‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేతలున్నారు. పార్టీకి క్షేత్రస్థాయిదాకా మూలాలు ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇప్పటికీ అన్నివర్గాల్లో సానుకూల వాతావరణం ఉంది. వీటితో పాటు అధికారం కోల్పోయిన బాధ పార్టీ రాష్ట్ర ముఖ్యులందరిలోనూ ఉంది. అలాగే పార్టీ శ్రేణుల్లోనూ పెద్దగా విబేధాలేమీ లేవు. రాష్ట్ర నాయకత్వం కూడా ఉత్సాహంగా, చాలా వరకు సమన్వయంతో వ్యవహరిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలకు భిన్నంగా ఏఐసీసీ నేతలే రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ, పార్టీ పదవుల పంపకం దాకా అన్నీ వారే చూడటం నా లాంటి సీనియర్లకు ఇబ్బందికరంగా ఉంది’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ముఖ్య నాయకుడొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేవలం ఒక ఏఐసీసీ నేత వల్లనే ఈ శిబిరం జరిగినట్టుగా అధిష్టానాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు’ అని జాతీయ స్థాయిలో ముఖ్యపాత్ర వహించిన నాయకుడు అభిప్రాయపడ్డారు. ‘ఒకవేళ ఆ ఏఐసీసీ నాయకుడే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని అనుకుంటే మంచిదే. ఆంధ్రప్రదేశ్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది కదా. ఆ నాయకుడు ఏపీలో ఇలాంటి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిం చలేదు. ఆ రాష్ట్రంలోనూ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి కదా. అక్కడ కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను ఎందుకు నిర్వహించడంలేదు. కేవలం తెలంగాణ ఒక్కటే ఆ నేతలకు దొరికిందా? మేం కష్ఠపడితే, ఆ ఘనత వారి ఖాతాలో పడాలా? దీర్ఘకాలిక వ్యూహాల్లేకుండా, కేవలం చిన్నచిన్న కార్యక్రమాలతో తెలంగాణలో పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు’అని ఆ నాయకుడు దుయ్యబట్టారు.