హైదరాబాద్ : నగరంలోని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి గ్రామ పంచాయతీలోని ఓ విల్లాలో పనిచేస్తున్న మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందింది. మంగళవారం మధ్యాహ్నం ఆమె విధినిర్వహణలో ఉండగా విద్యుత్ తీగ తెగిపడింది. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళ గాయపడింది. పేట్బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతురాలి వివరాలను సేకరిస్తున్నారు.