హైదరాబాద్ : శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఆయూబ్ అనే ప్రయాణికుడు లోదుస్తుల్లో బిస్కెట్లు తీసుకువస్తూ కస్టమ్స్ అధికారుల తనిఖీల్లో పట్టుపడ్డాడు. అతని వద్ద నుంచి సుమారు 2 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. ఆయూబ్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.