telangana pcc
-
కాంగ్రెస్ ‘సామాజిక అస్త్రం’.. రాజ్యాంగ పరిరక్షణ కవాతు ప్రణాళిక
సాక్షి, హైదరాబాద్: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అదనంగా రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ కవాతు (సంవిధాన్ బచావో మార్చ్) నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలను తమవైపు తిప్పుకోవడమే లక్ష్యంగా 2 వారాలపాటు కవాతు నిర్వహించనుంది. దీనిపై చర్చించేందుకు వచ్చే నెల 4న కాంగ్రెస్ ముఖ్య నాయకులు దిగ్విజయ్సింగ్, జైరాం రమేశ్ హైదరాబాద్ రానున్నారు. నవంబర్ 3వ వారం తర్వాత.. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ నెలాఖరులో రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 24న నారాయణపేట జిల్లా నుంచి తెలంగాణ లోకి రావాల్సిన యాత్ర 3–4 రోజులు ఆల స్యం కావొచ్చని గాంధీ భవన్ వర్గాలు చెబు తున్నాయి. అక్టోబర్ 26 నుంచి నవంబర్ 1లోగా ఏదో ఒకరోజు తెలంగాణలోకి యాత్ర వస్తుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ యాత్ర కనీసం 13 రోజులపాటు జరగ నుంది. అంటే నవంబర్ మూడో వారం వరకు రాహుల్ యాత్ర రాష్ట్రంలో జరగనుండగా ఆ తర్వాత 75 కి.మీ. రాజ్యాంగ పరి రక్షణ కవాతు ప్రారంభించాలని టీపీసీసీ నేతలు యోచిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో నూ ఇలాంటి యాత్రలు చేపడుతున్నారని, అయితే తెలంగాణలో మాత్రం ఇతర రాష్ట్రా లకు భిన్నంగా కవాతు నిర్వహించాలనేది రాష్ట్ర కాంగ్రెస్ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. ఇందుకోసం టీపీసీసీకి అనుబంధంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్, వృత్తి దారులు, కిసాన్, ఫిషర్మెన్ సెల్లను భాగ స్వాములను చేస్తూ యాత్ర నిర్వహిస్తామని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. అన్యాయాన్ని వివరించడమే లక్ష్యంగా.. కాంగ్రెస్ హయాంలో ఆయా వర్గాలకు ఇచ్చి న ప్రాధాన్యం గురించి చెప్పడంతోపాటు బీజేపీ, టీఆర్ఎస్ల హయాంలో ఆయా వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని వివ రించడమే లక్ష్యంగా యాత్ర సాగుతుందని, భారత్ జోడో యాత్రకు ఎంత ప్రాధాన్య మి చ్చామో సామాజిక కవాతుకూ అంతే ప్రాధా న్యమిస్తామని టీపీసీసీ ముఖ్యనేత ఒకరు వెల్లడించారు. కవాతు ఏర్పాట్లపై చర్చించేందుకు పార్టీ ముఖ్య నాయకులు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేశ్ వచ్చే నెల 4న హైదరా బాద్కు రానున్నారు. ఈ సమావేశానికి హాజ రుకావాలంటూ పార్టీ అనుబంధ విభాగాల చైర్మన్లకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్లకు ఏఐసీసీ సమన్వయకర్త కొప్పుల రాజు లేఖలు కూడా రాశారు. ఈ సమావేశంలోనే కవాతు ఎక్కడ ప్రారంభించి, ఎక్కడ ముగించాలి, ముగింపు సందర్భంగా నిర్వ హించే బహిరంగ సభకు ఎవరిని ఆహ్వానించాలన్న దానిపై స్పష్టత రానుంది. -
దేశాన్ని విచ్ఛిన్నం చేసే రాజకీయ శక్తులను అడ్డుకోవాలి
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ పాలకులను తరిమికొట్టి ప్రజలకు స్వాతంత్య్రాన్ని సాధించి స్వేచ్ఛా వాయువులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అయితే కొన్ని మతతత్వ శక్తులు దేశంలో చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు చూస్తున్నాయని, ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులను ప్రతీ ఒక్కరూ ప్రతిఘటించాలని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్రోద్యమంలో వేలాదిమంది ప్రాణ త్యాగాలు చేశారని, లక్షలాదిమంది జైలు పాలయ్యారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు స్వాతంత్య్రం సిద్ధించిందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా సోమవారం తన నివాసంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. కరోనా కారణంగా గాంధీభవన్కు వెళ్లని ఆయన జూబ్లీహిల్స్లోని తన ఇంట్లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న వీడియోను విడుదల చేశారు. మతకల్లోలాలు, దేశ విభజన నేపథ్యంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తొలి ప్రధానమంత్రి నెహ్రూ దూర దృష్టితో పనిచేశారని, అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంతోనే 75 ఏళ్ల నుంచి దేశ ప్రజలు హక్కులు, బాధ్యతలతో స్వేచ్ఛగా జీవిస్తున్నారన్నారు. సోనియా, రాహుల్గాంధీల నాయకత్వంలో పటిష్టమైన పోరాటాలతో పనిచేయాలని, ప్రజాస్వామ్య, పార్లమెంటరీ వ్యవస్థల పతనాన్ని సంఘటితంగా అడ్డుకోవాలని కోరారు. చదవండి: ప్రశ్నిస్తే దాడులు చేయిస్తారా? నిరంకుశ పాలనను అంతం చేస్తాం -
బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి: రేవంత్
సాక్షి, హైదరాబాద్: చేనేత మీద 12 శాతం జీఎస్టీ వేసి చేనేత కళను చంపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి దుయ్యబట్టారు. చేనేత కార్మికుల జీవితాలతో బీజేపీ చెలగాటమాడు తోందని విమర్శిస్తూ ఆదివారం తన ట్విట్టర్లో పోస్టు చేశారు. నేతన్నకు అన్యాయం చేస్తున్న బీజేపీ దోపిడీ ముఠాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలని ఆ ట్వీట్లో రేవంత్ పిలుపునిచ్చారు. కాగా, జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణలోని నేతన్నలకు రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వాతంత్య్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచిన చేనేత రంగానికి ప్రత్యేకమైన రోజు ఉండాలన్న ఉద్దేశంతో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. గాంధీ కూడా రాట్నంపై నూలు వడకడానికి ప్రాధాన్యం ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీలో నేత కార్మికులకు ప్రత్యేక స్థానం ఉంటుందని ఆ ప్రకటనలో రేవంత్ వెల్లడించారు. చదవండి: అయోధ్యలో బీజేపీ నేతల భూ కుంభకోణం.. అఖిలేశ్ యాదవ్ ఫైర్ -
‘సభ్యత్వం’పై వద్దు అలసత్వం: పీసీసీ చీఫ్ రేవంత్ హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: సంస్థాగత బలమే పార్టీకి ప్రాణమని, క్షేత్రస్థాయిలో బలోపేతం కోసం మండలాల ప్రాతిపదికన కార్యాచరణ రూపొం దించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి సూచించారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, రాష్ట్రంలోని 34 వేల పోలింగ్ బూత్ల పరిధిలో ప్రతి బూత్కు 100 మందిని పార్టీ సభ్యులుగా చేర్పించాలని ఆదేశిం చారు. బుధవారం గాంధీభవన్లో పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై లోక్సభ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలతో రేవంత్ సమీక్షించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు పార్టీ సభ్యత్వ నమోదును క్రియాశీలకంగా నిర్వహించాలని కోరారు. దేశంలోనే తెలంగాణను ఆదర్శవంతంగా నిలపాలని సూచించారు. సభ్యత్వ నమోదులో నిర్లక్ష్యం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. నిర్లక్ష్యం చేస్తే ఎంతటివారైనా నష్టపోతారని హెచ్చరించారు. బలముంటేనే కొట్లాడగలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. క్షేత్రస్థాయిలో పార్టీ బలంగా ఉంటే ఈ ప్రభుత్వాలపై కొట్లాడగలమని పార్టీ నేతలకు రేవంత్ స్పష్టం చేశారు. ‘‘ఐదు మండలాల్లో పార్టీ బలంగా ఉంటే అసెంబ్లీ స్థానాన్ని, 35 మండలాల్లో బలంగా ఉంటే లోక్సభ స్థానాన్ని గెలుస్తాం. అదే 600 మండలాల్లో పార్టీ బలపడితే రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం. మండలాల్లో అధ్యక్షులు సరిగా పనిచేయకపోతే వారిపై చర్యలు ఉంటాయి. ప్రతి మండలంలో 10వేలు, నియోజకవర్గంలో 50వేలు, ఎంపీ స్థానం పరిధిలో 3.5లక్షల సభ్యత్వం చేసిన వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తాం’’అని చెప్పా రు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, ఎమ్మెల్యే సీతక్క, నేతలు మహేశ్కుమార్గౌడ్, హర్కర వేణుగోపాల్, మల్లు రవి, దీపక్జాన్, చిన్నారెడ్డి, గోపిశెట్టి నిరంజన్, వేం నరేందర్రెడ్డి, సోహైల్ పాల్గొన్నారు. ‘ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ అండ’ ఉద్యోగ, ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 317 జీవో చాలా ఇబ్బందులకు గురిచేస్తోందని, దీని కారణంగానే బడికి వెళ్లి పాఠాలు చెప్పాల్సిన టీచర్లు ప్రగతి భవన్ ముందు ఆందోళన చేస్తున్నారని టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. 317 జీవో రద్దయ్యేవరకు ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉపాధ్యాయ సంఘం మాజీ నేత గాల్రెడ్డి హర్షవర్ధన్రెడ్డి బుధవారం గాంధీభవన్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ మాట్లాడుతూ ఉద్యోగుల భవిష్యత్ను చీకట్లోకి నెట్టేస్తున్న 317 జీవోపై పోరాటం చేసేందుకే హర్షవర్ధన్ను కాంగ్రెస్లోకి తీసుకుంటున్నామని, ఆయనకు పార్టీలో గుర్తింపు ఉంటుం దని చెప్పారు. టీపీసీసీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ.. అందరం కలసి కాం గ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. -
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి
-
‘నాకు పీసీసీ అధ్యక్షుడిగా ప్రమోషన్ కావాలి’
సాక్షి, హైదరాబాద్ : ఉత్తమకుమార్ రెడ్డి రాజీనామాతో తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవికి ఆశావాహుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే పలువురు టీపీసీసీ రేసులో ఉన్నామంటూ ఫీలర్లు వదిలిన విషయం తెలిసిందే. పలువురు బాహాటంగా, మరికొందరు తాము ఆ పదవికి అర్హులే అంటూ పరోక్షంగా చెబుతున్నారు. తాజాగా ఆ రేసులో అంజనీ కుమార్ యాదవ్ కూడా చేరారు. రెండుసార్లు ఎంపీగా పని చేసిన తాను పీసీసీ అధ్యక్ష పదవికి అర్హుడేనని తెలిపారు. తనకు పీసీసీ అధ్యక్షుడుగా ప్రమోషన్ కావాలని, అందుకే హైదరాబాద్ అధ్యక్షుడుగా రాజీనామా చేశానని తెలిపారు. హైదరాబాద్ సిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయాన్ని అంజనీ కుమార్ గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. నేను గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిని కాదు. హైదరాబాద్, సికింద్రాబాద్ మాత్రమే అధ్యక్షుడిని. సీట్ల కేటాయింపులో నా ప్రమేయం లేదు. ప్రతీ నియోజకవర్గానికి పెద్ద లీడర్లు ఉన్నారు. (టీపీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు..) అంబర్ పేటలో వీ హనుమంతరావు, జూబ్లీహిల్స్లో విష్ణువర్థన్ రెడ్డి, సనత్ నగర్లో మర్రి శశిధర్ రెడ్డి.. ఇలా అందరూ పెద్ద నేతలే ఉన్నారు. గ్రేటర్ ఎన్నికల సీట్ల కేటాయింపులో నా పాత్ర సికింద్రాబాద్, ముషీరాబాద్ తప్ప ఎక్కడ లేదు. నా రాజకీయ జీవితం ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. బీజేపీ లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లను. గ్రేటర్లో ఓటమి అపనింద పడటం ఇష్టం లేదు.’ అని తెలిపారు. (కోమటిరెడ్డికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన ఉత్తమ్) ఇక ఇప్పటికే తెలంగాణ పీసీసీ రేసులో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉన్నారు. తనకు పగ్గాలు అప్పగిస్తే పార్టీని గాడిలో పెడతానంటూ ఆయన తన మనసులో మాటను వెల్లడించారు. మరోవైపు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందుకు రాష్ట్ర పార్టీ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకునేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్లో మకాం వేశారు. కోర్కమిటీ సభ్యులతో కలసి కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక గురించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. -
ఉస్మానియా వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్శిటీ భూముల పరిశీలన ఆదివారం ఉద్రికత్తకు దారితీసింది. ఓయూ భూములను పరిశీలించేందుకు వెళ్లిన తెలంగాణ పీసీసీ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. డీడీ కాలనీలో కబ్జా అయిన భూమి దగ్గరకు వెళ్లేందుకు యత్నించారు. అయితే వారిని అడ్డుకోవడంతో కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తమను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ కార్యక్రమంలో టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, వంశీచంద్రెడ్డితో పాటు పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు. (ప్రభుత్వ వైఫల్యాలపై టీపీసీసీ ‘పోరుబాట’) కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుబాట పట్టాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఓయూ భూములను పరిశీలించింది. ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు బీజేపీ, టీఆర్ఎస్ నేతలు భూములు కబ్జా చేస్తున్నారన్న ఆరోపణలతో పీసీసీ నేతలు ఉస్మానియాకు వెళ్లారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలపై అధ్యయనం చేసేందుకు నాలుగు కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. ఆర్థిక వ్యవహారాలపై సీఎల్పీ నేత భట్టి నేతృత్వంలో, ఉస్మానియా భూములు, విద్యారంగాలపై మాజీ ఎంపీ పొన్నం నేతృత్వంలో, నూతన వ్యవసాయ విధానంపై అధ్యయనానికి చిన్నారెడ్డి, కోదండరెడ్డి, గోదావరి పెండింగ్ ప్రాజెక్టులపై ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి నేతృత్వంలో కమిటీలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
ప్రభుత్వం ఏం చేస్తుంది: ఉత్తమ్ కుమార్ రెడ్డి
-
నన్ను అకారణంగా సస్పెండ్ చేశారు...
సాక్షి, హైదరాబాద్ : సస్పెన్షన్ వేటుపై తెలంగాణ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ స్పందించారు. పార్టీ నుంచి తనను అకారణంగా సస్పెండ్ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని నగేశ్ స్పష్టం చేశారు. క్రమశిక్షణా కమిటీ వీ హనుమంతరావుకు తొత్తులా పని చేస్తోందని ఆయన ఆరోపించారు. వాస్తవానికి, ఆ రోజు జరిగిన ఘటనలో తన తప్పేమీ లేదని, ఈ విషయం క్రమశిక్షణా సంఘం కూడా గుర్తించినా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని నగేశ్ ముదిరాజ్ వ్యాఖ్యానించారు. తనను సస్పెండ్ చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్న అనంతరం ఆయన గాంధీభవన్లోని గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనపై అకారణంగా చేయి చేసుకోవడంతో పాటు వీహెచ్ తనను వ్యక్తిగతంగా దూషించారని చెప్పారు. అన్ని పార్టీల నేతల ముందు, తన నియోజకవర్గంలో వీహెచ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని ఆరోపించారు. అయినా, కనీసం వీహెచ్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ 11వ తేదీన ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో మాజీ ఎంపీ వీ హనుమంతరావు, నగేశ్ మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. వేదికపైనే ఇద్దరు నేతలు బాహాబాహీకి దిగిన దిగటంతో విచారణ జరిపిన కాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం...నగేశ్పై సస్పెన్షన్ వేటు వేసింది. సంబంధిత వీడియో కోసం క్లిక్ చేయండి : నా సస్పెన్షన్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం -
నా పెళ్లి.. అయిపోయిందోచ్!
సాక్షి, హైదరాబాద్: రాహుల్ గాంధీ పెళ్లి అయిపోయిందట..! అమ్మాయి ఎవరు అని మాత్రం అడగకండి.. ఆయన పెళ్లి జరిగింది అమ్మాయితో కాదు.. కాంగ్రెస్ పార్టీతో!! ఈ విషయాన్ని మంగళవారం హరిత ప్లాజాలో ‘హైదరాబాద్ ప్రెస్క్లబ్’ నిర్వహించిన ఎడిటర్స్ మీట్లో రాహులే స్వయంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏ హడావుడి, హంగామా లేకుండా అతి సాధారణంగా టేబుల్ టేబుల్ తిరుగుతూ, కూర్చుంటూ, లేస్తూ, నడుస్తూ రాహుల్ ప్రసంగించారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలు, రాజకీయాలతోపాటు వ్యక్తిగత అంశాలను పంచుకున్నారు. జర్నలిస్టులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఇదే సందర్భంలో మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు.. బ్రహ్మచారిగానే ఉండిపోతారా అని ఓ పాత్రికేయుడు అడగ్గానే రాహుల్ బిగ్గరగా నవ్వేస్తూ.. ‘కాంగ్రెస్ పార్టీ నే పెళ్లి చేసుకున్నా..’అంటూ బదులిచ్చారు. తొలుత మహిళా జర్నలిస్టులు కూర్చున్న టేబుల్ నుంచి తన చిట్చాట్ను ప్రారంభించారు. ‘అత్యంత శక్తివంతమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన మీకు నానమ్మ ఇందిర, అమ్మ సోనియా, సోదరి ప్రియాంకాల్లో ఎవరు స్ఫూర్తి..’ అని ఒకరు ప్రశ్నించగా.. ‘ముగ్గురూ స్ఫూర్తే.. వాళ్లే బలం..’అని చెప్పారు. మహిళా జర్నలిస్టులున్న ఈ టేబుల్కు మరో రెండు నిమిషాల సమయాన్ని అధికంగా కేటాయిస్తానని చెప్పి.. వారితో అదనంగా మరో ప్రశ్న వేయించుకుని సమాధానం చెప్పారు. సెల్లో రికార్డింగ్పై చిరు కోపం సుమారు గంటా పది నిమిషాల పాటు జరిగిన ఈ మీట్లో ఓ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు తీరుపై రాహుల్ నొచ్చుకున్నారు. ‘ఈ మీట్ కేవలం ఆఫ్ ది రికార్డ్ కోసం ఉద్దేశించిందే.. నేను ఎంత ఫేర్గా ఉన్నానో.. మీరు అలాగే ఉండాలి’ అంటూ తన మాటల్ని సెల్ఫోన్లో రికార్డు చేసిన ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుపై చిరుకోపాన్ని ప్రదర్శించారు. కేసీఆర్ కుటుంబ పాలనపై విమర్శలు చేస్తున్న మీరు.. మీ కుటుంబ పాలనపై ఏమంటారు అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ‘మేం 30 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్నాం. నా తండ్రి ప్రధాని అయ్యాక మా కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఎవరూ ప్రధాని పదవి తీసుకోలేదు’ అని బదులిచ్చారు. ఈ భేటీలో ఆయన సాధారణ వ్యక్తిలా కలిసిపోయి పూర్తి వివరాలు, విశేషాలతో కూడిన సమాధానలివ్వటంతో సమావేశం అనంతరం ఆయన్ను పలువురు ఎడిటర్లు, జర్నలిస్టులు చప్పట్లతో అభినందించారు. సమావేశం చివరలో ‘సాక్షి’ దినపత్రిక కార్టూనిస్ట్ శంకర్ రాహుల్పై గీసిన క్యారికేచర్ను ప్రెస్క్లబ్ ప్రతినిధులు అందజేయగా.. ‘దీన్ని నా సోదరికి గిఫ్ట్గా ఇస్తా’ అంటూ తీసుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మీట్కు ఎస్పీజీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయటంతో ముఖ్య కాంగ్రెస్ నాయకులు సైతం ఇబ్బంది పడ్డారు. చివరకు ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు చొరవతో సీఎల్పీ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క లోపలికి రాగలిగారు. సుమారు 80 మందికిపైగా మీడియా ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసంగా సాగింది. జర్నలిస్ట్తో చాలెంజ్ దేశంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో తప్పక ఓటమి పాలవుతుందని రాహుల్ అనడంతో.. ఓ టీవీ చానల్ ఎడిటర్ మధ్యలో కల్పించుకుని వచ్చే ఎన్నికల్లో జాతీయ స్థాయిలో మీరు ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? 100 లేదా 200 అని అడిగారు. స్పందించిన రాహుల్ ‘మేం గెలువబోతున్నాం.. మీకు సందేహం అవసరం లేదు’ అన్నారు. సీట్ల సంఖ్య చెప్పండి అంటూ చానల్ ఎడిటర్ మళ్లీ అడగడంతో.. రాహుల్ ఆయన సీటు వద్దకు వచ్చి.. ‘బెట్ ఏమిటో చెప్పండి’ అని అడిగారు. ‘నూరు శాతం విజయం నాదే. మేం గెలిస్తే ఏం కావాలో బెట్ చేయండి’ అనగా.. ప్రధాని హోదాలో ఫస్ట్ ఇంటర్వ్యూ తనకే ఇవ్వాలని చానల్ ఎడిటర్ బదులిచ్చారు. ఈ బెట్కు రాహుల్ ఓకే చెప్పేయటంతో హాలంతా నవ్వుల్లో మునిగిపోయింది. రాఫెల్ విమానాల కొనుగోళ్లపై ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. మోదీ ప్రభుత్వం ఈ వ్యవహారంలో భారీ కుంభకోణానికి పాల్పడిందని, దీనిపై తాను పార్లమెంటులో ప్రశ్నిస్తే తన కళ్లలో సూటిగా చూసి సమాధానం చెప్పలేక ప్రధాని దిక్కులు చూస్తూ దాటేసిపోయారన్నారు. -
బహిరంగ సభలో కేసీఆర్పై నిప్పులు చెరిగిన రాహుల్
సాక్షి, హైదాబాద్ : ఏ కలల కోసం తెలంగాణ ప్రజలు పోరాటం చేశారో ఆ కలలు నెరవేరడం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తెలంగాణ సాధనలో ఆత్మబలిదానాలు చేసిన అమరులకు ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. సరూర్నగర్ స్టేడియంలో మంగళవారం జరిగిన ‘విద్యార్థి-నిరుద్యోగ గర్జన’సభలో టీఆర్ఎస్, ఎన్డీయే ప్రభుత్వాలపై ఆయన ధ్వజమెత్తారు. మన ఉద్యోగాలు మనకు వస్తాయని ఆశపడ్డాం, కానీ కొత్తగా వచ్చిన సీఎం నిరుద్యోగులకు, విద్యార్థులకు ఒరగబెట్టిందేం లేదని అన్నారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఆగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సభలో ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే.. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి టెండర్లు పారదర్శకంగా లేవని విమర్శలు గుప్పించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో పూర్తిగా కేసీఆర్ కుటుంబం ఆధిపత్యమే ఉందని అన్నారు. నరేంద్ర మోదీ, కేసీఆర్లు రీడిజైన్లో స్పెషలిస్టులని ఎద్దేవా చేశారు. మోదీ నోట్ల రద్దు చేస్తే.. కేసీఆర్ దానికి వంతపాడారని అన్నారు. ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద మోదీ, హైదరాబాద్లో ధర్నా చౌక్లో కేసీఆర్ నిరసనలు చేపట్టనీయకుండా నియంతల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, రాహుల్ తెలుగులో ప్రసంగం మొదలు పెట్టడంతో జనం నుంచి విశేష స్పందన లభించింది. నరేంద్రమోదీ బేటీ బచావో.. బేటీ పడావో అనే నినాదమిచ్చారు. కానీ, బిహార్లో బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దేశంలోని మహిళలపై ఇంతటి అమానుష ఘటనలు జరుగుతున్నా మోదీ మౌనం వీడడం లేదని రాహుల్ అన్నారు. మోదీ తన నినాదంలో ఆడపిల్ల ఎవరి నుంచి రక్షించబడాలో చెప్పలేదన్నారు. బీజేపీ ఎమ్మెల్యేల నుంచి ఆడపిల్లలను రక్షించాలా అని మోదీని ప్రశ్నించారు. -
కాంగ్రెస్లో నూతన ఉత్తేజం!
ఏఐసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన తరువాత, రాహుల్ గాంధీ మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి అన్ని అనుకూలతలున్న రాష్ట్రం తెలంగాణ. ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలైంది. ఇలాంటి కీలక సమయంలో రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తుంది. జమిలీ ఎన్నికల మాట అటుంచి, రాష్ట్రంలో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోనున్నారన్న ప్రచారం ఎక్కువైంది. అందుకు తగ్గట్టుగానే ఆ పార్టీ దూకుడు పెంచింది. ఏఐసీసీ ప్లీనరీలో చెప్పినట్టుగా కార్యకర్తలకు అధిష్టానానికి ఉన్న అడ్డుగోడలను కూల్చివేసే ప్రక్రియ తెలంగాణ నుంచే ఆరంభిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి అడ్డుపడుతున్న మోదీకి అన్ని సంద ర్భాలలో కేసీఆర్ మద్దతుగా నిలవటంతో టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ‘బి–టీం’గా వ్యవహరిస్తోందని తేలి పోయింది. దీనితో సెటిలర్లలో, విభజన హామీలుS అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే మార్గమనే భావన ఏర్పడింది. రెండు తెలుగు రాష్ట్రాలపై సవితి తల్లి ప్రేమ చూపిస్తూ, అన్యాయం చేస్తున్న మోదీకి బుద్ధి చెప్పాలని చూస్తున్న తరుణంలో, రాహుల్ పర్యటన తెలం గాణ ప్రజలకు భరోసా ఇవ్వనుంది. మోదీ రూపంలో ప్రజలను పట్టిపీడిస్తున్న ధరల పెరుగుదల, జీఎస్టీ భారం, బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత, అసహనం, దళితులపై దాడులు, రాఫెల్ యుద్ధ విమానాల కుంభకోణం తదితర అంశాలతో పాటు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ చేస్తున్న ద్రోహాలను రాహుల్ తన రెండు రోజుల పర్యటనలో ఎత్తిచూపనున్నారు. ఇక రాహుల్ గతంలో నామకరణం చేసినట్టు ‘మినీ మోదీ’ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఎమ్మెల్యేల పదవీ కాలం రద్దు, ప్రాజెక్టుల్లో అవినీతి, ఇసుక మాఫియా, నేరెళ్ల ఘటన, కౌలు రైతులకు రైతు బంధు పథకం వర్తించకపోవటం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో స్తబ్దత, అభయ హస్తం పింఛన్లు, ఊసే లేని కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, నిర్లక్ష్యానికి గురవుతున్న ఆరోగ్యశ్రీ, గ్రామ పంచాయతీ ఉద్యోగుల నిరసనలు, రేషన్ డీలర్ల సమస్యలు, నిరుద్యోగ సమస్యలు రైతు బీమా పేరుతో తెచ్చిన పథకం 60 ఏళ్ళు నిబంధన ఇలా ప్రజలు అసంతృప్తితోవున్న అనేక అంశాలు గ్రేటర్ వేదికగా, యావత్ తెలంగాణ ప్రజల మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలను రాజకీయాలకు అతీతంగా సందర్శించి, విద్యార్థులతో ఇష్టాగోష్టిలో పాల్గొంటున్నారు. అందులో భాగంగా, ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ వస్తారంటే టీఆర్ఎస్ నేతలు దీన్నీ వివాదాస్పదం చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం అన్ని సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని సమన్వయంతో పని చేస్తుంటే, టీఆర్ఎస్ మద్దతుదారులు మాత్రం అనుమతి ఇవ్వొద్దని పోటీగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చి యూనివర్సిటీ ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నవేళ, పార్టీ కార్యక్రమాలతో పాటు, సమాజంలోని అనేక రంగాల ప్రజలను రాహుల్ ఈ పర్యటనలో కలుస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు కూడా కలవరం మొదలైంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే బలమైన రాజకీయ శక్తి అని భావించి, ఈ మధ్యనే వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరిన నేతలు రాహుల్ పర్యటనను తమ ఉనికిని చాటుకోవడానికి అనువైన సమయంగా భావిస్తుండటంతో పాత–కొత్త కలయికతో పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగనుంది. ఊహించినట్టుగా ముందస్తు ఎన్నికలు డిసెంబర్లోపే వచ్చినా ఈ పర్యటనలో రాహుల్ స్ఫూర్తితో పనిచేసి, మెజారిటీ అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుని, అధికారంలోకి రావాలనే ఊపు పార్టీ శ్రేణులలో కనబడుతుంది. -కొనగాల మహేష్(వ్యాసకర్త సభ్యులు, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ -98667 76999) -
టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కంటే అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తోంది. అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ సమర్థులైన అభ్యర్థులను బరిలోకి దింపితే కాంగ్రెస్ అధికారంలోకి రావడం సాధ్యమే.. ఇది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ సెక్రటరీలు పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీకి నివేదించిన సారాంశం. తెలంగాణ కాంగ్రెస్ ఇఛార్జ్ సెక్రటరీలతో రాహుల్ సోమవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని పార్టీ పరిస్థితులపై ముగ్గురు సెక్రటరీలతో చర్చించారు. నెల రోజుల తమ రాష్ట్ర పర్యటన వివరాలను ఈ భేటీలో ఏఐసీసీ సెక్రటరీలు రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామాల్లో కాంగ్రెస్కు అనుకూలత కనిపిస్తోందని రాహుల్కు వివరించినట్టు ఏఐసీసీ కార్యదర్శి ఎన్ఎస్ బోసురాజు తెలిపారు. కేసీఆర్ కుటుంబ పాలన, ఇచ్చిన హామీలు అమలుకాకపోవడం, నిరుద్యోగ సమస్య తదితర అంశాలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. స్థానిక సమస్యలపై దృష్టిపెట్టి ప్రజల్లోకి వెళితే పార్టీకి అనుకూలత ఉంటుందని రాహుల్కు వివరించామని తెలిపారు. తెలంగాణలో లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై మొదటదృష్టి సారించామని, అదే సమయంలో మండల స్థాయి నుంచి పీసీసీ వరకు పార్టీని బలోపేతం చేయాలని రాహుల్ సెక్రటరీలకు సూచించారు. ప్రతినెలా ఆయా స్థాయిల్లో ఒకసారైనా సమావేశాన్ని నిర్వహించాలని తెలిపారు. దేశవ్యాప్తంగా చూసినా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణాలో మంచి భవిష్యత్తు కనిపిస్తోందని రాహుల్ తమతో అన్నారని ఎన్ఎస్ బోసురాజు మీడియాకు తెలిపారు. తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన సహకారాన్ని అధిష్టానం నుంచి అందిస్తామని రాహుల్ తెలిపారని చెప్పారు. -
టీఆర్ఎస్ వెలమల పార్టీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీని వెలమ సామాజిక వర్గం వ్యక్తులు నడిపిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్.సి.కుంతియా విమర్శించారు. టీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఆ పార్టీ బలహీనంగా ఉన్నందునే తమ పార్టీ నేతలను చేర్చుకుంటోందని ఎద్దేవా చేశారు. సోమవారం గాంధీభవన్లో జరిగిన ముఖ్య నేతల సమావేశం అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి తదితరులతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ మభ్యపెట్టాలని చూస్తున్నారని, అయినా ఉత్తమ్ నాయకత్వంలో టీఆర్ఎస్ను తాము ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 40 శాతం మంది కౌలు రైతులు ఉన్నారని, వారికి కూడా రైతుబంధు పథకాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఎన్నికలొచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్న కుంతియా.. పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీట వేస్తామని వెల్లడించారు. గద్దె దించేందుకు ప్రజలూ సిద్ధం: ఉత్తమ్ ‘ముందస్తు ఎన్నికలకు సిద్ధం అంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ రద్దుపై గవర్నర్కు లేఖ ఇస్తానంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుందా..? ఎవరైనా వద్దన్నారా?’ అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వ్యాఖ్యానించారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ నిరంకుశ పాలనలో అన్ని రంగాల్లో అన్యాయానికి గురైన ప్రజలు కూడా ఎన్నికలకు, టీఆర్ఎస్ను గద్దె దించేందుకు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు. దానం నాగేందర్ పార్టీని వీడటం బాధాకరమన్న ఉత్తమ్.. సామాజిక న్యాయం విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. తప్పుడు సర్వేలతో కేసీఆర్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు. -
కుంతియాను అవమానించారా?
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర కుంతియాకు అవమానం జరిగిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. తనకు జరిగిన అవమానంపై ఆయన కాంగ్రెస్ బస్సుయాత్ర కోఆర్డినేషన్ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘నేను ఇన్చార్జ్గా ఉన్నా కదా. గులాం నబీకి స్వాగతం అంటూ సోషల్ మీడియాలో ఎలా పోస్ట్ చేస్తారు. అధిష్టానం నుంచి అధికార ప్రకటన రాకముందే ఇలా చేసి నన్ను అవమానించినట్టే. నేనే ఇన్చార్జ్గా ఉండాలని నాకేం లేదు. కానీ పార్టీ ప్రకటించిన తర్వాత ఏమైనా చేసుకోండి. అనవసరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోవద్దో చెప్పాలని కుంతియా ఆగ్రహం చెందినట్లు తెలుస్తోంది.’ కాగా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలోఅధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ వ్యూహంతో ముందుకు వెళుతోంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ కుంతియా సమర్థవంతంగా పని చేయడం లేదని భావించిన అధిష్టానం తాజాగా ఆజాద్ పేరును పరిశీలనకు తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జిగా పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ను నియమించనుందని తెలుస్తోంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన చేయనుంది. అయితే అధికారిక ప్రకటన రాకముందే తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలువురు ఆజాద్ రాకను స్వాగతిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై కుంతియ కినుక వహించినట్లు సమాచారం. -
హైదరాబాద్లో సీమాంధ్రులకు టికెట్లు
సాక్షి, హైదరాబాద్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో సెటిలైన సీమాంధ్రులకు కూడా టికెట్లు ఇస్తామని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ అన్నారు. హైదరాబాద్, చుట్టుపక్కల నియోజకవర్గాల విషయంలో ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతున్నామని, ఈ సారి సెటిలర్లు కాంగ్రెస్ వైపే ఉంటారని నమ్ముతున్నట్లు చెప్పారు. బుధవారం హైదరాబాద్లో మీడియాతో ఆయన చిట్చాట్ చేశారు. ‘‘హైదరాబాద్లోని సెటిలర్స్ నేతలతో మాట్లాడుతున్నాం. కొన్ని చోట్ల సీమాంధ్ర నేతలకు టికెట్లు ఇస్తాం. అధిష్టానం కూడా ఇందుకు ఓకే చెప్పింది. కాంగ్రెస్పై వారికి గతంలో ఉన్న కోపం లేదు కాబట్టి ఈసారి సెటిలర్స్ మావైపే ఉంటారు. పాతబస్తీలో ఎంఐఎంపై బలమైన అభ్యర్థులను నిలబెడతాం. ఎంఐఎంకు బీజేపీతో రహస్య ఒప్పందాలున్నాయి. కాబట్టే బలమైన మైనార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తాం. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ మా విజయాన్ని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని ఉత్తమ్ తెలిపారు. టీడీపీతో కాంగ్రెస్ పొత్తు..: మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్-టీడీపీలు కలిసి పనిచేయబోతున్నాయన్న వార్తలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. నేటి విలేకరుల భేటీలోనూ పీసీసీ చీఫ్ ఉత్తమ్ అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘అవును. టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దు అని ఎక్కడా లేదుగా! హైదరాబాద్లో కొన్ని చోట్ల టీడీపీకి ఓటు బ్యాంకు ఉంది. అయితే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా, వద్దా అనేది అధిష్టానమే నిర్ణయిస్తుంది. ఇకపోతే, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లిన చాలా మంది నేతలు మళ్లీ వస్తామని చర్చలు జరుపుతున్నారు. కానీ దీనిపై పార్టీలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈసారీ టికెట్ ఇచ్చినవాడు యుద్ధం చేసేందుకు రెడీగా ఉండాలి. ఉత్తమ్ మనిషనో, ఇంకొకరి మనిషనో టికెట్లు ఇవ్వరు. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ల పాదయాత్రల ఫలితాలు హైకమాండ్ విశ్లేషిస్తుంది’’ అని టీపీసీసీ చీఫ్ చెప్పారు. రాహుల్ అలా అనలేదు: దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన కాంగ్రెస్ నేతలంతా పదవుల నుంచి తప్పుకుంటుండంపై ఉత్తమ్ స్పందించారు. నిజానికి రాహుల్ గాంధీ సీనియర్లను తప్పుకోమనలేదని, యువతకు, కొత్త తరానికి అవకాశం ఇవ్వాలని మాత్రమే సూచించారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి క్లియర్గా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తున్నాం. క్లిష్టమైన స్థానాల్లో హైకమాండ్దే అంతిమ నిర్ణయం. కాంగ్రెస్లో నేతల మధ్య అభిప్రాయం భేదాలు చాలా సహజం. అయితే ఎన్నికల్లో అందరం ఒక్కటిగా పనిచేస్తాం’’ అని ఉత్తమ్ వివరించారు. -
నేటీ నుంటి టీకాంగ్రెస్ రెండో విడత బస్సు యాత్ర
-
కాంగ్రెస్లో నూతనోత్తేజం
సాక్షిప్రతినిధి, నిజామాబాద్: టీపీసీసీ చేపట్టిన ప్రజాచైతన్య బస్సుయాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో రెండురోజుల పాటు సాగిన ఈ యాత్ర నాలుగు చోట్ల బహిరంగసభలను నిర్వహించింది. తొలిరొజు బోధన్, నిజామాబాద్ నగరాల్లో నిర్వహించగా., సోమవారం నందిపేట్, భీంగల్లలో బహిరంగసభలు జరిగాయి. సభలను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమీప ప్రాంతాల నుంచి జనసమీకరణ చేసింది. నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో ముగ్గురు, నలుగురు నాయకులు తమ ప్రాతినిధ్యాన్ని ప్రదర్శించేందుకు పోటీపడ్డారు. అంతర్గతంగా కుమ్ములాటలున్నప్పటికీ.. ఈ యాత్ర కోసం ఐక్యతారాగాన్ని ఆలపించారు. బస్సుయాత్ర సజావుగా సాగడంతో జిల్లా ముఖ్య నాయకత్వం ఊపిరి పీల్చుకుంది. రైతాంగ సమస్యలపై.. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే ఈ యాత్ర చేపట్టామని ప్రకటించిన రాష్ట్ర అధినాయకత్వం ఒకవైపు సీఎం కేసీఆర్ను విమర్శిస్తూనే.. జిల్లా అంశాలను కూడా ప్రస్తావించారు. రెండో రోజు బస్సుయాత్ర సాగిన ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలు వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కావడంతో రైతాంగ సమస్యలపై దృష్టి సారించారు. పంట రుణ పరిమితి పెంపు, మద్దతు ధరలు వంటి అంశాలను నేతలు ప్రత్యేకించి ప్రస్తావించారు. కొన్ని నెలల క్రితం ఆర్మూర్ డిక్లరేషన్ పేరుతో ఆలూరులో రైతుసదస్సు నిర్వహించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఈ బస్సుయాత్రలో కూడా రైతాంగ సమస్యలపై దృష్టి సారించింది. ప్రత్యేకంగా పార్టీ కిసాన్సెల్ రాష్ట్ర నాయకత్వం రైతుల అంశాన్ని ప్రస్తావించింది. ఆర్మూర్లో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణం ప్రారంభానికే నోచుకోని అంశాన్ని లేవనెత్తారు. తొలిరోజు ఆదివారం బోధన్ చక్కెర కర్మాగారాన్ని ప్రారంభించాలనే ఎన్నికల హామీతో పాటు, మైనార్టీల సంక్షేమ అంశాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసిన విషయం విదితమే. అంటీముట్టనట్టుగా మధుయాష్కి.. మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ ఈ బస్సుయాత్రలో అంటీముట్టనట్టుగా వ్యవహరించడం పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది. ఈ యాత్ర దాదాపు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోనే సాగడంతో నాలుగు బహిరంగసభల్లో ఆయన పాల్గొనే అవకాశాలున్నాయని భావించారు. ఒక్క నిజామాబాద్ అర్బన్లో సభకు మాత్రమే హాజరైన మధుయాష్కి, కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయారు. మిగితా మూడు సభల్లో ఆయన కనిపించలేదు. రాహుల్గాంధీ విదేశీ పర్యటన ఏర్పాట్ల నిమిత్తం ఆయన మలేషియా వెళ్లడంతో ఈ సభలకు హాజరుకాలేక పోయారని ఆయన సన్నిహితవర్గాలు పేర్కొంటున్నాయి. -
మనస్పర్ధలు సర్దుకుంటాయ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఏర్పడిన మనస్పర్ధలు త్వరలోనే సర్దుకుంటాయని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య వచ్చే విభేదాల్లాంటివే ఇవికూడా.. వాటిని పైకి చెప్పనవసరంలేదని వ్యాఖ్యానిం చారు. ఢిల్లీలో మంగళవారం కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన ఆయన తెలుగు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులపై నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టిసారించామని త్వరలోనే అన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. రాజ్భవన్లను ప్రజలకు మరింత చేరువ చేయడంపై హోం శాఖకు పలు సూచనలు చేసినట్టు తెలిపారు. గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న కాంగ్రెస్ నేతల ఆరోపణలపై విలేకరులు ప్రశ్నించగా.. అపార్థాలతో బంధాలను విడగొట్టుకోలేమన్నారు. ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయానికి 24 గంటల విద్యుత్, భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి గవర్నర్ తీసుకెళ్లారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ప్రధానితో అరగంటసేపు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను ప్రధానికి వివరించినట్లు తెలిసింది. కేంద్రం ఇచ్చిన అనుమతులతో తెలంగాణలో కాళేశ్వరం, ఏపీలో పోలవరం ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్నాయని వివరించారు. రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల పరంగా ఎలాంటి సమస్యలు లేవని నివేదించారు. -
ఆశావాహులకు రాహుల్ షాక్
న్యూఢిల్లీ : పీసీసీ పీఠంపై ఆశలు పెంచుకున్న ఆశావాహులకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ షాక్ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ప్రాంతీయ కమిటీలను యథాతథంగా కొనసాగించాలని ఆయన శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని దక్కించుకొనేందుకుగాను కొంతకాలంగా పార్టీ సీనియర్లు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ పిసీసీ పీఠం కోసం తెలంగాణలో ఉత్తమ్ కుమార్ స్థానంలో తమకు అవకాశం కల్పించాలని, అలా అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెస్తామని బహిరంగంగానే ప్రకటనలు చేశారు. ఈ మేరకు హైకమాండ్కు విజ్ఞప్తులు కూడా చేశారు. అయితే రాహుల్ తాజా నిర్ణయం వారికి నిరాశ కలిగించిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఆయా కమిటీలే కొనసాగనున్నాయి. -
కాంగ్రెస్ నుంచి 30 మంది సీనియర్లు ఔట్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దాదాపు 30 మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్లకు ఈ సారి టికెట్లు గల్లంతయ్యే అవకాశాలున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఇతర కీలక నేతలు కూడా ఈ జాబితాలో ఉన్నారని టీపీసీసీ ముఖ్యనేతలు చెబుతున్నారు. ఏఐసీసీ అధినేతగా రాహుల్ గాంధీ బాధ్యతలు తీసుకుని, పూర్తిస్థాయి పనులు ప్రారంభించిన తర్వాత తెలంగాణలో కీలకమార్పులు, పార్టీలో అంతర్గత సంస్కరణలు జరుగుతాయని వారంటున్నారు. పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగే సాధారణ ఎన్నికలు కాంగ్రెస్కే కాకుండా, ఆయనకు వ్యక్తిగతంగా అత్యంత ప్రతిష్టాత్మకం అవుతాయంటున్నారు. రాహుల్ గాంధీ రాజకీయ మనుగడకు పరీక్ష పెట్టబోయే వచ్చే సాధారణ ఎన్నికల్లో ప్రతీ ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థి టికెట్పై ఆచితూచి నిర్ణయం తీసుకోనున్నారని చెబుతున్నారు. ‘రానున్న ఎన్నికల్లో టికెట్ల పంపిణీ, అభ్యర్థుల స్క్రీనింగ్ ఆషామాషీగా ఉండే అవకాశం లేదు. పార్టీలో సీనియర్లు అనే కోణంలో మాత్రమే టికెట్లు వచ్చే అవకాశాల్లేవు. అభ్యర్థి గెలుపోటములు, పనితీరు, వ్యక్తిగత చరిత్రపై ఆధారపడి టికెట్లు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు అనేది ఎప్పుడైనా అధిష్టానం పరిధిలోని అంశమే. టీపీసీసీ నుంచి కేవలం ప్రతిపాదనలు, అభిప్రాయాలను మాత్రమే తీసుకుంటారనేది అందరికీ తెలిసిందే. అయితే ఈ సారి టీపీసీసీ నుంచి వచ్చే ప్రతిపాదనలను కూడా అత్యంత జాగ్రత్తతో పంపించాల్సి ఉంటుంది’ అని పీసీసీ ముఖ్యనాయకుడొకరు వెల్లడించారు. సీనియర్ అయితే సరిపోదు.. పార్టీలో సీనియర్.. అనే అర్హత ఒక్కటే వచ్చే ఎన్నికల్లో సరిపోదంటున్నారు. వరుసగా మూడుసార్లు ఓడిపోయిన నాయకునికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. టికెట్ల ఎంపికకోసం అభ్యర్థుల జాబితాను పంపేటప్పుడు పాటించాల్సిన నిబంధనలను త్వరలోనే అధిష్టానం నుంచి వస్తాయని తెలుస్తోంది. మూడుసార్లు ఓడిపోయినవారికి టికెట్ను నిష్కర్షగా తిరస్కరించాలనేది ఇందులో ప్రధానమైనదని ఆ నాయకుడు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయినవారికి కూడా టికెట్ గల్లంతయ్యే అవకాశముందని ఆయన వివరించారు. వరుసగా మూడుసార్లు అవకాశం ఇచ్చినా గెలవని అభ్యర్థి, ఇక వచ్చే ఎన్నికల్లోనూ గెలిచే అవకాశం ఉండదనే అంచనాతోనే కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో 30 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థి వచ్చే ఎన్నికల నాటికి ఈ తేడాను అధిగమించి, గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయనే అంచనాతో పార్టీ ఉన్నట్టుగా తెలుస్తోంది. డీసీసీ అధ్యక్షులకూ...? అలాగే డీసీసీ అధ్యక్షులుగా పనిచేస్తున్నవారు కూడా టికెట్లు అడగకూడదని ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం చాలా స్పష్టంగా సూచనలు చేసింది. అయితే ఈ నిబంధన వల్ల డీసీసీ అధ్యక్షులుగా పనిచేయడానికి చాలామంది నాయకులు విముఖంగా ఉన్నారని, డీసీసీ అధ్యక్షులుగా ఉండటం వల్లనే టికెట్లు నిరాకరిస్తే ఇబ్బంది అవుతుందని అధిష్టానానికి టీపీసీసీ వివరించింది. దీనిపై అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. మరో పక్క డీసీసీ అధ్యక్షులకు కూడా టికెట్లు వస్తాయని, ఆ పదవి టికెట్కు అనర్హత కాకుండా చూస్తామని టీపీసీసీ అధ్యక్షుడు భరోసా ఇస్తున్నారు. అయితే పార్టీ అభివృద్ధికోసం జిల్లా అంతా సమన్వయం చేయడానికి డీసీసీ అధ్యక్షుడు పనిచేయాలని, టికెట్లు ఇస్తే డీసీసీ అధ్యక్షుడు కూడా తన నియోజకవర్గానికే పరిమితమైన అనుభవాలు ఉన్నాయని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. నిబంధనల గురించి ఇప్పటికే టీపీసీసీకి ఢిల్లీ వర్గాలనుంచి మౌఖికంగా సమాచారం అందినట్టు తెలుస్తోంది. -
తెలంగాణ కాంగ్రెస్లో భారీ మార్పులు..?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయా? తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశలో పీసీసీకి అనుబంధంగా లేదా సమాంతరంగా మరిన్ని కమిటీలు ఏర్పాటు కానున్నాయా? పార్టీ సీనియర్లు, సామాజిక సమతుల్యత వంటివాటికి ప్రాధాన్యత ఇవ్వనుందా? ఇలాంటి ప్రశ్నలకు సీనియర్ నేతలు అవుననే సమాధానం ఇస్తున్నారు. పార్టీలో నాయకత్వ సమస్యను పరిష్కరించడానికి పలు మార్పులూ చేర్పులను చేపట్టనున్నట్టుగా కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు. ఏఐసీసీ అధ్యక్షునిగా రాహుల్ గాంధీ బాధ్యతలను తీసుకున్న తర్వాత రాష్ట్ర కాంగ్రెస్లోని సమస్యలను పరిష్కరించడానికి, పార్టీ సీనియర్లను ఏకతాటిపైకి తీసుకురావడానికి కీలకమైన చర్యలను తీసుకుంటారని చెబుతున్నారు. ఇందుకోసం పార్టీలో కొంత పేరు, పని చేయగలిగే సత్తా ఉన్న వారికి తగిన బాధ్యతలను అప్పగించాలనే ఏఐసీసీ స్థాయి లో స్థూలంగా నిర్ణయాలు జరిగాయని పార్టీ జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషిస్తున్న నేత ఒకరు వెల్లడించారు. సీడబ్ల్యూసీలోకి కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్రెడ్డిని తీసుకునే అవకాశం ఉందని చెప్పారు. పొన్నాల, సర్వేలకూ అవకాశం.. కేంద్ర మంత్రిగా పలు కీలకమైన శాఖలకు పని చేసిన జైపాల్రెడ్డి సేవలను జాతీయ స్థాయిలో వినియోగించుకోవాలనే యోచనలో రాహుల్ గాంధీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే సీనియర్లు పొన్నాల లక్ష్మయ్య, సర్వే సత్యనారాయణ వంటివారికి కూడా జాతీయ స్థాయిలోనే అవకాశం కల్పిస్తారని సమాచారం. ఇప్పటికే వి.హన్మంతరావు, మధు యాష్కీ, చిన్నారెడ్డి వంటివారికి ఏఐసీసీలో బాధ్యతలున్నాయి. వీరితోపాటు మరో ఇద్దరు, ముగ్గురికి ఏఐసీసీలో అవకాశాలు వస్తాయని తెలుస్తోంది. అలాగే రాష్ట్రస్థాయిలో మరికొందరు ముఖ్యనేతలకు అవకాశాలు కల్పించనున్నట్టుగా తెలుస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరికి కీలక అవకాశం కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న సినీ నటి, మాజీ ఎంపీ ఎం.విజయశాంతికి పార్టీలో తగిన వేదికను కల్పించాలనే ప్రతిపాదన ఏఐసీసీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరికి కీలకమైన అవకాశాలను కల్పించాలనే యోచన ఏఐసీసీకి ఉన్నట్టు సమాచారం. వీరికి తగిన అవకాశాలను కల్పించే ప్రతిపాదనపై విజయశాంతి, కోమటిరెడ్డి సోదరులతోనూ ఏఐసీసీ ముఖ్యులు ప్రాథమికంగా చర్చలను పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో కాంగ్రెస్లో చేరిన రేవంత్రెడ్డికి పీసీసీలో కీలక అవకాశాన్ని కల్పిస్తారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరణ పూర్తిచేసి, ఎన్నికలకు పీసీసీని సన్నద్ధం చేసే ప్రక్రియ త్వరలోనే జరుగుతుందని ఏఐసీసీ నేతలు చెబుతున్నారు. కొత్తగా మరో కమిటీ..! ఇప్పటికే టీపీసీసీ సమన్వయ కమిటీ ఉంది. దీన్ని పునర్వ్యవస్థీకరించే యోచనలో ఏఐసీసీ ఉంది. సమన్వయ కమిటీలో సత్తా లేని వారిని తొలగించి, పని చేయగలిగే శక్తి ఉన్న నేతలకు అవకాశం కల్పించనున్నారు. పీసీసీకి కీలకమైన రాజకీయ అంశాల్లో తోడ్పాటు అందించేలా, పార్టీ సీనియర్ల ప్రతిపాదనలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా ఒక కమిటీని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో పీసీసీ ఎన్నికల కమిటీ ఉంటుందని, అంతకుముందు పార్టీ నేతల అభిప్రాయాలకు తగిన వేదిక ఉండాలనే యోచనలో ఏఐసీసీ ఉన్నట్టుగా తెలుస్తోంది. -
కాంగ్రెస్లోకి వారి చేరికను స్వాగతిస్తాం..
సాక్షి, నిజామాబాద్ : టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరాంలు కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలోనే ఆ పార్టీ సీనియర్ నాయకుడు, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి కొత్త రక్తం వస్తే తప్పులేదని, వచ్చేవారిని స్వాగతిస్తామని అన్నారు. అయితే, ఎవరు కాంగ్రెస్లో చేరాలన్నా హైకమాండ్ ఆదేశానుసారంగా జరుగుతుందని, కోదండరాం వస్తానంటే అధిష్టానమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. నిజామాబాద్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలపై సీఎం నోరువిప్పరా? : ‘‘అధికార పార్టీకి చెందిన నేతలు విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏకంగా స్పీకర్ మధుసూదనాచారి, ఇంకొందరు ఎమ్మెల్యేలలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. మరి అవినీతి చేస్తే చెప్పుతో కొట్టండని జనానికి పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి ఈ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు?’’ అని షబ్బీర్ ప్రశ్నించారు. గాడి తప్పిన పాలన : మిషన్ భగిరథ పథకంలో బాగంగా ఇంటింటికి నీళ్లు ఎప్పుడు ఇస్తారనేదానిపై సంబంధిత అదికారులకే స్పష్టత లేదని, అన్ని జిల్లాలోనూ పరిపాలన గాడి తప్పిందని షబ్బీర్ అన్నారు. సోంత పార్టీ నేతలే పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నా సీఎం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గుజరాత్లోనూ గుర్దాస్పూర్ ఫలితమే : మరికొద్ది రోజుల్లో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చావుదెబ్బ తప్పదని షబ్బీర్ అలీ అన్నారు. నాందేడ్ కార్పోరేషన్, గురుదాస్ పూర్, కేరళ ఉప ఏన్నికల్లో వచ్చిన ఫలితాలే గుజరాత్లోనూ పునరావృతం అవుతాయని జోస్యం చెప్పారు. -
టీడీపీకి భారీ షాక్ : కాంగ్రెస్ గూటికి రేవంత్రెడ్డి!
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు సమాచారం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి పార్టీని వీడనున్నట్లు తెలిసింది. అధికార టీఆర్ఎస్తో టీటీడీపీ పొత్తు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. గడిచిన కొద్ది గంటలుగా ఢిల్లీలోనే మకాం వేసిన ఆయన.. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో చర్చలు జరుపుతున్నారని, రెండు మూడు రోజుల్లోనే చేరికకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై అటు కాంగ్రెస్కానీ, ఇటు రేవంత్గానీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. రాహుల్ గాంధీతో భేటీ! : ఢిల్లీలో ఉన్న రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నవంబర్ 9న హైదరాబాద్లో జరిగే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలోనే రేవంత్ కాంగ్రెస్లోకి అధికారికంగా చేరతారని తెలుస్తోంది. ‘టీఆర్ఎస్తో పొత్తు’తో టీడీపీలో చిచ్చు : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో గణనీయమైన స్థానాలను కైవసం చేసుకున్న తెలుగుదేశం పార్టీ.. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలను కోల్పోయింది. అధికార టీఆర్ఎస్లోకి ఫిరాయింపుల పర్వం మొదలైనప్పుడు, టీడీపీ పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు ఆధ్వర్యంలో ఓటుకు కోట్లు కుట్రను అమలుచేయడం, అదికాస్తా బట్టబయలు కావడం, ఆ తర్వాత మిగిలిన టీడీపీ నేతలంతా టీఆర్ఎస్లోకి చేరడం.. తదితర పరిణామాలు తెలిసినవే. అయితే మొదటి నుంచి టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడుతున్న రేవంత్రెడ్డి.. చివరినిమిషం దాకా అదేబాటను అట్టిపెట్టుకున్నారు. ఓటుకు నోట్లు కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లొచ్చారు. ఏ చంద్రబాబు కోసమైతే తన రాజకీయ జీవితాన్ని త్యాగం చేసేందుకు రేవంత్ సిద్ధపడ్డరో.. అదే చంద్రబాబు ఇప్పుడు కేసీఆర్తో పొత్తుపెట్టుకోవడానికి సిద్ధం కావడం మిగుండు పడని విషయంలా మారింది. అందుకే రేవంత్ కాంగ్రెస్లోకి చేరి, టీఆర్ఎస్పై పోరాటాన్ని కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
‘మా పార్టీలో ఆయన మాటే ఫైనల్’
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటే తుది నిర్ణయమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ ఆర్సీ కుంతియా స్పష్టం చేశారు. ఆయన సోమవారం మీడియా చిట్ చాట్ లో ..2019 వరకూ ఉత్తమ్ కుమార్ రెడ్డే తమ కెప్టెన్ అని తెలిపారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీ కట్టు దాటితే..ఎంతటి నేత అయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తమ్ పనితీరు పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సంతృప్తిగా ఉన్నారని కుంతియా పేర్కొన్నారు. పొత్తులపై హైకమాండ్దే తుది నిర్ణయం అని వివరించారు. ఎవరితో కలవాలి..ఎప్పుడు కలవాలన్నది అధిష్టానం నిర్ణయిస్తుందని, పొత్తులపై పీసీసీ నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని తెలిపారు. తన నుంచి, పీసీసీ వరకూ ఏ పదవుల్లోనూ మార్పులు ఉండవన్నారు. ప్రజలు తమవైపు చూస్తున్నారనడానికి సంగారెడ్డి సభే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతిమండలానికి వెళతామని, అన్నీ స్థాయిల్లో నేతల మధ్య విబేధాలు పరిష్కరిస్తామని తెలిపారు. రాహుల్ సందేశ్ యాత్రలు ఎన్నికల వరకు కొనసాగిస్తామన్నారు. తన నుంచి పీసీసీ వరకూ ఏ పదవుల్లోనూ మార్పులు ఉండవన్నారు. పార్టీలో ఎవరినీ విస్మరించబోమని కుంతియ తెలిపారు. వ్యక్తులపై కాదని, పాలసీలపై తమ పోరాటమన్నారు. జైరాం రమేష్, మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలు వారి వ్యక్తిగతమన్నారు. ఓటమి చెందిన చోట రాహుల్ను తప్పుబడుతున్నవారు... గెలిచిన చోట ఆయనకు క్రెడిట్ ఇవ్వాలి కదా అని అన్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి కేసీఆ అధికారాన్ని లాక్కున్నారని కుంతియా విమర్శించారు. కేసీఆర్, ఆయన కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరికీ లబ్ధి జరగడం లేదని ఆయన దుయ్యబట్టారు. -
యువ నాయకత్వానికి ప్రాధాన్యత: కుంతియా
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది నిర్ణయించే అధికారం తనకు లేదని తెలంగాణ కాంగ్రెస్ వ్యహారాల ఇన్ఛార్జ్ కుంతియా అన్నారు. సీఎం అభ్యర్థిని ముందే నిర్ణయించే సంప్రదాయం కాంగ్రెస్లో లేదని, పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమన్నారు. ఇన్చార్జి బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన తొలిసారిగా శనివారం హైదరాబాద్ వచ్చారు. పర్యటనలో భాగంగా కుంతియా పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. గాంధీభవన్కు వచ్చిన ఆయనకు పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుంతియా మాట్లాడుతూ.. టికెట్ల కేటాయింపులో యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. పార్టీ కమిటీలు, టికెట్ల కేటాయింపులో యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నది రాహుల్ గాంధీ ఆలోచన అని ఆయన వెల్లడించారు. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సోనియాగాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ధైర్యంగా ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని, అయితే టీఆర్ఎస్కు ఎలాంటి సిద్ధాంతం లేదని కుంతియ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం కాదని, టీఆర్ఎస్ పార్టీయే తమ ప్రధాన ప్రత్యర్థి అని పేర్కొన్నారు. కేసీఆర్కు నిజంగా ప్రజలపై విశ్వాసం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రతిపాదన గురించి తనకు తెలియదని, ఏదైనా ఉంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇన్చార్జిలు మిరాకిల్స్ చేయలేరని.. టీపీసీసీ బాగా పనిచేస్తోందన్నారు. రాహుల్ కూడా ఇదే భావనలో ఉన్నారని కుంతియా అన్నారు. పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ నాయకత్వంలో ఎన్నికలు వెళతామని అన్నారు. కాగా కుంతియా నెలలో 15 రోజుల పాటు రాష్ట్రంలోనే ఉండి అన్ని మండలాల కాంగ్రెస్ కమిటీలతో మండల కేంద్రాల్లోనే సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. -
ఇక్కడ ఢిల్లీ నేతల పెత్తనమేంటి?
ఏఐసీసీ నేతలపై టీ కాంగ్రెస్ సీనియర్ల అసంతృప్తి - కష్టం మాదైతే.. క్రెడిట్ వారిదా? - తామే కష్టపడుతున్నట్లు అధిష్టానానికి నివేదికలిస్తున్నారని మండిపాటు సాక్షి, హైదరాబాద్: పార్టీ రాష్ట్ర వ్యవహారాల్లో ఏఐసీసీ నేతల పెత్తనంపై కొందరు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పార్టీలోని చిన్నచిన్న కార్యక్రమాల నుంచి నియామకాల దాకా ఏఐసీసీ నేతల కనుసన్నల్లోనే నడిపించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని జాతీయస్థాయిలో కీలకపాత్ర పోషించిన నేతలు గుర్రుగా ఉన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాల్లో రాష్ట్రేతర నేతలైన ఏఐసీసీ బాధ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ, తెలంగాణలో పార్టీని అంతా తామే భుజాల మీద మోస్తున్నట్టుగా అధిష్టానవర్గానికి నివేదికలను ఇచ్చుకుంటున్నారని వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యనేతలున్నారు. పార్టీకి క్షేత్రస్థాయిదాకా మూలాలు ఉన్నాయి. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇప్పటికీ అన్నివర్గాల్లో సానుకూల వాతావరణం ఉంది. వీటితో పాటు అధికారం కోల్పోయిన బాధ పార్టీ రాష్ట్ర ముఖ్యులందరిలోనూ ఉంది. అలాగే పార్టీ శ్రేణుల్లోనూ పెద్దగా విబేధాలేమీ లేవు. రాష్ట్ర నాయకత్వం కూడా ఉత్సాహంగా, చాలా వరకు సమన్వయంతో వ్యవహరిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సంప్రదాయాలకు భిన్నంగా ఏఐసీసీ నేతలే రాష్ట్రంలో పార్టీని నడిపిస్తున్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల రూపకల్పన, నిర్వహణ, పార్టీ పదవుల పంపకం దాకా అన్నీ వారే చూడటం నా లాంటి సీనియర్లకు ఇబ్బందికరంగా ఉంది’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ముఖ్య నాయకుడొకరు అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్క రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయొచ్చుగా.. తెలంగాణలో కాంగ్రెస్కు బలముందని, పటిష్టమైన కేడర్ ఉందని పార్టీ సీనియర్లు అంటున్నారు. ఈ వాస్తవాన్ని మరిచిపోయి పార్టీని అన్ని స్థాయిల్లో తామే బలోపేతం చేస్తున్నామనే సంకేతాలను అధిష్టానవర్గానికి ఇస్తున్నారని మండిపడుతున్నారు.‘ఇప్పటికే బలంగా ఉన్న తెలంగాణలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడం పెద్ద విషయం కాదు. ఇటీవల నిర్వహించిన రిజర్వుడు నియోజకవర్గాల ముఖ్యుల సమావేశాన్ని ఏఐసీసీ నేత ఒకరు తన ఖాతాలో వేసుకున్నారు. ఈ కార్యక్రమంకోసం రాష్ట్రపార్టీ ముఖ్యులు, సీనియర్లు చేసిం దేమీ లేదన్నట్లుగా ఢిల్లీకి నివేదికలు వెళ్లాయి. కేవలం ఒక ఏఐసీసీ నేత వల్లనే ఈ శిబిరం జరిగినట్టుగా అధిష్టానాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు’ అని జాతీయ స్థాయిలో ముఖ్యపాత్ర వహించిన నాయకుడు అభిప్రాయపడ్డారు. ‘ఒకవేళ ఆ ఏఐసీసీ నాయకుడే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నానని అనుకుంటే మంచిదే. ఆంధ్రప్రదేశ్లో పార్టీ చాలా బలహీనంగా ఉంది కదా. ఆ నాయకుడు ఏపీలో ఇలాంటి కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిం చలేదు. ఆ రాష్ట్రంలోనూ రిజర్వుడు నియోజకవర్గాలు ఉన్నాయి కదా. అక్కడ కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలను ఎందుకు నిర్వహించడంలేదు. కేవలం తెలంగాణ ఒక్కటే ఆ నేతలకు దొరికిందా? మేం కష్ఠపడితే, ఆ ఘనత వారి ఖాతాలో పడాలా? దీర్ఘకాలిక వ్యూహాల్లేకుండా, కేవలం చిన్నచిన్న కార్యక్రమాలతో తెలంగాణలో పార్టీని గుప్పిట్లో పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు’అని ఆ నాయకుడు దుయ్యబట్టారు. -
టీకాంగ్రెస్ నేతలకు రాజ్నాథ్ ఝలక్
- ఆఖరినిమిషంలో అపాయింట్మెంట్ రద్దుచేసిన కేంద్ర హోం మంత్రి.. - మియాపూర్ భూకుంభకోణం ఫిర్యాదు స్వీకరణకు నిరాకరణ - కాంగ్రెస్ మండిపాటు.. టీఆర్ఎస్ను బీజేపీ కాపాడుతోందని విమర్శ సాక్షి, న్యూఢిల్లీ: మియాపూర్ భూ కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలనుకున్న తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. ఈ వ్యవహారంపై ఫిర్యాదు స్వీకరించేందుకు సమయం ఇచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్.. తీరా చివరి నిమిషంలో అపాయింట్మెంట్ రద్దుచేశారు. దీంతో కేంద్ర మంత్రిపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూకుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాల్సిందేనని, ఈ విషయంలో నిజానిజాలు తేలేంతవరకు తాము పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రమే నేరుగా ఎంక్వైరీకి ఆదేశించాలి టీఆర్ఎస్-బీజేపీల మధ్య చీకటి ఒప్పందం జరిగిందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ‘రాష్ట్రపతి ఎన్నికలో బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తానన్నందుకే ప్రతిఫలంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేంద్రం కాపాడుతున్నద’ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. భూకుంభకోణంతో సంబంధమున్న టీఆర్ఎస్ నేతలకు బీజేపీ కాపాడుతోందని విమర్శించారు. కబ్జాకు గురైన వాటిలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన భూములు కూడా ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సుతో సంబంధం లేకుండా కేంద్రమే నేరుగా సీబీఐ విచారణకు ఆదేశించవచ్చునని దిగ్విజయ్ సింగ్ చెప్పారు. అపాయింట్మెంట్ లేదనటం అప్రజాస్వామికం:జానారెడ్డి మియాపూర్ భూ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాల్పిందేనని సీఎల్పీ నేత జానా రెడ్డి డిమాండ్ చేశారు. మియాపూర్ భూకుంభకోణంపై సీబీఐ విచారణ కోరడానికి కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ అపాయింట్మెంట్ కోరామని, అయితే బుధవారం అపాయింట్మెంట్ ఇచ్చి తర్వాత ఆరోగ్యకారణాల వల్ల రద్దు చేస్తున్నట్టు చెప్పారని ఆయన వెల్లడించారు. మరో రోజు తమకు సమయం కేటాయించాల్సిందని, కానీ అసలు అపాయింట్మెంట్ లేదనడం అప్రజాస్వామికమని జానారెడ్డి విమర్శించారు. న్యాయం జరిగేవరకూ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. చీకటి ఒప్పందం కాదా: ఉత్తమ్కుమార్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం పై వచ్చిన ఆరోపణలపై విచారణకు బిజెపీ ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నిస్తూ ఇది చీకటి ఒప్పందం కాదా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు. పది నుంచి పదిహేను వేల కోట్ల రూపాయల కుంభకోణంపై విచారణ కు కేంద్రం ఎందుకు వెనుకాడుతోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్ర హోం మంత్రి రాజ్నా«ద్ సింగ్ అపాయింట్మెంట్ ఇచ్చి రద్దు చేశారని, కనీస ఆయన వ్యక్తిగత కార్యదర్శికి కూడా వినతి పత్రం అందించడానికి అంగీకరించలేదన్నారు. తెలంగాణ లో అన్ని రాజకీయ పార్టీలు సీబీఐ విచారణ కు డిమాండ్ చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణకు అంగీకరించాలని సీపీఐ నేత చాడ వెంకట రెడ్డి డిమాండ్ చేశారు. -
దిగ్విజయ్ ఎదుటే నేతల బాహాబాహీ
గాంధీభవన్లో దిగ్విజయ్ సింగ్ సాక్షిగా జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశం రసాభాసగా మారింది. రెండు రోజుల పాటు జరుగుతున్న జిల్లా సమీక్ష సమావేశాలలో భాగంగా శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. అందులో పార్టీ నాయకులు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, గూడూరు నారాయణరెడ్డి మధ్య వాగ్వాదం మొదలైంది. ఇద్దరి మధ్య మాటలు పెరిగి చివరకు ఒకరినొకరు తోసుకున్నారు. దాంతో సీనియర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. కాసేపటి తర్వాత ఇతర నాయకులు వాళ్లను శాంతింపజేసి బయటకు తీసుకెళ్లడంతో గొడవ సర్దుమణిగింది. రెండు రోజులుగా దిగ్విజయ్ సింగ్ సమక్షంలో పీసీసీ, డీసీసీ, బ్లాక్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతున్నాయి. డీసీసీ అధ్యక్షులుగా ఎవరిని నియమించాలన్న విషయమై చర్చించారు. గురువారం ఐదు జిల్లాలు, శుక్రవారం మరో ఐదు జిల్లాల సమీక్ష సమావేశాలు జరిగాయి. నల్లగొండ జిల్లాలో నాయకులు ఆధిపత్యం చూపించుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియామకాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ చాలాకాలంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గొడవ జరిగింది. దాంతో ఒక్కసారిగా కంగుతిన్న దిగ్విజయ్.. ఇక్కడేం జరుగుతోందని ఆరా తీశారు. గొడవ మొత్తం ముగిసిన తర్వాత.. ఉత్తమ్ పనితీరు సంతృప్తికరంగా ఉందని దిగ్విజయ్ కితాబిచ్చారు. -
నిరసన తెలిపితే ఎందుకు భయం?
-
తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక నిర్ణయాలు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నేతలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీ పీసీసీ ముఖ్యనేతలు మంగళవారం నగరంలోని గోల్కొండ హోటల్లో భేటీ అయ్యారు. అనంతరం టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల గవర్నర్, ముఖ్యమంత్రులు..ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇచ్చి రాజకీయాలు దిగజార్చారని మండిపడ్డారు. ఫిరాయింపులపై రాష్ట్రపతిని కలవడంతో పాటు, ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని అన్నారు. కేసీఆర్ నియంతృత్వ పాలనకు నిరసనగా కలిసివచ్చే ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని ఐక్య పోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. రెండు లక్షల కోట్ల టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, వేలకోట్లు దుర్వినియోగం అయ్యాయని ఆయన ధ్వజమెత్తారు. అవినీతి వాస్తవాలను బయటపెట్టి కేసీఆర్ సర్కార్ను ఎండగడతామన్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మ తగలబెడితే కూడా పోలీసులు సీరియస్ కేసులు పెడుతున్నారని, కేసులకు, జైళ్లకు తాము భయపడేది లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. అవసరం అయితే జైల్భరో కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు. అలాగే పార్టీ తరపున బరిలోకి దిగే అసెంబ్లీ అభ్యర్థులను ముందే ఖరారు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామన్నారు. విభజన చట్టంలోని హామీలను పూర్తి చేసిన తర్వాతే డీలిమిటేషన్ను చేపట్టాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ భారం కాబోతుందని, ఒక ఎకరా సాగునీటికి లక్ష రూపాయిలు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
కాంగ్రెస్లో ‘బాహుబలి’ రచ్చ!
-
కాంగ్రెస్లో ‘బాహుబలి’ రచ్చ!
- పార్టీలో సమర్థులు లేరని జానారెడ్డి చెప్తారా..? - సీనియర్లలో అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ను ఓడించడానికి బాహుబలి వస్తాడని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సద్దుమణిగినా ఆ పార్టీలో అంతర్గతంగా రగులుతున్నట్టుగానే కనిపిస్తోంది. టీఆర్ఎస్ బలంగా ఉన్నట్టు, కేసీఆర్ను ఓడించడానికి బయటనుంచి ఎవరో రావాలన్నట్టుగా జానారెడ్డి మాట్లాడారని పలువురు సీనియర్లు అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అగ్రనేతగా, శాసనసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న జానా స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పార్టీ శ్రేణుల మనో స్థైర్యాన్ని దెబ్బతీయదా అని ప్రశ్నిస్తున్నారు. ‘తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్కి, రాష్ట్ర ఏర్పాటు సమయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చూపించిన పట్టు దల, చిత్తశుద్ధిపై తెలంగాణవాదుల్లో, ముఖ్యంగా యువతలో సానుకూల దృక్పథం ఉందని వారు అన్నారు. కాంగ్రెస్ పట్ల ఉన్న అనుకూలతను వచ్చే ఎన్నికల్లో వినియోగించుకుని, పార్టీకి పూర్వవైభ వం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్న నాయకుడే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ‘పార్టీలో సమర్థులు లేరన్నట్టుగా, బయట పార్టీల నుంచి వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీని కాపాడలేరని అన్నట్టుగా కీలక నాయకుడు మాట్లాడటం తప్పు డు సంకేతాలను పంపించదా’ అని పార్టీ సీనియర్ నాయకుడొకరు ప్రశ్నించారు. ‘శాసనసభలో కేసీఆర్ను ఎదిరించే బాహుబలి లేరేమోకానీ, టీపీసీసీలో చాలామంది బాహుబలిలు ఉన్నారు’ అని టీపీసీసీ ముఖ్య నాయకుడొకరు ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. అధిష్టానానికి ఫిర్యాదు.. ఆరా.. అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన జానాపై చర్యలు తీసు కోవాలని పార్టీలోని కొందరు సీనియర్లు అధిష్టా నానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. దీనిపై అధిష్టానం కూడా ఆరా తీస్తున్నట్టుగా టీపీసీసీ నాయకుడొకరు చెప్పారు. జానా వ్యాఖ్యలు.. దాని వెనుకనున్న ఉద్దేశమేమిటనేది అధిష్టానంలో ని ముఖ్యులు కొందరు ఆరా తీస్తున్నట్టుగా తెలిసింది. -
ప్రాజెక్ట్ల పేరుతో టీఆర్ఎస్ అవినీతి
-
టీపీసీసీకి దిగ్విజయసింగ్ దిశానిర్దేశం
-
రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు?
హైదరాబాద్: పాత పెద్ద నోట్ల రద్దు అతి పెద్ద కుంభకోణం అని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ఆరోపించారు. నోట్ల రద్దు తర్వాత ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. తెలంగాణ పీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ సెంటిమెంట్ ను గౌరవించి తమ పార్టీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని గుర్తు చేశారు. తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నించారు. చిన్నరాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. గుజరాత్, పంజాబ్, హర్యానా ఇందుకు నిదర్శనమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. -
రెండు రాష్ట్రాలు ఎందుకు ఉండకూడదు?
-
టీ కాంగ్రెస్లో తీవ్రమైన విభేదాలు
-
'మల్లన్న.. భారీ రిజర్వాయర్ అవసరం లేదు'
న్యూఢిల్లీ: మల్లన్న సాగర్ భారీ రిజర్వాయర్ అవసరం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. బుధవారం న్యూఢిల్లీలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు రైతుల నుంచి నిర్బంధంగా భూసేకరణ చేస్తున్నారంటూ రాష్ట్రపతికి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. సమావేశం ముగిసిన అనంతరం ఉత్తమ్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భూసేకరణలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. ఈ విషయంలో రాష్ట్రపతి ప్రణబ్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరినట్టు తెలిపారు. రైతులను భయపెట్టి, 144 సెక్షన్ విధించి భూములను లాక్కుంటున్నారని ఉత్తమ్ విమర్శించారు. -
టీఆర్ఎస్కు అనుకూలంగా జానా..!
హైదరాబాద్: పార్టీ శాసనసభ ప్రతిపక్ష నేత జానారెడ్డి తీరుపై టీ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరుపై ఏకంగా పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేసే యోచనలో వారు ఉన్నారు. గోదావరి నదిపై ప్రాజెక్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వంతో గతంలో ఎలాంటి ఒప్పందం జరగలేదంటూ జానారెడ్డి టీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడటమే ఇందుకు కారణం. జానా తీరుతో కాంగ్రెస్ ఇమేజ్ దెబ్బతింటుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఎందుకు మాట్లాడారంటూ జానాకు పలువురు టీ కాంగ్రెస్ నేతలు ఫోన్ చేసి అడిగినట్లు సమాచారం. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూ.5 భోజనాన్ని గతంలో జానారెడ్డి మెచ్చుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆయన పలుసార్లు కేసీఆర్ సర్కార్ కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో సొంతపార్టీలోనే జానా వైఖరి ఏమిటో తెలియక అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో జానారెడ్డి తీరుతో పార్టీకి నష్టం జరుగుతున్నదంటూ.. ఇక ఆయన ధోరణిని సహించేది లేదని, ఆయనపై హైకమాండ్కు ఫిర్యాదు చేయాలని కాంగ్రెస్ ముఖ్యలు కాంగ్రెస్ ముఖ్యలు భావిస్తున్నట్టు సమాచారం. -
'కేసీఆర్ ఒప్పందం మహాపాపం, మహానష్టం'
హైదరాబాద్ : మహారాష్ట్రతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసుకునేది చారిత్రక ఒప్పందం కాదని... మహాద్రోహం అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ అంశంపై మంగళవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు భట్టి విక్రమార్కతోపాటు సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. రీడిజైనింగ్ పేరుతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల వ్యయాన్ని రూ. 50 వేల కోట్లు పెంచారని ఉత్తమ్ విమర్శించారు. టీఆర్ఎస్ చేప్తున్న ఆయకట్టుకు... నీటి లభ్యతకు పొంతనే లేదని పొన్నాల స్పష్టం చేశారు. మహారాష్ట్రతో ఒప్పందంపై బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు పొన్నాల సవాల్ విసిరారు. కేసీఆర్ వైఖరితో బంగారు తెలంగాణ కాస్త... భ్రష్టు పట్టిన తెలంగాణ అయ్యే ప్రమాదం ఉందని కె. జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల పేరుతో రూ. కోట్లు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. తమ్మిడిహెట్టి ఎత్తు తగ్గించి తెలంగాణకు ద్రోహం చేస్తున్నారని కేసీఆర్పై భట్టి విక్రమార్క మండిపడ్డారు. కేసీఆర్ చేసుకునే ఒప్పందం మహాపాపం, మహా నష్టం అని భట్టి అభివర్ణించారు. -
కాంగ్రెస్ నేతలు చెప్పేవన్నీ కాకి లెక్కలే!
హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్పిన కాకి లెక్కలనే కాంగ్రెస్ నేతలు మళ్లీ చెబుతున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు విమర్శించారు. తెలంగాణలో ప్రాజెక్టులు, నీటి వినియోగంపై టీ.కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంపై స్పందించారు. ఈ మేరకు విద్యాసాగర్ రావు మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణలో 47 లక్షల ఎకరాలకు ఎన్నడూ నీరందలేదని పేర్కొన్నారు. ప్రాజెక్టుల కింద ప్రతిపాదించింది ఎంత.. నీరందించింది ఎంత? అని కాంగ్రెస్ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ లెక్కలు ప్రజల్ని మరింత గందరగోళానికి గురిచేస్తున్నాయని విద్యాసాగర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. -
లక్ష కోట్ల ప్రాజెక్టులకు డీపీఆర్ లేకపోతే ఎలా?
-
కేసీఆర్ రాజీనామా చేయాలి: డీకే అరుణ
హైదరాబాద్ : ఎంసెట్-2 లీకేజీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ధోరణి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ వ్యాఖ్యానించారు. లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఎంసెట్-2 లీకేజీపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిసి చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ...కేసీఆర్ రాష్ట్రంలో పరిపాలనను పోలీసుల చేతుల్లో పెట్టి ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారన్నారు. ఎంసెట్ పేపర్ లీక్పై ముఖ్యమంత్రి కుటుంబంపై ఆరోపణలు వస్తే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని డీకే అరుణ ప్రశ్నించారు. పోలీసులు టీఆర్ఎస్ ఏజెంట్లుగా మారారని ఆమె ధ్వజమెత్తారు. నియోజక వర్గంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై నిర్బంధం సాగిస్తున్నారని, ఎమ్మెల్యే సంపత్ను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమని డీకే అరుణ అన్నారు. -
ఆ గ్రామాలు పాకిస్తాన్, బర్మాలో ఉన్నాయా?
హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నాపత్రం లీకేజీ అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం గవర్నర్ నరసింహన్ను రాజ్భవన్లో కలిశారు. ఎంసెట్ పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలని, బాధ్యులైన విద్యావైద్య శాఖ మంత్రులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్లను భర్తరఫ్ చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు. ఇందుకు సంబంధించి గవర్నర్కు వినతిపత్రం సమర్పించారు. గవర్నర్తో భేటీ అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ...అవినీతిని సహించనని చెప్పే సీఎం... 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగినా ఈ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మల్లన్నసాగర్ ముంపు గ్రామాలకు విపక్ష నేతలను వెళ్లనీయకపోవడం సరికాదని అన్నారు. ఆ గ్రామాలు పాకిస్తాన్, బర్మాలో ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. రైతులను నిర్బంధించి బలవంతంగా భూ సేకరణ చేయడాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని ఉత్తమ్ తెలిపారు. మల్లన్నసాగర్ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చేలా ఆదేశించాలని గవర్నర్ను కోరినట్లు ఆయన చెప్పారు. గవర్నర్ను కలిసిన వారిలో తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, డీకే అరుణ, మాగం రంగారెడ్డి తదితర నేతలు ఉన్నారు. మరోవైపు తెలంగాణ పీసీసీ ఈ నెల 7న ఛలో మల్లన్నసాగర్కు పిలుపునిచ్చింది. నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు. మల్లన్నసాగర్లో లాఠీఛార్జ్ జరిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మల్లురవి డిమాండ్ చేశారు. -
జానారెడ్డి, షబ్బీర్ అలీ అరెస్ట్
హైదరాబాద్ : మల్లన్నసాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులను పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీలను పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. మెదక్ జిల్లా ములుగు మండలం ఒంటిమామిడి వద్ద తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, నేతలకు మధ్య కొద్దిసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది. జానారెడ్డి, షబ్బీర్ అలీని బీహెచ్ఈఎల్ రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ నేతల వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కూడా పోలీసులు అనుమతించలేదు. కాగా మల్లన్నసాగర్ ముంపు ప్రాంతాలు పర్యటనతోపాటు... ముంపు ప్రాంత ప్రజల ఆందోళనలో పోలీసుల లాఠీచార్జీలో గాయపడిన వారిని పరామర్శించేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ నెల 26న ఛలో మల్లన్న సాగర్కు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే పోలీసులు మాత్రం ఛలో మల్లన్నసాగర్ పర్యటనకు వెళ్తున్న నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్ట్ లు చేశారు. ఈ నేపథ్యంలో టీ.కాంగ్రెస్ నేతలు మళ్లీ మల్లన్నసాగర్ బయలుదేరారు. అయితే రెండోసారి కూడా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
'ఉత్తమ్ గాంధీభవన్ వదిలి జనంలోకి వెళ్లు'
హైదరాబాద్: తెలంగాణలో చట్టబద్ధ పాలన సాగడం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. భూసేకరణ చట్టాన్ని కేసీఆర్ సర్కారు ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. దీనిపై హైకోర్టులో పిల్ వేయాలని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్ ను వదిలి జనంలోకి వెళ్లి ప్రజాసమస్యలపై పోరాడాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణ అంచనాలు పెంచుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందన్నారు. అవినీతి సొమ్ముతోనే ఇతర పార్టీల నేతలను కొంటున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర బడ్జెట్ కేసీఆర్ కుబుంబ సొమ్ము కాదు, ప్రజల సొమ్మున్నారు. గాంధీభవన్ లో మున్సిపల్ ప్రతినిధుల శిక్షణా కార్యక్రమానికి ఆయన హాజరైయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ శిక్షణా కార్యక్రమాన్ని రెండేళ్ల కిందటే నిర్వహించాల్సి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పార్టీ పెద్దలు భరోసా కల్పించనందు వల్లే మున్సిపల్ చైర్మన్లు పార్టీ మారారని అన్నారు. -
టీ కాంగ్రెస్కు ఇన్ఛార్జ్గా మాజీ సీఎం!
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ప్రక్షాళనకు ఆపార్టీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. గత కొంత కాలంగా ఆపార్టీలోని నేతల పనితీరు, తెలంగాణలో రోజురోజూకూ పార్టీ బలహీనపడటం అ పార్టీని కలవరపాటుకు గురి చేస్తోంది. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ స్థానంలో కేరళ మాజీ ముఖ్యమత్రి ఊమెన్ చాందీని నియమించనున్నట్లు సమాచారం. పార్టీ తెలంగాణ నేతలతో సమావేశమైన సోనియాగాంధీ ఈ మేరకు హింట్ ఇచ్చారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు వెల్లడించారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపరేషన్ ఆకర్షణ్ స్కీమ్ తో కాంగ్రెస్ బలహీనపరుస్తున్న నేపథ్యంలో ఊమెన్ చాందీకి పగ్గాలు అప్పగించనున్నారు. కాగా చాందీ కేరళకు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. -
కలహాల వల్లే పార్టీకి తీవ్ర నష్టం
కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో వీహెచ్, పాల్వాయి భేటీ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ)లోని అంతర్గత కలహాల వల్లే పార్టీ తీవ్రంగా నష్టపోయిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్రెడ్డి పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వద్ద వాపోయారు. సోమవారం ఢిల్లీలో సోనియాను కలుసుకొని తెలంగాణలోని తాజా రాజకీయపరిస్థితిని వీహెచ్, పాల్వాయి వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చిందనే భావన ప్రజల్లో ఇప్పటికీ పదిలంగా ఉందని, అధికారంలో ఉన్నంతకాలం కొందరు నాయకులు పదవులను వాడుకొని తాజాగా పార్టీని వీడారని, అయితే కార్యకర్తలు ఉత్సాహంగానే ఉన్నారని చెప్పారు. భేటీ తర్వాత వారు విలేకరులతో మాట్లాడుతూ పార్టీ నిర్వహణకు అందరూ సహకరించేలా చూడాలని పార్టీ అధ్యక్షురాలిని కోరామని చెప్పారు. కొంతమంది గ్రూపులను నిర్వహిస్తూ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని ఆమె దృష్టికి తీసుకువచ్చారు. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం సాధించేందుకు పార్టీ పునర్నిర్మాణం, బలోపేతానికి క్షేత్రసాయి నుంచి కృషి చేస్తామని సోనియాకు తెలిపామని పాల్వాయి చెప్పారు. బంగారు తెలంగాణ పేరిట సీఎం కేసీఆర్ ప్రజలను మోసగిస్తున్నారని వీహెచ్ ఆరోపించారు. కాపు కులాలపై ఆరా: ఈ భేటీలో కాపులను బీసీ జాబితాలో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంలో కాపులలో ఎన్ని కులాలున్నాయని సోనియా ఆరా తీశారు. -
సోనియాతో వీహెచ్, పాల్వాయి భేటీ
ఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ పర్యటనతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీని సోమవారం ఉదయం కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతురావు, పాల్వాయి గోవర్థన్ రెడ్డి కలిశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. భేటీ అనంతరం పాల్వాయి మీడియాతో మాట్లాడుతూ...ఢిల్లీ నాయకులు గ్రూపులు కట్టడం మానాలన్నారు. కలసిమెలసి పనిచేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని లూటీ చేస్తోందని పాల్వాయి ఆరోపించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయించిన నేతలపై న్యాయపరంగా పోరాడేందుకు సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు. -
వారిపై అనర్హత వేటు వేయండి: టీ.కాంగ్రెస్
హైదరాబాద్ : పెంచిన విద్యుత్,ఆర్టీసీ చార్జీలను కెసిఆర్ సర్కార్ తక్షణమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారమిక్కడ మాట్లాడుతూ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం దిగి రాకపోతే ఇతర పార్టీలను కలుపుకుని కాంగ్రెస్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తుందన్నారు. ఆదాయం పెరుగుతోందన్న ప్రభుత్వ పెద్దలు ఆ రాబడితో విద్యుత్, ఆర్టీసీ లోటును భర్తీ చేయాలన్నారు. మిషన్ భగీరథ,పాలమూరు రంగారెడ్డి,కాళేశ్వరం ప్రాజెక్టు ల నిర్మాణ అంచనాలను ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచడం వల్ల ఖజానా పై బారం పడుతుందన్నారు. కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఇలా ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతుందని చిన్నారెడ్డి విమర్శించారు. అంతకు ముందు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు చిట్టం రామ్మోహన్ రెడ్డి, పువ్వాడ అజయ్లపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, చిన్నారెడ్డి, సంపత్, పద్మావతి ఉత్తమ్, వంశీచంద్రెడ్డి తరతరులు స్పీకర్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ విప్ సంపత్ మాట్లాడుతూ తెరాసలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే లు చిట్టం రామ్ మోహన్ రెడ్డి,పువ్వాడ అజయ్ లపై అనర్హత వేటు వేయలంటూ స్పీకర్ మధుసూధనా చారికి ఫిర్యాదు చేశామన్నారు. ఆధారాలతో సహా పిటిషన్ సమర్పించినట్లు చెప్పారు. రెండేళ్లుగా తెరాస ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ప్రజాస్వామ్యంతో పాటు నైతిక విలువలను,రాజ్యాంగ స్పూర్తిని ఖునీ చేస్తోందని సంపత్ మండిపడ్డారు. డిస్ క్వాలిఫికేషన్ల పిటిషన్లపై స్పీకర్ స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు ను ఆశ్రయించినట్లు చెప్పారు. జులై 1 న ఈ కేసు విచారణకు రానున్నదని తెలిపారు. డబ్బు సంచులకో, ప్రలోభాలకో,తెరాస బ్లాక్ మెయిలింగ్కో లొంగిపోయి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తున్నారన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయలంటూ తాము పిటిషన్ లు ఇచ్చినప్పటికీ స్పీకర్ స్పందించడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి అన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యే లకు స్పీకర్ ఆఫీసు ఇప్పటివరకు నోటీసులే ఇవ్వలేదన్నారు. ఫిరాయింపు నిరోధక చట్టంను అమలు చేయాల్సిన స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఫిరాయింపుదారులపై నిర్ణయం తీసుకోకుండా రాజ్యాంగాన్ని బుట్టదాఖలు చేయడం ఎంతవరకు సమంజసమని గీతారెడ్డి ప్రశ్నించారు. -
ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు: ఉత్తమ్
హైదరాబాద్: రాజ్యాంగ విరుద్దంగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. గాంధీభవన్లో గురువారం టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని ఈ సందర్భంగా ఉత్తమ్ విమర్శించారు. ఇప్పటికే అన్ని ప్రజాస్వామిక వేదికలపైనా ఫిర్యాదులు చేసినా ఫలితం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లజ్జగా రాజకీయ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు. సచివాలయం, ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వేదికలుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, టీఆర్ఎస్ కండువాలను కప్పుతున్నారని ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాలపై ఇప్పటికే రాజ్యాంగ బద్దంగా ఏర్పాటైన అన్ని వేదికలకు ఫిర్యాదులు చేశామని ఉత్తమ్ చెప్పారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, యధేచ్చగా ఫిరాయింపులకు పాల్పడుతున్నారని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న అంశాల ఆధారంగా తాము సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 28 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నందున, సెలవులు పూర్తయిన వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. ఇటీవల పార్టీ మారిన నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిపై లోక్సభ స్పీకరుకు ఫిర్యాదు చేస్తామన్నారు. గుత్తాపైనా సుప్రీంకోర్టులో కేసు వేస్తామని ఉత్తమ్ ప్రకటించారు. రాజకీయ ఫిరాయింపులను అడ్డుకునే విధంగా న్యాయపోరాటం చేస్తామన్నారు. న్యాయనిపుణులతో జరిగిన ఈ సమావేశంలో శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, పార్టీ సీనియర్లు డి.కె.అరుణ, సబితా ఇంద్రా రెడ్డి, సంపత్ఖుమార్, మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'టీపీసీసీతో విభేదాలు లేవు'
నల్లగొండ: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ(పీసీసీ)తో తనకు విభేదాలు లేవని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. బుధవారం నల్లగొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్టు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని స్పష్టం చేశారు. 2019లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. -
'పార్టీ కష్టకాలంలో ఉంది'
హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యాలు సరికాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కె. జానారెడ్డి అన్నారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదంతోనే పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్ కుమార్ నియమితులయ్యారని గుర్తు చేశారు. ఉత్తమ్ నియామకాన్ని తప్పుబట్టడమంటే హైకమాండ్ ను వేలెత్తిచూపడమేనని అన్నారు. పార్టీ కష్టకాలంలో ఉందని, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని హితవు పలికారు. టీపీసీసీకి సారథిగా పొన్నాల లక్ష్మయ్య కంటే ఉత్తమ్కుమార్రెడ్డి ఎంపిక వరస్ట్ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఉత్తమ్ పై బహిరంగంగా విమర్శలు చేసినందుకు పీసీసీ క్రమశిక్షణా సంఘం ఆదివారం కోమటిరెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. -
నోటీసులు ఎందుకు పంపారు?
నల్లగొండ: తనకు షోకాజ్ నోటీసులు పంపడంపై తెలంగాణ సీఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పీసీసీ క్రమశిక్షణ సంఘం తనకు పంపిన నోటీసులను పట్టించుకోనని అన్నారు. తాను పీసీసీనే పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు నోటీసులేంటని ఆయన ప్రశ్నించారు. తాను పీసీసీనే పట్టించుకోవడం లేదని, అలాంటప్పుడు నోటీసులు ఎందుకు పంపారని ఆయన ప్రశ్నించారు. ఉత్తమ్ కుమార్ అసమర్థత వల్లే పార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయని మండిపడ్డారు. పనికిరాని పీసీసీ చీఫ్ కింద పనిచేయను అని స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి నుంచి ఉత్తమ్ ను తప్పించాలని డిమాండ్ చేశారు. షోకాజ్ నోటీసు ఇచ్చే సత్తా రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరికీ లేదని కోమటిరెడ్డి అన్నారు. ఉత్తమ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనకు పీసీసీ షోకాజ్ నోటీసులు పంపింది. -
కర్ణాటక సీఎంతో టి.కాంగ్రెస్ నేతల భేటీ
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం భేటీయ్యారు. ఆర్డీఎస్ పనులను వెంటనే చేపడతామని కర్ణాటక సీఎం చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. తీవ్ర కరవుతో అల్లాడుతున్న మహబూబ్నగర్ జిల్లాకు తాగునీటి కోసం ఒక టీఎంసీ నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు. -
'సెటిలర్లకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ రాజకీయాలు'
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క నిప్పులు చెరిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో భట్టి విక్రమార్క బుధవారం హైదరాబాద్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.... టీఆర్ఎస్ పార్టీ రాజకీయ ఉగ్రవాదానికి తెర తీసిందని ఆరోపించారు. ఆ ధీమాతోనే ఈ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని మంత్రి కేటీఆర్ అంటున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ సెటిలర్లకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పేరు మారుస్తామని చెప్పి... అంతలోనే ఓ జోకర్లా మారారని తెలంగాణ ఐటీ, పంచయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ను ఎద్దేవా చేశారు. హెచ్సీయూ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అంశం దేశాన్ని కుదిపేస్తున్నా తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం స్పందించలేదని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీకి కోపం వస్తుందనే... సీఎం కేసీఆర్ హెచ్సీయూకు వెళ్లలేదన్నారు. ఇతర పార్టీ నేతలను తన అధికారంతో టీఆర్ఎస్ లోబర్చుకునే ప్రయత్నం చేసిందన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరానికి చేసిందేమీ లేదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని సైతం టీఆర్ఎస్ అడ్డుకుందని విమర్శించారు. ఎంఐఎం, బీజేపీలు మతతత్వ పార్టీలని భట్టి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ మూడు పార్టీల వల్ల హైదరాబాద్ ఇమేజ్ ప్రమాదంలో పడిందని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల అనంతరం ఈ మూడు పార్టీలు తమ ద్వేషపూరిత విధానాన్ని తీవ్రతరం చేస్తాయన్నారు. టీడీపీ, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలు పరస్పరం అవగాహనతో ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. -
తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా ఆరెపల్లె మోహన్
తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ గా ఆరెపల్లె మోహన్ నియమితులయ్యారు. ఈమేరకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ జనార్థన్ ద్వివేదీ పేర్కొన్నారు. కాగా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగాన్ని పటిష్టం చేసేందుకు కృషి చేస్తానని.. ఈ సందర్భంగా ఆరెపల్లి మోహన్ తెలిపారు. -
మా వాళ్ల ఓట్లు అక్కర్లేదా?
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల సందడి మొదలైనా ప్రచారంలో పాల్గొనాలని మాటమాత్రంగానైనా ఆహ్వానించకపోవడం పట్ల తెలంగాణ కాంగ్రెస్ నేతలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పెద్దలు గుర్రుమంటున్నారు. ఈ ఎన్నికల్లో ఏదో ఒక రకంగా ఉనికి చాటుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచార వ్యూహంపై పెద్ద ఎత్తున కసరత్తు చేపట్టారు. అయితే, తనకు పిలుపు రాకపోవడంతో ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాము ప్రచారం చేస్తే ఆంధ్రా ప్రాంతానికి చెందిన ఓటర్లను ఆకర్షించే అవకాశం ఉన్నా దిగ్విజయ్సింగ్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు పట్టించుకోవడం లేదని ఏపీకి చెందిన ముఖ్యనేతలు ఇందిర భవన్లో చర్చించుకుంటున్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటామనే ఆకాంక్షను ఇటీవల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించాలని ఏపీ పీసీసీ చీఫ్ ముందుగా అనుకున్నప్పటికీ తెలంగాణ నాయకుల నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో ఆ విషయాన్ని ప్రకటించకుండా వాయిదా వేయాల్సి వచ్చిందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. -
'కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి'
హైదరాబాద్ : కాంగ్రెస్ హయాంలోనే హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిందని తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలపై నగర కాంగ్రెస్ పార్టీ నాయకులతో దిగ్విజయ్ సింగ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ.... టీఆర్ఎస్ పార్టీది కుటుంబపాలన అని అభివర్ణించారు. పేదల గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పట్టదని ఎద్దేవా చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. 2019లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. సోనియా వల్లే తెలంగాణ వచ్చిందని దిగ్విజయ్ సింగ్ గుర్తు చేశారు. అలాగే ఈ బేటీలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీకి ఓటు వేస్తే అది వృధానే అని చెప్పారు. ఇక తెలంగాణలో టీడీపీ కనుమరుగే అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్కి టీఆర్ఎస్ చేసింది ఏమీ లేదన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ శాసనసభలో శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి మాట్లాడుతూ... సెటిలర్లను భయబ్రాంతులకు గురి చేసింది టీఆర్ఎస్ పార్టీనే అని గుర్తు చేశారు. సెటిలర్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది.... ఇకపై నిలబడుతుందని జానారెడ్డి హామీ ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెడుతోందని జానారెడ్డి ఆరోపించారు. -
'మైనార్టీలకు రిజర్వేషన్ల హామీ ఏమైంది'
హైదరాబాద్: మైనార్టీలకు ఎన్నికల్లో ఇచ్చిన 12 శాతం రిజర్వేషన్ల హామీ ఏమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును టీ-పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. దీనిపై ఎంఐఎం ఎందుకు మాట్లాడటం లేదో సమాధానం చెప్పాలన్నారు. హైదరబాద్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను నిష్పాక్షపాతంగా నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాలుగైదు రోజుల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తామని ఉత్తమ్ తెలిపారు. భావ సారూప్యత ఉన్న పార్టీలతో ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉన్న చోట్ల వారికే టిక్కెట్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. -
టీఆర్ఎస్ అహంకారానికి చెంపపెట్టు
సాక్షి, హైదరాబాద్: అధికార దుర్వినియోగం, అప్రజాస్వామిక విధానాలు, ప్రజా ప్రతినిధులను బెదిరించడం, బ్లాక్మెయిల్ వంటి చర్యలకు పాల్పడుతున్న టీఆర్ఎస్కు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టువంటివని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. నల్లగొండ, మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకున్న నేపథ్యంలో బుధవారం ఆయన గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. స్థానిక సంస్థల కోటా నుంచి మూడు స్థానాలకు పోటీచేసిన కాంగ్రెస్పార్టీ రెండు స్థానాలను గెలుచుకుందన్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ఎస్ పార్టీ అన్ని అడ్డదారులను తొక్కి, అప్రజాస్వామికంగా వ్యవహరించిందని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విషసంస్కృతిని రాష్ట్ర రాజకీయాల్లోకి తెచ్చి, ప్రతిపక్షాలను లేకుండా చేయాలని ఆ పార్టీ కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. నల్లగొండ, మహబూబ్నగర్లో విజయంకోసం అధికారపార్టీ అన్ని కుయుక్తులకు, కుట్రలకు పాల్పడిందని ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. ఖమ్మం, రంగారెడ్డిలో టీఆర్ఎస్కు మెజారిటీ స్థానాలు లేకున్నా ఎలా గెలిచిందో ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ గెలుపుకోసం వైఎస్సార్సీపీ పరోక్షంగా పనిచేందని ఆరోపించారు. నల్లగొండలో గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహబూబ్నగర్లో గెలిచిన దామోదర్రెడ్డిని అభినందించారు. హృదయంలో దాచుకున్నారు: జానా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులు, కుట్రలు, కుయుక్తులకు పాల్పడినా స్థానిక సంస్థల ప్రతినిధులు ధర్మాన్ని హృదయంలో దాచుకున్నారని ప్రతిపక్షనేత కె.జానారెడ్డి అన్నారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీతో కలసి ఆయన అసెంబ్లీ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్కు బలం లేకున్నా నల్లగొండలో చేయని ట్రిక్కులు, కుయుక్తులు లేవన్నారు. గెలుపుకోసం ప్రజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా టీఆర్ఎస్ చాలా అనైతిక పద్ధతులను అవలంభించిందని విమర్శించారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను బెదిరించి, ప్రలోభాలు పెట్టి, బంధుగణాలను అడ్డుగా పెట్టి టీఆర్ఎస్ విజయం కోసం ప్రయత్నాలు చేసిందన్నారు. బలం లేకున్నా గెలుస్తామంటూ ప్రగల్భాలు పలికినవారు, డాంబికంగా పేలినవారు నల్లగొండలో కాంగ్రెస్ విజయంతో ఆత్మవిమర్శ చేసుకోవాలని జానారెడ్డి సూచించారు. గెలుపోటములు సహజమని, అంతిమంగా ప్రజల పక్షాన పరస్పర సహకారంతో పనిచేయాలన్నారు. ‘తెలంగాణ ప్రజల కోరిక ప్రకారం రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్.., కాంగ్రెస్ పార్టీదే భవిష్యత్తు. విలీనం చేస్తామంటూ టీఆర్ఎస్ పార్టీ మాటతప్పింది. తెలంగాణ ఇస్తే మద్దతుగా ఉంటామన్న సంఘాలు కూడా తప్పించుకున్నాయి. అయినా కాంగ్రెస్పార్టీ వెనుకాడలేదు’ అని అన్నారు. కాంగ్రెస్నే గెలిపించారు: షబ్బీర్ ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని మండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ అన్నారు. నైతిక విలువలను వదిలేసి డబ్బు, అధికారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఓటర్లతో మాట్లాడినా కాంగ్రెస్పార్టీ అభ్యర్థులను ఓటర్లు గెలిపించారని అన్నారు. -
ఆమె అయితే వద్దు... అతడు అయితే ఒకే
ఒక మహిళా ఎంపీ అంటేనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు కారాలు మిరియాలు నూరుతున్నారట. ఆ నోటిదురుసుతనం, ఫైర్బ్రాండ్ తత్వంతో కేంద్రమంత్రి పదవిని సైతం నిర్వహించినా ఈమె పొడ అంటేనే టీ నాయకులకు గిట్టడం లేదు. ఏపీలో బలమైన సామాజిక వర్గానికి చెందిన ఈ నాయకురాలు తెలంగాణకు అవసరంలేదని తేల్చి చెబుతున్నారట. అంతగా కాకపోతే తండ్రి వారసత్వం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాజ్యాంగ పదవిని సైతం నిర్వహించిన మృదుస్వభావి అయిన ఓ నాయకుడు తెలంగాణకు వచ్చినా సరిపోతుందంటున్నారు. ఫైర్బ్రాండ్, మృదుస్వభావి ఈ ఇద్దరు నేతలకు కూడా హైదరాబాద్కు చెందినవారే కాకుండా ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాను గతంలో ఖమ్మం ఎంపీ సీటుకు పోటీ చేసినా హైదరాబాద్లో కార్పొరేటర్గా ఉన్నా తెలంగాణలో నాయకులు పట్టించుకోవడంలేదు కాబట్టి తాను కూడా ఏపీ రాజకీయాలకు వెళతానని ఆ మహిళ ఎంపీ సన్నిహితులతో అంటున్నారట. ఏపీ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటా... ఏపీ సీఎం చంద్రబాబుకు ఏకుమేకుగా త యారవుతానని ఆమె సవాల్ కూడా విసురుతున్నారట. మరోవైపు మృదుస్వభావినేత వస్తే కాంగ్రెస్ తరుపున సెటిలర్ల ఓట్లను ఆకర్షించే అవకాశం ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారట. ఈయన తెలంగాణకు రాకుండా రాష్ట్ర పాలన ఇన్చార్జీ అడ్డుకోకుండా హైకమాండే చొరవ తీసుకుంటే మంచిదనే ఆలోచనలో ఈ నేతలు ఉన్నారట. -
'అప్రజాస్వామిక విధానాలపై చర్యలు తీసుకోవాలి'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. సోమవారం తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ను కలిశారు. అనంతరం నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. క్యాంప్ ఆఫీసు, తెలంగాణ సచివాలయంలో ఇతర పార్టీ నేతలకు టీఆర్ఎస్ కండువా కప్పుతున్నారంటూ విమర్శించారు. ఇది అప్రజాస్వామికంగా ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహిరిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని ప్రణబ్ను కోరినట్టు ఎంపీ గుత్తా తెలిపారు. -
టీ కాంగ్రెస్ ముఖ్యనేతలకు హైకమాండ్ పిలుపు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు కాంగ్రెస్ అదిష్టానం పిలుపు మేరకు సోమవారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఏఐసీసీ ప్రధానకార్యదర్శి దిగ్విజయ్సింగ్ సమక్షంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, శాసనసభ ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, మాజీ మంత్రి దానం నాగేందర్, కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు సునీతా లక్ష్మారెడ్డి సమావేశం కానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈ రోజు సాయంత్రం 6 గంటలకు అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేయనున్నట్టు సమాచారం. -
నేడు ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయ్యేందుకు నాయకులు సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్సింగ్తో భేటీ కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరడం, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇప్పటికే సగం సీట్లు అధికారపార్టీ కైవసం చేసుకోవడంపై చర్చించేందుకు పిలిచినట్లు తెలుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను నేతలు రచించే అవకాశముంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క, జానారెడ్డి, షబ్బీర్ అలీ, దానం నాగేందర్ తదితరులు ఢిల్లీకి వెళ్లనున్నారు. -
గ్రేటర్ కాంగ్రెస్ కమిటీ రద్దు?
గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీని పూర్తిగా రద్దు చేయాలన్న ఆలోచనలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ (టీపీసీసీ) నాయకత్వం ఉంది. గ్రేటర్ కాంగ్రెస్ నుంచి నాయకుల వలసలు పెరిగే అవకాశాలున్నాయన్న సమాచారంతో టీపీసీసీ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరడం ఖాయమైన తరుణంలో టీపీసీసీ నాయకత్వంలో కదలిక వచ్చింది. కమిటీలో కొనసాగుతున్న నాయకులు వెళ్లిపోవడం వల్ల పార్టీ బలహీనపడిందన్న అభిప్రాయం ఏర్పడుతుందని భావిస్తున్న టీపీసీసీ ముందుగానే ఆ కమిటీని పూర్తిగా రద్దుచేయాలన్న నిర్ణయానికి వచ్చింది. అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు కమిటీని రద్దు చేయడం వల్ల రాజకీయంగా లాభనష్టాలను బేరీజు వేసే పనిలో టీపీసీసీ నేతలు తలమునకలయ్యారు. దానం నాగేందర్ టీఆర్ఎస్లో చేరడానికి ముందే కమిటీని రద్దు చేయడం మంచిదని పలువురు నేతలు ఒత్తిడి తెస్తుండటంతో టీపీసీసీ నేతలు ఈ విషయంపై హైకమాండ్ను ఆశ్రయించారు. టీఆర్ఎస్లో చేరాలన్న నిర్ణయానికి వచ్చిన దానం కమిటీ అధ్యక్షుడిగా ఇంకా కార్యక్రమాలు కొనసాగించే ఆస్కారం కల్పించడం పార్టీకి నష్టం చేకూర్చుతుందని, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు గ్రేటర్ కమిటీని రద్దు చేయడమే మంచిదని ఏఐసీసీకి నివేదించారు. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి తగిన ఆదేశాలు రావొచ్చని టీపీసీసీ నాయకుడొకరు చెప్పారు. హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ప్రస్తుత కమిటీని రద్దు చేసి జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పర్యవేక్షణ కోసం తాత్కాలికంగా ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో టీపీసీసీ నేతలు ఉన్నట్టు తెలిసింది. -
ముగిసిన టీ కాంగ్రెస్ సమన్వయ భేటీ
-
టీ కాంగ్ నేతలకు హైకమాండ్ పిలుపు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. తెలంగాణ పీసీసీ చీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, శాసన పక్ష నేత జానా రెడ్డితో పాటు శాసన మండలి నేత షబ్బీర్ ఆలీ మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వరంగల్ ఉప ఎన్నిక ఓటమితో పాటు, తెలంగాణలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలపై హైకమాండ్తో కాంగ్రెస్ నేతలు చర్చించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, దిగ్విజయ్ సింగ్, పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యే అవకాశముంది. వరంగల్ ఉప ఎన్నికల్లో చివర నిమిషంలో కాంగ్రెస్ అభ్యర్థి మార్పు, ప్రచారంలో లోపాలు, అధికార పార్టీని ఎదుర్కోవడంలో విఫలమైన అంశాలతో పాటు, ఓటమి గల కారణాలను నాయకులు హైకమాండ్కు వివరించనున్నారు. అధికార పార్టీ టిఆర్ఎస్కి వచ్చిన భారీ మెజార్టీపై కూడా అధిష్టానం ఆరా తీసే అవకాశముంది. వచ్చే నెలాఖరులో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, గ్రేటర్ ఎన్నికలపై పట్టు సాధించే దిశగా పని చేసేందుకు నాయకులకు అధిష్టానం దిశానిర్దేశం చేయనుంది. -
టీ కాంగ్ నేతలకు హైకమాండ్ పిలుపు
-
నడిపించే నాయకుడేడీ...!!
వరంగల్ ఉపఎన్నికల ఫలితాలతో తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయి కుదేలైంది. ఈ ఫలితం కాంగ్రెస్లో తీవ్ర నిరాశా నిస్పృహలను నింపింది. పార్టీని నడిపించడానికి సరైన నాయకుడు లేనందువల్లే ఉపఎన్నికల్లో చేదు ఫలితాలు వచ్చాయని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. ఉపఎన్నిక విషయంలో అంతా ఒక్కటై పని చేయాల్సిన పరిస్థితుల్లో కూడా టీ-పీసీసీ నేతలు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించడం, టికెట్ ఖరారు చేసే విషయంలో కూడా సమన్వయం లేకపోవడం వంటి అనేక అంతర్గత సమస్యలు ఈ పరిస్థితిని తెచ్చాయని చెబుతున్నారు. వీటికి తోడు టీఆర్ఎస్ విషయంలో తమ అంచనాలు కూడా తారుమారయ్యాయని అంటున్నారు. అధికారం చేపట్టిన 17 నెలల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావించిన కాంగ్రెస్ నేతలకు.. ఓరుగల్లు ప్రజల తీర్పు పెద్ద షాకిచ్చింది. గత ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు కూడా సాధించుకోలేక చతికిలపడింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులతో పాటు దిగ్విజయ్సింగ్, గులాంనబీ ఆజాద్ వంటి జాతీయ నేతలను రప్పించి ప్రచారం చేయించినా డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితి రావడం ఆ పార్టీ నేతలను అంతర్మథనంలో పడేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడు ఉత్తమ్కుమార్రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఈ ఉప ఎన్నిక ప్రభుత్వ పనితీరుకు రిఫరెండం అంటూ సవాలు చేశారు. నేతల మధ్య సమన్వయం లేకపోవడం, పార్టీలో అంతర్గత విభేదాలు, చిట్టచివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం లాంటి అనేక కారణాలు ఈ పరిస్థితికి కారణమయ్యాయని నేతలు తాజాగా విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న తమ అంచనా తప్పిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి స్వల్పకాలమే అయినందున ఆ ప్రభుత్వం పట్ల ప్రజలింకా నమ్మకంతో ఉన్నారని ఈ ఫలితాలతో తేలిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు విశ్లేషించారు. మొదట్లో స్థానిక కాంగ్రెస్ నేతలు నియోజకవర్గాల వానీగా సమావేశాలు నిర్వహించి శ్రేణుల్లో కొంత కదలిక తెచ్చారు. రాజయ్య ఎఫెక్ట్ ఉప ఎన్నిక నామినేషన్ దాఖలుకు చిట్టచివరి రోజున కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక.. తన ముగ్గురు పిల్లలతో కలిసి అనుమానాస్పద స్థితిలో మరణించడం, ఆ విషయంలో రాజయ్య, ఆయన కుటుంబ సభ్యులపై కేసులు నమోదు కావడం లాంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశాయి. దాంతో చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. సర్వే సత్యనారాయణతో అప్పటికప్పుడు నామినేషన్ వేయించారు. సరైన సమన్వయం చేసేవారు లేకపోవడంతో సర్వేకు ఘోర పరాజయం తప్పలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు 2,69,065 ఓట్లు రాగా ఈసారి 1,55,957 ఓట్లు మాత్రమే రావడం, గతంతో పోల్చితే లక్షకు పైగా ఓట్లు తగ్గడం కాంగ్రెస్ నేతలను నివ్వెరపరిచింది. -
పది మందిలో పాము..
పది మందిలో పాము చావదన్న సామెత తమ పార్టీకి సరిగ్గా అన్వయించవచ్చునని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంగీకరిస్తున్నారు. సీఎం పదవి తనకంటే తనకంటూ నల్లారి కిరణ్కుమార్రెడ్డి అనంతరం పలువురు నేతలు పోటీపడటంతో రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందని వాపోతున్నారు. సీఎంగా పార్టీ నేత ఎవరైనా ఉండి ఉంటే ఎన్నికల ఫలితాలు ఇంత నిరాశాజనకంగా వచ్చి ఉండేవి కావంటున్నారు. అయితే ప్రతిపక్షంలో ఉన్నా మళ్లీ అలాంటి పరిస్థితే వచ్చిందని తలలు పట్టుకుంటున్నారట. తెలంగాణ కోసం సీఎం పదవిని తాను వదిలేశానంటే... తాను వదిలేశానని సీనియర్ నేతలు జైపాల్రెడ్డి, జానారెడ్డి వంటి వారు సీఎం కేసీఆర్ వ్యాఖ్యల పుణ్యామా అంటూ ప్రకటన లు చేయడాన్ని వారు ఉదహరిస్తున్నారు. మరో నేత దామోదర రాజనర్సింహ తాను సీఎం కాకుండా అగ్రకుల నేతలు అడ్డుకున్నారని ఇప్పటికీ వాపోతున్నారని వారు గుర్తుచేస్తున్నారట. ఎవరో ఒకరు సీఎం పదవిని తీసుకుంటే పార్టీకి ఈ పరిస్థితి దాపురించేది కాదంటున్నారు. అయితే సమస్యంతా.. ఇప్పటికీ ఈ నేతల తీరు మారకపోవడమేనని నాయకులు అంటున్నారు. ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగానే ఉన్నా.. మళ్లీ తామే సీఎం అభ్యర్థి అంటూ దళిత వర్గాల నుంచి దామోదర రాజనర్సింహా, సర్వే సత్యనారాయణ, వివేక్, భట్టి విక్రమార్క, రెడ్డి సామాజిక వర్గం నుంచి జై పాల్రెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీకే అరుణ, సబితా ఇంద్రారెడ్డి, బీసీ వర్గాల నుంచి పొన్నాల లక్ష్మయ్య తదితర నేతలు పోటీపడుతుండడంతో ఏమీ చేయాలో తెలియక హైకమాండ్కు సైతం జుట్టుపీక్కునే పరిస్థితి ఏర్పడిందట! -
'టీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోంది'
-
'టీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోంది'
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ఆరోపిస్తూ తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్కు ఫిర్యాదు చేశారు. వరంగల్లో ప్రభుత్వం, మంత్రులు విధాన ప్రకటనలతో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే కళ్లు పోతాయని.. మంత్రి కేటీఆర్ ఓటర్లను భయపెడుతున్నారని అన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్ ప్రకటన, మహిళలకు రిజర్వేషన్లు ఇస్తామని నిరుద్యోగులను ప్రలోభ పెడుతున్నారని తెలిపారు. ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిక ఏకపక్షం, గెలుపు తమదే అంటున్న మంత్రులు వరంగల్లో ఎందుకు ప్రచారం చేస్తున్నారని అడిగారు. గెలుపుపై అంత ధీమా ఉంటే మంత్రులు ప్రచారం వదిలి హైదరాబాద్ రావాలని సూచించారు. ఎన్నికల ప్రచారం చేయకుండా కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి భయపెడుతున్నారని గుత్తా ధ్వజమెత్తారు. -
'బాబు, కేసీఆర్ మధ్య రహస్య ఒప్పందం'
హైదరాబాద్: ఓటుకు కోట్లు, ఫోన్ ట్యాపింగ్ కేసులపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కే చంద్రశేఖర్ రావుల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, కేసీఆర్ల మధ్యవర్తి ఎవరనేది త్వరలో బయటపెడతామని చెప్పారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం తెలుగు ప్రజలను నిరాశపరిచిందని, ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడం అన్యాయమని కాంగ్రెస్ నేతలు అన్నారు. రాష్ట్ర విభజన సరిగా జరగలేదన్న మోదీ ప్రకటనను కేసీఆర్ వ్యతిరేకించకపోవడం తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని అవమానపరచడమేనని, మోదీ పాదాల వద్ద తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ, చంద్రబాబు, కేసీఆర్ అబద్ధాల కిలాడీలేనని షబ్బీర్ అలీ, పొంగులేటి విమర్శించారు. -
తెలంగాణలో దిగ్విజయ్ పర్యటన
వరంగల్, నారాయణ్ ఖేడ్ ఉపెఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారుచేసేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ సోమవారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. హైదరాబాద్ లోజరిగే ఓ కార్యక్రమంలో పాల్గొనే ఆయన.. సాయంత్రం వరంగల్లో జిల్లా నేతలతో భేటీ కానున్నారు. వరంగల్ లోక్ సభ అభ్యర్థి ఎంపికపై తుదినిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం గాంధీ భవన్ లో మెదక్ జిల్లా నేతలతో సమావేశం కానున్న దిగ్విజయ్.. నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక అభ్యర్థిని ఎంపిక చేస్తారు.కాగా..సోమవారం చార్మినార్ వద్ద జరిగే రాజీవ్ సద్భావన రజతోత్సవంలో ఆయన ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఈ ఏడాది రాజీవ్ సద్భావనా అవార్డు గులాంనబీ ఆజాద్ కు ఇవ్వనుట్లు నిర్వాహకులు తెలిపారు. -
ఆ కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది..
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క ఓటును కూడా అకారణంగా తొలగించరని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారమిక్కడ ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గంలో భారీగా ఓట్లు తొలగించారనేది అవాస్తవమని, 2014 కంటే సనత్ నగర్ లో ఇప్పుడు 7వేల ఓట్లు పెరిగాయన్నారు. ఓట్లు తొలగించారంటూ నిరాధారంతో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయటం తగదన్నారు. ఓట్లు తొలగించినట్లు తమకు ఇప్పటివరకూ ఎవరి నుంచి ఫిర్యాదులు రాలేదని తలసాని తెలిపారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బుద్ధిలేని మాటలు చెబుతున్నారని, చౌకబారు రాజకీయాలతో అనవసర ప్రకటనలు చేస్తున్నారని తలసాని మండిపడ్డారు. ప్రారంభోత్సవాల్లో పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు చేయటం సరికాదన్నారు. రైతు ఆత్మహత్యలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని ధ్వజమెత్తారు. ధర్నాల పేరుతో కాంగ్రెస్, తెలంగాణ టీడీపీల కలయికతో ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోందని తలసాని వ్యాఖ్యానించారు. -
హస్తిన బాట పట్టిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలంతా ఢిల్లీ బాటపట్టారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు పలువురు పార్టీ నేతలు శనివారం ఢిల్లీ బయల్దేరారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు వివరాలను ఉత్తమ్ ....ఏఐసీసీకి సమర్పిస్తారు. అలాగే తాను గత ఆరు నెలల్లో చేపట్టిన కార్యక్రమాలపై సోనియా, రాహుల్గాంధీకి ఆయన నివేదిక ఇవ్వనున్నారు. వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగే ఉపఎన్నిక , కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపికపై కూడా ఉత్తమ్ హైకమాండ్ పెద్దలతో కసరత్తు చేయనున్నారు. ఇక ఆదివారం ఢిల్లీ రాంలీలా మైదాన్లో ఏఐసీసీ నిర్వహించే కిసాన్ ర్యాలీలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాల్గొంటారు. -
పంజాగుట్ట రోడ్డుపై కాంగ్రెస్ నేతల బైఠాయింపు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద ధర్నా చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. సీఎం క్యాంప్ ఆఫీసుకు వద్దకు కాంగ్రెస్ నేతలు వెళ్తుండగా సోమాజీగూడ చౌరస్తాలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు వారిని అరెస్ట్ చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం పంజాగుట్ట రోడ్డుపైనే కాంగ్రెస్ నేతలు బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు దాడి చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సీఎం క్యాంప్ ఆఫీసు వద్ద నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. శనివారం సాయంత్రం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ను కాంగ్రెస్ నేతలు కలసి బాలరాజుపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం క్యాంప్ ఆఫీసుకు వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. -
'రాజీవ్ ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడటం దుర్మార్గం'
హైదరాబాద్: రాజీవ్గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, ముఖ్యనేతలు గురువారం పంజాగుట్టలోని రాజీవ్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం పంజాగుట్ట నుంచి నెక్లెస్రోడ్లోని ఇందిరా విగ్రహం వరకు టీపీసీసీ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక భారత నిర్మాణంలో రాజీవ్గాంధీ కీలక పాత్ర షోషించారంటూ కొనియాడారు. రాజీవ్ గాంధీ ప్రతిష్టను దెబ్బతీసేలా సుష్మాస్వరాజ్ లాంటి పెద్దలు మాట్లాడటం దుర్మార్గమని విమర్శించారు. మత సమరస్యం కోసం రాజీవ్గాంధీ చేపట్టిన సద్భావన యాత్ర దేశానికి ఆదర్శమన్నారు. గాంధీ భవన్, ఇందిరాభవన్లోనూ రాజీవ్ గాంధీకి నివాళుర్పించారు.