వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ కోర్సుల ట్యూషన్ ఫీజును రూ.1.6 లక్షలుగా నిర్ణయించాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ఫీజు నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ)ని ఆదేశించింది.
టీఎఫ్ఆర్సీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: వాసవి కాలేజీలో ఇంజనీరింగ్ కోర్సుల ట్యూషన్ ఫీజును రూ.1.6 లక్షలుగా నిర్ణయించాలని ఉమ్మడి హైకోర్టు తెలంగాణ ఫీజు నియంత్రణ కమిటీ (టీఎఫ్ఆర్సీ)ని ఆదేశించింది. రెండువారాల్లో ఈ ఫీజును ప్రకటించాలని ఉన్నత విద్యా శాఖ అధికారులకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్. రామచంద్రరావు ఇటీవల తీర్పు వెలువరించారు.