద్యలను ప్రసాదిస్తుంది.సకల విద్యాస్వరూపిణి, సకల వాజ్ఞయానికీ మూలకారకురాలు, భాష, లిపి, కళలకు అధిదేవత సరస్వతీమాత. పలుకు తేనెల బంగరు తల్లి, వేదాలకు జనయిత్రి, వీణాపుస్తక ధారిణి అయిన ఆ తల్లి దయ ఉంటే వెర్రిబాగులవాడు కూడా వేదవేదాంగవేత్త అవుతాడు. మూర్ఖుడు సైతం మహావిద్వాంసుడుగా మారిపోతాడు. ఆమెను తృణీకరిస్తే మహాపండితుడు కూడా వివేకశూన్యునిగా మారి సర్వం పోగొట్టుకుంటాడు. అందుకే ఆ చల్లని తల్లి కరుణ అందరికీ అవసరం. ఎవరైనా సరే, తమకుగాని, తమ హితులు, సన్నిహితులు, పుత్రులు, బంధుమిత్రులకు పాండిత్యం లభించాలన్నా, కోరిన కోరికలు నెరవేరాలన్నా, ఉన్నత విద్యాప్రాప్తి, ఉన్నతోద్యోగం, పదోన్నతి లభించాలన్నా సరస్వతీ దేవిని ఆరాధించవలసిందే. వసంత పంచమి ఉదయం పూట స్నానాదికాలు ముగించుకుని శుచి అయి, గణపతిని పూజించి, కలశంలో దేవిని ఆవాహన చేయాలి. విద్యాదాయిని సరస్వతీదేవి ప్రతిమ లేదా చిత్రపటానికి తెల్లని పూలు, అక్షతలు, మంచిగంధం, తెల్లని నగలు అలంకరించి షోడశోపచారాలతో పూజించి, పాయసం నివేదించాలి. పూజానంతరం ఆ పాయసాన్ని ప్రసాదంగా భుజించి, అందరికీ పంచిపెట్టాలి. ఐదుగురు బాలలను అమ్మవారి ప్రతిరూపాలుగా భావించి, నూతన వస్త్రాలు కట్టబెట్టి, పలకాబలపాలు లేదా పుస్తకం, కలం ఇచ్చి సంవత్సరంపాటు వారి చదువుకు అయ్యే ఖర్చును భరించాలి. సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం కాబట్టి ఆమెను తెల్లని పూలు, తెల్లని పట్టువస్త్రంతో అలంకరించి, పెరుగు, వెన్న, వరిపేలాలు, తెల్ల నువ్వులతో చేసిన లడ్లు, చెరుకు రసం, బెల్లం, తేనె, పాలకోవా, చక్కెర, కొబ్బరికాయ, రేగుపళ్లు వంటి వాటిని నివేదిస్తే సరస్వతీదేవి ప్రసన్నురాలై కోరిన కోరికలు తీరుస్తుందని శాస్త్రోక్తి. – డి.శ్రీలేఖ -
ఉద్యోగ విరమణ రోజే పదోన్నతి
ఖమ్మంక్రైం: ఆ ఏఎస్ఐ సోమవారం ఉద్యోగ విరమణ పొందనున్నాడు. అయితే ఎప్పుడో ఎస్ఐగా పదోన్నతి రావాల్సి ఉన్నా రాలేదు. తాను ఉత్తమ సేవలు అందించినా చివరకు ఏఎస్ఐగానే ఉద్యోగ విరమణ పొందుతున్నానని సదరు ఏఎస్ఐ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరకు ఉద్యోగ విరమణ పొందే రోజు కూడా వచ్చింది. అయితే ఆ ఏఎస్ఐ తాను ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఎస్ఐగా పదోన్నతి సాధించి మరీ ఉద్యోగ విరమణ పొందుతున్నాడని తెలిసి ఉప్పొంగిపోయాడు. పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ప్రత్యేక చొరవతో అది సాధ్యం అయింది. వివరాలిలా ఉన్నాయి. ఖమ్మం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న ఫరీద్బాబు సోమవా రం ఉద్యోగ విరమణ పొందనున్నారు. అయితే ఆయన ఇప్పటికే ఎస్ఐగా పదోన్నతి పొందాల్సి ఉండగా బాగా ఆలస్యం కావడంతో ఏఎస్ఐగానే విరమణ పొందుతానని భావించాడు. అయితే ఆయన విధి నిర్వహణలో అందించిన సేవలకు గాను సీపీ తఫ్సీర్ ఇక్బాల్ ప్రత్యేక చొరవతో ఆయనకు ఎస్ఐగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆయనకు సీపీ తన కార్యాలయంలో ఎస్ఐ పట్టీ తొడిగి పూలమాల వేసి సన్మానించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ విరమణ తన వృత్తికే కాని తన వ్యక్తిత్వానికి కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐగా ఉద్యోగ విరమణ పొందిన ఫరీద్బాబు సీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ అధికారి వినీత్ పాల్గొన్నారు. -
ప్రకటనలు.. ప్రచారం ఒక్క చోటే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఏ ఉత్పత్తయినా లకి‡్ష్యంచిన కొనుగోలుదారులకు చేరాలంటే నాణ్యతతో పాటూ బ్రాండ్ ఇమేజ్ తప్పనిసరి! దీనికోసం సెలబ్రిటీల ఎంపిక, ప్రకటనలు, ప్రచారం... ఇవన్నీ పెద్ద టాస్కే. కానీ, విజయవాడకు చెందిన రీసెర్చ్ మీడియా గ్రూప్ దీన్ని సులభతరం చేసింది. సెలబ్రిటీల ఎంపిక కోసం సెలబ్రిటీ హబ్, ప్రకటనల కోసం న్యూవేవ్ అడ్వర్టయిజింగ్, ప్రొడక్షన్ హౌస్ సేవల కోసం రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్, ఈవెంట్ల నిర్వహణ కోసం మ్యాజిక్ మంత్ర... ఇలా అన్ని సేవలనూ అందిస్తున్న రీసెర్చ్ మీడియా గ్రూప్. మరిన్ని వివరాలు సంస్థ చైర్మన్ జే చైతన్య ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. చిన్న ప్రకటనల సంస్థగా మా ప్రస్థానం మొదలైంది. ఇపుడు కార్పొరేట్ ఈవెంట్స్, సెలబ్రిటీ మేనేజ్మెంట్ స్థాయికి చేరాం. ప్రస్తుతం రీసెర్చ్ మీడియా గ్రూప్లో సెలబ్రిటీ హబ్, మేజిక్ మంత్ర, న్యూవేవ్ అడ్వర్టయిజింగ్, రీసెర్చ్ మీడియా గ్రూప్ ఎంటర్టైన్మెంట్స్, పింక్ పీఆర్ లైన్స్, కీ హైట్స్ అనుబంధ సంస్థలుగా ఉన్నాయి. ఇప్పటివరకు రీసెర్చ్ మీడియా గ్రూప్కు 18 వేల మంది కార్పొరేట్స్ క్లయింట్లున్నారు. వీటిలో రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు, ఉత్పత్తుల తయారీ కంపెనీల వరకూ అన్నీ ఉన్నాయి. త్వరలోనే కంటిన్యూ మెడికల్ ఎడ్యుకేషన్ (సీఎంఈ), కామినేని, కేర్ ఆసుపత్రులు, ప్రక్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మా క్లయింట్ల జాబితాలో చేరనున్నాయి. ఇదీ... మా కంపెనీల తీరు సెలబ్రిటీ హబ్: 2014లో విజయవాడ కేంద్రంగా ప్రారంభమైంది. దీనికి విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, గోవా, బెంగళూరు, ముంబైలో బ్రాంచీలున్నాయి. సెలబ్రిటీల ఎంపిక కోసం ముంబైకి చెందిన సిమ్కామ్ మోడల్, చిరాక్ మేనేజ్మెంట్స్, జాకీ ఫెర్నాండెస్, పినాకిల్ రూడ్జ్, ది క్వీన్స్, ఎవాన్ ఎంటర్టైన్మెంట్స్ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం సెలబ్రిటీ హబ్లో 40 వేల మంది సినీ ప్రముఖులున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా, దుబాయ్, మలేషియా, బ్యాంకాక్, శ్రీలంక వంటి దేశాల్లోని కార్యక్రమాలకూ తారలను అందించాం. మ్యాజిక్ మంత్ర: 2012లో ప్రారంభమైన ఈ సంస్థ కార్పొరేట్, వ్యక్తిగత ఈవెంట్లను నిర్వహిస్తుంది. గతేడాది రూ.40 కోట్ల టర్నోవర్ను చేరుకున్నాం. న్యూవేవ్: విజువల్ యాడ్స్ రూపకల్పన కోసం న్యూవేవ్ అడ్వర్టయిజింగ్ పనిచేస్తుంది. టీవీ సీరియల్స్, సినిమాల చిత్రీకరణ కోసం అవసరమైన ప్రొడక్షన్ హౌస్ సేవల కోసం రీసెర్చ్ మీడియా ఎంటర్టైన్మెంట్ పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 16 టీవీ సీరియల్స్కు సేవలందించాం. రూ.100 కోట్లు లక్ష్యం.. ప్రస్తుతం రీసెర్చ్ మీడియా గ్రూప్లో 300 మంది ఉద్యోగులున్నారు. గతేడాది రూ.60 కోట్ల వ్యాపారాన్ని చేరుకున్నాం. ఈ ఏడాది రూ.100 కోట్లు లకి‡్ష్యంచాం. త్వరలోనే సొంత బ్యానర్పై తెలుగు, హిందీ చిత్రాల నిర్మాణంతో పాటూ జాతీయ స్థాయిలో మిస్ ఇండియా పోటీలను నిర్వహించనున్నాం’’ అని చైతన్య వివరించారు. -
‘వెనకబాటు’ సమాచారం అక్కర్లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకున్న ప్రధాన అవరోధం తొలగిపోయింది. కోటా అమలుకు ముందు రాష్ట్రాలు ఎస్సీ, ఎస్టీల వెనకబాటుతనంపై సమాచారం సేకరించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పునిచ్చింది. ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు ఈ నిబంధనే అడ్డుగా ఉందని ఇన్నాళ్లూ కేంద్రం చెబుతోంది. దళిత వర్గాల పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు కోసం పలు షరతులు విధించిన 2006 నాటి ఎం.నాగరాజ్ కేసు తీర్పును సమీక్షించేందుకు కోర్టు నిరాకరించింది. ఈ అంశాన్ని ఏడుగురు సభ్యుల ధర్మాసనానికి నివేదించాల్సిన అవసరం లేదని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ వర్తింపుపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. క్రీమీలేయర్ నిబంధనకు సమర్థన.. ఎస్సీ, ఎస్టీల వెనకబాటుతనాన్ని ప్రతిబింబించే సమాచారాన్ని సేకరించాలని నాగరాజ్ కేసులో కోర్టు తుది నిర్ణయానికి రావడం 1992 నాటి ఇందిరా సహనీ కేసు(మండల్ కమిషన్ కేసు)లోని తీర్పుకు విరుద్ధంగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీంతో, కోటా అమలు వ్యవహారంలో అలాంటి సమాచార సేకరణ చెల్లుబాటు కాదని తేల్చిచెప్పింది. ఎస్సీ, ఎస్టీలు అత్యంత వెనకబడిన, బలహీన వర్గాలని, వారిని వెనకబాటు తరగతిగానే భావించాలని 58 పేజీల తీర్పు ప్రతిని రాసిన జస్టిస్ నారిమన్ అన్నారు. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ వర్తింపజేయాలన్న నాగరాజ్ తీర్పులోని భాగాన్ని బెంచ్ సమర్థించింది. వెనకబడిన తరగతులు అభివృద్ధిచెంది, ఇతరులతో సమాన స్థాయికి చేరుకోవాలన్నదే రిజర్వేషన్ల ప్రాథమిక లక్ష్యమని గుర్తుచేసింది. క్రీమీలేయర్ లేనట్లయితే కొందరే కీలక పదవులు పొందుతారని, ఫలితంగా వెనకబడినవారు అలాగే ఉండిపోతారంది. ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ వర్తింపు ఆర్టికల్స్ 341, 342 ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులపై ప్రభావం చూపదని తెలిపింది. ఇందిరా సహానీ కేసులో 9 మంది జడ్జీల్లో 8 మంది క్రీమీలేయర్ను సమానత్వ సూత్రాల్లో ఒకదానిగా పరిగణించారు. ఆర్టికల్ 341, 342లతో పాటు ఆర్టికల్ 14(సమానత్వ హక్కు), ఆర్టికల్ 16(ఉద్యోగాల్లో సమాన అవకాశాలు)లు ఒకదానితో ఒకటి విభేదించకుండా రాజ్యాంగంలో విస్పష్ట వివరణ ఉందని తెలిపింది. పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఎవరిని తొలగించాలి? ఎవరిని చేర్చాలనేది పూర్తిగా పార్లమెంట్ విచక్షణ మీదే ఆధారపడి ఉంటుందని పేర్కొంది. కేసు నేపథ్యమిదీ.. ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలుపై ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో కొన్ని షరతులు విధించింది. రిజర్వేషన్లు కల్పించే ముందు రాష్ట్రాలు.. ఎస్సీ, ఎస్టీల వెనకబాటుతనంపై పరిమాణాత్మక సమాచారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి తగినంత ప్రాతినిధ్యం దక్కడంలేదని నిరూపించే వివరాలు, సంస్థల పాలనా విధానాలపై రిజర్వేషన్ల ప్రభావం తదితర సమాచారం సేకరించాలని సూచించింది. ఈ నిబంధనల వల్ల ఎస్సీ, ఎస్టీలకు పదోన్నతులు దాదాపు నిలిచిపోయాయని, వారిని వెనకబడిన తరగతిగా భావిస్తూ పదోన్నతుల్లోనూ రిజర్వేషన్లు కల్పించేందుకు ఆ తీర్పును సమీక్షించాలని ప్రభుత్వంతో పాటు పలు సంస్థలు కోర్టును కోరాయి. ఎం.నాగరాజ్ కేసులో కోర్టు అనవసర షరతులు విధించిందని విచారణ సందర్భంగా కేంద్రం ఆరోపించింది. -
2040 వరకు హైకోర్టు జడ్జి కాలేం
సాక్షి, న్యూఢిల్లీ: సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే తాము 2040 వరకూ తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తులుగా పదోన్నతిపై వెళ్లలేమని సుప్రీంకోర్టుకు తెలంగాణ న్యాయాధికారుల సంఘం నివేదించింది. జిల్లా న్యాయమూర్తులు, ఇతర సబార్డినేట్ సర్వీసుల్లో ఉన్న న్యాయాధికారుల విభజనకు సంబంధించిన వివాదంపై బుధవారం తన వాదనలు కొనసాగించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ అశోక్ భూషణ్లతో కూడిన ధర్మాసనం వరుసగా రెండో రోజూ కేసును విచారించింది. తెలంగాణ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాదులు సల్మాన్ ఖుర్షీద్, హుజేఫా అహ్మదీ తమ వాదనలు వినిపించారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, 3, 4 ద్వారా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు తీసుకొచ్చింది. ఈ చట్టం ద్వారానే విభజన జరగాలి. న్యాయాధికారుల విభజన కూడా అలాగే జరగాలి. కానీ ఆర్టికల్ 235 ప్రకారం సబార్డినేట్ కోర్టులు హైకోర్టు నియంత్రణలో ఉన్నాయి కాబట్టి.. విభజన కూడా ఆర్టికల్ 235 ప్రకారమే జరగాలంటే ఎలా? రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆర్టికల్ 235 ఎలా వర్తిస్తుంది? కేంద్రం హైకోర్టుతో సంప్రదింపులు జరపవచ్చు. కానీ అంతిమంగా పునర్వ్యవస్థీకరణ చట్టం పరిధిలోనే కేంద్రం మార్గదర్శకాలు రూపొందించాలి. అసలు పునర్ వ్యవస్థీకరణ చట్టానికి స్థానికతే గుండెకాయ. స్థానికత లేకుండా కేవలం సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటే మేం 2040 వరకూ కూడా హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి పొందలేం’’అని హుజేఫా అహ్మదీ వాదించారు. ఫుల్ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ అది: హైకోర్టు రిజిస్ట్రీ హైకోర్టు రిజిస్ట్రీ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్.వెంకటరమణి తన వాదన వినిపించారు. ‘‘పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 78 గానీ, మరొకటి గానీ న్యాయాధికారుల విభజనను ప్రస్తావించలేదు. వీరు సవాలు చేసిన తీర్పు ఫుల్ కోర్టు ఇచ్చినది. మీరు సీనియారిటీని ఎలా విస్మరిస్తారు? సర్వీసు కండిషన్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆప్షన్లు ఉంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల వారు తరాలుగా వచ్చి స్థిరపడి ఉన్నారు. వారిని కాదంటే ఎలా? సీనియారిటీ ద్వారానే కేటాయింపులకు న్యాయం జరుగుతుంది’’అని వాదించారు. అప్పుడు లేనిది.. ఇప్పుడెందుకు?: ఏపీ న్యాయాధికారుల సంఘం ఏపీ న్యాయాధికారుల సంఘం తరఫున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, వై.రాజగోపాలరావు తమ వాదనలు వినిపించారు. ‘‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 76 నుంచి 80 వరకు ఏవీ కూడా న్యాయాధికారుల విభజనను ప్రస్తావించలేదు’’అని ఆదినారాయణ రావు వాదించారు. దీనికి జస్టిస్ ఏకే సిక్రీ జోక్యం చేసుకుంటూ ‘‘ఈ చట్టం ద్వారా విభజన చేపట్టవచ్చని హైకోర్టు అంగీకరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరిస్తోంది.. మరి మీరెందుకు అంగీకరించడం లేదు’’అని ప్రశ్నించారు. ఆదినారాయణరావు బదులిస్తూ ‘‘ఈ చట్టం ఆధారంగా విభజనకు హైకోర్టు మార్గదర్శకాలు ఇవ్వలేదు. కేవలం ఆర్టికల్ 235 ద్వారా సంక్రమించిన అధికారాలతోనే మార్గదర్శకాలను రూపొందించింది’’అని పేర్కొన్నారు.‘‘సుప్రీంకోర్టు 1993లో ఆలిండియా జడ్జెస్ కేసులో ఇచ్చిన తీర్పు గానీ, ఇతర తీర్పులు గానీ పరిశీలిస్తే న్యాయవ్యవస్థలోకి ఏనాడూ కార్యనిర్వాహక వ్యవస్థ చొరబడేందుకు అనుమతివ్వలేదు. పిటిషనర్లు చెబుతున్నట్టు 371డీ న్యాయవ్యవస్థకు అమలు కాదు. అలా అమలైతే ప్రాంతాల వారీగా రిజర్వేషన్ వర్తించేది. కానీ ఈ సర్వీసులో అఖిల భారత స్థాయిలో ఎవరైనా పోటీపడొచ్చు. వారన్నట్టుగా స్థానికతే ప్రాతిపదిక అయితే ప్రస్తుతం ఈ సర్వీసులో తెలంగాణలో, ఏపీలో పనిచేస్తున్న తమిళనాడు వారినో లేదా కర్ణాటక వారినో ఏ ప్రాతిపదికన కేటాయిస్తారు? అసలు ప్రభుత్వ ఉద్యోగాల్లో నివాసం ఎక్కడ అనేది ఒక ప్రాతిపదికే కాదు. నియామకం సమయంలో ప్రాతిపదికగా లేని స్థానికతను ఇప్పుడు మాత్రం ఎందుకు తీసుకోవాలి’’అని వాదించారు. వాదప్రతివాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఇప్పటివరకు జరిగిన వాదనలపై కేసులోని అన్ని పార్టీలు తమ ప్రతిస్పందనలను ఆగస్టు 31 లోపు లిఖితపూర్వకంగా అందజేయాలని కోర్టు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది ఉదయకుమార్ సాగర్ వాదనలు వినిపించారు. ఏపీ న్యాయాధికారుల సంఘం ప్రతినిధి గంటా శ్రీనివాసులు, తెలంగాణ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు వరప్రసాద్, చంద్రశేఖర్ విచారణకు హాజరయ్యారు. -
అందుకే నేను ఇలా ఉన్నాను మరి!
మూడురోజులుగా తిండి లేని ఒక యాచకుడు ఆ దారిన వెళ్లే ఒక కారును ఆపి ‘‘కాస్త ధర్మం చెయ్యండి బాబూ’’అన్నాడు. యాచకుడి కట్టూబొట్టూ చూసి అతనేదో మంచి కుటుంబం నుండి వచ్చిన వాడై ఉంటాడని, అతని మాట తీరు చూస్తే కాస్త చదువుకున్నవాడని అనిపించింది కారులోని వ్యక్తికి. పైగా, అతను తనకు అప్పుడే ప్రమోషన్ వచ్చిందన్న సంతోషంలో ఉన్నాడు. దాంతో అతను జేబులో నుంచి వందరూపాయల నోటు తీసి యాచకుడికి ఇవ్వబోయాడు. ఆ వంద రూపాయల నోటుకేసి చూస్తూ పక్కనే కూర్చున్న స్నేహితుడు పెద్దగా నవ్వాడు.‘‘ఎందుకలా నవ్వుతున్నావు?’’ అన్నాడు అతను. ‘‘అతి త్వరలో నువ్వు కూడా నా స్థానంలో ఉండాల్సి వస్తుందనిపించి నవ్వొచ్చింది. కనిపించిన ప్రతివాడికీ ఇలా దానం చేస్తూ పోతే చివరికి ఏమీ మిగలదు. నేనందుకే చాలా జాగ్రత్తగా ఉంటాను. అసలే నాకు రావలసిన ప్రమోషన్ కూడా మిస్సయింది’’ అన్నాడు స్నేహితుడు. దానికతను నవ్వుతూ, ‘‘బహుశా అందుకేనేమో నాకు ప్రమోషన్ వచ్చింది. కారు కూడా కొనుక్కోగలిగాను. నువ్వేమో అలాగే ఉన్నావు ఎదుగూబొదుగూ లేకుండా’’ నవ్వుతూనే అంటించాడు. మీరు ఇస్తూ పోతే మీ దగ్గర ఉన్నదంతా అయిపోతుందనేది సాధారణ ఆర్థిక సూత్రాలకు సంబంధించినది. అదే ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారమైతే మీరు ఏమీ ఇవ్వకుండా ఉన్నట్లైతే మీ దగ్గర ఏదీ మిగలదు. అదే మీరు ఇస్తూ పోతే మీ దగ్గర చాలా చాలా ఉంటుంది. బాహ్య, అంతర్గత ప్రపంచాల చట్టాలు పరస్పరం వ్యతిరేక దిశలో ఉంటాయి. ముందు మీరు అంతర్గతంగా చక్రవర్తి స్థాయికి ఎదగండి. అప్పుడే పంచేందుకు మీ దగ్గర చాలా ఉంటుంది. – ఓషో భరత్ -
డేటా లేకుండా రిజర్వేషన్లు ఎలా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు తక్కువ ప్రాతినిధ్యం ఉందని నిరూపించే సమాచారంతో రాష్ట్రాలు ఎందుకు ముందుకు రావడంలేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు పరిమాణాత్మక సమాచారమే కీలకమని ఉద్ఘాటించింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ను వర్తింపజేయాలన్న 12 ఏళ్ల నాటి కోర్టు తీర్పును కేంద్రం సవాలుచేయడం తెల్సిందే. ఆ పిటిషన్ను విచారిస్తూ సుప్రీం పైవిధంగా స్పందించింది. పదోన్నతుల్లో దళితులకు 23 శాతం కోటా ఉండాలని కేంద్రం ఉద్ఘాటించింది. 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు వెనకబాటుతనం, తక్కువ ప్రాతినిధ్యాన్ని కోర్టు ప్రాదిపదికగా నిర్ధారించడం తెల్సిందే. దీంతో వారికి పదోన్నతులు దాదాపు నిలిచిపోయాయని, ఆ తీర్పును ఏడుగురు సభ్యుల బెంచ్ పునఃపరిశీలించాలని కేంద్రం కోరింది. ‘క్రీమీలేయర్పై 12 ఏళ్ల క్రితం వెలువడిన తీర్పు తప్పని నిరూపించాలంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందనే సమాచారాన్ని గణాంకాలతో సహా సమర్పించాలి. ఇన్నేళ్లయినా ఆ వివరాలను రాష్ట్రాలు ఇంకా ఎందుకు సేకరించలేదు?’ అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ..వెనకబడిన తరగతులుగా భావిస్తున్న ఎస్సీ, ఎస్టీలు వెనకబడిన వాళ్లమని ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరంలేదన్న 1992 నాటి ఇందిరా సహానీ కేసును ఉదహరించారు. పరిమాణాత్మక సమాచారం అందుబాటులో ఉంటే నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారాలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కోర్టు బదులిచ్చింది. వారికి తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే, వేగంగా పదోన్నతులు కల్పించే బాధ్యత రాష్ట్రాలదే అని పేర్కొంది. -
హైకోర్టు జడ్జీలుగా నియమించలేం
న్యూఢిల్లీ: అలహాబాద్ హైకోర్టులో న్యాయవాదులుగా పనిచేస్తున్న ఇద్దరికి అదే హైకోర్టులో న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం రెండోసారి కూడా వెనక్కు పంపింది. కొలీజియం సిఫారసు చేసిన న్యాయవాదులపై ఫిర్యాదులు ఉన్నందున వారిని జడ్జీలుగా నియమించలేమని కేంద్రం పేర్కొంది. ఆ ఇద్దరు న్యాయవాదుల్లో ఒకరైన మహ్మద్ మన్సూర్.. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి దివంగత సాఘిర్ అహ్మద్ కుమారుడు కావడం గమనార్హం. న్యాయవాదులు మహ్మద్ మన్సూర్తోపాటు బష్రత్ అలీని అలహాబాద్ హైకోర్టులో న్యాయమూర్తులుగా నియమించాలంటూ చాలా రోజుల క్రితమే సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆ ఇద్దరిపై ఫిర్యాదులున్నాయన్న కారణం చూపుతూ అప్పట్లో కేంద్రం ఈ ప్రతిపాదనను తిప్పిపంపింది. ఆ ఫిర్యాదులు తీవ్రమైనవేమీ కాదంటూ కొలీజియం మరోసారి అవే పేర్లను సిఫారసు చేయగా, ఏ నిర్ణయమూ తీసుకోకుండా రెండున్నరేళ్లు కాలయాపన చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు వారిరువురీ పేర్లను తిరస్కరిస్తున్నట్లు గత నెలలో కొలీజియంకు తెలిపింది. కొలీజియం సభ్యుల్లో ఒకరైన జస్టిస్ చలమేశ్వర్ ఇటీవలే పదవీ విరమణ పొందినందున కొత్త కొలీజియం ఏర్పాటైన అనంతరం ఈ అంశంపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. -
పదోన్నతి ‘పరుగు’లో కుప్పకూలాడు
జైపూర్, రాజస్ధాన్ : పదోన్నతి కోసం నిర్వహించిన పరుగు పందెం కాస్తా ఆ కానిస్టేబుల్ పాలిట శాపమైంది. పదోన్నతి గురించి కలలు కంటూ పరుగు పందెంలో పాల్గొన్న వ్యక్తి గమ్యం చేరకుండానే అసువులు బాసాడు. విషాదాంతకరమైన ఈ సంఘటన జైపూర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జైపూర్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుశీల్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై) గా పదోన్నతి కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో జైపూర్ పోలీసు శాఖ శుక్రవారం అమీర్ రోడ్డులోని జల్మహల్లో పదోన్నతి కోసం నిర్వహించిన పరుగు పందెంలో సుశీల్ పాల్గొన్నాడు. అయితే మార్గ మధ్యలో ఉన్నట్టుండి, ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన పోలీసులు వెంటనే సుశీల్ను సమీప ఎస్ఎమ్ఎస్ ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే సుశీల్ మృతి చెందినట్లు నిర్ధారించారని తెలిపారు. -
సీబీఐలోకి వెళ్తున్న ఆనందంలో కాల్పులు
పాట్నా : పెళ్లి వేడుకల్లో, ఇతర ఉత్సవాల్లో ఆకతాయిలు తమ ఇష్టం వచ్చినట్టు గాల్లోకి కాల్పులు జరపడం ఫ్యాషన్గా మారిపోయింది. కానీ బిహార్లో ఓ పోలీస్ ఉన్నతాధికారి ఫేర్వెల్ పార్టీలో గాల్లోకి కాల్పులు జరిపిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. బిహార్లోని కతిహార్లో ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న సిదార్థ్ మోహన్ జైన్కు ఇటీవలే సీబీఐ అధికారిగా ప్రమోషన్ లభించింది. తాను ఎప్పటినుంచో కోరుకున్న పదవి లభించడంతో ఆనందంలో ఉన్న జైన్ తన సన్నిహితులకు పార్టీ ఇచ్చారు. ఇందులో పాల్గొన్న మరో అధికారి మితిలేశ్ మిశ్రా ఓ హిందీ పాట పాడుతుండగా.. జైన్ ఆ పాటకి తగ్గ స్టెప్పులు వేస్తూ.. అదే తీరుగా తుపాకితో గాల్లోకి తొమ్మిది సార్లు కాల్పులు జరిపాడు. అదృష్టావశాత్తు ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి అపాయం జరుగలేదు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి చట్టవిరుద్ధ పనులకు పాల్పడటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఆయుధాన్న దుర్వినియోగం చేసినందుకు అతనిపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
ప్రమోషన్ వచ్చిన ఆనందంలో గాల్లోకి కాల్పులు
-
అర్హత లేకున్నా పదోన్నతి కల్పించారు
గుంటూరు : ఎలాంటి శిక్షణ లేకుండా అర్హత లేని ఏడుగురు ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్) కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా అడ్డదారిలో పదోన్నతి కల్పించారంటూ పలువురు ఏఆర్ కానిస్టేబుళ్లు శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఏఆర్ కానిస్టేబుల్ సీహెచ్ మోషేబాబు మాట్లాడుతూ గత ఏడాది జనవరిలో తిరుపతిలోని 70 మంది పదోన్నతి కోసం శిక్షణ పూర్తి చేసుకుని రాగా వారిలో 13 మందికి పదోన్నతి జాబితా ప్రకారం హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు కల్పించారని చెప్పారు. అయితే ఆ సమయంలో తమకు పదోన్నతి అవసరం లేదని చెప్పి ఏడుగురు కానిస్టేబుళ్లు తాము సివిల్ విభాగానికి వెళతామని చెప్పడంతో వారిని సివిల్ విభాగానికి బదిలీ చేయడంతో వారు కొద్ది రోజులకే తిరిగి మళ్లీ ఏఆర్లో రిపోర్టు చేశారని తెలిపారు. జీవో నంబరు 84 ప్రకారం పోలీస్ శాఖలోని విభాగాల్లో పనిచేస్తున్న వారికి పదోన్నతులు లేవని 2012లో ప్రభుత్వం జీవో జారీ చేసిందని స్పష్టం చేశారు. వీటన్నింటినీ పక్కన పెట్టి ఎస్పీ కార్యాలయ గుమస్తా నాగరాజు ప్రస్తుతం మోటారు వెహికల్ విభాగంలో పనిచేస్తున్న ఏడుగురు కానిస్టేబుళ్ల జాబితాను రూపొందించి ఎస్పీని సైతం మభ్యపెట్టి నిబంధనలు పక్కన పెట్టి వారికి పదోన్నతులు కల్పించారని ఆరోపిస్తున్నారు. జనరల్ సీనియార్టీలో వున్న వారిని పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించిన నాగరాజుపై రూరల్ ఎస్పీతో పాటు గుంటూరు రేంజ్ ఐజీ కేవీవీ గోపాలరావుకు ఫిబ్రవరిలో ఫిర్యాదు చేశామన్నారు. ఇదే విషయమై రాష్ట్ర డీజీపీ మాలకొండయ్యకు గురువారం ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పటికైనా జరిగిన పొరపాటును సరిచేసి వారి పదోన్నతులు రద్దు చేసి అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని కోరుతున్నామని వెల్లడించారు. లేకుంటే సీనియార్టీ జాబితాలో ఉన్న కానిస్టేబుళ్లు ట్రిబ్యునల్ను అశ్రయించి న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధపడనున్నట్టు వివరించారు. -
ముగ్గురు సంతానమైతే.. ప్రమోషన్..?
జైపూర్ : రెండో వివాహం ద్వారా మూడో బిడ్డను పొందినవారు కూడా పదోన్నతులకు అర్హులేనని రాజస్థాన్ హైకోర్టు తీర్పునిచ్చింది. పదోన్నతుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ జైరాం మీనా అనే వ్యక్తితో పాటు మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ ఎమ్ఎన్ భండారి, జస్టిస్ డీసీ సోమనాయ్ డివిజన్ బెంచ్ వీరికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. జనాభా నియంత్రణలో భాగంగా రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం 2002, జూన్లో ఒక నిబంధనను అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులకు అనర్హులని తెలిపింది. అయితే 2015 నవంబర్ 30న ఈ నిబంధనను సడలించింది. మొదటి భార్య/ భర్త ద్వారా ఇద్దరు సంతానాన్ని పొంది, రెండవ వివాహం ద్వారా మరో సంతానాన్ని పొందిన వారు ఈ నిబంధన పరిధిలోకి రారని ప్రకటించింది. అయితే సడలించిన ఈ నిబంధనను తమకు వర్తింపచేసి పదోన్నతి ఇవ్వాల్సిందిగా జైరాం తన పిటిషన్లో పేర్కొన్నారు. కోర్టు ఈ పిటిషన్ను విచారించి వీరు కూడా పదోన్నతులకు అర్హులేనని తీర్పునిచ్చింది -
ఆ నటుడి కోసం ‘ఖాన్ త్రయం’...?
తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు ఉంది ఇర్ఫాన్ ఖాన్ ప్రస్తుత పరిస్థితి. ఇర్ఫాన్ నటించిన చిత్రం బ్లాక్మెయిల్. ఈ చిత్ర ప్రమోషన్ కోసం ఇర్ఫాన్ ఎంతో ఆతురుతగా ఎదురుచూస్తున్న సమయంలో అనుకోకుండా అనారోగ్యానికి గురయ్యాడు. న్యూరో ఎండోక్రైన్ వ్యాధితో బాధపడుతున్న అతడు ప్రస్తుతం యూకేలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ పరిస్ధితులో ఇర్ఫాన్కు సహయం చేయడానికి బాలీవుడ్ ఖాన్ల త్రయం ముదుకొచ్చారు. షారుఖ్ ఖాన్, ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్లు ప్రత్యేక షో వేయించుకుని చూడనున్నట్లు, ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నట్లు సమాచారం. ఇలా ముగ్గురు ఖాన్లు కలవడమే అరుదు. ఇదేకానీ జరిగితే అభిమానులకు పండగే. అభినయ్ డియో దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఇర్ఫాన్తో పాటు కీర్తి కుల్హర్, దివ్య దత్తా, అరుణోదయ్ సింగ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. -
‘ఫిట్నెస్’ ఉంటేనే పదోన్నతి!
సాక్షి, హైదరాబాద్: పోలీసుల జీవితాల్లో భాగమైన ‘ఫిట్నెస్’అంశం ఐపీఎస్ అధి కారుల పదోన్నతులకు ఎసరుపెడుతోంది. ‘స్మార్ట్ పోలీసింగ్’చేయాలంటే ఐపీఎస్ అధికారులు శారీరకంగా కూడా దృఢంగా ఉండాలని, అలా ఫిట్గా ఉన్నవారికే పదోన్నతులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పదోన్నతుల సమయంలో ఐపీఎస్ అధికారులకు ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి చేయాలని, ఈ ప్రతిపాదనలపై అభిప్రాయాలు తెలియజేయాలంటూ రాష్ట్రాలకు లేఖలు రాసింది. అంతేగా కుండా ఉత్తమ సేవలు అందించినవారికి ఇచ్చే పోలీస్ మెడల్ పొందాలన్నా కూడా ఫిట్నెస్ పరీక్ష తప్పనిసరి చేయాలని కూడా ఆ లేఖలో పేర్కొంది. స్పందించింది మూడు రాష్ట్రాలే.. కేంద్రం రెండు నెలల కిందే ఈ ప్రతిపాదన చేసినా ఇప్పటివరకు మూడు రాష్ట్రాలు మాత్రమే అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఇందులో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలు కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకించగా.. తెలంగాణ మాత్రం మిశ్రమ అభిప్రాయం వ్యక్తం చేశాయి. మహారాష్ట్ర ఆసక్తికరంగా సమాధానమిచ్చినట్టు కేంద్ర హోంశాఖ (ఎంహెచ్ఏ) వర్గాలు చెబుతున్నాయి. ఐపీఎస్ అధికారులు రోజంతా పనిచేయాల్సి ఉంటుందని, వారికి తమ శరీరాకృతి, ఫిట్నెస్ కోసం చెమటోడ్చే సమయం ఉండదని పేర్కొన్నట్లు తెలిసింది. ఇక తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకించలేదు, ఆమోదయోగ్యమని అంగీకరించలేదు. కేవలం కేంద్ర ప్రతిపాదనల పట్ల సానుకూలంగా ఉన్నామని, వాటిని అమలు చేయాలంటూ సంబంధిత విభాగాలకు ఆదేశాలిస్తామని పేర్కొంది. ఐపీఎస్లలో వ్యతిరేకత! ‘ఫిట్నెస్’ప్రతిపాదనలపై దేశవ్యాప్తంగా ఐపీఎస్ అధికారులు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ఐపీఎస్ అధికారి ఒకరు స్పందిస్తూ.. ‘‘పోలీసులు అంటే అందరికీ చులకనే! శ్రమకు తగిన గౌరవం, ప్రతిఫలం లేని ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సిందే..!’’అని వ్యాఖ్యానించారు. ఏ ఆలిండియా సర్వీసు అధికారులకు లేని నిబంధన తమకు ఎందుకని ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న మరో ఐపీఎస్ అధికారి పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలు సరికాదని.. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి శారీరక రుగ్మతలతో బాధపడకుండా ఉంటే చాలని రాష్ట్ర ఐపీఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అమలుకు కేంద్రం యోచన! ఐపీఎస్ అధికారులకు ఫిట్నెస్ అంశంపై కేంద్ర హోంశాఖ వెనక్కి తగ్గే అవకాశాల్లేవని సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత.. ఐపీఎస్ల పదోన్నతులకు మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఈ తదితర పారామిలటరీ అధికారులకు వర్తింపజేసే శారీరక దృఢత్వ నిబంధనలను వర్తింపజేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. శారీరకంగా దృఢంగా లేని ఐపీఎస్ అధికారుల మెడికల్ బిల్లులు భారంగా మారాయని కేంద్రం భావిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్ఎస్) కింద ఆ మెడికల్ బిల్లులు క్లియర్ అవుతున్నందున ఆ కోణంలోనూ ‘ఫిట్నెస్’ప్రతిపాదనను పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ అంశంపై ఇప్పటివరకు మూడు రాష్ట్రాలే అభిప్రాయం తెలపడం పట్ల కేంద్ర హోంశాఖ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఐపీఎస్ అధికారులు ‘ఫిట్నెస్’అంశానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభావితం చేస్తున్నారని సందేహిస్తున్నట్లు తెలుస్తోంది. -
రన్ రాజా రన్
సాఫ్ట్వేర్ కంపెనీ ‘మిరాకిల్స్’ యజమాని యుగంధర్ తన సంస్థ ఉద్యోగులను పిలిచి ఒక శుభవార్త ఇలా చెప్పాడు...‘‘మన సంస్థ వార్షికోత్సవంలో భాగంగా మొదటి సారిగా పాటల పోటీ నిర్వహిస్తున్నాం. ‘గెలిచిన విజేత చేతిలో ఒక కప్పు పెట్టి, భుజాల మీద శాలువ కప్పుతాం...’ అని అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు ఉప్పులో కాలేసినట్లే. శాలువ, కప్పు కాదు విజేతకు 5లక్షల రూపాయల క్యాష్అవార్డ్ ఇస్తున్నాం.అంతేనా?వారానికి రెండు ఆఫ్లు ఇస్తాం.బైక్ ఉన్నవారికి కారు ఇస్తాం. కారు ఉన్నవారికి అంత కంటే ఖరీదైన కారు ఇస్తాం.అంతేనా? ప్రమోషన్ కూడా ఇస్తాం. మీ టాలెంట్ను చాటుకునే అపూర్వ అవకాశం ఇది’’ చప్పట్ల మోతతో హాలు అదిరిపోయింది. ‘గిఫ్ట్ ప్యాకేజీ’ దెబ్బతో ఎన్నడూ పాడని వాళ్లు, ఎప్పుడూ పాడే వాళ్లు, పాట అదేపనిగా వినేవాళ్లు, పాట వినగానే అందనంత దూరం పారిపోయేవాళ్లు...వీరు వారు అనే తేడా లేకుండా ‘పాట’ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఎలాగైనా ‘వరాల మూట’ను చేజిక్కించుకోవాలని గట్టిగా సంకల్పించుకున్నారు.పొద్దున్న ఏ తొమ్మిదింటికో, పదింటికో నిద్ర లేచే కుటుంబరావు... తెల్లవారుజామున మూడుగంటలకే లేచి గాత్రశుద్ధి కోసం ‘సా...రీ....రీ....గ...’ అని సంగీతసాధన మొదలుపెడుతున్నాడు. ఈ దెబ్బతో ఇంట్లోని వాళ్లకి నిద్ర లేకుండా పోయింది.పుసుక్కున పాటల పోటీలో విజేతగా నిలబడితే తమ దశ మారిపోతుందనే ఏకైక ఆశతో, ఆశయంతో వాళ్లు సర్దుకుపోతున్నారు.మరి ఇరిగింటోళ్లు, పొరుగింటోళ్ల సంగతి?వాళ్లెందుకు సైలెన్స్గా ఉంటారు? తమ విలువైన నిద్రను ఎందుకు త్యాగం చేస్తారు? అదిగో పొద్దున్నే ఎవరో కుటుంబరావు ఇంటి తలుపును దబాదబా బాదుతున్నారు....‘‘ఎవరండీ మీరు?’’ తలుపు తీసి అడిగింది కుటుంబరావు భార్య.‘‘రీ...రీ...గ...గ...సా...సా ఇంట్లో ఉన్నాడా?’’ ఆరా తీశాడు తలుపులు బాదిన వ్యక్తి.‘‘ఆయన ఎవరు?’’ ఆశ్చర్యం, విసుగును చూపుల మిక్సీలో వేసి కలిపి అడిగింది కుభా (కుటుంబరావు భార్య)‘‘అదేనమ్మా...రీ...రీ....గ...గ అంటూ మాకు నిద్ర లేకుండా చేస్తున్నాడు కదా... ఆ పెద్దమనిషి ఎక్కడ ఉన్నాడు?’’ అడిగాడు ఆయన.‘‘ఎందుకు?’’ అంటూ కాస్త ఆశ్చర్యంగా, కాస్త భయంగా అడిగింది కుభా.‘‘అంత గొప్ప గాత్రాన్ని ఎన్నడూ విన్న పాపాన పోలేదు. ఆయన్ను చూసి తరించిపోవాలనుంది. అమ్మా... ఒక్కసారి ఆయన్ని పిలుస్తారా’’ అని రిక్వెస్ట్గా అడిగాడు ఆయన.‘‘కుటూ... నీ కోసం ఇరుగింటి పొరుగింటి ఫ్యాన్స్ వచ్చారు...’’ అని కేకేసింది కుభా.అప్పుడే బాత్రూమ్లో నుంచి బయటికి వచ్చిన కుటుంబరావు....‘రీ...రీ...సా...గ...గా’ అని పాడుతూనే ‘ఏం కావాలి మీకు?’ అన్నట్లు సైగ చేశాడు.ప్రపంచంలోని మేలురకం తిట్లను తెలుగులోకి తర్జుమా చేసి మరీ తిట్టారు పొరుగువాళ్లు. ‘ఇంకోసారి...సా...రీ... అని పాడావంటే....ఏ గొంతుతో అయితే పాడుతున్నావో ఆ గొంతు నొక్కేస్తాం’ అని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు.ఇది కూకట్పల్లిలో ఉండే కుటుంబరావు పరిస్థితే కాదు, çసూరారంలో ఉండే సుబ్బారావు పరిస్థితి, చింతల్బస్తీలో ఉండే శ్రీనివాస్ పరిస్థితి.... దాదాపుగా అందరి ఉద్యోగుల పరిస్థితి! గిఫ్ట్ప్యాకేజా మజాకా! ఆరోజు ‘మిరాకిల్స్’ సంస్థ ప్రాంగణంలో పాటల పోటీ మొదలైంది...‘‘ఇప్పుడు నేను పాడబోయే పాట...‘ప్రేమాభిషేకం’ సినిమాలోనిది’’ అంటూ మొదలుపెట్టాడు కుటుంబరావు.‘ఆగదూ... ఆగదు.... ఆగితే సాగదు..’ అని మొదలుపెట్టాడో లేదో అతని ముఖంలో రంగులు మారాయి. ‘సభకు సారీ’ అంటూ స్టేజీ దిగి వేగంగా వెళ్లిపోయాడు కుటుంబరావు.ప్రేక్షకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.ఆ తరువాత సుబ్బారావు...‘రామ్మా చిలకమ్మ...ప్రేమా మొలకమ్మా...’ అని గొంతు సవరించాడు. గొంతు ఇంకాస్త పెంచగానే అతని కళ్లలో తేడా కనిపించింది. ‘సభకు సారీ’ అంటూ స్టేజీ దిగి వేగంగా పరుగులు తీశాడు.ఆ తరువాత...గుర్నాథం గొంతు విప్పాడు...‘రాను రానంటూనే చిన్నదో...చిన్నదో’ అంటూ చిన్నగా మొదలైన అతని గొంతు పెద్దదైంది. ఆ తరువాత అతని బాడీలాంగ్వేజ్ మొత్తం మారిపోయింది. మెలికలు తిరగడం మొదలైంది. ‘సారీ’ కూడా చెప్పకుండానే స్టేజీ దిగి పరుగు అందుకున్నాడు.‘‘ఇదేంటి పల్లవి కూడా పూర్తి కాకుండానే అందరూ ఇలా పరుగులు తీస్తున్నారు?’’ ‘మిరాకిల్స్’ యజమాని యుగంధర్ని ఆశ్చర్యంగా అడిగాడు పక్కనే కూర్చున్న అతని ఫ్రెండ్.‘‘ఆ పొరపాటు నా దగ్గరే జరిగింది. మా ఆవిడ మిత్రమండలి సభ్యురాలనే విషయం నీకు తెలుసుకదా. వచ్చే వారం వాళ్ల సంస్థ వార్షికోత్సవం జరగనుంది. ఇందులో భాగంగా తీపి వంటకాల పోటీ పెట్టారు. మా ఆవిడ ‘రన్ రాజా రన్’ పేరుతో ఒక కొత్త స్వీటు తయారుచేసింది. మీ వాళ్లకు టేస్ట్ చూపించి ఒపీనియన్ కనుక్కో అని ‘రన్ రాజా రన్’ ప్యాకెట్లు నా చేతికి ఇచ్చింది.‘ మీరు మరింత తీయగా పాడాలి. మా ఆవిడ చేసిన ఈ స్వీటు తినండి’ అని ఆ స్వీట్లను గాయకులందరికీ ఇచ్చాను. ఆ ఎఫెక్ట్ ఇలా ఉంటుందనుకోలేదు. స్టేజీ దిగిపారిపోయినవారంతా ఆ వాష్రూమ్ల దగ్గర నేను ముందంటే నేను ముందు అని కాలర్లు పట్టుకుంటున్నారు...అటు చూడు’’ అని వాపోయాడు యుగంధర్. – యాకుబ్ పాషా -
‘ఆస్తుల వివరాలు చెబితేనే ప్రమోషన్లు’
న్యూఢిల్లీ: దేశంలోని ఐఏఎస్ అధికారులంతా తమ ఆస్తుల వివరాలను జనవరి 31లోపు ప్రభుత్వానికి సమర్పించాల్సిందిగా సిబ్బంది, శిక్షణ విభాగం (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఎవరైనా వివరాలు సమర్పించకపోతే వారికి విజిలెన్స్ విభాగం క్లియరెన్స్ ఇవ్వదనీ, తత్ఫలితంగా పదోన్నతులకు గానీ, విదేశాల్లో పోస్టింగ్స్ పొందడానికిగాని అనర్హులవుతారని హెచ్చరించింది. ఆస్తులకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లోనే అప్లోడ్ చేసేందుకు అవకాశం కల్పించింది. ప్రస్తుతం దేశంలో 5,004 మంది ఐఏఎస్ అధికారులు విధుల్లో ఉన్నారు. -
ఆ చిన్నారే ఇప్పుడు నా హీరోయిన్ అయింది!
సాక్షి, సినిమా: నటుడు సునీల్ ఒకప్పుడు తాను ఎత్తుకున్న పాపే తనతో హీరోయిన్గా నటిస్తుందని తెలిపారు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం '2 కంట్రీస్' ఈ నెల 29న తెరపైకి రానుంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఓ సంఘటనను గుర్తుచేశారు. ‘సొంతం సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లినప్పుడు తమ కుమార్తెను ఎత్తుకోమని ఓ దంపతులు నన్ను కలిశారన్నారు. ఆ అమ్మాయిని ఎత్తుకున్న నాతో ఓ ఫొటో దిగారు. ఆ అమ్మాయే 2 కంట్రీస్ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది’ అని సునీల్ తెలిపారు. తొలిరోజు షూటింగ్ అయిన తర్వాత మనీషా రాజ్ తండ్రి సునీల్ని కలిసి ‘చాలా రోజుల క్రితం మా పాపను ఎత్తుకున్నారు. ఆ సమయంలో మేం మీతో ఫొటో దిగామని అని చెప్పారు. ఆ ఫొటోలో ఉన్న పాపే ఇప్పుడు నీతో హీరోయిన్గా చేస్తుంది’ అని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సునీల్ ఆశ్యర్యానికి లోనయ్యానని చెప్పారు. సునీల్ కామెడీ పాత్రలతో తన సినిమా జీవితాన్ని మొదలుపెట్టాడు. కమెడీయన్గా మంచి ఫామ్లో ఉన్నప్పుడే 'అందాల రాముడు'తో హీరోగా మారారు. ఆ సినిమా తరువాత కూడా హాస్య పాత్రలకే పరిమితమైన సునీల్.. 'మర్యాద రామన్న' తరువాత హీరో వేషాలవైపే దృష్టి పెట్టారు. అయితే సునీల్ మళ్ళీ హాస్య పాత్రలు చేసేందుకు ఆయన సిద్ధమయినట్ల వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్, ఎన్టీఆర్ చిత్రంలో, రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలోనూ కామెడీ రోల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలోస్తున్నాయి. -
పాతికేళ్లుగా పని చేస్తున్నా.. పదోన్నతి లేకపాయె!
పోలీస్ శాఖకు వాళ్లే బలం, వాళ్లే బలగం. వేలాది మంది నిత్యం రాత్రి, పగలు తేడా లేకుండా విధి నిర్వహణలో నిమగ్నమవుతారు. కాని ఏళ్లు గడుస్తున్నా ఒక్క ప్రమోషన్ కూడా లేదు. రాష్ట్రంలోని కానిస్టేబుళ్ల దుస్థితి ఇదీ. ఎస్ఐ స్థాయి నుంచి డీజీపీ వరకు ఎవరి కోటా కింద రావాల్సిన ప్రమోషన్ వాళ్లకు దక్కుతోంది. మరి కింది స్థాయిలోని వేలాది మంది కానిస్టేబుళ్ల పరిస్థితి మాత్రం ఒక్క ప్రమో షన్ కూడా లేకుండా రిటైర్మెంట్కు వెళ్లిపోతోంది. దీంతో పోలీస్ కానిస్టేబుళ్లు మానసిక వేదనకు గురవుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్గానే. . రాష్ట్ర రాజధానిలో పని చేసే పవన్ (పేరు మార్చాం) 1991లో కానిస్టేబుల్గా సెలక్ట్ అయ్యాడు. అప్పుడు అతడి వయసు 18 సంవత్సరాలు. సర్వీసులో చేరి 27 ఏళ్లు గడుస్తోంది. పవన్ ఇప్పుడు కూడా కానిస్టేబుల్గానే ఉన్నాడు. అదే 1991లో ఎస్ఐగా చేరిన అతడి స్నేహితుడు మహేశ్ (పేరు మార్చాం) ప్రస్తుతం డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇతడికి రెండు ప్రమోషన్లు వచ్చాయి. పవన్ చేసిన సర్వీస్, అతడి స్నేహితుడు మహేశ్ చేసిన సర్వీసు రెండూ ఒకటే. కాని ఇద్దరి ప్రమోషన్లలో తేడా. ఇలా పవన్ ఒక్కడే కాదు యావత్ తెలంగాణ పోలీస్ శాఖలో 25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వేలాది మంది కానిస్టేబుళ్లు కనీసం హెడ్కానిస్టేబుల్గా కూడా పదోన్నతి పొందుకుండానే పదవీ విరమణ పొందుతున్నారు. పదోన్నతికి పోస్టుల సమస్య.. పోలీస్ శాఖలో కానిస్టేబుళ్లే కీలకం. అయితే వేల సంఖ్యలో ఉన్న కానిస్టేబుళ్లకు హెడ్కానిస్టేబుల్గా పదోన్నతి ఇచ్చేందుకు పోస్టుల సమస్య ఉందని పోలీస్ శాఖ చెబుతోంది. ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ ప్రమోషన్ల కోసం సూపర్ న్యూమరరీ పోస్టులను పెంచారు. డీఎస్పీ, అదనపు ఎస్పీ అడహక్ పదోన్నతుల పేరిట వందలాది మంది అధికారులకు పదోన్నతులిచ్చారు. మరి కిందిస్థాయిలోని కానిస్టేబుళ్ల విషయంలో ఇలాంటి కొత్త పోస్టుల సృష్టి, లేదా సూపర్ న్యూమరరీ పోస్టులు పెంచడానికి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదన్న అంశంపై ఉన్నతాధికారులు నోరు మెదపడం లేదు. ఏడాది నుంచి శిక్షణ వాయిదా ప్రస్తుతం హెడ్కానిస్టేబుల్ పదోన్నతికి అర్హత సాధించి ట్రైనింగ్కు వెళ్లేందుకు 4 వేల మంది కానిస్టేబుళ్లు సిద్ధంగా ఉన్నారు. వీరికి శిక్షణ ఇచ్చి పోస్టింగ్స్ ఇచ్చేలోపు అందులో 285 మంది పదవీ విరమణ పొందే జాబితాలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఏడాది నుంచి వీరి శిక్షణ వాయిదా పడుతూ వస్తోంది. అసలే పదోన్నతి రాదు, వచ్చినా శిక్షణకు పంపకుండా ఏళ్ల తరబడి వాయిదా వేసి మానసిక వేదనకు గురి చేస్తున్నారని కానిస్టేబుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్లకోసారి పదోన్నతి ఇవ్వాల్సిందే! ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల వ్యవహారంలో సుప్రీంకోర్టు గతంలో పలు కీలకమైన సూచనలు చేసింది. పోలీస్ శాఖలో ప్రతీ ఆరేళ్లకోసారి పదోన్నతి కల్పించాలని స్పష్టంచేసింది. ఆరేళ్లు కానిస్టేబుల్గా పని చేస్తే హెడ్కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా ఆరేళ్లు సర్వీస్ పూర్తి చేస్తే ఏఎస్ఐగా పదోన్నతి కల్పించాలని ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులు అమలు చేసే అధికారులే వాటిని అటకెక్కించారు. అదేంటని అడిగితే వేల మందికి పదోన్నతులివ్వడం కుదరదని, పోస్టులు లేవని సమాధానం చెప్పి చేతులు దులుపుకుంటున్నారు. లేకుంటే పదోన్నతి ఇవ్వకుండా ఇంక్రిమెంట్లు ఇచ్చి వదిలేస్తున్నారు. కొత్త జిల్లాల్లో పోస్టుల సంగతేంటి? జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్త పోస్టులు ఏర్పాటు చేస్తూ జీవో నంబర్ 121ను ప్రభుత్వం జారీ చేసి ఏడాది గడిచింది. ఆ ప్రకారం ప్రభుత్వం మంజూరు చేసిన పోస్టులను భర్తీ చేయడంలోనూ పోలీస్ శాఖ అలసత్వం చూపిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ ఫోర్స్ విధానంలో భాగంగా పదోన్నతికి అర్హత సాధించిన ప్యానల్ ఏడాది రాగానే.. పదోన్నతి కోసం సిబ్బందికి పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణత సాధించిన వారికి పదోన్నతులు కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎస్ఐ పోస్టుల భర్తీ విషయంలో 30 శాతం కోటా కానిస్టేబుల్ ర్యాంకర్లది. కాని ఈ కోటాను కూడా పూర్తి స్థాయిలో భర్తీ చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు పోస్టుల పెంపుతోపాటు అర్హత సాధించిన వారిని ట్రైనింగ్ పంపించాలని కానిస్టేబుళ్లు వేడుకుంటున్నారు. -
పోలీసు పదోన్నతుల వివాదానికి తెర
సాక్షి, హైదరాబాద్: ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతుల వివాదాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం పరిష్కరించారు. దాదాపు నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించి, న్యాయ, పోలీసు శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులతో అనేక దఫాలుగా చర్చలు జరిపి ఒకేసారి 275 మందికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా, ఏఎస్పీలుగా, డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. దీనివల్ల 1994 బ్యాచ్ వరకు ప్రతి పోలీసు అధికారికి పదోన్నతి లభించనుంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి శనివారం రాత్రి సంతకం చేశారు. పోలీసు అధికారుల పదోన్నతిపై ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమైక్య రాష్ట్రంలోనే పదోన్నతుల విషయంలో వివక్ష, గందరగోళం జరిగిందని, ఈ సమస్యను పరిష్కరించి, పదోన్నతుల్లో పారదర్శకత పాటించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయంకూడా తీసుకుని వివాదాలకు తావులేని విధంగా సమస్యను పరిష్కరించారు. రాష్ట్రవ్యాప్తంగా 139 మంది సీఐలకు డీఎస్పీలుగా, 103 మంది డీఎస్పీలకు ఏఎస్పీలుగా, 33 మంది ఏఎస్పీలకు నాన్క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. పదోన్నతులతో ఖాళీ అయిన పోస్టులు భర్తీ చేయాలని, అవసరమనుకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు. అంతకుముందు పోలీసు అధికారుల పదోన్నతి అంశంపై విస్తృతంగా చర్చించారు. ‘‘అర్హులైన వారందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సకాలంలో పదోన్నతి లభించాలి. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అలాంటి న్యాయం జరగలేదు. వివక్ష చూపడం వల్ల కొంతమందికి అన్యాయం జరిగింది. జోన్ల వారీగా నియామకాలు జరిగినప్పటికీ రాష్ట్ర స్థాయి కేడర్కు పదోన్నతి కల్పించే సందర్భం లో జోన్ల నిష్పత్తి పాటించలేదు. గతంలో ఇన్స్పెక్టర్ స్థాయి నుండి డీఎస్పీ స్థాయి వరకు ప్రమోషన్లు ఇచ్చినప్పుడు జరిగిన తప్పొప్పులను సరిదిద్ది, ఎవరికీ అన్యాయం జరుగకుండా చూడాలి. అన్యాయాన్ని సరిదిద్దడానికి అవసరమైనచోట సూపర్ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాలి. ఇలా చేయడంవల్ల వరంగల్ జోన్లో ఇన్స్పెక్టర్లకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవచ్చు’’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం, మంత్రులు పోచారం, తుమ్మల, ఈటలæ, ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్శర్మ, చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్శర్మ, అడ్వకేట్ జనరల్ ప్రకాశ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోలీసు అధికారుల పదోన్నతుల్లో అన్యాయాలను సరిచేసి, అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇచ్చినందుకు ఐదవ జోన్ కు చెందిన ప్రజా ప్రతినిధులు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. -
కాజల్ కంటికి ఇంపుగా!
కాజల్.. కాటుక. కంటికి అందాన్నిస్తుంది. బుగ్గ మీద దిష్టి చుక్క అవుతుంది. కాజల్.. అగర్వాల్. కంటికి ఇంపుగా కనిపిస్తుంది. సొంపైన డ్రెస్కి అడ్రెస్ అవుతుంది. ►డిజైనర్ నిషికా లుల్లా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. లైట్ పింక్ జంప్ సూట్ ఇది. డిజైనర్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, పొనీటెయిల్తో ఒక స్టైలిష్ లుక్ని తీసుకువచ్చాం. క్యాజువల్ వేర్కి, వెస్ట్రన్ పార్టీలకు ఈ డ్రెస్ బాగా సూటవుతుంది. ►అనితాడోంగ్రె డిజైన్ చేసిన ఇండిగోబ్లూ అసమెట్రికల్ ట్యూనిక్ ఇది. సర్డార్ గబ్బర్సింగ్ ప్రమోషన్కి ఈ డ్రెస్ని ఎంపిక చేశాను. కాటన్ ఫ్యాబ్రిక్ అవడంతో కంఫర్ట్ ఉంటుంది. క్యాజువల్గా ఏ టైమ్లో ధరించినా స్టైలిష్గా ఉంటుంది. ఏ శరీరాకృతి గలవారికైనా ఈ స్టైల్ నప్పుతుంది. ►తానియా ఖనూజా డిజైన్ చేసిన డ్రెస్ని ఫొటో షూట్ కోసం వాడాం. టాప్ ముందు భాగంలో కురచగా, వెనకాల పొడవుగా ఉంటుంది. జార్జెట్ మెటీరియల్పైన సెల్ఫ్ ఎంబ్రాయిడరీ చేశారు. భుజాలు, సీటు భాగం వెడల్పుగా ఉండేవారు ఇలాంటి స్టైల్ వేసుకుంటే ఇంకా స్లిమ్గా కనపడతారు. ►డిజైనర్ నిషికా లుల్లా డిజైన్ చేసిన డ్రెస్ ఇది. లైట్ పింక్ జంప్ సూట్ ఇది. డిజైనర్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, పొనీటెయిల్తో ఒక స్టైలిష్లుక్ని తీసుకువచ్చాం. క్యాజువల్ వేర్కి, వెస్ట్రన్ పార్టీలకు ఈ డ్రెస్ బాగా సూటవుతుంది. ►ఈ మెటాలిక్ ఎంబలిష్డ్ లెహంగా, స్టైలిష్ క్రాప్టాప్ని శంతను నిఖిల్ డిజైన్ చేశారు. ఇది డ్రెడిషనల్ డ్రెస్ అవడంతో సంప్రదాయ వేడకులకు బాగుంటుంది. సినిమా ఆడియోలాంచ్ వేడుకకు ఈ డ్రెస్ను ఎంపిక చేశాం. ఆమ్రపాలి ఆభరణాలు ఈ లుక్కి మరింత వన్నెలు అద్దాయి. ► ఒక టీవీ ప్రోగ్రామ్లో కాజల్ పాల్గొనాల్సి ఉంది. ఈ షోలో ఆమె లుక్ ప్రెట్టీగా, అదే టైమ్లో డ్రెస్ కంఫర్ట్ ఉండాలి. అందుకు సమత్వన్ బై అంజలీ భాస్కర్ డిజైన్ ఈ బాడీకాన్ డ్రెస్ని ఎంచుకున్నాం. వైట్ జరా స్నీకర్స్ జత చేయడంతో స్టైలిష్తో పాటు, స్పోర్టివ్ లుక్ వచ్చింది. ► ఒక సినిమా ప్రమోషన్లో భాగంగా ప్రెస్మీట్కోసం ఎంపిక చేసిన బీజ్ డ్రెస్ ఇది. హ్యాండ్లూమ్, కాటన్ సిల్క్ మెటీరియల్స్తో తానెయా ఖనూజా డిజైన్ చేసినదీ డ్రెస్. వెస్ట్రన్, నైట్ పార్టీలకు ఈ తరహా డ్రెస్ బాగా సూటవుతుంది. ► ఇకత్ ఫ్యాబ్రిక్తో డిజైన్ చేసిన కోల్డ్ షోల్డర్ క్యాజువల్ వేర్ ఇది. నిషికా లుల్లా డిజైన్ చేసిన ఈ డ్రెస్ మోడల్ని ఏ ఫ్యాబ్రిక్తోనైనా డిజైన్ చేసుకోవచ్చు. క్యాజువల్ వేర్కి బాగా నప్పే డ్రెస్ ఇది. (కాజల్ దుస్తులకు నీరజ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ) నటి కాజల్ అగర్వాల్తో నీరజ కోన సినీ తారల డ్రెస్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ నిర్వహణ: ఎన్.ఆర్. -
ఆల్ ద బెస్ట్!!
పిల్లలు పరీక్షలకు రెడీ.. ఆల్ ద బెస్ట్!! పేరెంట్స్ చెయ్యాల్సిందంతా చేశారు! స్ట్రెస్ లేకుండా.. స్ట్రెస్ ఇవ్వకుండా పిల్లల్ని పరీక్షలకు పంపించండి! ఆల్ ద బెస్ట్!! పిల్లల పరీక్షలు తల్లిదండ్రులకు పెద్ద పరీక్షే. పిల్లలు ఎలాగూ కష్టపడుతున్నారు. పెద్దల యాంగ్జయిటీ అంతా ‘మనం కూడా కష్టపడుతున్నామా’ అన్నదే. పిల్లల పరీక్షల్లో భాగస్వాములుగా కాకపోతే ఫెయిలవుతామేమో అన్న భయం. ‘ఆ ఫార్మూలా గుర్తుంటుందా?’, ‘ఏ కాంటినెంట్ పక్కన ఆఫ్రికా ఉందో జ్ఞాపకం ఉంటుందా?’, ‘ఏ ప్లస్ బి హోల్స్క్వేర్ ఎంత?’, ‘సెకండ్ టైమ్ రివిజన్ కంప్లీట్ అయిందా?’ , ‘పొద్దున మూడింటికి అలారమ్ పెట్టి లేపుతాను సరేనా?’ .. పిల్లలకు ఇవ్వన్నీ చెప్పాలంటే పేరెంట్స్ ఎంతగా ప్రిపేర్ కావాలి? ప్రిపేర్ అయ్యేది పేరెంట్స్.. పరీక్ష రాసేది పిల్లలు. పిల్లలు మంచి మార్కులతో పాసవ్వాలనే యాంగ్జయిటీలో ఒక్కోసారి పిల్లల్ని కూడా యాంగ్జయిటీకి గురిచేస్తున్నారు. పిల్లల్లో లేని భయాన్ని సృష్టిస్తున్నారు. దాంతో జవాబులన్నీ తెలుసుండీ కూడా ఆన్సర్ పేపర్ ముందుకు వెళ్లేసరికి బ్లాంక్ అయిపోతున్నారు పిల్లలు. అందుకు పిల్లలకు కొంచెం ఊపిరాడే చోటిస్తే బాగుంటుందని చెప్తున్నారు నిపుణులు. పిల్లలూ అదే కోరుకుంటున్నారని తెలిసింది.. ఓ సోడా కంపెనీ తన సీఎస్సార్ కింద చేసిన ఓ డిజిటల్ ప్రమోషన్లో. ఇందులో పెద్దలు పెట్టిన ఒత్తిడితో సతమతమవుతున్న çపధ్నాలుగు, పదిహేనేళ్ల వయసు పిల్లలు.. పెద్దల నుంచి తాము ఎలాంటి మద్దతును ఆశిస్తున్నారో తెలుపుతూ తమ తల్లిదండ్రులకు ఉత్తరాలు రాశారు. చూస్తుంటే.. వింటుంటే.. హృదయం ద్రవిస్తోంది. ఆ ఉత్తరం ముక్కలను మీకోసం పట్టుకొచ్చాం.. ఒక్కసారి చదవండి! పిల్లల మనసు అర్థమవుతుంది! మీ స్ట్రెస్ చూస్తుంటే నర్వస్గా ఉంటుంది.. ప్రియమైన అమ్మా, నాన్నకు.. నేనంటే మీకెంత ఇష్టమో నాకు తెలుసు. అయినా చదువు విషయంలో మీ ప్రవర్తన నాకు అర్థంకాదు. ఫ్రెండ్స్తో కలవనివ్వరు. ఆడుకోనివ్వరు. ఓ బందీలా చూస్తారు. ఎందుకమ్మా? ఎందుకు నాన్నా? నాకు పరీక్షలొస్తున్నాయంటే మీరు స్ట్రెస్ ఫీలవుతారు. మీ స్ట్రెస్ చూస్తుంటే నాకు నర్వస్గా ఉంటుంది. మీరు నా పట్ల చూపిస్తున్న ప్రేమంటే నాకు చాలా కన్సర్న్ నాన్నా.. అమ్మా! కాని కొన్నిసార్లు, కొన్ని విషయాల్లో నన్ను వదిలేయండి. నన్నుగా ఉండనివ్వండి. ప్లీజ్! జీవితంలో మీ గౌరవాన్ని ఎక్కడా తగ్గించను. నన్ను కన్నందుకు మీరు గర్వపడేలా చేస్తాను. ఇట్లు మీ కూతురు కేసంగ్ నన్ను నమ్మండి ప్లీజ్ డియర్.. అమ్మా అండ్ అప్పా.. ఏ విషయంలోనైనా నాకెంత బెరుకు, భయమో మీకు తెలుసు. ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకొని మీకు ఈ ఉత్తరం రాస్తున్నా. కిందటేడాది నేను మంచి మార్కులు తెచ్చుకోలేదు. కాని ఈసారి మార్కుల కోసం బాగా కష్టపడుతున్నా. టీవీలో ఫుట్బాల్, క్రికెట్ మ్యాచెస్ చూడాలనుకుంటా. వాటితో రిలాక్స్ అవాలనుకుంటా. నా ప్రెషర్ తగ్గించుకోవాలనుకుంటా. కాని మీరు పరీక్షల కోసం టీవీ కనెక్షన్ కట్ చేయించారు. దయచేసి నన్ను అర్థంచేసుకోండి! నేను బాగా చదువుతున్నాను. నన్ను నమ్మంyì ప్లీజ్! మీ ప్రవర్తన వల్ల చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నా. ఎవరితో మాట్లాడకుండా బాత్రూమ్లోకి వెళ్లి తలుపేసుకొని నన్ను నేను బంధించుకోవాలనిపిస్తోంది. మనింటిని నార్మల్ హౌజ్లా ఉంచడమ్మా...! ఇట్లు మీ అబ్బాయి కార్తిక్ ప్లీజ్ హెల్ప్ మీ నాన్నా.. ప్రియమైన నాన్నకు.. నాకు ఎగ్జామ్స్ అంటే భయంలేదు. మీరంటేనే భయమేస్తోంది. ఎంతలా అంటే మిమ్మల్ని తలచుకుంటే ధైర్యం రావాల్సింది పోయి కళ్లల్లో నీళ్లొస్తున్నాయి. అందరిముందు నిషి ఆంటి కూతురుతో నన్ను కంపేర్చేయొద్దు ప్లీజ్! నన్ను నాలా ఉండనివ్వండి నాన్నా! నువ్ అనుక్షణం నా గురించే ఆలోచిస్తూ.. నాతోనే ఉన్నా నువ్వు నాతో ఉన్నావన్న ధైర్యమే నాకు రావడంలేదు నాన్నా.. నిన్ను తలచుకుంటేనే భయమేస్తోంది. ప్లీజ్ హెల్ప్ మీ నాన్నా.. మీ లవింగ్ డాటర్ నిఖిత భయమేస్తోంది.. ప్రియమైన అమ్మా, నాన్నకు.. పరీక్షలు దగ్గరపడుతున్నాయి. భయమేస్తోంది. సరిగ్గా రాయలేనేమో అని కాదు.. మీరు నామీద పెట్టుకున్న అంచనాలను తలచుకుంటే భయమేస్తోంది. నా చదువు పట్ల మీరెంత శ్రద్ధ పెడుతున్నారో నాకు తెలుసు. కానీ నేనూ అంతే కష్టపడుతున్నానని మీకెందుకు అర్థంకావట్లేదమ్మా? ఎంత చదువుతున్నా.. ఎన్ని మార్క్స్ వస్తున్నా ఇంకా చదవట్లేదనే తిడ్తున్నారు. తట్టుకోలేకపోతున్నానమ్మా.. అందుకే పరీక్షలు వస్తున్నాయంటే భయమేస్తోంది! మీ ఒత్తిడికి ఊపిరాడనట్టవుతోంది. స్కూల్ నుంచి, మీ నుంచి పారిపోవాలనిపిస్తోంది. ప్లీజ్ నన్ను డిమోటివేట్ చేయొద్దమ్మా! నా మానాన నన్ను చదవనివ్వండి. మీరు తలెత్తుకునేలా చేస్తాను. ప్రామిస్! లవ్ యూ మా.. లవ్ యూ పా..! ఇట్లు మీ కూతురు అనీష మార్కులు తప్ప జీవితమే లేనట్టు... డియర్ మదర్.. నాతో నువ్వెప్పుడూ మార్కులు, కాంపిటీషన్ గురించే మాట్లాడతావ్! నువ్వు చెప్పినన్ని మార్కులు తెచ్చుకోకపోతే.. టాపర్స్తో కంపీట్ చేయలేకపోతే ఇక నా లైఫ్ వేస్ట్ అన్న ఫీలింగ్ను కలిగిస్తున్నావ్! మార్కులు తప్ప నాకు ఇక లైఫే లేదన్న ఫీల్ వస్తోందమ్మా..! జీవితమంటే మార్కులేనా అమ్మా...? నువ్వు, నాన్న .. నాతో ఒక్కసారి కూడా నెమ్మదిగా మాట్లాడరు. మార్కుల గురించి కాక ఇంకో టాపిక్ తీసుకురారు. మీరనుకున్నదానికంటే ఒక్క మార్క్ తక్కువైనా నా మీద గట్టిగట్టిగా అరుస్తారు. తిడ్తారు. మీరు తిట్టిన రాత్రిళ్లు ఒక్క క్షణం కూడా నాకు నిద్ర ఉండదు తెలుసా అమ్మా.. ! నువ్వు నామీద అరిచిన ప్రతిసారీ నాకెంతో దూరమైపోయినట్టు.. నువ్వో కొత్త మనిషిలా కనిపిస్తావమ్మా! ఆ క్షణంలో నిన్ను చూస్తుంటే భయమేస్తుంది. ఇంట్లోంచి పారిపోవాలనిపిస్తుంది. కడుపులో తిప్పుతుంది. వామ్టింగ్ వచ్చినట్టువుతుంది. అమ్మా.. నేను బాగా చదువుతానమ్మా.. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నన్ను తిట్టొద్దమ్మా! మీ కూతురైనందుకు చాలా గర్వంగా ఉంది. నాకోసం ఇంతగా కష్టపడుతున్నందుకు మీకెప్పుడూ రుణపడి ఉంటా. మీ గౌరవం నిలబెడ్తా. ఇట్లు మీ చిట్టితల్లి టీనా మైడియర్ పేరెంట్స్.. పది గంటలపాటు ఒక్క ఉదుటున.. కుదురుగా కూర్చోని చదివేంత ఎనర్జి నాకు లేదని మీకు తెలుసు. అయినా ఎటూ కదలనివ్వకుండా నా గదిలో కూర్చోబెట్టి చదివిస్తుంటారు. పైగా అరగంటకు ఒకసారి వచ్చి చెక్ చేస్తుంటారు నేను కుదురుగా ఉన్నానో లేదోనని. ఇదంతా నాకు చాలా బాధగా ఉంది. మీరలా చేయడం వల్లే నేను నా కాన్సంట్రేషన్ను కోల్పోతున్నాను. అమ్మా... నాన్నా.. ప్లీజ్ మాటిమాటికి నా సిన్సియారిటీని చెక్ చేయకండి! నా కాన్ఫిడెన్స్ను దెబ్బతీయకండి.ప్లీజ్... ఇట్లు మీ అబ్బాయి అన్షుల్ ఇవి ఉత్తరాలు కావు.. పసి హృదయాల ఆవేదనకు అక్షర రూపాలు. టీనేజర్స్లో అంతకంతకు పెరుగుతున్న డిప్రెషన్, సూసైడల్ టెండన్స్లకు కారణం పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లల మీద పెట్టే ఒత్తిడేనని ఎన్నో నివేదికలు, మానసిక విశ్లేషణలూ ఘోషిస్తున్నాయి. ఈ తరమే రేపటి మన దేశ బంగారు భవిష్యత్తు. వాళ్ల అభ్యర్థనను అర్థం చేసుకుందాం. మన పిల్లల్ని కాపాడుకుందాం! మార్కుల మిల్లుల్లా కాదు మానవత్వమున్న మనషుల్లా పెంచుకుందాం! -
ఇక సుప్రీంకు..
సాక్షి, చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్ పదోన్నతిపై సుప్రీంకోర్టులో అడుగు పెట్టనున్నారు. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో బుధవారం రాష్ట్ర హైకోర్టులో తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇక, మద్రాసు హైకోర్టుకు ప్రధానన్యాయమూర్తిగా ఎవర్ని నియమిస్తారో అన్న ఎదురుచూపుల్లో న్యాయ వర్గాలు పడ్డాయి. శ్రీనగర్కు చెందిన సంజయ్కిషన్ కౌల్ 2014 జూలై 26వ తేదీన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సంజయ్ బాధ్యతలు స్వీకరించారు. కేసుల సత్వర పరిష్కారంతోపాటు, హైకోర్టు, మదురై ధర్మాసనంలలో భద్రతా పరంగా చర్యల్ని వేగవంతం చేశారు. సీఐఎస్ఎఫ్ బలగాల గొడుగు నీడలోకి తీసుకొచ్చారు. న్యాయ పరంగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సుమోటో కేసులతో ప్రభుత్వాన్ని బెంబేలెత్తించారని చెప్పవచ్చు. అన్నాడీఎంకే ప్రభుత్వానికి పక్కలో బల్లెంగా వ్యవహరిస్తూ, పలు విషయాల్లో ముచ్చమటలు పట్టించారు. ప్రభుత్వానికి పలు మార్లు అక్షింతలు వేయడంతో పాటు జరిమానా మోత సైతం మోగించారు. ప్రధానంగా హైకోర్టులో ఖాళీల భర్తీకి సంజయ్ కిషన్ కౌల్ చర్యలు అభినందనీయం. ముౖప్పై మందిలోపు ఉన్న హై కోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 60కు సమీపంలోకి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. న్యాయపరంగా అందర్నీ కలుపుకెళ్లే తత్వం కల్గిన సంజయ్ కిషన్ కౌల్కు ప్రస్తుతం పదోన్నతి లభించింది. ఆయన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. స్వయంగా ఈ వివరాలను కోర్టులో సంజయ్ కిషన్ కౌల్ పేర్కొనడం గమనార్హం. న్యాయవాది యానై రాజేంద్రన్ ఓ కేసును అత్యవసరంగా పరిగణించి విచారణకు స్వీకరించాలని ప్రధాన న్యాయమూర్తి సంజయ్కిషన్ కౌల్ను ఉదయం విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ కేసును అత్యవసరంగా తాను స్వీకరించ లేనని, అవసరం అయితే, మరోబెంచ్కు బదిలీ చేస్తానని ప్రకటించారు. దీంతో కోర్టు హాల్లో ఉన్నవాళ్లందరూ విస్మయానికి గురయ్యారు. తనకు ఇదే చివరి రోజు అని, సుప్రీంకోర్టుకు పదోన్నతి మీద వెళ్తున్నట్టు ప్రకటించారు. దీంతో పక్కనే ఉన్న మరో న్యాయమూర్తి సుందరేష్తో పాటు కోర్టు హాల్లో ఉన్న వాళ్లందరూ సంజయ్ కిషన్ కౌల్కు శుభాకాంక్షలు తెలియజేశారు. కౌల్ పదోన్నతి మీద వెళ్తుండడంతో, ఇక, మద్రాసు హైకోర్టుకు కొత్త న్యాయమూర్తి ఎవరన్న చర్చ బయలు దేరింది. ఏ రాష్ట్రం నుంచి ఎవరు వస్తారో అన్న ఎదురు చూపుల్లో న్యాయవర్గాలు ఉన్నాయి. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లు రద్దు
న్యూఢిల్లీ: పదోన్నతులకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన రిజర్వేషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ‘ప్రభుత్వ ఉద్యోగులకు రిజర్వేషన్ల ఆధారంగా ప్రమోషన్లు కల్పించే చట్టం – 2002’ ను రద్దు చేసిన అత్యున్నత న్యాయస్థానం.. ఈ చట్టం ‘కాచ్ అప్ రూల్’కు విరుద్ధమని పేర్కొంది. ప్రమోషన్లకు రిజర్వేషన్లు కల్పించే ముందు.. ప్రాతినిధ్య కొరత, వెనకబాటుతనం, పూర్తి సామర్థ్యం తదితరాలు ఉన్నాయో లేదో పరిగణనలోకి తీసుకోవాలని తెలిపింది. ఈ చట్టంలోని అంశాలు ఆర్టికల్ 14 (సమానత్వపు హక్కు), ఆర్టికల్ 16 (ప్రభుత్వ సర్వీసుల అవకాశాల్లో సమానత్వం)ల పరిధి దాటి ఉన్నాయని న్యాయమూర్తులు జస్టిస్ ఏకే గోయల్, జస్టిస్ యూయూ లలిత్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రాతినిధ్య కొరత, వెనకబాటుతనం తదితరాలు ఉన్నప్పుడే రిజర్వేషన్ల ద్వారా ప్రమోషన్లు ఇవ్వాలని వివరించింది. -
విషాదంగా మారిన ’రయీస్’ ప్రమోషన్
-
హైదరాబాద్లో ఆమిర్ సందడి
-
హెచ్ఎంలకు పదోన్నతులు
► రాత్రివరకు కొనసాగిన తర్జనభర్జన ► తమకు అవసరం లేదన్న ఇద్దరు అనడంతో మరో ఇద్దరికి అవకాశం ఒంగోలు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 18 ప్రధానోపాధ్యాయుల పోస్టులకు పదోన్నతులను ఖరారుచేశారు. అర్హులైన వారికి జిల్లా విద్యాశాఖ అధికారి డీవీ సుప్రకాష్ శనివారం ఉత్తర్వులు అందించారు. ఉదయం పదోన్నతుల కౌన్సెలింగ్ స్థానిక జిల్లా పరిషత్ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో జరిగింది. జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు, జిల్లా రెండో సంయుక్త కలెక్టర్ ఐ.ప్రకాష్కుమార్ మాట్లాడుతూ పాఠశాలల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. డీఈవో డీవీ సుప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలో ఖాళీలు ఉన్న స్కూల్ అసిస్టెంట్లు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులను కూడా భర్తీ చేస్తామని డీఈవో పేర్కొన్నారు. అయితే పదోన్నతుల కౌన్సెలింగ్ సందర్భంగా ఇద్దరు ఉపాధ్యాయులు తమకు పదోన్నతులు అవసరంలేదని ప్రకటించారు. దీంతో వారి స్థానంలో మరో ఇద్దరిని తీసుకోవాలని నిర్ణయించారు. ఒక పోస్టు ఎస్సీకి, మరో పోస్టు ఓసీకి కేటాయించేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఈ సందర్భంలో పలు ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. నిబంధనల ప్రకారం సీనియార్టీ జాబితాలో ఉన్న ఇద్దరికే అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడంలో రాత్రి వరకు జాప్యం జరిగింది. అన్ని ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం సీనియార్టీ లిస్టులో ఉన్నవారికే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఉపాధ్యాయ సంఘాలకు చెందిన వై.వెంకట్రావు(హెచ్ఎం అసోసియేషన్), జి.ఎస్.ఆర్. సాయి(స్కూల్ అసిస్టెంట్స్ అసోసియేషన్), వెంకటేశ్వర్లు(బీటీఏ), ఎం.వెంకటేశ్వరరెడ్డి(యూటీఎఫ్), చంద్రశేఖర్ (వైఎస్సార్టీఎఫ్) తదితరులు పాల్గొన్నారు. పదోన్నతులు పొందినవారు.. ఎం.దేవంద్రరావు-అన్నంబొట్లవారిపాలెం, కె.వి శ్రీనివాసరావు-తిమ్మాయపాలెం, సీహెచ్ సుధాకరరావు-త్రోవగుంట, ఎం.వెంకటేశ్వర్లు-ఈపూరుపాలెం, జి.రత్నావళి-శంకవరప్పాడు, బి.డేవిడ్-సీఎస్పురం, వి.పార్వతిశాంతి-టి.నాయుడుపాలెం, జి.వసుంధరాదేవి-ఇనమనమెళ్లూరు, ఎం.ప్రభాకర్-కె.ఉప్పలపాడు, ఎస్.శ్యాంప్రసాద్-ఎనికపాడు, బి.భారతి-పెట్లూరు, ఐ.పురుషోత్తమరావు-ఓబులక్కపల్లి, కె.వెంకటేశ్వర్లు-దిరిశవంచ, జీఎస్ పద్మజ- పందిళ్లపల్లి, బి.అమూల్య-బిపేట బాలికోన్నత పాఠశాల, పీవీ రామమోహన్-పెద్దరాజుపాలెం, ఆర్.కొండారెడ్డి-యర్రబాలెం, కేవీఎన్ శైలజ-గురవాజీపేట. -
ఆర్టీసీ డిప్యూటీ సీటీఎంగా కిషోర్
కడప అర్బన్ : ఏపీఎస్ఆర్టీసీ డిప్యూటీ సీటీఎంగా ఆర్ఆర్ కిషోర్ గురువారం సాయంత్రం ఆర్ఎం కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. 1992లో చిత్తూరులో డిపో మేనేజర్గా బాధ్యతలను చేపట్టిన ఈయన తర్వాత అనంతపురం, కడప రీజినల్లో పని చేశారు. 2006లో పదోన్నతి పొందారు. హైదరాబాద్లో పనిచేస్తూ, రాష్ట్ర విభజనలో విజయవాడకు వచ్చి అక్కడ విధులు నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటీ సీటీఎం హోదాలో జిల్లాకు బదిలీ ఆయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ వంతు ప్రయాణికులకు సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు. -
18 మంది ఎసై ్సలకు సీఐలుగా పదోన్నతి
సాక్షి, గుంటూరు: గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన 18 ఎసై ్సలకు సీఐలుగా పదోన్నతి కల్పిస్తూ గుంటూరు రేంజ్ ఐజీ ఎన్ సంజయ్ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని ఏలూరు, గుంటూరు రేంజ్ పరిధిలో ఎసై ్సల పదోన్నతులకు బీపీసీ రెండు నెలల క్రితమే అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఏలూరు రేంజ్ పరిధిలో 42 మంది ఎసై ్సలకు సీఐలుగా పదోన్నతులు ఇస్తూ రెండు నెలల క్రితమే అక్కడి ఐజీ పోస్టింగ్లు కేటాయించగా, గుంటూరు రేంజ్ పరిధిలో మాత్రం రెండు నెలలుగా పదోన్నతుల కోసం 18 మంది ఎసై ్సలు ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి ఆశలు ఫలించి శుక్రవారం పదోన్నతి లభించింది. పదోన్నతితోపాటు అందరికి సీఐడీ, ఏసీబీ, పీటీసీ వంటి లూప్లైన్ లో పోస్టింగ్లు ఇచ్చారు. -
రెవెన్యూ శాఖలో భారీగా పదోన్నతులు
80 మందికి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదా సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ ఎత్తున స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పదోన్నతులు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఒకేసారి 80 మంది రెవెన్యూ అధికారులు పదోన్నతులు పొందనున్నారు. ఈ మేరకు కసరత్తు పూర్తి చేసిన రెవెన్యూ శాఖ.. సిద్ధమైన జాబితాను గురువారం సీసీఎల్ఏ రిమార్క్ కోసం పంపింది. అక్కడి నుంచి సమాచారం రాగానే పదోన్నతుల ఉత్తర్వు జారీ కానుంది. ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటుతో ఒక్కసారిగా జిల్లా రెవెన్యూ అధికారుల పోస్టులు ఖాళీ అయ్యాయి. పలువురు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, ప్రొబెషనరీ డిప్యూటీ కలెక్టర్ పోస్టులు కూడా ఖాళీ అయ్యాయి. జాయింట్ కలెక్టర్లుగా నాన్ కేడర్ రెవెన్యూ అధికారులను సర్దుబాటు చేయటంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. దీంతో డీఆర్ఓ సహా సర్వే సెటిల్మెంట్స్, భూసేకరణ తదితర విభాగాల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. పాత జిల్లాల్లో మూడు చోట్ల మినహా మిగతా జిల్లాల డీఆర్వోలంతా జాయింట్ కలెక్టర్లు అయ్యారు. వీరు సరిపోక వివిధ పోస్టులు, డిప్యుటేషన్లలో ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకూ జేసీలుగా పదోన్నతి కల్పించి నియమించారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డ నేపథ్యంలో ఈ ఖాళీలను భర్తీ చేయకపోతే పాలన పడకేసే ప్రమాదం ఉండటంతో వెంటనే పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కసరత్తు ప్రారంభించారు. -
పౌరసరఫరాల శాఖ అధికారులకు పోస్టింగులు
సాక్షి, హైదరాబాద్: జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారుల (డీసీఎస్వో)కు పోస్టింగులు ఖరారయ్యాయి. పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.వి.ఆనంద్ శని, ఆదివారాల్లో ఆ శాఖలోని అధికారులు, ఉద్యోగులకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగులు ఖరారు చేశారు. మంగళవారం నుంచి కొత్త జిల్లాలు ఉనికిలోకి రానున్న నేపథ్యంలో 31 జిల్లాలకు అధికారుల పేర్లను ఖరారు చేశారు. ఖరారైన వారిలో ఎం.కె.రాథోడ్ (హైదరాబాద్), బి.ఎన్.వి.వి.కృష్ణప్రసాద్(నిజామాబాద్), ఎస్.ఉదయ్కుమార్(నల్లగొండ), ఎం.గౌరీశంకర్(రంగారెడ్డి/శంషాబాద్), డి.అనురాధ (సూర్యాపేట), పి.బి.సంధ్యారాణి (ఖమ్మం), ఎ.ఉషారాణి (కరీంనగర్), వి.నాగేశ్వర్రావు(మేడ్చల్), ఎస్.అమృతారెడ్డి (కొత్తగూడెం), పి.రాజారావు(జయశంకర్/భూపాలపల్లి), ఎ.వి.ఎస్.వి.ప్రసాద్రావు (సంగారెడ్డి), పి.సత్యనారాయణ(జగిత్యాల), వి.వెంకటేశ్వర్లు(సిద్దిపేట), ఐ.శారదాప్రియదర్శిని (మహబూబ్నగర్), ఎన్.విజయలక్ష్మి(వరంగల్ అర్బన్), ఎ.రమేశ్(కామారెడ్డి), జి.రేవతి (మెదక్), కె.అబీబ్ ఉర్ రహమాన్(పెద్దపల్లి), ఎ.లక్ష్మణ్ (మహబూబాబాద్), సి.హెచ్.తనూజ(వనపర్తి), సి.పద్మజ(వికారాబాద్), పి.సంధ్యారాణి (యాదాద్రి), జె.యుగంధర్ (మంచిర్యాల), వి.మోహన్బాబు (నాగర్కర్నూలు), ఎస్.విలియమ్స్ పీటర్(వరంగల్ రూరల్), ఆర్.చంద్రశేఖర్రెడ్డి(గద్వాల), పి.రుక్మిణీదేవి(జనగామ), ఆర్.సుదర్శనమ్(నిర్మల్), సి.పద్మ(సిరిసిల్ల), ఎం.శ్రీకాంత్రెడ్డి(ఆదిలాబాద్), టి.సత్యనారాయణ(ఆసిఫాబాద్/కొమురం భీం) ఉన్నారు. 11 మంది అధికారుల డిప్యుటేషన్లు రద్దు... వివిధ జిల్లాల్లో ఏఎస్వోలుగా పోస్టింగులు పొంది, అక్కడ పనిచేయకుండా హైదరాబాద్లోని కమిషనర్ ఆఫీసు, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ (సీఆర్వో) కార్యాలయాల్లో కదలకుండా ఏళ్లకు ఏళ్లుగా తిష్ట వేసిన పౌరసరఫరాల శాఖ అధికారుల డిప్యుటేషన్లను కమిషనర్ సి.వి.ఆనంద్ రద్దు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆదేశాలు జారీ చేశారు. వీరిలో చాలామంది వివిధ కారణాలను సాకుగా చూపెట్టి, తమకున్న రాజకీయ పరిచయాలను వాడుకుని డిప్యుటేషన్లపై హైదరాబాద్కు వచ్చారు. ఇప్పటిదాకా కమిషనర్ కార్యాలయంలో డిప్యుటేషన్పై పనిచేస్తున్న పి.సంధ్యారాణి, వి.మాధవి, ఎ.స్వామి కుమార్, ఎ.వి.ఎస్.వి.ప్రసాద్రావు, షేక్ నసీరుద్దీన్, జి.బాలసరోజ, టి.అరవింద్రెడ్డిలను ఆయా జిల్లాలకు పంపించారు. అలాగే సీఆర్వో ఆఫీసులో పనిచేస్తున్న వి.వెంకటేశ్వర్లు, బి.ఎన్.సరస్వతి, కె.శ్రీనివాస్, రంగారెడ్డి డీఎస్వో ఆఫీసులో పనిచేస్తున్న డి.దీప్తి డిప్యుటేషన్లను రద్దు చేశారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి
నల్లగొండ టౌన్ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానికంగా జరిగిన ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జీఓ నంబరు 342లోని ప్రి రెగ్యులేషన్ అనే మెమోను రద్దు చేసి జీఓ 2 లోనే అడక్వసీ అనే పదాన్ని తొలగించి గ్యాడర్ స్ట్రెంత్తో ప్రమేయం లేకుండా రిజర్వేషన్లను ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంట అంజయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ వెంటనే రూపొందించి రాష్ట్రపతి ఆమోదానికి ప్రభుత్వం, ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు అద్దంకి దేవదాసు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాంమోహన్, జిల్లా ఉపాధ్యక్షుడు ఉబ్బల చినవెంకయ్య, కొచ్చర్ల వేణు, కోశాధికారి లచ్చిరాం నాయక్, రామకృష్ణ, సత్యం, సైదులు, నామ నాగయ్య, దుర్గయ్య, లింగయ్య, రాములు, దయాకర్, వెంకటయ్య, సైదానాయక్ పాల్గొన్నారు. -
జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాస్
ఇందూరు : జిల్లా ట్రెజరీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా ఎం.శ్రీనివాస్ రానున్నారు. ఈ మేరకు హైదరాబాద్లో గల రాష్ట్ర శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న ఆయనకు డీడీగా పదోన్నతి కల్పిస్తూ సోమవారం ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి జారీ అయ్యాయి. రెండు, మూడు రోజుల్లో నూతన డీటీవోగా జిల్లాకు వచ్చి విధుల్లో చేరనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం డీడీగా పనిచేస్తున్న ప్రభాకర్రెడ్డికి హైదరాబాద్లో పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సీఏవోగా ప్రభుత్వం పదోన్నతి ఇచ్చి బదిలీ చేస్తూ మరో ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ప్రభాకర్ రెడ్డి జిల్లా ట్రెజరీ అధికారిగా వచ్చి తొమ్మిది నెలలే అవుతోంది. 2015 డిసెంబర్ 1న ఆయన జిల్లాకు వచ్చారు. వచ్చి రాగానే ట్రెజరీ శాఖల్లో ఉద్యోగుల ప్రక్షాళన, ఆరోపణలున్న ఉద్యోగుల సెక్షన్ల మార్పు, అర్హులకు పదోన్నతులు కల్పించి మంచి పేరును సంపాదించుకున్నారు. అలాగే జిల్లాలో వెలుగు చూసిన నకలీ పెన్షన్ ‘యాహ్యా’ ఉదంతంపై లోతైన విచారణ చేపట్టడంతో పాటు, మిగతా అన్ని పెన్షన్లపై విచారణ చేపట్టిన మొదటి డీడీగా నిలిచిపోయారు. -
పాకిస్థాన్ లో ఓం పురి..!
ఇస్లామాబాద్ః 'యాక్టర్ ఇన్ లా' అనే పాకిస్థానీ సినిమాలో నటించిన వెటరన్ నటుడు ఓం పురి.. ఆ సినిమా ప్రమోషన్ కోసం పాకిస్థాన్ వెళ్ళారు. లాహోర్ లో ఆయన తన పాకిస్థానీ అభిమానులను కలుసుకోవడంతోపాటు.. తన సినిమా చూడాలంటూ కోరారు. అలాగే ఇతర పాకిస్థానీ నగరాల్లో కూడా ఓం పురి చిత్రం కోసం ప్రచారం చేస్తున్నారు. ఫహద్ ముస్తాఫా, మెహ్విష్ హయత్ లు 'యాక్టర్ ఇన్ లా' సినిమాలలో ప్రధాన భూమికలు పోషిస్తున్నారు. వీరు కాకుండా ఓంపురితోబాటు రెహన్ షేక్, తలత్ హుసేన్ కూడా నటిస్తున్నారు. అత్యంత సున్నితమైన నేపథ్యంలో నడిచే ఈ పాకిస్తానీ చిత్రం అక్కడి ప్రజల మనసుల్ని దోచుకుంటుందన్న ఆశాభావాన్ని ఓం పురి వ్యక్తం చేస్తున్నారు. నబీల్ ఖురేషి దర్శకత్వంలో రూపొందిన ఈ ఉర్దూ చిత్రం సెప్టెంబర్ 13న విడుదలయ్యేందుకు సిద్ధమౌతున్నట్లు తెలుస్తోంది. -
తాండూరు ఏఎస్పీ చందనదీప్తికి పదోన్నతి
♦ నిజామాబాద్ అడిషినల్ ఎస్పీగా నియామకం ♦ యేడాదిన్నర పాటు పనిచేసిన ఏఎస్పీ ♦ ట్రాఫిక్ నియంత్రణ, షీ టీములతో మహిళల భద్రతకు కృషి తాండూరు: తాండూరు ఏఎస్పీ చందనదీప్తికి పదోన్నతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన చందనదీప్తిని నిజామాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ(ఓఎస్డీ)గా నియమితులయ్యారు. తాండూరు ఏఎస్పీగా 2015 ఫిబ్రవరిలో ఆమె బాద్యతలు చేపట్టారు. ఏడాదిన్నర కాలం పాటు ఇక్కడ పనిచేశారు. ఆ సమయంలో తాండూరు పరిధిలో షీ టీం ద్వారా మహిళలకు భద్రత కల్పించారు. తాండూరు పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణను పటిష్టం చేశారు. డివిజన్ పరిధిలో నేరాల సంఖ్య తగ్గించేందుకు కృషి చేశారు. రెండు రోజుల్లో ఆమె నిజామాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్నారు. -
చార్మినార్ వద్ద చెడ్డీలు అమ్మిన నటుడు!
సల్మాన్ ఖాన్ 'భజరంగీ భాయ్ జాన్' సినిమా చూసినవారందరికీ నవాజుద్ధీన్ సిద్ధిఖీ సుపరిచితుడే. ఆ సినిమాలో అతడు చేసిన 'రిపోర్టర్' పాత్ర అంత తేలికగా మరచిపోయేది కాదు. గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్, తలాష్, కిక్ లాంటి సినిమాల్లో కూడా తనదైన నటనతో మెప్పించాడు సిద్ధిఖీ. అయితే తాజాగా అతడు చార్మినార్ సెంటర్లో చెడ్డీలు అమ్ముతూ కెమెరా కంటపడ్డాడు. కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు.. తన సినిమా ప్రమోషన్ కోసం పడిన ప్రయాసే అది. బాలీవుడ్ తీరే వేరు. సినిమాను ప్రమోట్ చేయడానికి విభిన్న మార్గాలను ఎంచుకుంటారు నటీనటులు. అవసరమైతే ఉన్నట్టుండి జనాల మధ్యలో ప్రత్యక్షమవుతారు కూడా. అచ్చంగా అలానే చేశాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఫ్రీకీ అలీ' సినిమాలో సిద్ధిఖీ హీరోగా నటించిన విషయం తెలిసిందే. సినిమాలో తన పాత్ర మాదిరిగా రోడ్డెక్కి చెడ్డీలు అమ్మాడు. చెడ్డీల వ్యాపారం సాగినంతసేపు ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. ఇక 'ఫ్రీకీ అలీ' కథ విషయానికొస్తే.. రోడ్డు పక్కన పేవ్మెంట్ మీద చెడ్డీలు అమ్ముకుంటూ ఉంటాడు అలీ అనే కుర్రాడు. పార్ట్ టైం జాబ్గా ఓ రౌడీ దగ్గర పని చేస్తూ అతడితో కలిసి మామూళ్ల వసూళ్లకు వెళ్తుంటాడు. అలానే ఓ వ్యక్తి వద్ద వసూళ్ల కోసం గోల్ఫ్ కోర్టుకి వెళతాడు. అక్కడ జరిగిన ఓ చిన్న సంఘటన అతనిలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. అతనికో ఆశయాన్ని తెచ్చిపెడుతుంది. పేవ్మెంట్ చెడ్డీల వ్యాపారి.. ఆ తర్వాత పెద్ద గోల్ఫ్ క్రీడాకారుడు ఎలా అయ్యాడనేదే కథ. సెప్టెంబరు 9 వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్ కోసం గురువారం హైదరాబాద్కు విచ్చేసింది చిత్ర యూనిట్. గోల్ఫ్ క్రీడాకారుడు కావడానికి అలీ పడిన పాట్లు హాస్యంతో కూడుకున్నవై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని చెబుతుంది మూవీ టీం. అమీ జాక్సన్ హీరోయిన్గా నటిస్తోంది. సల్మాన్ మరో సోదరుడు అర్బాజ్ ఖాన్ ఈ చిత్రంలో ఓ ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు. -
తలుపులు మూసి.. పరీక్ష రాయించి..
నిజామాబాద్ నాగారం: సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్లో పదోన్నతుల కోసం ఆదివారం డిపార్ట్మెంటల్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో 23 మంది సీనియర్ అసిస్టెంట్లు, ఆర్ఐలు పరీక్ష రాశారు. ఈ పరీక్ష ఆరు నెలల క్రితమే నిర్వహించారు. అప్పట్లో 24 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. అయితే మాస్ కాపీయింగ్ జరిగిందంటూ ‘సాక్షి’లో ‘చూచిరాతలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అధికారులు అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసి చూచిరాతలకు సహకరించారంటూ కథనం ప్రచురితం కావడంతో స్పందించిన రాష్ట్ర ఉన్నతాధికారులు విచారణ జరిపి ఆ పరీక్షను రద్దు చేశారు. ఆరు నెలల క్రితం రద్దయిన పరీక్షను ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించారు. 24 మంది అభ్యర్థులకు గాను 23 మంది పరీక్ష రాశారు. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయ ఏడీఈ కిషన్రావు, జిల్లా విద్యాశాఖాధికారి లింగయ్య ప్రత్యేక అధికారులుగా వ్యవహరించారు. శాఖ సూపరింటెండెంట్ వెంకటేశం, సెక్షన్ క్లర్క్ స్వప్న పరీక్షల నిర్వహణ బాధ్యత నిర్వర్తించారు. అయితే ఈసారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా పని దినాలలో కార్యాలయంలోని కిటికీ తలుపులు తెరిచి ఉంటాయి. కానీ పరీక్ష సమయంలో కిటికీలను మూసి ఉంచారు. అభ్యర్థులకు దోమలు కుట్టుతున్నాయంటూ ఆలౌట్ ఫాస్ట్ కార్డులను తెప్పించారు. పరీక్ష జరుగుతున్నంత సేపు కిటికీల తలుపులు మూసి ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించలేదు.. ఈ పరీక్ష రాస్తున్న ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు ముఖ్యంగా ఆయా మండలాల్లో క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ కొంతమంది ఆర్ఐలు, సీనియర్ అసిస్టెంట్లు ఇతర మండలాల్లో పోస్టింగ్ వచ్చినా.. కలెక్టరేట్లోని రెవెన్యూ సెక్షన్లో డిప్యూటేషన్పై పనిచేస్తున్నారు. డిపార్ట్మెంటల్ పరీక్ష పాసైతే డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతులు లభిస్తాయి. మండలాల్లో పని చేయని వారికి పదోన్నతుల పరీక్షకు అనుమతించడం సబబు కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
'హిస్టరీ అంటే ఇష్టమే లేదు'
చారిత్రాత్మక చిత్రం 'మొహంజొదారో'తో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అయిన హీరో హృతిక్.. తనకు హిస్టరీ సబ్జెక్ట్ అంటే ఇష్టమే ఉండేది కాదంటున్నాడు. మొహంజొదారో ప్రమోషన్ కోసం ఢిల్లీ వెళ్లిన ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. స్కూల్లో ఉన్నప్పుడు హృతిక్.. హిస్టరీ అంటే చాలా బోరింగ్ సబ్జెక్ట్ అని ఫీలయ్యేవాడట. కానీ ఆ తర్వాత చరిత్ర ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు. నేనే కాదు.. ఎవరైనా సరే చరిత్ర గొప్పతనం తెలుసుకుని తీరాలి. మన పుట్టుపూర్వోత్తరాల గురించి, సంస్కృతి,సంప్రదాయాల గురించి, గొప్ప వ్యక్తుల జీవితాల గురించి తెలుసుకోవడం బావుంటుందంటున్నాడు హృతిక్. చదువుకునే రోజుల్లో మాత్రం హిస్టరీ సబ్జెక్ట్ అస్సలు నచ్చేది కాదట. ఇప్పుడు ఇదంతా చదివి నేనేం చేయాలి అనుకునేవాడట. తర్వాత్తర్వాత తన ఆలోచన పూర్తిగా మారిందట. మన కుటుంబం గురించి, తాతముత్తాతల గురించి, వారి కష్టం గురించి తెలుసుకోవాల్సి అవసరం ఉంది. అన్నిటికీ మించి ప్రపంచ చరిత్ర తెలుసుకోవడం చాలా ముఖ్యం, నా పిల్లలిద్దరికీ అదే చెప్తుంటానంటూ సెలవిచ్చాడు. హృతిక్, పూజా హెగ్డేలు జంటగా నటిస్తున్న 'మొహంజొదారో' ఆగస్టు 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం హృతిక్, పూజాలు చిత్ర ప్రమోషన్లో ఫుల్ బిజీగా ఉన్నారు. -
కాలేజ్ అమ్మాయికి హృతిక్ స్పెషల్ గిఫ్ట్
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఓ కాలేజ్ అమ్మాయికి స్వీట్ గిఫ్ట్ ఇచ్చాడు. తన లేటెస్ట్ ఫిల్మ్ 'మొహంజొదారో' ప్రమోషన్ కోసం ఢిల్లీ చేరుకున్న హృతిక్, హీరోయిన్ పూజా హెగ్డేతో కలిసి శుక్రవారం గార్గీ గాళ్స్ కాలేజ్కి వెళ్లారు. హృతిక్కు అక్కడి అమ్మాయిల నుంచి అదిరే వెల్కం అందింది. స్టార్ హీరోను చూసిన ఆనందంలో యువతులంతా సంతోషంలో మునిగిపోయారు. హృతిక్, పూజాలిద్దరూ వారితో సరదా సంభాషణ జరుపుతూ.. వారి ప్రశ్నలకు సమాధానాలిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ యువతి పుట్టినరోజని తెలిసింది. వెంటనే ఆమెను స్టేజ్పైకి ఆహ్వానించిన హృతిక్.. ఆమె కోరుకున్నట్టుగానే ఆమెతో కలిసి డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ను ఫిదా చేశాడు. 'జిందగీ న మిలేగీ దొబారా' సినిమాలోని హిట్ సాంగ్ సెనోరీటాకు ఆ బర్త్ డే గాళ్తో కలిసి స్టెప్పులేశాడు. అభిమాన హీరోతో కలిసి ఆడిపాడిన ఆమె స్వీట్ షాక్కు గురైంది. ఇది తనెప్పటికీ మర్చిపోలేని బర్త్ డే అంటూ సంతోషాన్ని వ్యక్తం చేసింది. చారిత్రాత్మక కథనంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'మొహంజొదారో' ఆగస్టు 12 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
డాక్టర్ లక్ష్మరెడ్డికి పదోన్నతి
పశుసంవర్ధక శాఖ రాష్ట్ర అదనపు సంచాలకుడిగా నియామకం జిల్లా జేడీగా విక్రంకుమార్.. ఉత్తర్వులు జారీ సాక్షి, సంగారెడ్డి: జిల్లా పశుసంవర్ధకశాఖ జాయింట్ డైరెక్టర్ వి.లక్ష్మారెడ్డికి ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనను ఆ శాఖ రాష్ట్ర అదనపు సంచాలకులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో వరంగల్ జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ విక్రంకుమార్ను జిల్లాకు బదిలీ చేసింది. ఈక్రమంలో లక్ష్మారెడ్డి వచ్చేవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. జిల్లాలో పాల దిగుబడి పెంచేందుకు కృషి చేయటంతో పాటు కరువు కాలంలో పశువులకు మేత సమస్య రాకుండా లక్ష్మారెడ్డి అవసరమైన చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గోపాలమిత్ర సేవలను విస్తరింపజేసేందుకు కృషి చేశారు. తన సేవలను గుర్తించి ప్రభుత్వం పదోన్నతి కల్పించటం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. -
జీహెచ్ఎంసీలో మరణించిన వ్యక్తికి పదోన్నతి
సాక్షి,సిటీబ్యూరో: అరె రషీద్ భాయ్కు ప్రమోషనొచ్చిందా.. మన జంగయ్యన్నకు కూడా వచ్చిందా.. అదేందిరా వాళ్లకెలా ఇస్తారు అని ఆశ్చర్యపోవడం మిగతావారి వంతైంది. అదేంటంటే.. జీహెచ్ఎంసీలో వాహనాల డ్రైవర్లుగా(లైట్ వెహికల్) పనిచేస్తున్న 78 మందికి పదోన్నతి కల్పించారు. వారిని హెవీ వెహికల్ డ్రైవర్లుగా నియమించారు. ఇందుకు సంబంధించిన జాబితా కూడా విడుదలైంది. సంతోషంగా తమ పేరును చూసుకున్న డ్రైవర్లు మరో ఇద్దరి పేర్లు చూసి షాక్ అయ్యారు. ఇదేంటి రషీద్కు ప్రమోషన్ ఇచ్చారా..! అరె జంగయ్యకు కూడా ఇచ్చారే అని డ్రైవర్లు చర్చించుకున్నారు. అసలు విషయం ఏమిటంటే రషీద్ గతంలో మృతి చెందాడు.. జంగయ్య పదవీ విరమణ చేశాడు. మృతిచెంది, పదవీ విరమణ చేసిన వారికి కూడా మన జీహెచ్ఎంసీలో పదోన్నతులిస్తారా అని ఆశ్చర్యపోవడం డ్రైవర్ల వంతైంది. ఈ జాబితాకు స్టాండింగ్కమిటీ కూడా ఆమోదముద్ర వేయడం కొసమెరుపు. అయితే ఈ పదోన్నతులు ఇంకా అమల్లోకి రాలేదని అడిషనల్ కమిషర్(అడ్మినిస్ట్రేషన్) రామకృష్ణారావు తెలిపారు. ఇప్పటికే విధుల్లో లేని పారిశుధ్య కార్మికులను ఉన్నట్లు చూపుతూ, ఎప్పుడో మరణించిన వారి పేరిట సైతం నెలనెలా జీతాలు విడుదల చేస్తున్న బల్దియా అదే ధోరణిలో పాలన సాగిస్తోంది. -
ఇద్దరు గ్రేడ్–1 వార్డెన్లకు ఏబీసీడబ్ల్యూఓలుగా పదోన్నతి
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ఇద్దరు గ్రేడ్–1 బీసీ వసతి గృహ సంక్షేమాధికారులకు సహాయ బీసీ సంక్షేమాధికారులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బీ సంజీవరాజు తెలిపారు. శనివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మకూరు ఐడబ్ల్యూహెచ్ వసతి గృహ సంక్షేమాధికారిణి లక్ష్మిదేవికి పదోన్నతి కల్పించి నంద్యాలకు, మీదివేముల వసతి గృహ సంక్షేమాధికారి రోషన్నకు పదోన్నతి కల్పించి వైఎస్సార్ జిల్లా పులివెందులకు బదిలీ చేశారన్నారు. నిర్ణీత గడువులోగా వీరు ఆయా ప్రాంతాల్లో బాధ్యతలు చేపడతారని సంజీవరాజు తెలిపారు. -
'కబాలి' పేరుకాదు.. ఓ బ్రాండ్
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కబాలి మేనియా కనిపిస్తోంది. గతంలో ఏ భారతీయ సినిమాకు జరగని స్థాయి ప్రచారం ఈ సినిమా కోసం జరుగుతోంది. పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు కబాలి సినిమా ప్రమోషన్లో భాగం పంచుకుంటున్నాయి. హాలీవుడ్ స్థాయిలో ఏకంగా విమానాలపై కబాలి పోస్టర్లను ముంద్రించటంతో రజనీ మేనియా ఏ స్థాయిలో ఉందో తెలిస్తోంది. ఇప్పటికే ఎయిర్ ఏసియాతో పాటు ఎయిర్టెల్, ముత్తూట్ లాంటి సంస్థలు ప్రచారంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి. వీటికి తోడు కబాలి పోస్టర్లతో తయారు చేసిన కీచైన్లు, టీషర్లు తమిళ నాట హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. వంద కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన కబాలి, ఇప్పటికే 200 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తొలి వారంలోనే సంచలనాలు నమోదు చేస్తుందని భావిస్తున్న ఈ సినిమా, టోటల్ రన్లో 500 కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తుందని నమ్ముతున్నారు. తొలిసారిగా మలేషియా అభిమానుల కోసం మలయ్లోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు ఇండియన్ సినిమా రిలీజ్ కాని చాలా దేశాల్లో కబాలి బోణి చేయడానికి రెడీ అవుతుంది. ఓవర్ సీస్ మార్కెట్ మీద భారీ ఆశలు పెట్టుకున్న చిత్రయూనిట్, ఒక్క అమెరికాలోనే 400 వందల థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. మొత్తంగా 5000ల స్క్రీన్స్ లో కబాలిని ప్రదర్శించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంతటి భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న కబాలి.. అభిమానుల ఆశలు నిజం చేస్తుందో లేదో చూడాలి. -
విమానాలకు కబాలి పోస్టర్స్
రజనీ కాంత్.. ఏ ముహుర్తాన కబాలి సినిమా మొదలు పెట్టాడో కాని, రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసేస్తున్నాడు. ఆన్ లైన్ వ్యూస్, ప్రీ రిలీజ్ బిజినెస్ ఇలా రకరకాల రికార్డ్లను కొల్లగొట్టిన సూపర్ స్టార్, తాజాగా మరో రికార్డ్కు రెడీ అవుతున్నాడు. రెండు భారీ ఫ్లాప్ల తరువాత రజనీ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావటంతో ఈ సినిమాను ఎలాగైన బ్లాక్ బస్టర్ సక్సెస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రచారం విషయంలోనూ కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చెన్నైలోని భారీ హోర్డింగ్ లతో పాటు బస్సులు, రైళ్లను కూడా కబాలి పోస్టర్లతో అలంకరించేస్తున్నారు. అది కూడా చాలదన్నట్టు ఇప్పుడు ఏకంగా విమానాలకే కబాలి పోస్టర్స్ వేస్తున్నారట. రెండు డొమాస్టిక్ ఫ్లైట్స్తో పాటు, మరో రెండు ఇంటర్ నేషనల్ ఫ్లైట్స్కు కబాలి పోస్టర్స్ వేస్తున్నారు. గతంలో హాలీవుడ్ సినిమా హాబిట్ కోసం ఈ తరహా ప్రచారం చేయగా, ఇండియాలో మాత్రం కబాలినే తొలిసారిగా ఈ రికార్డ్ సొంతం చేసుకోనుంది. -
మా టీచర్ను పదోన్నతిపై పంపొద్దు
నల్లగొండ : నారాయణపురం మండంలోని పుట్టపాక జిల్లా పరిషత్ పాఠశాల తెలుగు టీచర్ను హైదరాబాద్లోని ఏసీఈఆర్టీకీ పదోన్నతిపై పంపించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు శుక్రవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తరగతులను బహిష్కరించారు. తెలుగు ఉపాధ్యాయుడి పదోన్నతిని నిలిపేయాలని ర్యాలీ నిర్వహించి, మానవహారం చేశారు. అదే విధంగా నల్లగొండలో సర్పంచ్ ఎన్.కళమ్మ, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు డీఈఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ సామల విజయలక్ష్మి, అమరేందర్, లింగస్వామి, రాజు, భాస్కర్ పాల్గొన్నారు. -
ఆర్అండ్బీలో పదోన్నతుల దుమారం!
- ఫైల్ వెనక్కు పంపిన మంత్రి శిద్ధా రాఘవరావు హైదరాబాద్ : ఏపీ రహదారులు, భవనాల శాఖలో అధికారుల పదోన్నతి వ్యవహారం ఒకడుగు ముందుకు.. నాలుగు అడుగుల వెనక్కు అన్న చందంగా సాగుతోంది. డిప్యూటీ ఇంజినీర్ల నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించే సీనియారిటీ జాబితాపై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా, సూపరింటెండెంట్ ఇంజినీర్ల నుంచి చీఫ్ ఇంజినీర్లు.. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల నుంచి సూపరింటెండెంట్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించేందుకు జాబితా సిద్ధం చేశారు. ఆరుగురు ఎస్ఈలను చీఫ్ ఇంజినీర్లుగా, మరో ఆరుగురు ఈఈలను ఎస్ఈలుగా పదోన్నతి కల్పించాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనల ఫైల్ను ఆర్అండ్బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంబాబ్ ఆర్అండ్బీ మంత్రి శిద్ధా రాఘవరావుకు పంపారు. అయితే ఈ పదోన్నతుల వల్ల తమకు అన్యాయం జరుగుతుందని సదరు శాఖలోని కొందరు అధికారులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ముఖ్య ఇంజినీరు ఒకరు ఇష్టారీతిన పదోన్నతుల ఫైల్ రూపొందించారని ఫిర్యాదు చేశారు. డీఈల నుంచి ఈఈలుగా పదోన్నతులు కల్పించే అంశంలో సదరు ముఖ్య ఇంజినీరు అవకతవకలకు పాల్పడి ఆయన వర్గానికి పెద్ద పీట వేశారని ఆరోపిస్తున్నారు. దీంతో మంత్రి శిద్ధా రాఘవరావు ఆ ఫైల్ను వెనక్కు తిప్పి పంపారు. పదోన్నతుల వ్యవహారంపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పదోన్నతుల వ్యవహారం మరికొంత కాలం వాయిదా పడే అవకాశం ఉంది. కాగా, ఆగస్టులో రూరల్ ఈఎన్సీగా ఉన్న వెంకటరెడ్డి పదవీ విరమణ చేస్తుండటం, కమిషనర్ ఆఫ్ టెండర్స్ సీఈ జ్ఞానరాజు వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడంతో సీఈ పోస్టుల్లో ఖాళీలేర్పడనున్నాయి. -
వైద్య, ఆరోగ్యశాఖలో పదోన్నతులు
సర్క్యులర్ జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల్లో పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సర్క్యులర్ జారీచేసింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి శుక్రవారం రాష్ట్ర వైద్యుల సంఘంతో జరిపిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పదోన్నతులు, బదిలీలపై నిషేధం ఉన్నం దున పాక్షిక పదోన్నతులకు మంత్రి లక్ష్మారెడ్డి అంగీకరించారు. రోగులకు మెరుగైన సేవలు అందించడం కోసం.. ఉద్యోగుల్లో ఉత్సాహం నింపడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఉద్యోగుల పదోన్నతులు, బదిలీల మీద నిషేధం ఉందన్నారు. మరోవైపు ఉద్యోగుల విభజన ప్రక్రియ కూడా పూర్తికాలేదన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 695 పదోన్నతులు, బదిలీలపై సడలింపు ఇచ్చిందన్నారు. దీంతో పాక్షిక బదిలీలు, పదోన్నతులు చేపడతామని ఆయన పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిపై సమీక్ష... మంత్రి లక్ష్మారెడ్డి గాంధీ ఆస్పత్రిలో సేవలపై సమీక్ష నిర్వహించారు. ఎమర్జెన్సీ సేవలను వేగంగా ఆధునికీకరించాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర అంశాలను స్వయంగా పర్యవేక్షించాలని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) సీఈవో ను ఆదేశించారు. ఈ సమీక్షలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, డీఎంఈ రమణి, టీఎస్ఎంఎస్ఐడీసీ సీఈవో లక్ష్మారెడ్డి, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ జె.వి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సహాయం కావాలి!
అమితాబ్ బచ్చన్ సినిమా అంటే ఏదో కొత్తదనం ఉంటుందని ప్రేక్షకుల అంచనా. ఎందుకంటే ఈ మధ్య ఆయన ఎంచుకునే సినిమాలన్నీ వైవిధ్యంగా ఉంటున్నాయి. తాజాగా ఆయన నటించిన ‘తీన్’ చిత్రం టీజర్కు మంచి స్పందన లభిస్తోంది. కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో అదృశ్యం అయిన తన మనవరాలి ఆచూకీ కోసం పోరాడే వృద్ధునిగా అమితాబ్ కనిపించనున్నారు. విద్యాబాలన్, నవాజుద్దీన్ సిద్దిఖి కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం ప్రమోషన్ని ప్రేక్షకులే చేయాలని అమితాబ్ అన్నారు. ‘‘సినిమా మీద అవగాహన ఉన్నవాళ్లు, మేధావి వర్గం మాకో హెల్ప్ చేయండి. ఈ చిత్రాన్ని ఎలా ప్రమోట్ చేయాలో సలహాలు ఇస్తే మేలు చేసినవాళ్లవుతారు’’ అని విన్నవించుకున్నారు. -
మార్కెట్ ‘కార్యదర్శుల’ బదిలీలు
♦ ఇతర జిల్లాలకు పోస్టింగ్లు ♦ పలువురికి పదోన్నతులు.. ♦ కొత్త కార్యదర్శుల నియామకం తాండూరు: జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శులకు స్థానచలనం కలిగింది. రెండు రోజుల క్రితం కార్యదర్శులను ఇతర జిల్లాలకు బదిలీ చేస్తూ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో మార్కెట్ కమిటీలకు కొత్త పాలకమండళ్లు కొలువుదీరనున్న నేపథ్యంలో కార్యదర్శులు బదిలీ కావడం గమనార్హం. బదిలీ అయిన వారి స్థానంలో కొత్త కార్యదర్శుల నియామకం కూడా వెంటనే ఉన్నతాధికారులు పూర్తి చేశారు. దీర్ఘకాలికంగా ఒకేచోట పని చేయడంతో బదిలీ చేశారు. ఇక పలు మార్కెట్లలో ఖాళీగా పోస్టులను భర్తీ చేశారు. పలువురు కార్యదర్శులకు పదోన్నతులు కల్పించారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా పనిచేసిన వెంకట్రెడ్డిని కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు ఇటీవల బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఇబ్రహీంపట్నం గ్రేడ్-2 కార్యదర్శి ఏ.చంద్రశేఖర్కు ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ తాండూరుకు బదిలీ చేశారు. ఇక తాండూరులో మూడోశ్రేణి కార్యదర్శిగా పని చేస్తున్న కే.సురేందర్రెడ్డికి రెండో శ్రేణి కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ నల్గొండ జిల్లా చండూరు మార్కెట్ కమిటీకి బదిలీ చేశారు. రెండేళ్లుగా తాండూరులో ఖాళీగా ఉన్న సహాయ కార్యదర్శి పోస్టును అధికారులు భర్తీ చేశారు. నల్గొండ జిల్లా ఆలేరు మార్కెట్ కమిటీలో సూపర్వైజర్గా కొనసాగుతున్న వహిద్ను పదోన్నతిపై తాండూరు సహాయ కార్యదర్శిగా నియామకం చేశారు. వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.శ్రీనివాస్ మూడు నెలల క్రితం మెదక్ జిల్లా సిద్దిపేటకు బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో వికారాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శిగా నారాయణపేట్ మార్కెట్ కమిటీ నుంచి ఎం.శ్రీనివాస్ను నియమించారు. మర్పల్లి కార్యదర్శి వీరభద్రయ్య ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మెదక్ జిల్లా జహీరాబాద్ మార్కెట్ కమిటీ కార్యదర్శి నాగేశ్వర్రావును నియామకం చేశారు. మర్పల్లి ఇన్చార్జి కార్యదర్శిగా కొనసాగుతున్న శంకర్పల్లి మార్కెట్ కమిటీ కార్యదర్శి మల్లేశంను మెదక్ జిల్లా చేగుంటకు, శంకర్పల్లికి మెదక్ జిల్లా నర్సాపూర్ కార్యదర్శి వెంకటయ్య బదిలీ చేస్తూ మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. తాండూరు ప్రత్యేక శ్రేణి కార్యదర్శిగా నియామకం అయిన ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ కార్యదర్శి ఏ.చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన తాండూరు మార్కెట్ కమిటీని సందర్శించారు. స్థానిక అధికారులతో సమావేశమయ్యారు. చండూరుకు బదిలీ అయిన సురేందర్రెడ్డి స్థానంలో మాత్రం అధికారులు ఎవరికీ పోస్టింగ్ ఇవ్వకపోవడం గమనార్హం. -
మిస్టర్ కరీనా
ఉద్యోగం పురుష లక్షణం అంటారా? అంటారా?! ఇంకో రకంగా కూడా ఉంటారా? ‘ఉంటారు’ అంటోంది కరీనా. లడకీలో ‘కీ’, లడకా లో ‘కా’ తీసుకుని ‘కీ అండ్ కా’ సినిమాలో... ‘ఉద్యోగం మహిళ లక్షణం’ అని ఈ నాయిక ప్రూవ్ చేసింది. ఇక మిగిలిందేంటి? ఓ సవాలు. ఓ ఛాలెంజ్. ఎవరికి? అబ్బాయిలకు! ఎక్కడ? ఇంట్లో... వంటింట్లో! మరి.. తెలుగు అబ్బాయిలు కూడా వంటలు, వగైరాలు చేసుకుంటూ మిస్టర్ భార్య చేతుల మీదుగా జీతం పుచ్చుకోగలరంటారా? చదవండి. కరీనాతో సాక్షి ‘ఫ్యామిలీ’ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. హాయ్ కరీనా... తెలుగు పత్రికకకు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం బహుశా మీకిదే మొదటిసారి అయ్యుంటుందేమో? అవును కరెక్టే. తెలుగులో మాత్రం మాట్లాడమని అడగొద్దు. నాకు ఒక్క ముక్క కూడా తెలియదు (నవ్వుతూ). ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వస్తుంటారు కదా.. ఇక్కడి మీడియా మీకెలా అనిపిస్తుంది? వెరీ ఫ్రెండ్లీ. ఆల్మోస్ట్ అందరూ స్మైలీ ఫేస్తోనే ఉంటారు. అందుకే హైదరాబాద్లో ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటే నాకు హుషారుగానే ఉంటుంది. ఇలా హిందీ సినిమాల ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చి, వెళ్లడం తప్ప తెలుగు సినిమాల్లో నటించరా ఏంటి? (నవ్వుతూ) సౌత్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. భాష తెలియకుండా నటించడం కష్టం. అందుకే ఒప్పుకోలేదు. మంచి మంచి అవకాశాలే వచ్చాయి. నార్త్ నుంచి ఎంతోమంది నాయికలు ఇక్కడ వెలిగిపోతున్నారు. వాళ్లకు కూడా భాష తెలియదు కదా? ఎవరి ఇష్టం వాళ్లది. నా మటుకు నాకు భాష తెలియకపోతే సరిగ్గా హావభావాలు పలికించలేను. మనం ఏం చెబుతున్నామో దాని అర్థం తెలియకపోతే ఎలా? అక్కడక్కడా ఏదో కొంత తెలుసుకుని నటించడం నా వల్ల కాదు. ఓకే.. హైదరాబాద్ గురించి నాలుగు మాటలు చెబుతారా? ఇది చాలా పెద్ద సిటీ. ముందుగా నాకు నచ్చింది అదే. షాపింగ్ ఏరియాలు రద్దీగా ఉన్నప్పటికీ.. మిగతా ఏరియాలు దాదాపు కూల్గానే ఉంటాయి. అందుకే నాకు ఇక్కడ షూటింగ్స్ చేయడం చాలా ఇష్టం. ముఖ్యంగా ఫలక్నుమా ప్యాలెస్ను చాలా ఇష్టపడతాను. నాయికగా 16 ఏళ్లుగా ఫిజిక్నెలా మెయిన్టైన్ చేస్తున్నారు? యోగా చేస్తాను. ఇంకా జిమ్లో వర్కవుట్స్ ఎలానూ ఉంటాయి. మన శరీరం బరువు పెరగడానికి ఓ కారణం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడమే. బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ మనం ఏ తీసుకున్నా టైమ్ ప్రకారమే తీసుకోవాలి. నేనలానే చేస్తాను. ఓకే.. ఏప్రిల్ 1న విడుదల కానున్న ‘కీ అండ్ కా’లో అర్జున్ కపూర్ హౌస్ హజ్బెండ్గా చేస్తే మీరేమో జాబ్ చేస్తారు. రియల్ లైఫ్లో ఇలా జరిగే అవకాశమే లేదు కదా? ఎందుకు లేదు? భార్యలు పని చేస్తుంటే ఇంటి పట్టున ఉండి, ఇంటిని చక్కదిద్దే భర్తలు ఉన్నారు. కాకపోతే ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడతారు. భార్యను ఉద్యోగానికి పంపి, భర్త ఇంట్లో ఉంటే... ఆ భర్త అందరికీ చులకనే. పైగా ఏదైనా పార్టీకో, ఫంక్షన్కో వెళితే ‘మీ ఆయన ఏం చేస్తున్నాడు?’ అని అడుగుతారు కదా? అవును. లోయర్, మిడిల్, అప్పర్... ఏ క్లాస్కి చెందిన ఆడవాళ్లైనా ఈ ప్రశ్నను తప్పించుకోలేరు. భర్త చేసే ఉద్యోగాన్ని బట్టి భార్యకు విలువ ఇస్తారు. మన ఇండియాలోనే ఇలా ఉంటుంది. నాకు తెలిసి విదేశాల్లో అంతగా పట్టించుకోరు. ఇంటిపట్టున ఉండే ఆడవాళ్లను ‘మీరేం చేస్తారు?’ అనడిగితే.. ‘హౌస్ వైఫ్’ని అని చెప్పుకున్నంతగా ఈజీగా మగవాళ్లు ‘నేను హౌస్ హజ్బెండ్’ని అని చెప్పుకోలేరు. అదేదో కాని పని అన్నట్లుగా ఫీలైపోతారు. ‘మగవాళ్లు సంపాదించాలి. ఆడవాళ్లు ఇంటిని చక్కదిద్దుకోవాలి’ అన్న ఒకప్పటి కట్టుబాటు గురించి మీ అభిప్రాయం? ఆ కాలంలో నేను లేనందుకు ఆనందంగా ఉంది. మెల్లి మెల్లిగా మార్పు రావడం ఓ రిలీఫ్. ఉద్యోగం చేసే హక్కు ఆడవాళ్లకు కూడా ఉంటుంది. ఇవాళ ఆడవాళ్లు సాధించనది అంటూ ఏమీ లేదు. లింగభేదంతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్నవాళ్లందరూ ఉద్యోగం చేసుకోవచ్చు. ఆడవాళ్లు ఇంటి గడప దాటితే సమస్యలు వస్తాయంటారు. మీ లాంటి డబ్బున్నవాళ్లకి కూడా సమస్యలు వస్తాయా? అఫ్కోర్స్... ఆడవాళ్ల సమస్యలకు స్థాయితో పని లేదు. ఎక్కడైనా ఉంటాయి. ఈ ప్రపంచంలో బలహీనులు ఎవరంటే అది ఆడవాళ్లే అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. అందుకే వాళ్లను ఇబ్బందుల పాలు చేయాలనుకుంటారు. వీలైతే తొక్కేయాలనుకుంటారు. దానికోసం మానసికంగా, శారీరకంగా వేధించడానికి వెనకాడరు. బాలీవుడ్లో పేరున్న కుటుంబానికి చెందిన అమ్మాయిగా మిమ్మల్ని వేధించే సాహసం ఎవరూ చేయకపోవచ్చు. ఒకవేళ చేస్తే... మీరెలా ట్యాకిల్ చేస్తారు? మానసికంగా నేను చాలా బోల్డ్. మగవాళ్లను శారీరకంగా బలంగా, ఆడవాళ్లను మానసికంగా బలంగా ఆ భగవంతుడు సృష్టించాడన్నది నా నమ్మకం. మగవాళ్ల కన్నా మనకు మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ అని నా ఫీలింగ్. ఆ బలమే మనకు మంచి ఆయుధం. భయం భయంగా బతికే ఆడవాళ్లకు మీరిచ్చే సలహా ఏంటి? ఆడపిల్లలా కాదు... పులిలా బతకండి. ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లండి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరో వచ్చి సహాయం చేస్తారులే అని కాకుండా మనకు మనమే సహాయం చేసుకోవాలి. సూపర్... బాగా చెప్పారు... థ్యాంక్యూ.. మీరేదో అడిగారని ఆవేశంగా చెప్పేయలేదు. నిజంగా కూడా ఆడవాళ్లు అమాయకంగా బతికేయకూడదు. తెలివిగా ఉండాలి. ప్రపంచం గురించి తెలుసుకోవాలి. అందుకే అందరూ చదువుకోవాలి. మీ పదహారేళ్ల సినీ జీవితం గురించి ఏం చెబుతారు? ఇది చాలా పెద్ద ప్రపంచం. పోటీ ఎక్కువ. తట్టుకుని నిలబడాలి. ప్రశంసలతో పాటు విమర్శలు వస్తాయి. ఎదుర్కోవాలి. మొదట్లో ఫెయిల్యూర్స్కి కంగారుపడేదాన్ని. సక్సెస్ వచ్చినప్పుడు సంతోషపడిపోయేదాన్ని. రాను రానూ సమానంగా తీసుకోవడం మొదలుపెట్టాను. విమర్శలకు ఫీలవ్వడం లేదు. అంతకు ముందు ఏదనుకుంటే అది క్షణాల్లో జరిగిపోవాలనుకునేదాన్ని. ఈ 16 ఏళ్ల జీవితం ఓపిక నేర్పించింది. దాంతో లైఫ్ హ్యాపీగా ఉంది. 80 ఏళ్ల వయసు వరకూ నటించాలన్నది మీ డ్రీమ్ అని ఓ సందర్భంలో అన్నారు. కథానాయికలు నలభైలకు దగ్గరపడితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారక తప్పదు కదా? అలా ఎందుకు అంటున్నారు? హాలీవుడ్ మెరిల్ స్ట్రీప్ని తీసుకుందాం. ఆవిడ వయసిప్పుడు అరవై పైనే. మెరిల్ స్ట్రీప్ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. కానీ, ఆమెను ఎవరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనరు. కథానాయిక అనే అంటారు. నేను కూడా ఆమెలానే నాయిక అనిపించుకోదగ్గ పాత్రలు ఎంచుకుంటాను. ముద్దు పేరు: బెబో పుట్టిన తేది: 1980 సెప్టెంబరు 21 పుట్టిన ఊరు: ముంబై తల్లిదండ్రులు: రణధీర్ కపూర్ (ప్రముఖ నటుడు), బబితా కపూర్ (ప్రముఖ నటి) ఎత్తు: ఐదు అడుగుల ఐదు అంగుళాలు కథానాయికగా మొదటి సినిమా: ‘రెఫ్యూజి’ (2000) అభిమాన నటీనటులు: సీనియర్ నటి నర్గిస్, సోదరి కరిష్మా కపూర్, షారుక్ ఖాన్ ఇష్టపడే ఫుడ్: చైనీస్, థాయ్, ఇటాలియన్ నచ్చే క్రీడ: స్విమ్మింగ్ ఇష్టపడే రంగులు: ఎరుపు, నలుపు ఫేవరెట్ హాలిడే స్పాట్స్: గోవా, లండన్ నచ్చే ఆభరణాలు: వజ్రాభరణాలు.. ముఖ్యంగా బ్రాస్లెట్ జీవితాశయం: లివ్ అండ్ లెట్ లివ్ అంటే... ‘కథానాయిక’ అనిపించుకోవడానికి ఏజ్తో పని లేదంటారా? ఓల్డేజ్లో గ్లామరస్ క్యారెక్టర్స్ చేయలేరుగా? కథానాయిక అంటే... కథకు కీలకంగా నిలిచే ఆడ పాత్ర అని అర్థం. గ్లామరస్గా కనిపిస్తేనే కథానాయిక అని కాదు. కథ నడిపించే దమ్మున్నవాళ్లను హీరో అనీ, ఆ పాత్ర తర్వాత కథ నడవడానికి కారణమయ్యే పాత్రను హీరోయిన్ అనీ అంటారు. సో... ఏజ్తో పని లేదు. మీ జవాబులు వింటుంటే ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అనిపిస్తోంది.. మీ ప్రశ్నలు కూడా బాగున్నాయి. యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే బోల్డంత ఇష్టం. సినిమాలు మానేయాలనే ఊహను కూడా నేను భరించలేను. ఇంతకీ దక్షిణాది వంటకాల్లో మీకేది ఇష్టం? చెబితే నవ్వుతారేమో కానీ, నాకు ఇడ్లీలు ఉంటే చాలు. తెల్లటి చట్నీతో కలిపి అవి తింటుంటే భలేగా ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఇడ్లీలు లాగించే వచ్చాను అసలు హైదరాబాద్లో దిగగానే బ్రేక్ఫాస్ట్ ఏం కావాలని నా స్టాఫ్ అడిగితే.. ఇడ్లీలు చాలన్నాను. మీ లాంటి నాజూకు నాయికలు మార్నింగ్ ఓట్స్, పండ్ల రసాలు, ఆమ్లెట్, ఎగ్ వైట్. ఇలా ఏవేవో తింటారు కదా..? నేను కూడా అవి తింటాను. కానీ, ఇడ్లీలు దొరికితే అవే తింటాను. నాకు డైట్ గురించి పెద్దగా పట్టింపు ఉండదు. అది సరే... తెలుగు సినిమాలు చూస్తుంటారా? అప్పుడప్పుడూ చూస్తుంటా. భాష తెలియదు కాబట్టి, డైలాగ్స్ అర్థంకావు. సినిమాథీమ్ అర్థం చేసుకోగలుగుతా. టాలీవుడ్లో మీ ఫ్రెండ్స్ లిస్ట్ చెబుతారా? మా సైఫ్కి మహేశ్, నమ్రతా శిరోద్కర్ మంచి ఫ్రెండ్స్. వాళ్లు మినహా పెద్దగా ఎవరూ తెలియదు. అప్పుడప్పుడూ తెలుగు సినిమాల సీడీలు వాళ్లు పంపిస్తుంటే, చూస్తాను. పెళ్లయ్యాక ముద్దు సీన్స్లో నటించనని, ‘కీ అండ్ కా’లో అర్జున్ కపూర్తో లిప్ లాక్ చేసేశారు. మీ భర్త సైఫ్ ఏమీ అనలేదా? మీ విషయంలో ఆయనకు పొసెసివ్నెస్ ఉండదా? పొసెసివ్నెస్ ఎక్కువ. కానీ, నా మీద మాత్రమే అది. నాలో ఉన్న నటి మీద ఆయనకెలాంటి అభిప్రాయమూ ఉండదు. బాగాచేస్తే అభినందిస్తారు. అంతేతప్ప ‘ఫలానా పాత్రలు చేయొద్దు’ అని రూల్ పెట్టరు. అందుకే నచ్చిన పాత్రలు చేయగలుగుతున్నా. సినిమాకు ఏది అవసరమో అది చేయాలని తనకు తెలుసు. ట్రైలర్ బాగుందన్నారు. నాయికగా వెలిగిన మీ అత్తగారు షర్మిలా ఠాగూర్ గురించి..? మా అత్తగారు నేటి తరం మహిళ అనాలి. ఆమెది ఫార్వార్డ్ థింకింగ్. పెళ్లయ్యాక కూడా బిజీగా సినిమాలు చేశారు. ఇంటినీ, పిల్లలనూ బాగా చూసుకున్నారు. రోల్ మోడల్గా తీసుకోదగ్గ వ్యక్తి. ‘పని చేయాలి.. ఖాళీగా ఉండకూడదు’ అని నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఫైనల్లీ... మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? నాది ప్రశాంత జీవితం. ఏ విషయానికీ టెన్షన్ పడను. ఇల్లు, సినిమాలు... ఈ రెండే నా ప్రపంచం. ఓవరాల్గా లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలన్నదే నా ఆశయం. - డి.జి. భవాని -
కుదుపు!
♦ క్లియరెన్స్ కోసం ఈసీకి జాబితా ♦ పదోన్నతులు పొందిన 9 మంది ♦ సహా 16 మందికి స్థాలచలనం రెవెన్యూ ప్రక్షాళనకు జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. సుదీర్ఘ కసరత్తు అనంతరం బదిలీల క్రతువును పూర్తి చేసిన కలెక్టర్ రఘునందన్రావు.. జాబితాను కేంద్ర ఎన్నికల కమిషన్కు పంపారు. ప్రస్తుతం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ జరుగుతుండడంతో ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో మార్పులు, చేర్పులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీల్డ్ కవర్లో బదిలీల జాబితాను ఈసీకి నివేదించింది. భారీగా తహసీల్దార్ల బదిలీలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : డిప్యూటీ తహసీల్దార్లుగా పనిచేస్తూ తహసీల్దార్లుగా ఇటీవల పదోన్నతులు పొందిన తొమ్మిది మందిని జిల్లాకు కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే రిపోర్టు చేసిన వీరికి పోస్టింగ్లు ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అలాగే పాలనా సౌలభ్యంలో భాగంగా అంతర్గత సర్దుబాట్లు చేసుకోవాలని భావించింది. యాలాల, బషీరాబాద్, మోమిన్పేట, బ ంట్వారం మండలాల్లో ప్రస్తుతం తహసీల్దార్లు లేరు. అలాగే కలెక్టరేట్లోని సీ, డీ సెక్షన్ సూపరింటెండెంట్ పోస్టులు సహా ఏఓ (భూ సంస్కరణలు) కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం కలె క్టరేట్ లో పనిచేస్తున్నఏఓ జనార్దన్ దేవాదాయశాఖలో పనిచేసేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈయనను జిల్లా యంత్రాంగం రిలీవ్ చేయాల్సివుంది. మరోవైపు రాజేంద్రనగర్, మల్కాజిగిరి డివిజన్ ఏఓ పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటిని కూడా భర్తీ చేయాల్సివుంది. పదోన్నతులతో జిల్లాకు వచ్చిన 9 మందికి పోస్టింగ్లు ఇవ్వడమేకాకుండా.. అంతర్గతంగా మరో ఆరేడుగురికి స్థానభ్రంశం కలిగించారు. మొత్తమ్మీద తాజా బదిలీల్లో 16 మందికి స్థానచలనం కలిగే అవకాశముందని తెలిసింది. కాగా, నేడో, రేపో ఈసీ నుంచి క్లియరెన్స్ రాగానే బదిలీ ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఎంపీడీఓల బదిలీలపై కేటీఆర్కు లేఖ మండల పరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీఓ) బదిలీలకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘకాలంగా ఒకేచోట తిష్టవేసిన ఎంపీడీఓలను ట్రాన్స్ఫర్ చేయాలని కొంతకాలంగా జిల్లా పరిషత్ యంత్రాంగం అనుకుంటోంది. ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, ఎంపీడీఓల లాబీయింగ్తో ఈ ప్రక్రియకు తరుచూ బ్రేక్ పడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా బదిలీల పర్వాన్ని పూర్తి చేయాలని నిర్ణయించిన యంత్రాంగం... 14 మంది ఎంపీడీఓలకు స్థానచలనం కలిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సాధార ణ బదిలీలపై నిషేధం ఉన్న క్రమంలో అనుమతి కోరుతూ రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి కె.తారకరామారావుకు లేఖ రాసింది. పనితీరు, సమర్థతను పరిగణనలోకి తీసుకోని పోస్టింగ్లను ఖరారు చేసినట్లు తెలిసింది. చాలావర కు స్థానిక ప్రజాప్రతినిధుల అభ్యర్థనల ఆధారంగా బదిలీల ప్రక్రియ చేపటినట్లు ప్రచారం జరుగుతోంది. పంచాయతీరాజ్ శాఖ నుంచి క్లియరెన్స్ రాగానే జాబితాకు అనుగుణంగా బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం. -
ఐఏఎస్, ఐపీఎస్ లకు పదోన్నతులు
♦ మొత్తం 31 మందికి ప్రమోషన్లు ♦ ముఖ్య కార్యదర్శులుగా ఐదుగురు ఐఏఎస్లకు అవకాశం ♦ అదనపు డీజీలుగా ఇద్దరు, ఐజీలుగా ఐదుగురు ఐపీఎస్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అఖిల భారత సర్వీసుకు చెందిన 31 మంది అధికారులకు పదోన్నతులు లభించాయి. పదోన్నతుల కమిటీ (డీపీసీ) రూపొందించిన ఫైల్పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సంతకం చేయడంతో శుక్రవారం సాధారణ పరిపాలన శాఖ ఈ ఉత్తర్వులు వెలువరించింది. పదోన్నతి లభించిన వారిలో ఐఏఎస్లు 13 మంది, ఐపీఎస్లు 12 మంది, ఐఎఫ్ఎస్లు ఆరుగురు ఉన్నారు. ఐఏఎస్లకు సంబంధించి 1991 బ్యాచ్కు చెందిన ఐదుగురు అధికారులకు కార్యదర్శి నుంచి ముఖ్య కార్యద ర్శి హోదా లభించింది. వీరిలో రజత్ కుమార్ (పౌరసరఫరాలశాఖ కమిషనర్), కె.రామకృష్ణారావు (ఆర్థికశాఖ కార్యదర్శి), హర్ప్రీత్సింగ్ (కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి), జి.అశోక్కుమార్లకు చోటు దక్కింది. ప్రస్తుతం వెయింటింగ్లో ఉన్న జి.అశోక్ కుమార్కు గృహనిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు. 1990 బ్యాచ్కు చెందిన శేషాద్రి, సయ్యద్ అలీ, ముర్తజ రిజ్వీలకు సూపర్ టైమ్స్కేల్ను వర్తింపజేశారు. వీరితో పాటు 2000 బ్యాచ్కు చెందిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ జగన్మోహన్, రాహుల్బొజ్జా, దినకర్బాబులకు కూడా సూపర్టైం స్కేల్ వర్తింపచేశారు. 2003 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారులైన యోగితా రాణా, లోకేశ్ కుమార్, సత్యనారాయణరెడ్డిలకు స్పెషల్ గ్రేడ్ స్కేల్ ఇచ్చారు. అదనపు డీజీలుగా సీవీ ఆనంద్, రాజీవ్త్రన్ ప్రస్తుతం ఐజీలుగా ఉన్న 1991 బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్ (సైబరాబాద్ కమిషనర్), రాజీవ్ రతన్ (అగ్నిమాపకశాఖ డీజీ)లకు అదనపు డెరైక్టర్ జనరల్గా పదోన్నతి కల్పించారు. అలాగే 1998 బ్యాచ్కు చెందిన ఐదుగురు ఐపీఎస్లకు డీఐజీల నుంచి ఐజీలుగా పదోన్నతి లభించింది. వీరిలో విక్రం సింగ్మాన్, ఆర్.బి.నాయక్, బి.మల్లారెడ్డి, టి.మురళీకృష్ణ, ఎం.శివప్రసాద్లు ఉన్నారు. 2002 బ్యాచ్కు చెందిన ఐపీఎస్ అధికారులు రాజేశ్ కుమార్, శివశంకర్రెడ్డిలకు డీఐజీ హోదా లభించింది. 2003 బ్యాచ్కు చెందిన ఐపీఎస్లు షానవాజ్ ఖాసిం, ఎ.సత్యనారాయణ, డా.వి.రవీందర్లకు సీనియర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పించారు. అలాగే ఆరుగురు ఐఎఫ్ఎస్లకు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్గా పదోన్నతి లభించింది. వీరిలో 1982 బ్యాచ్కు చెందిన డీకే పాండే, కేసీ శ్రీవాసుకి, చందన్ మిత్రా, పి.మధుసూదన్రావు, 1983 బ్యాచ్కు చెందిన ఏకే జైన్, ప్రశాంత్కుమార్ ఝాలు ఉన్నారు. -
పదోన్నతి కోసం 102 రోజులుగా దీక్ష
చిరుద్యోగిని పట్టించుకోని అధికారులు భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం బాలసదనంలో అటెండర్గా పనిచేస్తున్న ఆర్.శివరామశాస్త్రి పదోన్నతి కల్పించాలని కోరుతూ 102 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నాడు. అతడిని ‘సాక్షి’ కదిలించగా తనకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. జిల్లా శిశు సంక్షేమ శాఖలో 1992 నుంచి నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేస్తున్న శివరామశాస్త్రి ఎంఏ సోషియాలజీ పూర్తి చేశారు. పదోన్నతి కోసం 1997 నుంచి ఆయన ఉన్నతాధికారులకు వినతులు సమర్పిస్తునే ఉన్నారు. శాఖలో సీడీపీవో పోస్టుకు కావాల్సిన అర్హతలున్నా వరంగల్ రీజినల్ అధికారులు సరైన సమయంలో ఎల్డీసీగా(1997లోపు) పదోన్నతి కల్పించకపోవడంతో గెజిటెడ్ హోదా పదోన్నతిని కోల్పోయానని కన్నీటి పర్యంతమయ్యారు. శాఖ డెరైక్టర్లు, సెక్రటరీలు, మంత్రులను, గవర్నర్, ముఖ్యమంత్రి, రాష్ట్రపతికి వినతిపత్రాలు పంపించానని, వారు న్యాయం చేయాలని ఆదేశాలు జారీ చేసినా శిశు, సంక్షేమశాఖ అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో 4 సార్లు డ్యూటీ చేస్తూ నిరాహార దీక్ష చేశానని, ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని ఆయన కోరారు. -
ముంబాయిలో సందడి చేసిన సల్మాన్,సోనమ్
-
ప్రమోషన్తో లావెక్కుతారట!
పరిపరి శోధన ప్రమోషన్ వస్తే పరపతి, పలుకుబడి, అధికారం పెరుగుతాయని అందరికీ తెలిసిందే. అయితే, ప్రమోషన్ వస్తే చాలామంది లావెక్కుతారట! పదోన్నతి వల్ల లభించే అధికారం వల్ల స్వయంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో ఒత్తిడికి గురై, దానిని అధిగమించడానికి అతిగా తినడమే దీనికి కారణమని ఆస్ట్రేలియన్ పరిశోధకులు చెబుతున్నారు. వివిధ పదవుల్లో పనిచేస్తున్న 450 మందిపై విస్తృతంగా అధ్యయనం చేసి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. ముఖ్యంగా నైపుణ్యాలతో నిమిత్తంలేని నిర్ణయాలు తీసుకునే పదవుల్లో పెకైగబాకిన వారు, స్వయం నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో విపరీతమైన ఒత్తిడికి గురై, లావెక్కుతున్నట్లు గుర్తించారు. నైపుణ్యాన్ని పెంచుకునే ఆస్కారం ఉన్న పదవుల్లో పదోన్నతులు సాధించిన వారిలో ఇలాంటి మార్పేమీ కనిపించలేదని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన అడిలాయిడ్ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. -
మహేష్కి అదే మైనస్ పాయింట్
-
బాహుబలి ప్రమోషన్కు తమన్నా దూరం?
-
హైదరాబాద్లో సన్నీలియోన్