తెలంగాణ పీసీసీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు గాంధీభవన్లో సమావేశం కానుంది.
హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు గాంధీభవన్లో సమావేశం కానుంది. ఈనెల 9న పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం, పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష ప్రధాన ఎజెండా ...తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనుంది. అలాగే తాజా రాజకీయ పరిణామలపైన సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.