బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంగళవారం భేటీయ్యారు. ఆర్డీఎస్ పనులను వెంటనే చేపడతామని కర్ణాటక సీఎం చెప్పినట్లు కాంగ్రెస్ నేతలు వెల్లడించారు.
తీవ్ర కరవుతో అల్లాడుతున్న మహబూబ్నగర్ జిల్లాకు తాగునీటి కోసం ఒక టీఎంసీ నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. సీఎంను కలిసిన వారిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, మహబూబ్నగర్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్నారు.
కర్ణాటక సీఎంతో టి.కాంగ్రెస్ నేతల భేటీ
Published Tue, May 10 2016 6:54 PM | Last Updated on Sat, Aug 11 2018 7:11 PM
Advertisement
Advertisement