electrocution
-
యువకుల ప్రాణం తీసిన ఫ్లెక్సీలు
కొల్చారం (నర్సాపూర్): విద్యుదాఘాతంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మెదక్ జిల్లా కొల్చారం మండలంలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్ఐ మహ మ్మద్ గౌస్ కథనం ప్రకా రం.. కిష్టాపూర్ గ్రామా నికి చెందిన ఎక్కెం యాదగిరి కుమారుడు నవీన్ (21), పసుపుల చిన్న వెంకటేశం కుమారుడు పసుపుల ప్రసాద్ (20) వారి వ్యవసాయ పొలంలో నారు మడికి నీరు పెట్టి, అడవి పందులు రాకుండా మంటలు పెట్టడానికి వెళ్లారు. కాగా, బుధవారం మెదక్ జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి రాక సందర్భంగా వీరి పొలాలకు సమీపంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.ఫ్లెక్సీలు విద్యుత్ హైటెన్షన్ వైర్కు ఆనుకొని ఉండటంతో వాటిని ఏర్పాటు చేసిన కాంట్రాక్టర్ తీయకుండా వదిలేశాడు. అయితే, ప్రసాద్, నవీన్ ఫ్లెక్సీలు తీయడానికి ప్రయతి్నంచగా విద్యుత్ సరఫరా కావడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకొని నిర్లక్ష్యంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మెదక్–నర్సాపూర్ జాతీ య రహదారిపై రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ రాజశేఖర్రెడ్డి అక్కడికి చేరుకొని బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇవ్వడంతో శాంతించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. మృతుల్లో ఒకరైన ప్రసాద్కి ఇటీవలే పెళ్లి కుదిరినట్లు గ్రామస్తులు తెలిపారు. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి మెదక్ చేరుకొని యువకుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పు న అందజేశారు. -
ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్.. సురక్షితం.. కాలుష్య రహితం
దేశంలో గత కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంపై పలు ఆంక్షలు విధించారు. బాణసంచా నుండి వెలువడే పొగ ఆరోగ్యానికి హానిచేస్తుంది. అలాగే కాలుష్యాన్ని కూడా వ్యాపింపజేస్తుంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బాణసంచా కొనుగోళ్లు, అమ్మకాలను నిషేధించారు.అయితే దీపావళి వేళ బాణసంచా లేకుండా సరదాగా ఎలా గడపడం? ఇది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇప్పుడు బాణసంచాకు బదులుగా ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి వెలుగు జిలుగులను, ధ్వనిని అందించినప్పటికీ కాలుష్యాన్ని కలుగజేయవు. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను కాల్పడం వలన ఎటువంటి హాని జరగదు.ఎలక్ట్రానిక్ టపాసులు నిజమైన టపాసుల మాదిరిగనే కనిపిస్తాయి. వాటిలానే వెలుగులను ఇస్తాయి. అయితే ఇవి రిమోట్తో పనిచేస్తాయి. వీటిని వినియోగించినప్పుడు నిజమైన బాణసంచాను కాల్చిన అనుభూతినే పొందవచ్చు. ఎలక్ట్రానిక్ టపాసులు వెలిగించేందుకు ఎటువంటి అగ్గిపెట్టె లేదా నిప్పు అవసరం లేదు. ఇవి ఎంతో సురక్షితమైనవి. కాలుష్యాన్ని కూడా వెదజల్లవు. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్లో వివిధ రకాల శబ్ధాలు, వెలుగులను చూడవచ్చు.remote control ignition device for crackers दिवाली में पटाखे जलाने के सुरक्षित यंत्र शुभ दिवाली 🪔 pic.twitter.com/VLj2n0tNFV— Er Ranjeet Singh (@ErRanjeetSingh) October 27, 2024 ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ లోపల వైర్లతో అనుసంధానమైన పలు చిన్న పాడ్లు, ఎల్ఈడీ లైట్లు ఉంటాయి. వీటిని ఆన్ చేసినప్పుడు పాడ్ల నుంచి స్పార్క్ వస్తుంది. అలాగే బాణసంచా మాదిరి శబ్దం కూడా వస్తుంది. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను రిమోట్ ద్వారా నియంత్రించవచ్చు. ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను వినియోగించి వినూత్నమైన దీపావళి ఆనందాన్ని పొందవచ్చు.ఎలక్ట్రానిక్ ఫైర్క్రాకర్స్ను మార్కెట్లో లేదా ఆన్లైన్లో సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఇవి కొంచెం ఖరీదైనవే అయినప్పటికీ పర్యావరణానికి ఎటువంటి హాని చేయవు. వీటిని పలుమార్లు ఉపయోగించవచ్చు. వీటిధర రూ.2,500 వరకూ ఉండవచ్చు.ఇది కూడా చదవండి: వరల్డ్ ట్రేడ్ సెంటర్లో దీపావళి వెలుగులు -
గజేంద్ర విలాపం
సాక్షి, అమరావతి: గత ఐదేళ్లలో వివిధ కారణాల రీత్యా దేశంలోని పలు ప్రాంతాల్లో 528 ఏనుగులు అసహజ రీతిలో మృత్యువాత పడ్డాయంటూ కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ వెల్లడించిన నేపథ్యంలో జంతు ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా విద్యుదాఘాతం కారణంగా గత ఐదేళ్లలో (2019–20 నుంచి 2023–24 వరకు) అత్యధికంగా 392 ఏనుగులు మృత్యువాతపడగా.. ఆ తరువాత రైళ్ల ప్రమాదాల బారిన పడి 73 ఏనుగులు మృతి చెందాయి. వేటాడం ద్వారా 50, విషప్రయోగం చేసి 13 ఏనుగులను హతమార్చారు.విద్యుత్ కంచెలతోనే పెను ముప్పు..అటవీ ప్రాంతం సమీపంలోని పంట పొలాల్లోకి ఏనుగులు రాకుండా రైతులు విద్యుత్ కంచెలను ఏర్పాటు చేస్తుండడంతో అత్యధికంగా ఏనుగులు మృతి చెందుతున్నాయి. విద్యుత్ ఘాతాల నుంచి ఏనుగులు, ఇతర వన్యప్రాణులను రక్షించేందుకు అక్రమంగా వేసిన విద్యుత్ కంచెలను తొలగించాల్సిందిగా అన్ని రాష్ట్రాల విద్యుత్ సంస్థలు, ట్రాన్స్మిషన్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. అండర్ గ్రౌండ్ లేదా, పోల్స్ పైన మాత్రమే విద్యుత్ లైన్లు ఉండేలా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్రం తెలిపింది.ప్రాజెక్ట్ ఎలిఫెంట్ కేంద్ర ప్రయోజిత పథకం ద్వారా ఏనుగులు, పరిరక్షణ, వాటి ఆవాసాల్లో చర్యలకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని రాష్ట్రాలకు అందిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. రైలు ప్రమాదాల్లో ఏనుగుల మరణాల నివారణకు రైల్వే మంత్రిత్వ శాఖ (రైల్వే బోర్డు) పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో శాశ్వత సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. రైలు పైలట్లకు స్పష్టమైన వీక్షణను అందించడానికి రైల్వే ట్రాక్ల వెంట వృక్ష సంపదను తొలగించడం, ఏనుగు ఉనికి గురించి పైలట్లను హెచ్చరించడానికి తగిన పాయింట్ల వద్ద సూచిక బోర్డులను ఉపయోగించడం, రైల్వే ట్రాక్ల ఎలివేటెడ్ విభాగాలను ఆధునికీకరించడం, ఏనుగుల సురక్షిత మార్గం కోసం అండర్పాస్, ఓవర్పాస్ను ఏర్పాటు చేయడం, అటవీ శాఖ ఫ్రంట్లైన్ సిబ్బంది, వన్యప్రా ణుల పరిశీలకులు రైల్వే ట్రాక్లపై రెగ్యులర్ పెట్రోలింగ్ చేయడం తదితర చర్యలను తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ వివరించింది.ఏనుగు దంతాల కోసం.. ఏనుగు దంతాల కోసం అత్యధికంగా ఒడిశా, మేఘాలయ, తమిళనాడులో వేటాడి హతమారుస్తున్నారని, అలాగే అసోం, ఛత్తీస్గఢ్లో విషప్రయోగం చేస్తున్నారని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ రాష్ట్రల్లో ఏనుగుల దంతాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు.. వేటగాళ్లు, విషప్రయోగాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసినట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. విద్యుదాఘాతంతో అత్యధికంగా ఒడిశాలో 71, అసోంలో 55, కర్ణాటకలో 52 మృతి చెందాయి. రైళ్లు ఢీ కొట్టిన ఘటనల్లో అత్యధికంగా అసోంలో 24, ఒడిశాలో 16 మృతి చెందాయి. వేటాడటం ద్వారా ఒడిశాలో అత్యధికంగా 17, మేఘాలయలో 14 ఏనులను చంపేశారు. అసోంలో విషప్రయోగం ద్వారా 10 ఏనుగులను హతమార్చారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
కందుకూరు: చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపే ఫ్లెక్సీ కడుతూ విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందిన ఘటన శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా కందుకూరు మండలం మాచవరంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇనకొల్లు గజపతి, అనూరాధ దంపతుల కుమారుడు నరసింహ (21) తోటి యువకులతో కలిసి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ భారీ ఫ్లెక్సీ ఏర్పాటుకు సంకల్పించారు.తన ఇంటి సమీపంలో ఫ్లెక్సీ కట్టేందుకు యత్నిస్తుండగా, ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చింది. దీంతో ఫ్లెక్సీ బ్యాలెన్స్ తప్పి పక్కనే వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్పై పడింది. ప్రమాదంలో ఫ్లెక్సీకి ఉన్న ఇనుప బోర్డుకు విద్యుత్ సరఫరా కావడంతో నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. -
ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతులు చేస్తూ.. కరెంట్ షాక్తో విద్యుత్ ఆపరేటర్ మృతి
సాక్షి, సూర్యాపేట, నడిగూడెం: ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై విద్యుత్ ఆపరేటర్ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తెల్లబల్లి గ్రామానికి చెందిన నెమ్మాది సుధాకర్ (40) మునగాల మండలం రేపాల విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సుధాకర్ గురువారం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తెల్లబల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు రత్నవరం రహదారిలోని ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని అతన్ని తీసుకెళ్లారు. ఆ ట్రాన్స్ఫార్మర్ మునగాల మండలం ఆకుపాముల విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఉందనుకొని అక్కడి నుంచి సుధాకర్ ఎల్సీ తీసుకున్నాడు. కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఉంది. ఈ విషయం తెలియకపోవడంతో సుధాకర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ప్రాణం తీసిన పిండిమర.. ఒకరిని కాపాడబోయి.. వరుసగా నలుగురు!
రాజస్థాన్లోని బాడ్మేర్లో విద్యుదాఘాతానికి నలుగురు బలయ్యారు. పిండిమరకు విద్యుత్ ప్రవహించిన నేపధ్యంలో వీరు ఒకరిని కాపాడబోయు మరొకరు మృతి చెందారు. మృతులలో ఇద్దరు చిన్నారులతోపాటు ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంనకు తరలించి, ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ ఉదంతం బాడ్మేర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరంగ్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన అర్జున్సింగ్ ఇంటిలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో ఇంటిలో అర్జున్సింగ్ లేడు. అతని భార్య పిండిమరలో గొధుమలను ఆడిస్తుండగా, ఆమె విద్యుదాఘాతానికి గురయ్యింది. బాధతో తల్లి విలవిలలాడుతుండగా, వారి ఇద్దరి పిల్లలను ఆమెను పట్టుకుని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే వారు కూడా విద్యుదాఘాతానికి గురయ్యారు. బాధితుల అరుపులు విన్న అర్జున్ సింగ్ బంధువు హఠెసింగ్ అక్కడికు వచ్చి, వారిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అయితే అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్ని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటన గురించి జిల్లా కలెక్టర్ అంజుమ్ తాహిర్ సమా మాట్లాడుతూ పిండిమరకు విద్యుత్ ప్రవాహం జరిగి, దానిని ముట్టుకున్న నలుగురు మృతి చెందారని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఇది కూడా చదవండి: నగరాలకు చెట్లు ఎందుకు అవసరం?.. 12 పాయింట్లలో పూర్తి వివరాలు! -
తల్లీకొడుకుల ప్రాణం తీసిన మొబైల్ చార్జర్
యూపీలోని సీతాపూర్లో మొబైల్ చార్జింగ్ అవుతున్న సమయంలో ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురైన తల్లీకుమారుడు మృతిచెందారు. వారిద్దిరూ ఒకే గదిలో ఉండగా, ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు ఆ గది తలుపులు తెరవగానే వారికి అక్కడ అచేతనంగా పడివున్న తల్లీకొడుకుల మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. అయితే కుటుంబ సభ్యులు మృతులకు పోస్టుమార్టం చేసేందుకు నిరాకరించారు. ఈ ఘటన భవానీపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. 15 ఏళ్ల రోహిత్ జైశ్వాల్ తమ ఇంటిలోని ఒక గదిలో పడుకున్నాడు. అదే గదిలో అతని తల్లి రామస్ హెలీ కూడా పడుకుంది. రాత్రి వేళ రోహిత్ మొబైల్ చార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. అతనిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా విద్యుదాఘాతానికి గురయ్యింది. ఉదయం కుటుంబ సభ్యులు తల్లీకొడుకులు మృతి చెందిన విషయాన్ని గుర్తించారు. మృతులకు పోస్టుమార్టం చేయవద్దంటూ అభ్యర్ఙంచి, వారికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇది కూడా చదవండి: ఎయిర్క్రాఫ్ట్ నడుపుతూ 11 ఏళ్ల చిన్నారి.. పక్కనే మద్యం తాగుతూ తండ్రి.. మరుక్షణంలో.. -
కళ్లముందే ఘోరం.. 16 మంది మృతి, రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్లో సంభవించిన విద్యుదాఘాత ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అనూహ్య ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాక్షించారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. కాగా, చమోలీ జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న చమోలీ బ్రిడ్జిపై ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యుత్ ప్రసరించింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవారికి షాక్ తగిలి 16 మంది ప్రాణాలు విడిచారు. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. (దంచికొట్టిన వాన.. గంటల్లోనే 30 సెం.మీ వర్షం.. రిజర్వాయర్లకు హై అలర్ట్) మృతుల్లో ముగ్గురు గార్డులు, ఒక పోలీసు వ్యక్తి కూడా ఉన్నారు. కళ్లముందే కరెంట్ షాక్తో అంతమంది విగతజీవులుగా మారడం స్థానికంగా భయోత్పాతం సృష్టించింది. తీవ్రంగా గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సీఎం విచారం.. ఎక్స్గ్రేషియా ప్రకటన చమోలీ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులకు రూ.1 లక్ష చొప్పున అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. సత్వర విచారణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సీఎం ధామితో ఫోన్లో మాట్లాడారు. చమోలీ ఘటనపై ఆరా తీశారు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. (డిప్యూటీ స్పీకర్పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..) -
ఢిల్లీలో భారీ వర్షాలు.. కరెంటు షాక్ కొట్టడంతో యువతి మృతి
న్యూఢిల్లీ: ఢిల్లీలో రుతుపవనాల తాకిడికి శనివారం జోరుగా వర్షం కురిసిన వర్షాలు ఒక యువతిని బలితీసుకున్నాయి. గుంతలుగా మారిన రోడ్డులో నడుస్తూ పొరపాటున కరెంటు స్తంభానికి వేలాడుతున్న వైర్లను తాకడంతో తాకడంతో యువతి విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినా కూడా ప్రయోజనం లేకపోయింది. ఆమె అప్పటికే చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు నిర్ధారించాయి. తూర్పు ఢిల్లీలోని ప్రీతి విహార్ లో నివాసముండే సాక్షి అహూజా తెల్లవారుజాము 5.30 నిముషాలకు ఇద్దరు పెద్దవాళ్ళు ముగ్గురు చిన్నారులతో రైల్వే స్టేషన్ వైపుగా వెళ్తోంది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో వాటిని తప్పించుకునే ప్రయత్నంలో పక్కనే ఉన్న కరెంటు స్థంభంవైపు అడుగు వేసిన ఆ యువతికి కింద వేలాడుతున్న వైర్లు తాకి అక్కడికక్కడే కూలబడిపోయింది. అక్కడే ఉన్న ఆమె సోదరి మాధవి చోప్రా వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే సాక్షి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగానే ఆమె సోదరి మరణించినట్లు సంబంధిత అధికారులపై మాధవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి లోకేష్ కుమార్ చోప్రా కూడా అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విపరీతమైన ఉక్కపోతతో వేసవిపై విసుగెత్తిపోయిన తరుణంలో తొలకరి చినుకులు ఎట్టకేలకు పలకరించాయని సంతోషించేంతలోపే ఢిల్లీలో పెనువిషాదం చోటు చేసుకోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురైయ్యారు. ఇది కూడా చదవండి: ఆ చీకటి రోజులను మరచిపోలేము.. ప్రధాని మోదీ -
హృదయవిదారకం: కరెంట్ షాక్తో గున్న ఏనుగు.. కాపాడదామని మరో మూడు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: తాగునీటి కోసం పొలాల్లోకి వచ్చిన నాలుగు ఏనుగులు విద్యుదాఘాతంతో మృత్యువాత పడ్డాయి. పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం పక్కుడుభద్ర గ్రామ సమీపంలో గురువారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది. ఒక గున్న ఏనుగు, ఐదు పెద్ద ఏనుగుల గుంపు గత ఫిబ్రవరిలో ఒడిశా సరిహద్దులోని అడవుల్లోంచి భామిని మండలంలోకి వచ్చింది. మూడు నెలలుగా ఇక్కడి అడవుల్లో ఉంటూ ఆహారం, తాగునీటి కోసం సమీప పొలాల్లోకి వస్తుండేవి. ఎవరికీ హాని చేయకపోవడంతో వాటిని చూసేందుకు పార్వతీపురం మన్యం జిల్లావాసులే కాకుండా ఒడిశా నుంచి కూడా వస్తుండేవారు. ఈ క్రమంలో గురువారం అర్ధరాత్రి పక్కుడుభద్ర గ్రామ సమీపంలోని పొలాల్లోకి వచ్చాయి. బొమ్మిక మిన్నారావుకు చెందిన బోరుబావి వద్దకు వెళ్లేందుకు యత్నించాయి. ఆ పక్కనే ఉన్న త్రీఫేజ్ విద్యుత్ లైన్, ట్రాన్స్ఫార్మర్ను గున్న ఏనుగు తన తొండంతో లాగింది. దీంతో విద్యుత్ షాక్కు గురై విలవిలలాడుతున్న గున్న ఏనుగును రక్షించేందుకు మరో మూడు పెద్ద ఏనుగులు ప్రయత్నించాయి. దీంతో నాలుగూ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. వాటిని చూసేందుకు సమీప గ్రామాల ప్రజలు వేలాది సంఖ్యలో పోటెత్తారు. నాలుగు ఏనుగుల కళేబరాలకు విశాఖ జూ వైద్యాధికారి శ్రీనివాసరావు బృందం పోస్టుమార్టం నిర్వహించింది. ఘటన స్థలంలోనే వాటిని ఖననం చేసేందుకు రైతు మిన్నారావు అంగీకరించడంతో జేసీబీలతో పెద్ద గోతులు తీయించి కళేబరాలను ప్రొటోకాల్ ప్రకారం ఖననం చేశారు. విశాఖ రేంజ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీకంఠనాథరెడ్డి, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల డీఎఫ్వోలు పాల్గొన్నారు. -
అమ్మా.. నేనూ బడికి పోతా!
సాక్షి, హిందూపురం: ‘అమ్మా... నేనూ బడికి పోతానమ్మా.. నాన్నకు చెప్పు.. నన్ను బడికి పిలుచుకెళ్లమని’ అంటూ ప్రాధేయపడుతున్న ఆ బాలుడి మాటలు విన్న కన్నతల్లికి కంట నీరు ఆగలేదు. అందరిలా తాను కూడా ఆడుకోవాలని, చదువుకోవాలనే అభిలాషను వ్యక్తం చేస్తున్న కుమారుడిని చూస్తూ నిరుపేద తల్లిదండ్రులు అసహాయ స్థితిలో మౌనంగా రోదిస్తున్నారు. ఏం జరిగింది?.. హిందూపురంలోని మేళాపురం ప్రాంతానికి చెందిన షేక్ రఫీక్, నూర్జహాన్ దంపతుల ఏకైక కుమారుడు హర్షాద్ ఏడో తరగతి చదువుతున్నాడు. నెల రోజుల క్రితం ఇంటిపైన కోతులు చేరుకుని అపరిశుభ్రం చేస్తున్నాయంటూ వాటిని అదిలించేందుకు కర్ర తీసుకుని మిద్దెపైకి హర్షాద్ వెళ్లాడు. ఆ సమయంలో కోతులను అదలిస్తూ ఇంటి పైభాగంలో వెళుతున్న హైటెన్షన్ (33కేవీ) విద్యుత్ వైర్ల ప్రభావం కారణంగా షాక్కు గురయ్యాడు. దీంతో మెడ నుంచి కుడి వైపు శరీరం మొత్తం కాలిపోయింది. ఉన్నదంతా అమ్మి.. లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న రఫీక్ పెద్ద ఆస్తి పరుడేమీ కాదు. వృత్తిలో భాగంగా వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అడపాదడపా కొంత మొత్తం పొదుపు చేసుకున్నాడు. ఈ క్రమంలో విద్యుత్షాక్కు గురైన కుమారుడి ప్రాణాలు దక్కించుకునేందుకు తల్లిదండ్రులు నానా ఇబ్బందులు పడ్డారు. బెంగళూరులోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. వైద్య చికిత్సకు పొదుపు చేసుకున్న డబ్బుతో పాటు ఉన్న కొద్దిపాటి బంగారు నగలూ కర్పూరంలా కరిగిపోయాయి. దాదాపు రూ. 5లక్షలకు పైగా ఖర్చు పెట్టి కుమారుడి ప్రాణాలు కాపాడుకోగలిగారు. అయితే మెడ నుంచి నడుము వరకూ కుడివైపు శరీరం పూర్తిగా కాలిపోయి ముడతలు పడింది. కుడి చేతిలోని నాలుగు వేళ్లూ తొలగించారు. శరీరంలో నీటి శాతం తగ్గింది. గొంతు వద్ద నరాలు గట్టిపడ్డాయి. శరీరంలో రక్తప్రసరణతో పాటు నరాల వ్యవస్థ మెరుగు పడాలంటే శస్త్రచికిత్స ఒక్కటే మార్గమని వైద్యులు తెలిపారు. ఇందు కోసం రూ. 30 లక్షల వరకూ ఖర్చు వస్తుందని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కుదేలయ్యారు. ఇప్పటికే వారానికి ఒకసారి బెంగళూరుకు చికిత్స కోసం వెళ్లి వచ్చేందుకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ ఖర్చు వస్తోంది. ఈ క్రమంలో శస్త్రచికిత్సకు పెద్ద మొత్తం సమకూర్చుకోవడం తమకు తలకు మించిన భారమవుతోందని, ఎవరైనా మానవతావాదులు స్పందించి తమ బిడ్డను మామూలు మనిషిని చేయాలని వేడుకుంటున్నారు. దాతలు సాయం చేయదలిస్తే... పేరు: షేక్ మహమ్మద్ రఫీక్ బ్యాంక్ పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నంబర్ : 3878 101 6511 ఐఎఫ్ఎస్సీ కోడ్ : టఆఐN 0004696 ఫోన్ పే నంబర్ : 76709 34214 (చదవండి: మంత్రి ఉచిత చక్కెరకు మహిళ తిరస్కారం) -
Darshit: కన్నా..ఇక కనిపించవా..
సాక్షి, తాళ్లపూడి/కాకినాడ క్రైం: మూడేళ్ల దర్శిత్ విషాదాంతం అందరి హృదయాలను కలచివేసింది. మండలంలోని పైడిమెట్ట గ్రామానికి చెందిన జొన్నకూటి వినోద్కుమార్ కుమారుడైన దర్శిత్ (3) చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ నెల 12న తమ ఇంటి డాబాపై ఆడుకుంటుండగా, పై నుంచి వెళుతున్న విద్యుత్ వైర్లు తగిలి బాలుడు షాక్కు గురయ్యాడు. దీంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాలుడ్ని చికిత్సకోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాబును కంటికి రెప్పలా చూసుకున్నారు. బాలుడి కాళ్లకు ఇన్పెక్షన్ సోకడంతో ఆపరేషన్ చేసి రెండు కాళ్లనూ తొలగించాల్సి వచ్చింది. ఈ సంఘటన అందరి గుండెలనూ పిండేసింది. బాలుడ్ని కాపాడేందుకు జీజీహెచ్ వైద్యుల బృందం చేయని ప్రయత్నం లేదు. మరోపక్క దాతలూ స్పందించారు. పెద్ద మనసుతో ఆర్థిక సహాయం అందించారు. పలు శాఖల అధికారుల తమ ఉదారతను చాటుకున్నారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. సుమారు రెండు వారాల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి దర్శిత్ శుక్రవారం సాయంత్రం తుది శ్వాస విడిచాడు. బాలుడి మృతితో పైడిమెట్ట గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. జొన్నకూటి వినోద్, చాందిని దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడైన అక్షిత్ యూకేజీ చదువుతున్నాడు. దర్శిత్ రెండో కుమారుడు. వినోద్ లారీ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చదవండి: (Yanamala Brothers: నాలుగు దశాబ్దాల చరిత్ర చెబుతున్నది ఇదే) హోం మంత్రి వనిత పరామర్శ శుక్రవారం ఉదయం హోంమంత్రి తానేటి వనిత కాకినాడ జీజీహెచ్కు వెళ్లి ఆర్ఐసీయూలో దర్శిత్ను పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడారు. బాలుడికి అత్యంత నాణ్యమైన వైద్యం అందించినట్లు తెలిపారు. బాలుడ్ని రక్షించేందుకు పీడియాట్రిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, అనస్థీయా నిపుణులు శ్రమించారని వివరించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని కుటుంబానికి భరోసా ఇచ్చారు. కుమారుడ్ని కాపాడాలంటూ రోదించిన దర్శిత్ తల్లి చాందినిని హోం మంత్రి అక్కున చేర్చుకొని ఓదార్చారు. ఆర్ఐసీయూలో బాలుడికి అందుతున్న చికిత్సను హోం మంత్రి తానేటి వనతి, కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ గీత, కౌడా ఛైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ నగర మాజీ మేయర్ సుంకర శివప్రసన్న పరిశీలించారు. సాయంత్రానికే బాబు మరణించాడనే దుర్వార్త మనసున్నవారిని కుదిపేసింది. బాలుడి కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు చూసి అందరూ చలించిపోయారు. -
కరెంటుతో జాగ్రత్త!.. ప్రాణాలు కోల్పోతున్న రైతులు, కూలీలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా నాలుగేళ్లలో 41,914 విద్యుత్ ప్రమాదాలు సంభవించగా.. మహారాష్ట్ర 10,698, ఉత్తరప్రదేశ్ 9,970, గుజరాత్ 3,767 ప్రమాదాలతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో అదే నాలుగేళ్లలో 2,922 ప్రమాదాలు జరిగాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వీటిని సైతం నివారించాలంటే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విద్యుత్ షాక్కు గరవుతున్నారు. కొన్ని జాగ్రతలు పాటిస్తే పెనుప్రమాదం నుంచి బయటపడవచ్చని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటించండి వ్యవసాయ పంపుసెట్లకు మోటార్ స్టార్టర్లు, స్విచ్లు ఉన్న ఇనుప బోర్డులకు విధిగా ఎర్తింగ్ చేయించాలి. తడి చేతులతో, నీటిలో నిలబడి విద్యుత్ మోటార్లను, స్విచ్లను, పరికరాలను తాకకూడదు. ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయడానికి విద్యుత్ అర్హత గల ఎలక్ట్రీషియన్ను పిలిపించాలి. పొలాల్లో తెగిపడిన, జారిపడి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు దూరంగా ఉండి.. 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంబంధిత విద్యుత్ సిబ్బందికి గానీ, గ్రామ సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ సహాయకులకు గానీ ఫిర్యాదు చేయాలి. పంటను జంతువుల బారినుంచి రక్షించేందుకు పెట్టే ఫెన్సింగులకు విద్యుత్ సరఫరా చేయకూడదు. పాడైన విద్యుత్ వైర్లను ఇన్సులేషన్ టేపుతో చుట్టాలి. వాహనాలపై విద్యుత్ తీగలు తగిలితే బయట పడేందుకు హాపింగ్ (గెంతుట, దుముకుట) విధానం అనుసరించాలి. అంతేతప్ప ఒక కాలు వాహనంలోనూ, మరో కాలు నేలపైనా ఉంచకూడదు. వర్షం వచ్చిన సమయంలో విద్యుత్ స్తంభాలను తాకరాదు. నీటిలో పడిన విద్యుత్ వైర్ల జోలికి వెళ్లకూడదు. స్తంభం, ట్రాన్స్ఫార్మర్ దగ్గర మూత్ర విసర్జన చేయకూడదు. విద్యుత్ స్తంభం నుంచి వ్యవసాయ మోటారుకు మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ దూరం ఉంటే గాలులు వీచినప్పుడు వాటి మధ్య ఉండే సర్వీస్ వైరు వదులై మోటారుపై ప్రభావం చూపుతుంది. విద్యుత్ స్తంభం నుంచి మోటారుకు కరెంటు నేరుగా సరఫరా కాకుండా మధ్యలో ఫ్యూజ్ బ్యాక్, స్టార్టర్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. మోటార్ వద్ద ఫ్యూజ్లు, ఇండికేటర్ బల్బులు, స్టార్టర్ను చెక్కపై బిగించుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇనుప డబ్బాపై బిగించకూడదు. భవనాలు, బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఉన్నట్టు గుర్తిస్తే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఇదీ చదవండి: ప్రమాదాల వేళ గోల్డెన్ అవర్లో స్పందించండి.. పోలీసుల సూచనలివీ -
అనంతపురం దుర్ఘటన.. విద్యుత్ శాఖకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరులో విద్యుదాఘాతం ఘటనపై అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని డిస్కంల పరిధిలో ఆడిట్ చేయాలని ఆదేశించారు. 2 వారాల్లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. ఇలాంటి సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో తక్షణమే గుర్తించాలన్నారు. సమగ్ర అధ్యయనం చేసి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గా హొన్నూరు వద్ద బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, అధికారులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. దర్గా హొన్నూరు గ్రామానికి చెందిన కమ్మూరి సుబ్బన్న అనే రైతు ఊరికి సమీపంలోని తన పొలంలో ఆముదం పంట సాగు చేశాడు. పంట దిగుబడిని తీసేందుకు బుధవారం ఉదయం 8.30 గంటలకు సొంత ట్రాక్టరులో గ్రామానికే చెందిన 14 మంది కూలీలను తీసుకుని వెళ్లాడు. వీరిలో ఎనిమిది మంది మహిళలు.. ఆరుగురు పురుషులు ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పని పూర్తయ్యింది. అదే సమయంలో వర్షం కూడా మొదలైంది. అయినా తిరుగు పయనమయ్యేందుకు సిద్ధమయ్యారు. కూలీలను ఎక్కించుకుని, ట్రాక్టర్ను రివర్స్ చేస్తుండగా.. పైనున్న 11 కేవీ విద్యుత్ తీగ షార్ట్సర్క్యూట్ కారణంగా తెగి ట్రాక్టరుపై పడింది. దీంతో వన్నక్క (52), రత్నమ్మ (40) అనే అత్తాకోడళ్లతో పాటు శంకరమ్మ (34), పార్వతి (48) అక్కడికక్కడే మృతి చెందారు. ముగ్గురు మహిళా, ఇద్దరు పురుష కూలీలకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని విజయనగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్ (విమ్స్)కు తరలించారు. వీరిలో సుంకమ్మ అనే మహిళా కూలీ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. ట్రాక్టర్ డ్రైవింగ్ చేస్తున్న రైతు సుబ్బన్న, ఐదుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు. చదవండి: (మృత్యుపాశం.. కూలీల ట్రాక్టర్పై తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ) -
ఊరేగింపులో విషాదం.. కరెంట్ షాక్తో ఆరుగురు మృతి
లక్నో: ఉత్తర్ప్రదేశ్లోని బహ్రాయిచ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం విషాద ఘటన జరిగింది. ఇనుప రాడ్డు హైటెన్షన్ విద్యుత్తు తీగకు తగిలి కరెంట్ షాక్తో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. మృతుల్లో ఐదుగురు మైనర్లు ఉన్నారని పోలీసులు తెలిపారు. జిల్లాలోని మసుపుర్ గ్రామంలో సాయంత్రం 4 గంటలకు ఈ దుర్ఘటన జరిగింది. గ్రామస్థులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపులో ఉపయోగించిన బండిలో ఏర్పాటు చేసిన ఇనుప రాడ్ హైఓల్టేజ్ విద్యుత్తు తీగకు తగిలి కరెంట్ సరఫరా అయినట్లు స్థానికులు తెలిపారు. కరెంట్ షాక్తో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆ తర్వాత మరో బాలుడు అరఫాత్(10) ఆసుపత్రిలో మృతి చెందగా.. మృతుల సంఖ్య ఆరుకు చేరినట్లు వెల్లడించారు. మృతుల్లో సుఫియా(12), ఇల్యాస్(16), టబ్రేజ్(16), అష్రఫ్ అలీ(30)లుగా గుర్తించారు. పలువురు గ్రామస్థులకు సైతం కరెంట్ షాక్ తగిలినట్లు చెప్పారు. ఈ విషాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. గాయపడిన వారికి అవసరమైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదీ చదవండి: ఢిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. ‘ఆప్’ మంత్రి రాజీనామా -
విషాదం: కుటుంబాన్ని కాటేసిన కరెంటు.. వైరు అంచు విద్యుత్ ఫ్యూజ్కు తాకడంతో..
కామారెడ్డి: వెలుగులు నింపే విద్యుత్ ఓ కుటుంబంలో చీకటి నింపింది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. రెండేళ్ల బాబు అనాథయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన ఎండీ అహ్మద్ (40) ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. అతడికి భార్య పర్వీన్ బేగం (32), కూతురు మాహీన్ (6), కుమారులు అద్నాన్ (3), ఫైజాన్ (2) ఉన్నారు. ఫైజాన్ సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. బట్టలు ఆరేయడానికి వారు నివసించే రేకుల ఇంటి ముందు గోడకు రెండువైపులా మేకులు కొట్టి వైరుకట్టారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పర్వీన్ బేగం దుప్పటిని వైరుపై ఆరేస్తుండగా బరువు కారణంగా వైరు కిందకు జారింది. వైరు అంచుకు కొద్దిదూరంలోనే విద్యుత్ ఫ్యూజ్ ఉంది. దానికి వైరు తాకడంతో విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో పర్వీన్ బేగం విద్యుదాఘాతానికి గురైంది. ఆమె అరుపు విని ఇంట్లో ఉన్న అహ్మద్, పిల్లలు బయటకు పరుగెత్తుకొచ్చారు. ఆమెను కాపాడబోయే ప్రయత్నంలో ఒకరి వెంట మరొకరు విద్యుదాఘాతానికి గురై నలుగురూ మృతిచెందారు. చుట్టుపక్కలవారు గమనించి విద్యుత్శాఖ అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. ఆయన ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దీన్తో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారని గోవర్ధన్ తెలిపారు. -
విషాదం: గడ్డివాముకు నిప్పు.. పశువులను కాపాడబోయి.. వదిన, మరిది..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పశువులను కాపాడబోయి వది న, మరిది కరెంట్ షాక్తో ప్రా ణాలు కోల్పోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండ లం ఎర్రగడ్డతండాలో ఈ ఘట న జరిగింది. గురువారం రాత్రి తండాలో బానోతు నీల (37), బానోతు రవి(34) ఇంటికి సమీపంలో ఉన్న ట్రా న్స్ఫార్మర్ నుంచి మంటలు వెలువడి గడ్డివాముకు నిప్పంటుకుంది. దీంతో సమీపంలోని పాకలో ఉన్న పశువులను మంటల నుంచి కాపాడేందుకు నీల, రవి వెళ్లా రు. అదే సమయంలో మంటలకు విద్యుత్ తీగలు తెగి వారిపై పడ్డాయి. తీగలు కాళ్లకు చుట్టుకోవడంతో కరెంట్ షాక్కు గురై ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గ్రామస్తులు, బంధువులు శుక్రవారం ఉదయం మృతదేహాలతో వీర్నపల్లి సబ్స్టేషన్ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని మూడు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అక్కడికి చేరుకొని కలెక్టర్, సెస్ ఎండీతో మాట్లాడారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం, ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుతుండగా.. అధికారుల నిర్లక్ష్యమే!
మరిపెడ రూరల్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. గ్రామమంతా షార్ట్సర్క్యూట్ వస్తుందని చెప్పినా వారు పట్టించుకోలేదు. వెరసి కుక్కర్లో అన్నం వండుతుండగా విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్జేజితండా పరిధిలోని బుడ్డతండా(మెగ్యాతండా)లో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. షార్ట్సర్క్యూట్ వల్ల కొద్ది రోజులుగా తండాలోని ఇళ్లలో గల గృహోపకరణాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. సమస్యను పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తండాకు చెందిన భూక్యా సునీత(25) ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. తన భార్య మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి భర్త భూక్యా సంతోష్ ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఏడాదిన్నర పాప ఉంది. తల్లి కోసం రోదిస్తున్న చిన్నారిని చూసి పలువురు కన్నీటి పర్యాంతమైయ్యారు. (చదవండి: అయ్యో భగవంతుడా.. మేం ఏ పాపం చేశాం.. ముగ్గురు కొడుకులు రోడ్డు ప్రమాదాల్లోనే..) -
ఇంటి స్లాబ్ వేస్తుండగా విద్యుదాఘాతం
ధారూరు/వికారాబాద్: ఇంటికి స్లాబ్ వేయిస్తున్న క్రమంలో ఇంటి యజమాని, మేస్త్రీకి విద్యుదాఘాతం కావడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ధారూరు మండల పరిధిలోని కేరెళ్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ధారూరు మండంల కేరెళ్లి గ్రామనికి చెందిన చంద్రారెడ్డి(55) గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి ఆదివారం స్లాబ్ వేయించారు. కూలీలంతా కిందకు దిగినప్పటికీ పైన సెంట్రింగ్ మేస్త్రీ సురేష్ మాత్రం చంద్రారెడ్డి సూచన మేరకు పైనే ఉన్నాడు. ఇంటిపైకీ ఎవరు ఎక్కకుండా కింద ఉన్న ఇనుపరాడ్ను మెట్లపై అడ్డంగా పెట్టేందుకు పైకీ తీసుకెళ్లాడు చంద్రారెడ్డి. ఇనుపరాడ్ను అడ్డంగా పెట్టేందుకు ప్రయతి్నస్తున్న సమయంలో పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు ఇనుపరాడ్ తగిలింది. యజమానిని రక్షించబోయిన మేస్త్రీ సురేష్ కూడా షాక్కు గురియ్యాడు. విద్యుత్ షాక్తో ఇద్దరూ భవనం పైనుంచి కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిని మొదట వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అధికారుల తీరుపై మండిపడ్డ గ్రామస్తులు.. కొత్త ఇంటి నిర్మాణానికి స్లాబ్ వేస్తున్నామని, విద్యుత్ సరఫరాను నిలిపివేయాలనీ చంద్రారెడ్డి విద్యుత్ అధికారులకు మొరపెట్టుకున్నారు. వారెవరు వినలేరని, గత్యంతరం లేక జాగ్రత్తగా స్లాబ్ వేయించిన ఇనుపరాడ్ మెట్లకు అడ్డంగా పెట్టేందుకు ప్రయతి్నస్తూ షాక్కు గురిౖయె ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వాపోయారు. అధికారుల నిర్లక్షమే చంద్రారెడ్డి, మేస్త్రీ ప్రమాదానికి కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్ మరో ఘటనలో బాలుడికి గాయాలు.. దోమ: విద్యుదాఘాతంతో బాలుడికి గాయాలైన సంఘటన మండల పరిధిలోని గుండాల్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు ఆదివారం పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన కోళ్ల రవి, చెన్నమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్ చెయ్యి విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యుదాఘతానికి గురై కొట్టుకుంటుండంగా మరో బాలుడు పట్టుకునే ప్రయత్నం చేశాడు. అతడికి కూడా విద్యుత్షాక్ తగలడంతో పక్కకు జరిగి కేకలు వేశాడు. అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన జనుమాండ్ల వెంకట్రెడ్డి గమనించి వెంటనే కర్రతో కొట్టగా శ్రీకాంత్ కిందపడిపోయాడు. వెంటనే కొస్గీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా రెండు నెలల క్రితం గ్రామస్తులకు ఆసరా పెన్షన్లు, రేషన్ బియ్యం అందించేందుకు పాఠశాల ఆవరణలో విద్యుత్ సరఫరా తీసుకుని అలాగే వదిలివేశారు. అతుకులతో కూడిన విద్యుత్ కనెక్షన్ తొలగించాలని గ్రామస్తులు చెప్పిన ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవ్వరూ పట్టించుకలేదని గ్రామస్తులు తెలిపారు. -
కరెంట్ షాక్తో ఫుడ్ డెలివరీ బాయ్ మృతి
అబిడ్స్: అర్ధరాత్రి వేళ భారీ వర్షంలో విద్యుత్ వైరు తెగిపడడంతో స్విగ్గి డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన షాహినాయత్గంజ్ పోలీస్స్టేషన్ పరిదిలోని గోడేకికబార్ ప్రధాన రహదారిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... పాతబస్తీ చార్మినార్ ప్రాంతంలో నివసించే మహ్మద్ ముస్తాఫ్ఉద్దీన్(40) స్విగ్గీలో డెలివరీ బాయ్గా పని చేస్తున్నాడు. గోషామహల్ పాన్మండి నుండి మంగళ్హాట్ ప్రాంతానికి గురువారం అర్ధరాత్రి వెళ్తుండగా భారీ వర్షం కురుస్తుంది. భారీ వర్షానికి, ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగి అతనిపై పడ్డాయి. దీంతో విద్యుదాఘాతానికి గురైన ముస్తాఫ్ ఉద్దీన్ అక్కడిక్కడే మృతిచెందాడు. సమీపంలో ఉన్న కొంత మంది స్థానికులు షాహినాయత్గంజ్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ అజయ్కుమార్, ఎస్ఐ కిషన్లు విద్యుత్ అధికారులను రపించి విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. దాదాపు 3 గంటల పాటు శుక్రవారం తెల్లవారు జాము వరకు గోడేకికబర్, మంగళ్హాట్ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ట్రాన్స్జెండర్తో పెళ్లి.. కట్నంకోసం వేధింపులు న్యాయవాదుల హత్య: ఆడియో క్లిప్పింగ్ వైరల్ -
స్తంభంపైనే మృత్యువాత
శివ్వంపేట (నర్సాపూర్): బోరుబావి సర్వీస్ వైరు కనెక్షన్ ఇచ్చేందుకు స్తంభం ఎక్కిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గోమారం గ్రామానికి చెందిన గూడెపు లక్ష్మణ్(40) విద్యుత్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. విద్యుత్ సిబ్బంది అందుబాటులో లేనప్పుడు స్థానిక రైతులకు ఏదైనా సమస్యలు తలెత్తితే లక్ష్మణ్తో చేయిస్తుంటారు. అదే గ్రామానికి చెందిన రైతు అబ్దుల్ అలీ బోరు మోటారు సర్వీస్ వైర్ కనెక్షన్ ఇచ్చేందుకు లక్ష్మణ్ని తీసుకెళ్లాడు. కాగా, పెద్దగొట్టిముక్ల కు చెందిన రైతు అనిల్ ఆదివారం తన వరి పంటను కోసేందుకు కోత యంత్రం రావడంతో విద్యుత్ వైర్లు కిందికి ఉన్నాయని ట్రాన్స్ఫార్మర్ను బంద్ చేసి, ఆన్ఆఫ్ హ్యాండిల్కు టవల్ చుట్టి ఇంటికి వెళ్లాడు. మరుసటి రోజు పొలానికి వచ్చిన అనిల్.. ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేయగా.. అప్పటికే లక్ష్మణ్ విద్యుత్ స్తంభంపై ఉండటంతో ప్రాణాలు కోల్పోయాడు. -
మృత్యుపాశాలు; ఆరేళ్లలో 3 వేల మంది మృతి
హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ తీగలు ప్రజల పాలిట మృత్యుపాశాలవుతున్నాయి. ఆరేళ్ల వ్యవధిలో 3 వేల మందిపైగా విద్యుదాఘాతాలకు బలైపోయారు. ఉత్తర తెలంగాణలోని 16 జిల్లాల్లో 2014-2020 మధ్య కాలంలో విద్యుత్ సంబంధిత ప్రమాదాల బారిన పడి 3,008 మంది ప్రాణాలు కోల్పోయారు. కేవలం 1,197 కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ పరిహారం అందడం గమనార్హం. తెలంగాణ ఉత్తర విభాగం విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్ఎన్పీడీసీఎల్) సమాచార హక్కు చట్టం కింద ఈ వివరాలు వెల్లడించింది. (వచ్చే జాతరకు ఉంటామో, లేదో !?: ఏఎస్పీ) విద్యుత్ ప్రమాదాల బారిన పడిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయం పరిహారం చెల్లించాలని డిస్కంలను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(టీఎస్ఈఆర్సీ) స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విద్యుత్ పంపిణీ సంస్థ సిబ్బంది, అధికారుల నిర్లక్క్ష్యంతో తరుచుగా ప్రజలు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తీగలను సరిగా అతికించకపోవడం, లైవ్ వైర్లు, స్తంభాల నుంచి లీకేజీ, విద్యుత్ సరఫరాలోని లోపాల కారణంగా విద్యుత్దాఘాతాలు సంభవిస్తున్నాయి. కరెంట్ షాక్తో మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారం అందజేసే ముందు అవసరమైతే అంతర్గత విచారణ చేపట్టవచ్చని డిస్కంలకు టీఎస్ఈఆర్సీ సూచించింది. 2013 వరకు 2 లక్షలుగా ఉన్న పరిహారాన్ని 2015లో నాలుగు లక్షలకు ప్రభుత్వం పెంచింది. పలు సవరణల తర్వాత 2018లో పరిహారాన్ని 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. మృతుల్లో చాలా మంది సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారు కావడంతో పరిహారాన్ని పొందడంలో వారి కుటుంబ సభ్యులు అవాంతరాలను ఎదుర్కొవాల్సి వస్తోంది. పరిహారం కోసం చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలు లెక్కలేనన్ని కష్టాలు పడుతున్నాయని సామాజిక కార్యకర్త సుధీర్ జలగం తెలిపారు. ఆర్టీఐ కింద విద్యుత్ ప్రమాద వివరాలను ఆయన సేకరించారు. ‘బాధితుల కుటుంబాలు ఈ మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి చట్టపరమైన వారసుల ధ్రువీకరణ పత్రాలు, ఇతర రుజువులను అందించాల్సిన అవసరం ఉంది, కాని అధికారులు వాటిని జారీ చేయడానికి నెలల సమయం తీసుకుంటూ, ప్రక్రియను ఆలస్యం చేస్తున్నార’ని ఆయన ఆరోపించారు. డిస్కంలు భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నాయని, తరచుగా తనిఖీలు నిర్వహించడం లేదని తెలిపారు. (మళ్లీ నగరం బాట పడుతున్న వలసజీవులు) టీఎస్ఎన్పీడీసీఎల్ పరిధిలో 2014-2020 మధ్య కాలంలో వరంగల్ రూరల్ జిల్లాలో అత్యధికంగా 178 విద్యుత్ ప్రమాద సంబంధిత మరణాలు సంభవించాయి. తర్వాత స్థానాల్లో కామారెడ్డి(175), నిర్మల్(164), మహబూబాబాద్(163), జగిత్యాల్(160), నిజామాబాద్(158), పెద్దపల్లి(139), కరీంనగర్(130), మంచిర్యాల(129), ఆదిలాబాద్(128), ఖమ్మం(128), భూపాలపల్లి(122), భదాద్రి-కొత్తగూడెం(119), జనగాం(113), వరంగల్ అర్బన్(60), ఆసిఫాబాద్(53) ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు, విద్యుత్ సిబ్బంది తప్పనిసరిగా ఎప్పటికప్పుడు భద్రతా ప్రమాణాలు, జాగ్రత్తలు అమలు చేసి ఉంటే ఈ మరణాలు సంభవించేవి కాదని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి టి. సాగర్ అన్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్క్ష్యం కారణంగానే రైతులు బలైపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాతే దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు తప్ప ముందుస్తు రక్షణ చర్యలు శూన్యమని విమర్శించారు. ఉత్తర తెలంగాణలోని 16 జిల్లాల్లో గత కొనేళ్లుగా విద్యుత్ ప్రమాద మరణాలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2014-15లో 210 మరణాలు నమోదు కాగా, 2017-18లో 537 మంది మృతి చెందారు. 2019-20 నాటికి ఈ సంఖ్య 681కి పెరగడం ప్రమాదాల తీవ్రతను తెలియజేస్తోంది. -
చెట్టెక్కడంతో ప్రాణాలు విడిచిన చిరుత!
జైపూర్: నీటి జాడ కోసం వెతుకున్న క్రమంలో ప్రమాదం పడిన ఓ చిరుత ప్రాణాలు విడిచింది. ఈ ఘటన రాజస్థాన్లోని భిల్వారా జిల్లా కరేడా ప్రాంతంలోని రాంపూర్ గ్రామంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. నీటి జాడను వెతుక్కుంటూ చిరుత రాంపూర్ గ్రామానికి చేరుకుంది. ఆక్రమంలోనే అది చెట్టుపైకి ఎక్కింది. అయితే, సమీపంలోని గ్రానైట్ గనికి విద్యుత్ సరఫరా చేసే హైటెన్షన్ విద్యుత్ వైరు తగలడంతో చిరుత అక్కడికక్కడే మృతిచెందిందని జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ దేవేంద్ర ప్రతాప్సింగ్ తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించామని చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని, పోస్టుమార్టం నివేదికలో అన్ని విషయాలు వెల్లడవుతాయని అన్నారు. కాగా, వేసవిలో ఆహారం కోసం అన్వేషిస్తూ భిల్వారా ప్రాంతంలో వన్యప్రాణులు సంచరిస్తుంటాయి. తాజాగా మృతి చెందిన చిరుత కూడా కొన్ని రోజులుగా స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. (చదవండి: చంటి బిడ్డలా మొసలిని మోస్తున్నాడు) -
ట్రాక్టర్ ప్రమాదం.. కరెంట్ షాక్ కూలీల దుర్మరణం
కాసేపట్లో ఇల్లు చేరతామంటూ మిర్చి కూలీలంతా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం. ట్రాక్టర్లోంచి కొందరు ఎగిరిపడ్డారు. మరికొందరు ట్రాలీలోనే ఉండిపోయారు. వారిపై విద్యుత్ తీగలు పడ్డాయి. కేకలు.. అరుపులు.. ఏం జరిగిందో అర్థం కాకముందే ఘోరం జరిగిపోయింది. నాగులుప్పలపాడు/ఒంగోలు సబర్బన్: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మాచవరం గ్రామం సమీపంలో గురువారం ఘోర ప్రమాదం సంభవించింది. కుమ్మరిడొంక వద్ద మిర్చి కూలీలతో వస్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో అక్కడికక్కడే 9 మంది దుర్మరణం పాలయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మృతి చెందాడు. మృతుల్లో ఏడుగురు మహిళలున్నారు. రాపర్ల రెవెన్యూ గ్రామ పరిధిలోని పొలాల్లో మిర్చి కోతలకు వెళ్లిన కూలీలు ట్రాక్టర్లో సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ► మాచవరం గ్రామానికి చెందిన నల్లూరి చెంచయ్య తాను కౌలుకు తీసుకున్న 3 ఎకరాల పొలంలో మిర్చి కోతలకు 23 మంది కూలీలను తన ట్రాక్టర్లో ఎక్కించుకుని మధ్యాహ్నం పొలానికి వెళ్లాడు. ఈ కూలీలంతా ఉదయం ఉపాధి పనులకు వెళ్లి వచ్చారు. ► ఇంటికి తిరిగి వస్తుండగా అమ్మనబ్రోలు–నాగులుప్పలపాడు మధ్య హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉన్న స్తంభాన్ని ట్రాక్టర్ అదుపు తప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ తెలిపారు. సంఘటనా స్థలంలో మృతి చెందింది వీరే ► పీకా కోటేశ్వరమ్మ (50), నూకతోటి లక్ష్మమ్మ (65), కాకుమాను రమాదేవి (55), రమాదేవి కొడుకు, కాకుమాను శివ (17), కాకుమాను కుమారి (60), కాకుమాను రవీంద్ర (మహిళ– 40), గోళ్ల రవిశంకర్ (20), కాకుమాను మౌనిక (18), కాకుమాను అమూల్య (18). ► పొలం కౌలుదారు, ట్రాక్టర్ డ్రైవర్, యజమాని నల్లూరి చెంచయ్య (48), కాకుమాను భాగ్యవతిలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్కు తరలించగా, చికిత్స పొందుతూ చెంచయ్య మృతి చెందాడు. రోదనలు మిన్నంటిన కుమ్మరి డొంక ► ప్రమాదం జరిగిన కుమ్మరిడొంకలో రోదనలు మిన్నంటాయి. రాపర్ల రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న మాచవరానికి చెందిన మిర్చి కూలీలు ఈ ప్రమాదంలో మృతి చెందడంతో మాచవరం, రాపర్ల గ్రామాల్లోని వారి కుటుంబ సభ్యులు, బంధువులు,పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ► ప్రమాదం జరిగిన ట్రాక్టర్ ట్రక్కులోనే విగతజీవులై పడివున్న మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. విద్యుత్ తీగల రూపంలో మృత్యువు కాటేసిందంటూ కన్నీరు మున్నీరుగా రోదించారు. మృతదేహాలపై పడి తల్లడిల్లిపోయారు. మృతులంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు. వెంటనే స్పందించిన పరిసర ప్రాంతాల రైతులు ► ప్రమాదం జరిగిందని గమనించిన కుమ్మరిడొంక పరిసర ప్రాంతాల్లో పొలం పనులు చేసుకుంటున్న రైతులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులైన నల్లూరి చెంచయ్య (ఆసుపత్రిలో చనిపోయాడు), కాకుమాను భాగ్యవతిని, స్వల్ప గాయాలైన మరో 11 మందిని వేరే ట్రాక్టర్లో చికిత్స నిమిత్తం తరలించారు. ► నాగులుప్పలపాడు ఎస్ఐ జి సోమశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని జిల్లా ఎస్పీ సిద్ధార్ద్ కౌశల్, ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్ ప్రసాద్కు సమాచారం అందించారు. జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్–1 జేవీ మురళి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు. సీఎం దిగ్భ్రాంతి.. సహాయక చర్యలకు ఆదేశం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలో ట్రాక్టర్ ప్రమాదంలో కూలీలు మరణించిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సహాయం అందించాలని కలెక్టర్ను ఆదేశించారు. క్షతగాత్రులకు మంచి వైద్యం అందించాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని, బాధిత కుటుంబాలను పరామర్శించాలని జిల్లా మంత్రులను సీఎం ఆదేశించారు. బాధితులను ఆదుకుంటాం : మంత్రి బాలినేని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకుంటామని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ఘటన తనను కలిచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే ఆయన అధికారులను అప్రమత్తం చేసి ఘటనాస్థలానికి పంపించారు. మృతుల కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల పరామర్శ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు కాకుమాను భాగ్యలక్ష్మి, నల్లూరి చెంచయ్యలను జీజీహెచ్ అత్యవసర విభాగానికి తరలించారు. చెంచయ్యకు కాలు తెగిపోగా శరీరంలో సగభాగం వరకు పూర్తిగా కాలిపోయింది. భాగ్యలక్ష్మి శరీరం కూడా 70 శాతం కలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చికిత్స పొందుతూ కాసేపటి తర్వాత చెంచయ్య మృతి చెందాడు. భాగ్యలక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. ఆర్ఎంఓ వేణుగోపాలరెడ్డి పర్యవేక్షణలో వైద్యం అందిస్తున్నారు. కాగా, అంతకు ముందు క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ పోల భాస్కర్, జేసీ మురళి, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్బాబు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కనకారావు మాదిగతో పాటు మద్దిపాడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇనగంటి పిచ్చిరెడ్డి, వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లమాలపు కృష్ణారెడ్డి తదితరులు పరామర్శించారు. వైద్యం అందుతున్న తీరును కలెక్టర్ భాస్కర్, జేసీ వెంకట మురళి వాకబు చేశారు. ప్రమాద స్థలం వద్ద రోదిస్తున్న మృతుల బంధువులు -
తప్పిన పెను ప్రమాదం.. 60 మంది సేఫ్!
సాక్షి, రాయపర్తి : 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. బస్సు 11 కేవీ విద్యుత్ తీగలను తాకడంతో టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. అదే సమయంలో విద్యుత్ తీగలు కూడా తెగిపడడంతో.. ట్రాన్స్ఫార్మర్ ఫీజు కొట్టేసి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈఘటన వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాలు.. రాయపర్తి మండలం తిరుమలయ్య పల్లి శివారులో పాలకుర్తి సీఐ వాహనం ఢీకొని దంపతులు బొమ్మకంటి రాజు (40), బొమ్మకంటి రాణి (33) మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. వారితో పాటు బైక్పై వెళ్తున్న రాణి సోదరి కవిత తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈనేపథ్యంలో.. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై మృతదేహాలతో ధర్నాకు దిగారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రహదారికి రెండు వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో వరంగల్ నుంచి తొర్రూర్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును.. డ్రైవర్ ఇరుకైన మార్గం గుండా పోనిచ్చేందుకు యత్నించాడు. ఆ పక్కనే ఉన్న విద్యుత్ వైర్లను డ్రైవర్ గమనించకపోవడంతో.. బస్సు 11 కేవీ విద్యుత్ తీగలకు తాకింది. విద్యుత్ ప్రసరించడంతో బస్సు టైర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. విద్యుత్ తీగలు కూడా తెగిపోవడంతో.. ట్రాన్స్ఫార్మర్ ఫీజు కొట్టేసింది. దాంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది వెంటనే ఆ రూట్లో విద్యుత్ నిలిపివేయడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ అజాగ్రత్తపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
11 కేవీ విద్యుత్ లైన్కు స్టాండ్ తగలడంతో..
సాక్షి, గుంటూరు : చిలకలూరిపేట మండలం తాతపూడికొండలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్ బంక్లోని విద్యుత్ దీపాలు రిపేర్ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మౌలాలీ, శేఖర్, శ్రీనివాసరావు అనే ముగ్గురు కార్మికులు మరణించారు. విద్యుత్ దీపాలను బాగు చేసేందుకు ఐరన్ స్టాండ్ను తీసుకెళ్తుండగా.. అది 11 కేవీ విద్యుత్ లైన్కు తగలడంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. -
పాఠశాలలో విద్యుత్ వైరు తగిలి విద్యార్థి మృతి
సాక్షి, నిజామాబాద్ : కోటగల్లీ ప్రభుత్వం పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ వైరు తగిలి ఐదో తరగతి చదువుతున్న అయన్ ప్రాణాలు విడిచాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నిర్లక్ష్యం కారణంగా చిన్నారి మృతి చెందాడని గ్రాహస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూలు వద్ద ఆందోళనకు దిగారు. ఘటనపై విచారించేందుకు పాఠశాలకు వచ్చిన జిల్లా విద్యాధికారి (డీఈఓ)ను విద్యార్థి సంఘాలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. సెక్యూరిటీ మధ్య డీఈవోను పోలీసులు బయటకు పంపించారు. -
కాటేసిన కరెంటు
విద్యుత్ షాక్తో రైతు మృతి చెందాడు. ఈ విషాద ఘటన దేవరాపల్లి మండలం వేచలం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. రైతు వేచలపు వెంకటరావు(60) తన పొలంలోని మోటా రుకు సమీపంలో గడ్డి కోస్తుండగా విద్యుత్ తీగ తగిలి షాక్కు గురై కన్నుమూశాడు. సాక్షి, దేవరాపల్లి(మాడుగుల): వేచలం గ్రామంలో విద్యుత్ షాక్తో ఓ రైతు మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వేచలపు వెంకటరావు(60)అనే రైతు తన పొలంలో గల వ్యవసాయ మోటారుకు సమీపంలో ఆదివారం సాయంత్రం గడ్డి కోస్తున్నాడు. అయితే వ్యవసాయ మోటారుకు విద్యుత్ సరఫరా చేసే వైరు గడ్డిలో ఉండడాన్ని గుర్తించని అతను గడ్డితో కలిపి వైర్లను కొడవలితో కోసేయడంతో విద్యుత్షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో పది నిముషాల్లో త్రిఫేజ్ విద్యుత్ సరఫరా నిలిపి వేసే సమయంలో విద్యుత్ షాక్కు గురై వెంకటరావు మృతిచెందడాన్ని కుటుంబసభ్యులతో పాటు గ్రామస్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. గడ్డి కోసుకొస్తానని చెప్పి ఇంటి నుంచి బయలు దేరిన వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు వెంకటరావుకు భార్య నాగభూషణమ్మ, వివాహితులైన నలుగురు కుమార్తెలు, అవివాహితుడైన కుమారుడు నర్సింహనాయుడు ఉన్నారు. వెంకటరావు మృతితో వేచలం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంఘటన స్థలాన్ని ట్రాన్స్కో ఏఈ కె. శంకరరావు పరిశీలించి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చోడవరం తరలించారు. బాధిత కుటుంబ సభ్యులను స్థానిక వైఎస్సార్సీపీ నాయుకులు నాగిరెడ్డి శఠారినాయుడు, రెడ్డి బలరాం తదితరులు పరామర్శించారు. -
జెండా స్తంభానికి కరెంట్; ముగ్గురు చిన్నారుల మృతి
సాక్షి, ప్రకాశం : జిల్లాలోని సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు గాయపడ్డారు.ఈ ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామంలోని జెండా స్తంభాన్ని పట్టుకుని ఆడుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతి చెందిన విద్యార్థులు షేక్ పఠాన్ గౌస్, షేక్ హసన్ బుడే , పఠాన్ అమర్ ఐదో తరగతి చదువుతున్నట్టు తెలిసింది. ముగ్గురూ పదకొండేళ్ల వయసు వారేనని కుటుంబ సభ్యులు తెలిపారు. -
గజరాజుల మరణమృదంగం
అడవిని దాటి వస్తున్న గజరాజులకు ప్రాణగండం తప్పడం లేదు. అడవిలో మేత, నీరు లేకపోవడంతో పొలాల బాట పడుతున్నాయి. సక్రమంగా చేపట్టని ఎలిఫెంట్ ట్రెంచ్లు, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తాజాగా ఓ గున్న ఏనుగు ప్రాణం పోయేందుకు కారణాలయ్యాయి. ఈ ఘటన పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గొబ్బిళ్లకోటూరు మున్సిపల్ డంపింగ్ యార్డు వద్ద శనివారం రాత్రి చోటుచేసుకోగా, ఆదివారం ఉదయం వెలుగుచూసింది. సాక్షి, పలమనేరు: పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో 35కిపైగా ఏనుగులు గుంపులుగా సంచరిస్తున్నాయి. అడవిలో తగిన మేత, నీరులేక కొన్నాళ్లుగా రైతుల పంటలపై పడుతున్నాయి. ఏనుగులు అడవిలోంచి రాకుండా అటవీ శాఖ ఎలిఫెంట్ ట్రెంచ్లను గత ప్రభుత్వంలో తవ్వించింది. కాంట్రాక్టర్లు రాళ్లు, వాగులున్న చోట ఈ పనులు చేపట్టలేదు. ఈ క్రమంలో ఏనుగులు ఆ మార్గాల్లో వచ్చి వెళుతున్నాయి. శనివారం రాత్రి ఏనుగుల గుంపు డంపింగ్ యార్డు పక్కనుంచి సుబ్రమణ్యంకు చెందిన పొలంలోకి ప్రవేశించాయి. అక్కడి మల్బరీతోటలో కాసేపు తిరిగి అడవిలోకి వెళ్లేందుకు వెళుతూ పొలం గట్టెక్కే ప్రయత్నంలో పక్కనే తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను గున్న ఏనుగు ముట్టుకోవడంతో మృతిచెందింది. ఏనుగుల ఘీంకారాలతో.. ఆదివారం ఉదయం పొలం వద్దకెళ్లిన రైతు సుబ్రమణ్యం ఏనుగుల ఘీంకారాలు విని కాస్త దూరం నుంచి చూడగా ఏనుగు మృతిచెందిన విషయాన్ని గుర్తించాడు. జరిగిన విషయాన్ని స్థానిక అటవీ శాఖకు తెలిపాడు. ఎఫ్ఆర్వో మదన్మోహన్రెడ్డి, సిబ్బంది, ట్రాకర్స్ అక్కడికి చేరుకున్నారు. అప్పటికి బిడ్డ వద్ద తల్లి ఏనుగు తల్లడిల్లుతోంది. రంగంలోకి దిగిన ట్రాకర్స్ తల్లి ఏనుగును టపాసులు పేల్చుతూ సమీపంలోని అడవిలోకి మళ్లించారు. ఆపై ఏనుగు మృతిచెందిన ప్రదేశానికి వెళ్లి మృతికి కారణాలను గమనించారు. తక్కువ ఎత్తులో ఉన్న కరెంటు తీగల కారణంగానే మృతిచెందిందని నిర్ధారించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. తల్లడిల్లిన తల్లి ఏనుగు శనివారం రాత్రి గున్న ఏనుగు మృతిచెందగానే తల్లి ఏనుగుతో సహా మిగిలిన ఏనుగులు దా న్ని లేపేందుకు చాలా ప్రయత్నించినట్టు తెలు స్తోంది. ఆదివారం ఉదయానికి అన్ని ఏనుగులు అడవిలోకి వెళ్లినా తల్లి ఏనుగు మాత్రం బిడ్డను వదిలిపోలేదు. ట్రాకర్స్ దాన్ని అడవిలోకి మళ్లించి నా ఘటనా స్థలానికి దగ్గరలో ఉంటూ నాలుగైదుసార్లు ఘీంకారాలు చేస్తూ బిడ్డవద్దకు పరుగులు పెడుతూ రాసాగింది. తల్లి ఏనుగు కళ్లలో కారుతున్న కన్నీటిని చూసిన జనం ఆవేదన చెందారు. తల్లి ప్రేమను చూసి కన్నీటిపర్యంతమయ్యారు. పీఎం చేస్తుండగా ఏనుగుల ఘీంకారాలు విషయం తెలుసుకున్న డీఎఫ్ఓ సునీల్కుమార్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తిరుపతి జూ నుంచి వచ్చిన డాక్టర్ తోయిబాసింగ్, స్థానిక వెటర్నరీ డాక్టర్ చిట్టిబాబు తదితరులు మృతిచెందిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనా స్థలం నుంచి ఏనుగును తరలించినప్పటి నుంచి పీఎం పూర్తయ్యేదాకా అక్కడికి సమీపంలో ఏనుగులు ఘీంకరిస్తూ, తల్లి తచ్చాడుతూ కనిపించాయి. రూ.2.61కోట్లు పెట్టినా నెరవేరని లక్ష్యం పలమనేరు కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీలో ఏనుగులు అడవిలోంచి బయటకు రాకుండా 142 కి.మీలో రూ.2.61కోట్లతో ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్ల నిర్మాణం సాగింది. అయితే రాళ్లు, వాగులున్న చోట సంబంధిత కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదు. ఈ మార్గాల్లో ఏనుగులు అడవిలోంచి వెలుపలకు వచ్చేస్తున్నాయి. మట్టి మెత్తగా ఉన్న చోట్ల ఏనుగులు వీటిని పూడ్చి బయటకొస్తున్నాయి. ఇన్ని కోట్లు వెచ్చించినా ఫలితం లేకుండా పోయిందనే విమర్శలున్నాయి. సమస్య పరిష్కారానికి చర్యలు జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఎఫ్ఓ సునీల్కుమార్రెడ్డి తెలిపారు. ఆదివారం కరెంట్ షాక్తో మృతి చెందిన ఏనుగును ఆయన పరిశీలిస్తుండగా మంజునాథ్ అనే రైతు తనకు నష్టపరిహారం అందలేదని అధికారులను విన్నవించారు. దీనిపై మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మైగ్రేటెడ్ ఏనుగులు 36 దాకా ఉన్నాయన్నారు. వాటికి ఇక్కడి చిట్టడవులు సురక్షితం కాదన్నారు. వాటికి అడవిలో తగిన మేత, నీరులేక అడవిని దాటి వెళుతున్నాయని తెలిపారు. ఏనుగుల సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా ఎలిఫెంట్ ట్రాకర్ల సంఖ్యను పెంచుతామన్నారు. రెండేసి కిలోమీటర్లలో ఇద్దరేసి పహారా కాసేలా చూస్తామన్నారు. అడవిలో ఏనుగులకు నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలిఫెంట్ ట్రెంచ్లు ఎక్కడ ఏర్పాటు చేయలేదో ఆ వివరాలను తెప్పించి అక్కడ ఏమి చేయాలో చూస్తామన్నారు. 2014 నుంచి 1,514మంది రైతులకు సంబంధించి రూ.74లక్షలు పరిహారం పంపిణీ చేశామన్నారు. పెండింగ్లో ఉన్న రూ.5లక్షలు త్వరలోనే అందుతుందని తెలిపారు. పీలేరు స్క్వాడ్ డీఎఫ్ఓ వెంకటనరసింహారావు, స్థానిక ఎఫ్ఆర్ఓ మదన్మోహన్రెడ్డి తదితరులున్నారు. ట్రాన్స్కో నిర్లక్ష్యం ఇక్కడి రైతుల పొలాల వద్ద తక్కువ ఎత్తులోని ట్రాన్స్ఫార్మర్లు అనేకం కనిపిస్తున్నాయి. మనుషులకు ప్రమాదం తప్పదని రైతు సుబ్రమణ్యం పలుమార్లు ట్రాన్స్కో అధికారులకు విన్నవించి నా వారు పట్టించుకోలేదని వాపోయాడు. దీనిపై కలత చెందిన ఎఫ్ఆర్ఓ స్థానిక ట్రాన్స్కో అధికారులపై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కనీసం కరెంటు తీగలకు బదులు ఫైబర్ వైర్లను అమర్చినా ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. సీఎం దృష్టికి తీసుకెళతాం పలమనేరు వద్ద ఏనుగు మృతిచెందిన ఘటన బాధాకరం. ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్తా. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉన్నాం. పెండింగ్లోని రైతుల నష్టపరిహారం చెల్లింపు, నష్టపరిహారం పెంపు తదితరాలపై శాసనసభలో ప్రస్తావిస్తా. – పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ -
ఉసురు తీస్తున్న విద్యుదాఘాతం
సాక్షి, బేస్తవారిపేట: జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో వేర్వేరు చోట్ల ఒకేరోజు ముగ్గురు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. పొలానికి పశువుల మేత కోసం వెళ్లగా విద్యుదాఘాతానికి గురై మహిళ మృతి చెందింది. ఈ సంఘటన బేస్తవారిపేట మండలం పెంచికలపాడులో శుక్రవారం జరిగింది. కొండసాని సుబ్బమ్మ (40) వేరే వాళ్ల పొలంలోకి పశువుల మేత (గడ్డి) కోసుకునేందుకు వెళ్లింది. ఈ సమయంలో పొలం చుట్టూ వేసిన ఇనుప కంచెకు తగిలి విద్యుదాఘాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఆవుల నల్లపురెడ్డి పొలంలో విద్యుత్ స్టార్టర్ ఉంది. స్టార్టర్కు విద్యుత్ సరఫరా చేసే తీగ తెగి పొలాన్ని ఆనుకుని ఉన్న నర్రా అనంతలక్ష్మి, దొంతా చెన్నయ్యల పొలం చుట్టూ ఉన్న ఇనుప కంచెపై పడింది. సుబ్బమ్మ పొలంలోకి వెళ్లేందుకు ఇనుప కంచెను దాటే సమయంలో విద్యుదాఘాతానికి గురైంది. గట్టిగా కేక పెట్టి అక్కడికక్కడే మృత్యువాత పడింది. ఆ సమయంలో పొలంలో గడ్డి కోసుకుంటున్న అనంతలక్ష్మి గట్టిగా కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు అక్కడికి చేరారు. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి విద్యుత్ సరఫరా నిలిపేయించారు. విద్యుత్ మోటార్ తీగను తొలగించి సుబ్బమ్మ మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చారు. బుధవారం రాత్రి వర్షం పడటంతో నీరు, బురద ఉండటంతో రోజూ వెళ్లే మార్గం నుంచి కాకుండా మరో మార్గాన్ని ఎంచుకోవడమే ఆమెకు శాపమైంది. మృతురాలికి భర్త గురువారెడ్డి, కుమారుడు, కుమార్తె ఉంది. సుబ్బమ్మ మృతితో కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. ఎస్ఐ రవీంద్రారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. భోరున విలపిస్తున్న కుటుంబ సభ్యులు పొలం చూసేందుకు వెళ్లి రైతు.. బొట్లగూడూరు (పామూరు): విద్యుదాఘాతంలో రైతు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని బొట్లగూడూరు సమీప పొలాల్లో శుక్రవారం జరిగింది. ఎస్ఐ కథనం ప్రకారం.. మండలంలో గురువారం రాత్రి నుంచి వర్షం పడటంతో బొట్లగూడూరు ఎస్సీ కాలనీకి చెందిన మైదుకూరు పెద అంకయ్య (65) తన పొలం చూసుకునేందుకు శుక్రవారం వేకువ జామున వెళ్లాడు. పొలానికి చుట్టూ వేసిన ఫెన్సింగ్ను పట్టుకున్నాడు. పెద అంకయ్య విద్యుదాఘాతానికి గరై తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి సమీపంలోనే ఉన్న కాలనీ వాసి దాసరి పెద మాల్యాద్రి గమనించి స్థానికులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యురాలు కొండమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. టీవీ స్విచ్ వేస్తుండగా మహిళ.. లింగసముద్రం: ఓ మహిళ ఇంట్లో టీవీ స్విచ్ వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన మండలంలోని మొగిలిచర్ల ఆదిఆంధ్ర కాలనీలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన కేసరపల్లి జయమ్మ గురువారం రాత్రి 10 గంటల సమయంలో టీవీ స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. దీనికి ముందు స్వీచ్పై నీరు పడి ఉండటాన్ని ఆమె గమనించలేదు. దీంతో విద్యుదాఘాతానికి గురై జయమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మృతురాలి కుమార్తె కుట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కందుకూరు సీఐ విజయ్కుమార్, వలేటివారిపాలెం ఎస్ఐ హజరత్తయ్య, లింగసముద్రం ఎస్ఐ ఎం.సైదుబాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. వీఆర్ఓ గిరి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భార్య ప్రియునిపై పగ; తొమ్మిదిమందికి షాక్..!
కోల్కత : కట్టుకున్న భార్య మరోవ్యక్తితో సంబంధం కొనసాగిస్తోందని అనుమానించిన ఓ వ్యక్తి ముగ్గురిని బలితీసుకున్నాడు. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాలు.. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే వ్యక్తి (46) కుటుంబంతో కలిసి దక్షిణ 24 పరగణాల జిల్లాలో నివాసముంటున్నాడు. అతని బంధువులు కూడా అక్కడే ఉంటున్నారు. అయితే, గత కొంతకాలంగా తన భార్య దగ్గరి బంధువైన ఓ వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అతనికి అనుమానం మొదలైంది. 15 రోజుల క్రితం వారిద్దరూ కలిసి బయటకు వెళ్లడంతో ఈ అనుమానం మరింత బలపడింది. దీంతో భార్యతో చనువుగా ఉంటున్న వ్యక్తిని చంపాలని నిశ్చయించుకున్నాడు. ఈక్రమంలో బుధవారం రాత్రి సదరు వ్యక్తి ఇంటి గుమ్మం బయట విద్యుత్ సరఫరా ఉన్న వైర్ను ఉంచాడు. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తిని వెలుపలకు రప్పించేందుకు బయట ఉన్న వారి బట్టలకు నిప్పుపెట్టాడు. మంటల్ని ఆర్పేందుకు ఇంట్లోని వారు ఒకరివెంట ఒకరు బయటికొచ్చారు. గుమ్మంలో ఉన్న విద్యుత్ వైర్ తగిలి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు విడువగా.. మరో ఆరుగురు తీవ్రగాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పారిపోయేందుకు యత్నించిన నిందితున్ని రైల్వే స్టేషన్లో పట్టుకున్న గ్రామస్తులు చితకబాది పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. -
బాలుడి ప్రాణం తీసిన టేబుల్ ఫ్యాన్
సాక్షి, పెనగలూరు(కడప) : టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసేందుకు స్విచ్పై చేయి పెట్టగానే విద్యుదాఘాతానికి గురై ఓ బాలుడు మృతి చెందాడు. పెనగలూరు మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దవటం మండలం తురకపల్లె గ్రామానికి చెందిన పసుపులేటి బండయ్య (11) తన తల్లితో కలసి బంధువుల ఇంటికి నల్లపురెడ్డిపల్లెకు వచ్చాడు. మంగళవారం ఉదయం స్నానం చేసి మంచం మీద పడుకొని టేబుల్ ఫ్యాను వేసుకోవాలని తడిచేతులతో స్విచ్పై వేలుపెట్టాడు. వెంటనే విద్యుత్ షాక్కు గురయ్యాడు. కొన ఊపిరితో ఉన్న బండయ్యను కుటుంబ సభ్యులు రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. చుట్టపు చూపుగా వచ్చి విద్యుదాఘాతంతో మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఏఎస్ఐ వెంగయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నిర్లక్ష్యం ఖరీదు.. రెండు ప్రాణాలు
సాక్షి, పులివెందుల : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆర్మీలో పనిచేసి దేశానికి సేవ చేసిన ఇద్దరు స్నేహితులు తుదకు మృత్యుఒడికి కూడా కలిసే చేరుకున్నారు. వివరాలలోకి వెళితే లింగాల మండలం గుణకణపల్లెకి చెందిన ప్రతాప్రెడ్డి(36), వేముల మండలం నల్లచెరువుపల్లెకు చెందిన రామిరెడ్డి గోవర్దన్రెడ్డి(35)లు కొంతకాలం ఆర్మీలో పనిచేశారు. తర్వాత రిజైన్ చేసి సొంత గ్రామాలకు వచ్చారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవారు. సోమవారం వీరిద్దరు వేర్వేరుగా పులివెందులకు వచ్చారు. పులివెందులలో వారిరువురు కలుసుకున్నారు. ఇంటి స్థలాల కొనుగోలు విషయమై కదిరి రోడ్డులో గల రియల్ ఎస్టేట్ భూములను పరిశీలించేందుకు గోవర్థన్రెడ్డికి చెందిన హోండా షైన్ బైకుపై కలిసి వెళ్లారు. కదిరి రోడ్డులోని గంగమ్మ గుడి దాటిన తర్వాత కుడి వైపున వెంకటాపురం హరిజనవాడ సమీపంలో ఉన్న స్థలాల దగ్గరకు వెళుతుండగా.. ఒక్కసారిగా రోడ్డు ప్రక్కనే గల విద్యుత్ స్థంభాలకు ఉన్న 11కె.వి హైటెక్షన్ విద్యుత్ వైరు తెగి బైకుపై పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చుట్టూ పక్కల వారు రక్షించే ప్రయత్నం చేయగా సాధ్యం కాలేదు. మంటలు పూర్తిగా వ్యాపించడంతో వారిద్దరు అక్కడే సజీవ దహనమయ్యారు. మృతుడు గోవర్థన్రెడ్డికి భార్య పార్వతితోపాటు ఇద్దరు కుమార్తెలు జ్యోతి, సాయి, కుమారుడు బద్రినాథరెడ్డిలు ఉన్నారు. మరొక మృతుడు ప్రతాప్రెడ్డికి భార్య అనురాధతోపాటు కుమార్తె రక్షిత ఉన్నారు. స్థానికులు పోలీసులకు, ఫైరింజన్కు సమాచారం అందించారు. వారు చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమా.. గోవర్థన్రెడ్డి, ప్రతాప్రెడ్డిల మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే పులివెందులకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి వారు బోరున విలపించారు. తమకు దిక్కెవరంటూ వారు విలపిస్తున్న దృశ్యాలను చూసి స్థానికులు చలించిపోయారు. గుణకణపల్లె, నల్లచెరువుపల్లెలలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో గోవర్థన్రెడ్డి, ప్రతాప్రెడ్డిలు మృతి చెందడానికి కేవలం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు భావిస్తున్నారు. విద్యుత్ లైన్ తెగిపోవడానికి లైన్ ఫాల్ట్ కానీ, జంపర్ వద్ద లూజు ఉండటంవల్ల కానీ ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. ఆ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై విద్యుత్ లైన్ను సరిచేయాల్సి ఉంటుంది. కొన్ని రోజులుగా 11కె.వి విద్యుత్ లైన్ లూజుగా ఉందని స్థానికులు ఆరోపించారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ అధికారులు లూజుగా ఉన్న వైర్లను, ఇతర వాటిని సరి చేయాల్సి ఉంది. జూన్, జులై నెలల్లో బలమైన గాలులు, వర్షాలు వస్తాయని ముందుగానే ట్రాన్స్కో అధికారులు ఇలాంటి పనులు చేపడుతుంటారు. వారు పట్టించుకోకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందినట్లు మృతుల కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు విద్యుత్ శాఖ అధికారులపై 304ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పులివెందుల అర్బన్ సీఐ రామాంజినాయక్ పేర్కొన్నారు. -
కరెంటు కాటు.. రెండు సార్లు షాక్తో రైతు మృతి
ఖానాపురం: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన రూరల్ జిల్లా ఖానా పురం మండలంలోని అశోక్నగర్ శివారు జాలుబంధం కాల్వ కాటమయ్య గుడి వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్నగర్ గ్రామానికి చెందిన రైతు, పీఏసీఎస్ మాజీ డైరెక్టర్ పిన్నింటి సురేందర్రావు(45) జాలుబంధం కాల్వ పరిధిలో ఉన్న తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో పొలం వద్ద పనులు ముగించుకొని తన ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో జాలుబంధం కాల్వకు అశోక్నగర్ గ్రామానికి చెందిన ఓ రైతు కాల్వ నుంచి నీటిని పారించుకోవడానికి విద్యుత్ మోటార్ను ఏర్పాటు చేసుకున్నాడు. కాల్వలోనుంచి కట్టమీదుగా పొలంలోకి పైపును ఏర్పాటు చేశాడు. దీంతో అటువైపుగా వచ్చిన సురేందర్రావు కట్టమీద ఉన్న పైపును పక్కనపెట్టి తన వాహనాన్ని దాటించుకోవడానికి ద్విచక్రవాహనాన్ని కట్టపై పెట్టాడు. పైపును తొలగించే క్రమంలో పైప్ద్వారా లీకేజీ అవుతున్న నీటికి విద్యుత్సరఫరా జరిగింది. షాక్కు గురై పక్కనే ఉన్న మోటార్పై పడి మరోసారి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమీపంలో ఉన్న రైతులు గమనించి సంఘటనా స్థలానికి చేరుకునే లోపే మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరు న విలపించారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న రైతు మృతి చెందడంతో కుటుంబంలో విషా దం నెలకొంది. మృతుడికి భార్య మంగాదేవి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతురాలి భార్య మంగాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సంఘటనా స్థలాన్ని విద్యుత్ ఏఈ తిరుపతిరెడ్డి, పోలీసులు సందర్శించి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
అద్భుతం చేసిన చెన్నై డాక్టర్లు..!
-
అద్భుతం చేసిన చెన్నై డాక్టర్లు..!
సాక్షి, చైన్నై : నేటి ఆధునిక యుగంలో సాంకేతికత ఎంత పెరిగిందో.. ప్రమాదాల శాతం అంతే పెరిగింది. ప్రమాదాల్లో కొందరు ప్రాణాలు కోల్పోతే.. మరికొందరు తీవ్రంగా గాయపడి అవయవాలు పోగొట్టుకుంటున్నారు. దీంతో బతుకు దుర్భరంగా మారుతోంది. అయితే, అలాంటి వారికి సరైన వైద్యం అందితే తిరిగి మామూలు మనుషులయ్యే అవకాశం ఉంది. విద్యుతాఘాతంతో రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి ట్రాన్స్ప్లాంటేషన్ పద్ధతి ద్వారా తిరిగి చేతులను అతికించారు చెన్నై డాక్టర్లు. 13 గంటల సుదీర్ఘ ఆపరేషన్తో గవర్నమెంట్ స్టాన్లీ మెడికల్ కాలేజ్ డాక్టర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. వివరాలు.. హైదరాబాద్లోని దుండిగల్కు చెందిన నారాయణ స్వామి మేస్త్రీ పని చేసేవాడు. 2015లో ఓ ఇంటి నిర్మాణం చేస్తుండగా ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్కు గురయ్యాడు. ఈ ఘటనలో అతను రెండు చేతులూ కోల్పోయాయి అవిటివాడయ్యాడు. ఈ క్రమంలో బ్రెయిన్డెడ్ అయిన ఓ వ్యక్తికి చెందిన రెండు చేతులను నారాయణ స్వామికి చెన్నై డాక్టర్లు ట్రాన్స్ప్లాంట్ చేసి అతికించారు. ఈ ఆపరేషన్ గత ఫిబ్రవరిలో జరగగా.. నారాయణ స్వామి, డాక్టర్లు తాజాగా మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. మొబైల్ ఫోన్ వాడడం, తేలిక పాటి వస్తువులు ఎత్తడం వంటి పనులు చేస్తున్నాడిప్పుడు నారాయణ స్వామి. నిజంగా వైద్యో నారాయణో హరియే కదా..!! కాగా, తమిళనాడు చరిత్రలో ఇదే తొలి హ్యాండ్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ కావడం విశేషం. -
విద్యుత్ షాక్కు 11 ఏళ్ల బాలుడు బలి
-
గుంటూరు: వినాయకచవితినాడు విషాదం
-
పండగపూట పెను విషాదం
సాక్షి, గుంటూరు: ఇంట్లో కేబుల్ వైరు లాగుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్కు గురై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. ఈ హృదయవిదారక ఘటన గురువారం ఉదయం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో చోటు చేసుకుంది. మృతిచెందిన వారిలో ఏసు(26), సాల్మన్ రాజు(5), ఎస్తేరు(3) వున్నారు. వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా మార్టూరు మండలం ద్రోణాదుల గ్రామానికి చెందిన ఏసు తన కుటుంబంతో కలిసి బుధవారం బంధువుల గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యాడు. కొత్త ఇంట్లోకి కేబుల్ వైరు లాగుతున్న సందర్భంలో ఏసు విద్యుత్ షాక్కు గురయ్యాడు. ఈ విషయం తెలియని పిల్లలు తండ్రిని పట్టుకోవడంతో వారికి కూడా షాక్ తగిలింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్షాక్కు గల కారణాలు తెలియాల్సివుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనతో గనికపూడి గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. -
అన్న అరుపు విని తమ్ముడు కూడా..!
సాక్షి, నల్లగొండక్రైం : కరెంట్ కాటుకు ఇద్దరు సోదరులు బలయ్యారు. ఈ విషాదకర ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం వెలుగుచూసింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం పజ్జూరి గ్రామానికి చెందిన పేర్ల శేఖర్, వెంకటమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. పెద్దకుమారుడు పేర్ల శ్రీని వాస్ (26) బీటెక్ పూర్తిచేయగా, చిన్నకుమారుడు పేర్ల ఆనంద్ (20) డిగ్రీ చదువుతున్నారు. మరో కుమార్తె వెన్నెల ఉంది. ఈ కుటుంబం కొంతకాలంగా పట్టణంలోని బీటీఎస్ ప్రాంతంలో గల రహ్మత్నగర్లో నివాసం ఉంటున్నారు. మూత్రవిసర్జనకు బయటికి వచ్చి.. అర్ధరాత్రి దాటిన తర్వాత శ్రీనివాస్ మూత్ర విసర్జన చేసేందుకు ఇంటిబయటికి వచ్చాడు. పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం నుంచి ఇంట్లోకి ఉన్న కనెక్షన్ వైర్లు గాలివానకు ఒకదానికి ఒకటి ఆనుకోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. అనంతరం ఓ వైరు తెగి బయటికి వస్తున్న శ్రీనివాస్పై పడడంతో గట్టిగా అరిచాడు. ఆ అరుపు విన్న తమ్ముడు ఆనంద్ వచ్చి కిందపడిన సోదరుడిని పట్టుకున్నాడు. దీంతో ఇద్దరూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. సోదరి వచ్చి చూడడంతో.. ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్లిన సోదరుల అరుపులు విని వారి సోదరి ఎన్నెల బయటికి వచ్చింది. సోదరులపై విద్యుత్ వైరు పడి ఉండడం, వారు స్పృహలో లేకపోవడంతో గట్టిగా అరిచి చుట్టుపక్కల వారిని పిలిచింది. వారు వచ్చి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబానికి ఆర్థికసాయం మృతుడి కుటుంబాన్ని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పరామర్శించారు. దుర్ఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతదేహాలపై పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. మృతుడి కుటుం బానికి ఆర్థికసాయం అందజేశారు. సంఘటన జరిగిన నివాసాన్ని పరిశీలించారు. అదే విధంగా ప్రభుత్వాసుపత్రిలో మృతుల కుటుంబాన్ని తిప్పర్తి జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్ పరామర్శించారు. మృతుల కుటుంబాలకు ఆర్థికసాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామన్నారు. నల్లగొండ తహసీల్దార్ నాగార్జునరెడ్డి పదివేల రూపాయలు అందజేశారు. పజ్జూరులో విషాదఛాయలు తిప్పర్తి (నల్లగొండ): మండలంలోని పజ్జూరుకు చెందిన పేర్ల శేఖర్ ఇద్దరు కుమారులు విద్యుదాఘాతానికి బలవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దహనసంస్కారాలు నిర్వహించేందుకు శ్రీనివాస్, ఆనంద్ల మృతదేహాలను సాయంత్రం స్వగ్రామానికి తీసుకొచ్చారు. గ్రామస్తులంతా మృతుల ఇంటికి వచ్చి తల్లిదండ్రులను ఓదార్చారు. పరామర్శించిన ఎమ్మెల్యే వీరేశం, కంచర్ల మృతుల కుటుంబాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కంచర్ల భూపాల్రెడ్డి పరామర్శించారు. మృతదేహలపై పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కుటుంబానికి రెండు లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్కె మోహిజ్, గోవర్ధన్,వెంకట్రెడ్డి, లక్ష్మయ్య, వెంకన్న, సహదేవురెడ్డి, తదితరులున్నారు. -
షాక్ : కాలిబూడిదైన లారీ, క్లినర్
సాక్షి, పశ్చిమగోదావరి : జిల్లాలోని నిడమర్రు మండల పరిధిలోని గుణపర్రు సమీపంలో ప్రొక్లెయిన్ తీసుకువెళుతున్న లారీకి విద్యుత్ సరఫరా ఉన్న వైర్లు తగలడంతో లారీ దగ్ధమైంది. లారీ క్లీనర్ కూడా వైర్లు తప్పించబోయి విద్యుత్ షాక్కు గురయ్యాడు. దీంతో కిందపడి మంటల్లో కాలిపోయాడు. అయితే, డ్రైవర్, మిషన్ ఆపరేటర్లు క్లీనర్ అజయ్ను రక్షించడం మానేసి ప్రొక్లైయిన్ను దింపేసరికి క్లీనర్ శరీరం కాలి బూడిదైంది. క్లీనర్ అజయ్ సొంత ఊరు ఏలూరుగా తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
మహబూబాబాద్ రూరల్: విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. మహబూబాబాద్ మండలం నడివాడ గ్రామపరిధిలోని రంగశాయిపేటకు చెందిన కొల్లు నర్సయ్య(60) తన వరి పొలం వద్ద గల బుర్ర కాలువకు నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా అక్కడున్న విద్యుత్ మోటార్కు కరెంట్ సరఫరా అవుతున్న విషయాన్ని గుర్తించలేదు. విద్యుత్ మోటార్కు ఉన్న పైపులకు నర్సయ్య కాళ్లు తగలగానే ఒక్కసారిగా అక్కడికక్కడే విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
లేపాక్షి: గొంగటిపల్లి గ్రామానికి చెందిన రవి (30) విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గ్రామానికి చెందిన బాలక్రిష్ణ సోమవారం మధ్యాహ్నం తన ఇంటిలోని సంప్కు కొళాయి నుంచి నీరు రాకపోవడంతో మరమ్మతు నిమిత్తం రవిని పిలిచాడు. సంప్ దగ్గర మోటారు రిపేరీ చేస్తున్న సమయంలో విద్యుత్షాక్కు గురైన రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని తండ్రి లక్ష్మారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుబ్బరామనాయక్ తెలిపారు. -
విద్యత్ఘాతంతో లైన్మెన్ మృతి
విజయనగరం: ట్రాన్స్ఫార్మర్పై ఫ్యూజ్ మారుస్తుండగా, విద్యుత్ఘాతానికి గురై లైన్మెన్ మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని గాజలరేగా కామాక్షి దాల్మిల్లులో చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముండే మహ్మద్ రషీద్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా పని చేస్తున్నాడు. ఈ గురువారం ఉదయం దాల్మిల్లులో ఫ్యూజ్ పోయిందని సమాచారం రావడంతో అక్కడికి చేరుకున్న రషీద్ ఫ్యూజ్ మారుస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ఘాతానికి గురై మృతిచెందాడు. -
విద్యుదాఘాతంతో తండ్రీకొడుకు మృతి
మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్ మండలం తోల్కట్టలో బుధవారం ఓ విషాద సంఘటన చోటుచేసుకుంది. విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకులిద్దరూ మృతి చెందారు. పొలం వద్ద అడవి పందులకు పెట్టిన విద్యుత్ తీగలు తగిలి కరెంట్ షాక్ కు గురయ్యారు. వ్యవసాయ పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్ళిన తండ్రీకొడుకులు బొలుగిద్ద గోపాల్ (55), రవికుమార్(23) కరెంట్ షాక్తో అక్కడికక్కడే మరణించారు. తండ్రీ కొడుకుల మృతితో కుటుంబంతో పాటు, గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. -
విద్యుదాఘాతానికి యువరైతు బలి
జగిత్యాల: అడవి పందుల బారి నుంచి పంటను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తగిలి ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలం శానబండలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన విష్ణు(32) పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తాకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
బిట్రగుంట : విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కోళ్లదిన్నెలో బుధవారం జరిగింది. స్థానికులు, మృతుడి బంధువుల కథనం మేరకు.. బోగోలు పాతదళితవాడకు చెందిన ఆలూరి మదన్ (19) తల్లి లక్ష్మి ఆరేళ్ల క్రితం, తండ్రి మల్లి నాలుగేళ్ల క్రితంమృతి చెందటంతో మదన్, చెల్లెలు మౌనిక కోళ్లదిన్నెలోని బంధువుల వద్ద ఉంటున్నారు. మౌనిక కళాశాలలో విద్యనభ్యసిస్తుండగా మదన్ చిన్నచిన్న ఎలక్ట్రికల్ పనులకు Ððవెళ్తున్నాడు. ఈ క్రమంలో మదన్ బుధవారం కోళ్లదిన్నెలో వైరింగ్ పనులు చేసేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మదన్ సంరక్షణ బాధ్యతలు చూస్తున్న బంధువులు బిట్రగుంట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
గూడూరు : అడుతూ పాడుతూ తిరిగే ఓ చిన్నారి విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన గూడూరు రెండో పట్టణంలోని అరవ దళితవాడలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. నాగరాజు, పువ్వాయి దంపతుల రెండో కుమార్తె వైష్ణవి (9) మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి ఇంటి ముందు వీధులో ఆడుకుంటుంది. అక్కడే ఓ ఆటోకు పెయింట్ వేస్తున్న వారు విద్యుత్ పెయింట్ మిషన్ను ఆటో ఉంచారు. ప్రమాదశావత్తు పెయింట్ మిషన్కు ఉన్న విద్యుత్ వైర్లు స్లీవ్లు తెగి ఆటోకు అతుక్కోవడంతో ఆటోకి విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ క్రమంలో చిన్నారి ఆడుకుంటూ ఆటోను పట్టుకోవడంతో అక్కడక్కడే మృతి చెందింది. చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. -
విద్యుదాఘాతానికి యువకుడి బలి
కావలిరూరల్ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన బుధవారం పట్టణంలో సంకులవారితోట సాయిబాబా మందిరం వీధిలో జరిగింది. ఒకటో పట్టణ ఎస్ఐ జి.అంకమ్మ కథనం మేరకు.. జౌళి రాజశేఖర్ అరుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ చదువు మధ్యలోనే ఆపేసి స్థానికంగా కరెంటు, ప్లంబింగ్ పనులకు వెళ్తుంటారు. బుధవారం ఓ కుమారుడు మీరయ్య (20) స్థానిక పాతూరు అరటి తోటలో కరెంటు మరమ్మతుల కోసం తన బాబాయ్ భద్రయ్యతో కలిసి వెళ్లాడు. కనెక్షన్ సరి చేస్తుండగా అతను విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన తోటి పనివారు వెంటనే మెయిన్ ఆఫ్ చేసి హుటాహుటి స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో ఏరియా వైద్యశాలకు తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. యువకుడి కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. చేతికెక్కొచ్చిన కుమారుడు ఇలా అర్ధాంతరంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
వరికుంటపాడు : విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని విరువూరులో ఆలస్యంగా బుధవారం వెలుగు చూసింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని కృష్ణంరాజుపల్లికి చెందిన డి.వెంకటనారాయణ (30) విరువూరులోని వాటర్ ప్లాంట్లో పనిచేసే తన సమీప బంధువు దగ్గరకు మంగళవారం ఉదయం వెళ్లాడు. అక్కడ సెల్చార్జింగ్ పెడుతున్న క్రమంలో విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన ఉదయం జరిగినప్పటికీ రాత్రి బాగా పొద్దుపోయే వరకు బయటకు పొక్కలేదు. రాత్రికి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ ముత్యాలరాజు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బుధవారం ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతిపై అనుమానాలు వెంకటనారాయణ మృతిపై రకరకాల అనుమానాలు వినిపిస్తున్నాయి. విద్యుత్ షాక్తో మృతి చెందలేదని, ఉద్దేశ పూర్వకంగా చంపి విద్యుత్ షాక్తో మృతి చెందినట్లుగా చిత్రీకరిస్తున్నారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ షాక్ అయితే తగిలిన ప్రాంతంలోనే గాయాలు ఉండాలి తప్ప తలపై బలమైన గాయం ఉండటంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శరీరంపై కూడా కొన్నిచోట్ల కొట్టిన దెబ్బలున్నట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై సాక్షి ఎస్ఐ ముత్యాలరాజు దృష్టికి తీసుకురాగా విద్యుదాఘాతంతోనే మృతి చెందాడని తెలిపారు. అనుమానించాల్సిన అంశం ఏమీ మా దృష్టికి రాలేదన్నారు. తొలుత పోస్టుమార్టం వద్దని బంధువులు చెప్పినప్పటికీ, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున పోస్టుమార్టం నిర్వహించామని తెలిపారు. -
సీతాఫలాల కోసం వెళ్లి..
పెద్దవంగర (వరంగల్) : సీతాఫలాలు తెంపడానికి వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన సంఘటన పెద్దవంగర మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న ధారావత్ జీవన్(11) స్నేహితులతో కలిసి సీతాఫలాలు కోసేందుకు చెట్టెక్కాడు. పక్కనే ఉన్న విద్యుత్ తీగలను గమనించకపోవడంతో కరెంట్ షాక్కు గురై మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
విద్యుదాఘాతానికి యువకుడి మృతి
కోట : విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని పుచ్చలపల్లిలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు మెట్టు గ్రామం గిరిజన కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అలియాస్ మణి (25) పుచ్చలపల్లి సమీపంలోని రావిగుంట చెరువు వద్ద జరుగుతున్న తూము నిర్మాణ పనులకు కూలీగా వెళ్లాడు. ట్రాక్టర్ ద్వారా బొంత రాళ్లను తరలిస్తుండగా వాటిని లెక్కించే పని మణికి అప్పగించారు. రాళ్లను అన్లోడ్ చేస్తుండగా అక్కడే తక్కువ ఎత్తులో ఉన్న 11 కేవీ విద్యుత్ వైర్లు ట్రాక్టర్కు తగలడంతో ట్రక్కును పట్టుకుని ఉన్న మణి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ మాత్రం దూకేయడంతో ప్రాణాలు కాపాడుకోగలిగాడు. మణికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
హైదరాబాద్ : నగరంలోని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి గ్రామ పంచాయతీలోని ఓ విల్లాలో పనిచేస్తున్న మహిళ విద్యుదాఘాతంతో మృతిచెందింది. మంగళవారం మధ్యాహ్నం ఆమె విధినిర్వహణలో ఉండగా విద్యుత్ తీగ తెగిపడింది. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళ గాయపడింది. పేట్బషీరాబాద్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతురాలి వివరాలను సేకరిస్తున్నారు. -
విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
మృతదేహంతో పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయింపు ఉద్రిక్తత పరిస్థితి ఉదయగిరి : విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని దేకూరుపల్లిలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దేకూరుపల్లికి చెందిన గోపిదేశి వెంకటరమణయ్య (30) ఉదయం ఎద్దులను మేత కోసం తోలుకోని గ్రామ సమీపంలో ఉన్న తమ పొలం వద్దకు వెళ్లాడు. పొలంలో పనిచేసుకుంటుండగా, ఎద్దులు పక్కనే ఉన్న పైరును మేస్తుండటంతో వాటిని తోలేందుకు పరుగెత్తుతుండగా అదే పొలంలో తాత్కాలిక కర్రల మీద ఏర్పాటు చేసిన విద్యుత్తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. గ్రామ ఎస్సీ కాలనీ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కిలో మీటరు దూరం వ్యవసాయ పొలాల్లో ఉండగా కర్రల ఆధారంగా సిద్దు నారాయణరెడ్డి, కారుమంచి రసూల్ తమ పొలాల వద్దకు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వైర్లు మృతుడి పొలం వద్ద కర్రల మీద నుంచి కిందికి పడిపోయాయి. గమనించని వెంకట రమణయ్య షాక్ తగిలి మృతి చెందారు. నారాయణరెడ్డి, రసూల్ చర్యల వల్లే వెంకట రమణయ్య మృతి చెందాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు స్టేషన్ బయట బైఠాయించారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల సమయంలో మృతుడి బంధువులకు, ఈ ప్రమాదానికి కారకులుగా ఆరోపిస్తున్న వ్యక్తుల బంధువుల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. కొంతమంది పెద్దలు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వైద్యులు సంధానిబాషా పోస్టుమార్టం నిర్వహించారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కావలిఅర్బన్ : డిష్ ప్లగ్ సరి చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన స్థానిక చంద్రబాబునగర్ కాలనీలో గురువారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కాలనీకి చెందిన బాబు జలదంకి మండల తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్గా పని చేస్తున్నాడు. ఆయన భార్య వరమ్మ(38) ఇంట్లో డిష్ సక్రమంగా పనిచేయకపోవడంతో వైరును సరిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురైంది. గమనించిన పక్కింటి మహిళ ఆమెను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఆమె కూడా షాక్కు గురైంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు విద్యుత్ను నిలిపి వేసి 108 వాహన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. విద్యుశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఆమె మృతితో భర్త, కుమారులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
కుక్కను కాపాడబోయి..
- ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం - పాలమూరు జిల్లాలో ఘటన కోస్గి: అడవి పందుల నుంచి రక్షణ కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ కంచె ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని బలిగొంది. కంచెకు తగిలి షాక్కు గురైన పెంపుడు కుక్కను కాపాడబోయి యజమాని, అతన్ని కాపాడబోయి కుమారుడు, కుమారుడిని కాపాడబోయి తల్లి మృతిచెందింది. ఈ సంఘటన మహబూబ్నగర్ జిల్లా కోస్గి మండలం తోగాపూర్ అనుబంధ గ్రామం పందిరి హన్మండ్లలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తుడుం వెంకట య్య (60)కు పది ఎకరాల భూమి ఉంది. చేను వద్దనే ఇంటిని నిర్మించుకున్నారు. వెంకటయ్య, అమృతమ్మ దంపతులతో పాటు కుమారుడు కిష్టప్ప (38), కోడలు యాదమ్మ నివాసం ఉంటున్నారు. జొన్నపంటను అడవి పందులు నాశనం చేస్తుండడంతో వాటి బారి నుంచి పంటను కాపాడుకునేందుకు చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశా రు. వెంకటయ్య రోజూ రాత్రి కంచె వేసి ఉద యం తీసేవాడు. కానీ శుక్రవారం ఉదయం మరిచిపోయాడు. విద్యుత్ కంచెకు తగిలి పెం పుడు కుక్క విలవిల్లాడుతుండగా దాన్ని కాపాడబోయి విఫలయత్నం చేశాడు. అనంతరం తాడుతో కట్టి బయటికి లాగుతుండగా షాక్కు గురై వెంకటయ్య (60) మరణించాడు. గమనించిన కుమారుడు కిష్టప్ప పరుగెత్తుకుంటూ వచ్చి తండ్రిని కాపాడబోయి అతనూ షాక్కు గురై కొట్టుమిట్టాడుతుండగా, ఆతృతతో వచ్చి న అమృతమ్మ (58) కూడా విద్యుత్ ప్రమాదానికి గురైంది. విషయం తెలుసుకున్న యాద మ్మ వెంటనే కరెంట్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చే చూసేసరికి ముగ్గురు ప్రాణాలు వదిలారు. ఒకరిని కాపాడబోయి మరొకరు ఇలా విద్యుత్ షాక్తో మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కోస్గి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వంశంలో ఒక్కడే కుమారుడు వెంకటయ్య కుటుంబంలో మగపిల్లవాడు ఒక్క డే ఉన్నారు. వెంకటయ్య వారి తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు, ముగ్గురు కూతుళ్లు. వెంకటయ్యకు కూడా కిష్టప్ప ఒక్కడే కుమారుడు, ముగ్గురు కూతుళ్లు, కిష్టప్పకు కూడా ఒక్కడే కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అవ్వ, తాతలతో పాటు తండ్రి మృతి చెందడంతో నిరాశ్రయులైన ఆ చిన్నారుల రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. రెండో కూతురు శిరీషా ఈ ఘటనను చూసి తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోయింది. -
విద్యుదాఘాతంతో ఇద్దరు రైతుల మృతి
ముదిగుబ్బ : అనంతపురం జిల్లాలో వేర్వేరు సంఘటనల్లో సోమవారం ఇద్దరు రైతులు విద్యుదాఘాతంతో మృతిచెందారు. ముదిగుబ్బ మండలం పొడ్రాళ్లపల్లికి చెందిన రమణారెడ్డి (48), సోమందేపల్లి మండలం చాకర్లపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి (43) లుగా వారిని గుర్తించారు. తనకున్న పదెకరాల పొలంలో ఇద్దరు రైతులు బోరుబావి కింద వేరుశనగ పంట సాగు చేశాడు. పంటకు నీళ్లు పెట్టేందుకు మధ్యాహ్నం వెళ్లాడు. స్ప్రింక్లర్ పైపులు మారుస్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గమనించిన గ్రామస్థులు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. వారు వెంటనే ముదిగుబ్బ ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రామిరెడ్డికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చాకర్లపల్లి గ్రామంలో రైతు శ్రీనివాసరెడ్డి(43) ఎకరా విస్తీర్ణంలో మామిడి, వంగ పంటలు సాగు చేశాడు. రెండు రోజులుగా పొలంలోని మోటారు పనిచేయడం లేదు. దీంతో సోమవారం ఉదయం మోటారుకు మరమ్మత్తులు చేయడానికి ట్రాన్స్ఫార్మర్ వద్ద పనిచేస్తుండగా 11కేవీ తీగలు తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతని వెంట ఉన్న మరో రైతు కొండారెడ్డి హుటాహుటిన కుటుంబసభ్యలకు సమాచారం అందించగా అప్పటికే శ్రీనివాసరెడ్డి మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఈ-సేవా కేంద్రంలో కరెంట్ షాక్తో రైతు మృతి
హైదరాబాద్: ఈ-సేవా కేంద్రంలో విద్యుదాఘాతంతో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన రైతు రాములు(65) తనకున్న వ్యవసాయ భూమికి సంబంధించిన పనిపై మంగళవారం మధ్యాహ్నం రాజేంద్రనగర్ కు వచ్చాడు. ఈ-సేవా కేంద్రంలో మెట్లు ఎక్కుతూ పక్కనే ఉన్న కిటికీని పట్టుకున్నాడు. కిటికి ఇనుప చువ్వలకు పైన ఉన్న వైరు నుంచి విద్యుత్ ప్రసరించడంతో రాములు షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుత్ తీగలు తెగి పడి 20 గొర్రెలు మృతి
గాలివీడు (వైఎస్సార్ జిల్లా) : ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తెగి పడటంతో 20 గొర్రెలు మృతిచెందిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా గాలీవీడు మండలం కసిరెడ్డిగారిపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఈదురు గాలుల ధాటికి విద్యుత్ తీగలు తెగిపడటంతో కొట్టంలో ఉన్న 20 గొర్రెలు అక్కడికక్కడే మృతిచెందాయి. -
అక్క పెళ్లి.. అంతలోనే చెల్లి..
♦ ఇంటిని శుభ్రం చేస్తుండగా కరెంట్ షాక్ ♦ అక్కడికక్కడే యువతి దుర్మరణం యాచారం: ఇటీవల అక్క పెళ్లి జరిగింది.. ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు. అంతలోనే ఆ ఆనందం ఆవిరైపోయింది. ఇంటిని నీటితో శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతానికి గురైన చెల్లెలు దుర్మరణం పాలైంది. ఈ ఘటన మండలకేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబీకులు, సీఐ మదన్మోహన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్, మల్లేశ్వరి దంపతులు నాలుగేళ్లుగా యాచారం మండల కేంద్రానికి చెందిన విమలమ్మ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్నారు. వీరికి కూతుళ్లు పూజ, శైలు(17), పవిత్ర ఉన్నారు. పెద్ద కుమార్తె పూజ పెళ్లి జరిపించడానికి నాలుగు రోజుల క్రితం దంపతులు స్వస్థలమైన గుంటూరుకు వెళ్లారు. రెండో కుమార్తె శైలు తన మేనత్త దుర్గతో కలిసి యాచారంలోనే ఉంది. పెళ్లి జరిగిన అనంతరం మంగళవారం కుటుం బీకులంతా యాచారానికి బయలుదేరా రు. మంగళవారం శైలుకు తల్లితండ్రులు ఫోన్ చేసి కొద్దిసేపట్లో ఇంటికి వస్తున్నాం.. ఇల్లంతా శుభ్రం చేసి పెట్టమని చెప్పారు. దీంతో మధ్యాహ్నం సమయంలో శైలు పౌల్ట్రీఫాం పక్కనే ఉన్న ఇంటిని నీటితో కడుగుతుండగా.. ఇనుప తలుపులకు ప్రమాదవశాత్తు విద్యుత్షాక్ తగిలి విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకుంది. విషయం తెలుసుకున్న పౌల్ట్రీఫాం యజమాని విమలమ్మ కుటుం బసభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. అప్పటికే శైలు మృతిచెందింది. శుభకార్యం జరగడంతో సంతోషంగా ఉండాల్సిన కుటుంబీకులు శైలు మృతితో కన్నీటిపర్యంతమయ్యారు. అంతలోనే నీకు నూరేళ్లు నిండాయా తల్లీ.. అంటూ శ్రీనివా స్ దంపతుల రోదనలకు స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. ఈమేరకు సీఐ మదన్మోహన్రెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ షాక్ తో కార్మికుని మృతి
మంథని: కరీంనగర్ జిల్లా మంథని మండలం గంగాపూర్ గ్రామశివారులో ఉన్న ఇటుక బట్టీ వద్ద విద్యుదాఘాతంతో బూడిద శంకర్(45) అనే వ్యక్తి మృతిచెందాడు. గురువారం తెల్లవారుజామున లారీలోకి ఇటుకలు చేరుస్తుండగా ప్రమాదవశాత్తూ పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో బూడిద శంకర్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు గోదావరి ఖని వాసిగా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
దౌల్తాబాద్: మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన గాడి కనకయ్య(38) అనే రైతు మంగళవారం ఉదయం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన కనకయ్య మోటారు స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ షాక్ కొట్టి అక్కడే కుప్పకూలిపోయాడు. తోటి రైతులు కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో ఆసుపత్రికి తరలించగా కనకయ్య మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో 8 మంది చిన్నారులకు గాయాలు
హైదరాబాద్ : భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో శనివారం సాయంత్రం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి12 మంది గాయపడ్డారు. వారిలో 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. సకాలంలో స్థానికులు స్పందించి, పెను ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది. -
బాదం చెట్టెక్కి.. షాక్తో విద్యార్థి మృతి
అందివస్తాడనుకున్న కొడుకు అర్ధంతరంగా అందని తీరాలకు చేరుకోవడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని వారు కన్న కలలన్నీ కల్లలవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. ఆనందంగా సాగిపోతున్న తమ జీవితంలో విద్యుత్తీగ రూపంలో విషాదం చోటు చేసుకుందని తల్లడిల్లిపోతున్నారు. కళ్లెదుటే కన్నకొడుకును కోల్పోయిన వారిని చూసి గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. * విద్యుత్వైరు తాకి విద్యార్థి మృతి * బాదం పిక్కలకోసం చెట్టెక్కి మృత్యువాత * మరొకరికి తీవ్ర గాయూలు * గుండెలవిసేలా రోదిస్తున్న కన్నవారు * జయితిలో విషాదఛాయలు జయితి (మెంటాడ) : విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ విద్యార్థి నిండు ప్రాణం గాలిలో కలిసిపోగా, మరో విద్యార్థి తీవ్ర గాయూల పాలైన సంఘటన మండలంలోని జరుుతి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నారుు. గ్రామానికి చెందిన గెద్ద నాగరాజు(ఏడో తరగతి), మన్నెపురి సురేష్(ఆరో తరగతి) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. ఎప్పటిలాగే శుక్రవారం పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం కూడా చేశారు. ఒంటిపూట బడులు కావడంతో 12.30 గంటల సమయంలో స్కూల్ వదిలేశారు. వెంటనే ఆ ఇద్దరు విద్యార్థులు ఇళ్లకు వెళ్లి బ్యాగులు పెట్టేసి బాదం పిక్కల కోసం గ్రామ సమీపంలో ఉన్న మల్లికార్జునస్వామి ఆలయూనికి సుమారు రెండున్నర గంటల సమయంలో వెళ్లారు. అక్కడున్న బాదం చెట్టు ఎక్కి పిక్కలు తీస్తుండగా చెట్టుకు ఆనుకుని వెళ్తున్న విద్యుత్ వైర్లు తగిలి నాగరాజు అక్కడికక్కడే మృతి చెందగా, సురేష్ మాత్రం తీవ్ర గాయూలతో కింద పడిపోయూడు. వెంటనే స్థానికులు 108కి సమాచారం ఇచ్చి సురేష్ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఆండ్ర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్పృహ కోల్పోయిన నాగరాజు తల్లి మృతుడి తల్లిదండ్రులు అప్పలనాయుడు, లక్ష్మి, నాన్నమ్మ పాపమ్మలను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. కుమారుడి మృతదేహం చూసిన తల్లి లక్ష్మి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నాగరాజు అన్నయ్య శంకరరావు గజపతినగరంలో ఇంటర్ చదువుతున్నాడు. విద్యార్థుల కుటుంబాలను విద్యుత్ శాఖాధికారులు, కాంట్రాక్టర్ ఆదుకోవాలని వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. -
విద్యుదాఘాతంతో కార్మికుడు మృతి
కోవూరు : నెల్లూరు జిల్లా కోవూరులో కరెంట్ షాక్తో ఓ భవన నిర్మాణ కార్మికుడు మృత్యువాతపడ్డాడు. మైథిలి సెంటర్లో ఓ ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఆదివారమైనా పనికి రావాలని ఒత్తిడి చేయడంతో శ్రీకాంత్ అనే కార్మికుడు (20) కూలీ పనులకు వెళ్లాడు. భవనం పక్కనే విద్యుత్ తీగలు ఉన్నాయి. కమ్ములు తీస్తున్న సమయంలో విద్యుత్ తీగలను తాకడంతో షాక్కు గురై శ్రీకాంత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ మిగతా కార్మికులు ఆందోళన చేశారు. -
సెల్ కు చార్జింగ్ పెడుతూ షాక్ తో మృతి
బొల్లాపల్లి (గుంటూరు జిల్లా) : సెల్ ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా రావులాపురం మండలం గుడిపాళెంలో ఆదివారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన భూక్యా తులసీ నాయక్(29) ఆదివారం ఉదయం సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్కు గురై స్పృహతప్పి పడిపోయాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే మరణించాడు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
యువతి సజీవదహనం
బోడుప్పల్ (హైదరాబాద్) : ఇంట్లో పని చేసుకుంటున్న యువతి విద్యుదాఘాతానికి గురై సజీవదహనమైంది. ఈ సంఘటన నగరంలోని బోడుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హేమానగర్లో గురువారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న సౌజన్య(18) ఇంట్లో పని చేసుకుంటుండగా.. ప్రమదవశాత్తు కరెంట్ షాక్కు గురైంది. ఈ ఘటనలో యువతి శరీరం పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ వైర్ తగిలి బాలుడు మృతి
కమలాపురం (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా కమలాపురంలోని అంధుల కాలనీలో విద్యుత్ వైరు తగిలి నాలుగేళ్ల బాలుడు మృతిచెందాడు. అంధుల కాలనీకి చెందిన పెద్ద నర్సింహ కుమారుడు నర్సింగ్(4) శనివారం మధ్యాహ్నం వీధిలో ఆడుకుంటుండగా తెగి పడి ఉన్న విద్యుత్ వైరును పట్టుకున్నాడు. కరెంట్ షాక్ కొట్టి బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. నర్సింహకు ఇద్దరు కుమారులు కాగా నర్సింగ్ రెండవ కుమారుడు. -
గణతంత్ర వేడుకల్లో అపశృతి
తాడిపత్రి (అనంతపురం జిల్లా) : తాడిపత్రి మండలం కావేరిసముద్రం గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయజెండాను సరిచేసేందుకు ఇద్దరు విద్యార్థులు పక్కనే ఉన్న భవనం ఎక్కారు. సరిచేసే సమయంలో కరెంట్ తీగలు తగిలి వంశీవర్ధన్(13) అనే 8వ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా..మనోజ్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థిని సమీప ఆసుపత్రికి తరలించారు. -
సెల్ చార్జింగ్ పెడుతూ యువకుడు మృతి
గట్టు (మహబూబ్నగర్) : సెల్ఫోన్ చార్జింగ్ పెడుతూ.. విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా గట్టు మండలం తారాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావలి ఆంజనేయులు(28) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో శనివారం సెల్ఫోన్ చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తూ.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
రెండు నెలల్లో ‘విద్యుదాఘాత’ పరిహారం
►జాప్యం జరిగితే డిస్కంలు 12 శాతం వడ్డీ చెల్లించాలి ►విద్యుదాఘాత మరణాలకు పరిహారం పెంపు ►రెగ్యులేటరీ కమిషన్ కొత్త నిబంధనలు అమల్లోకి ►మనుషులకు రూ.4 లక్షలకు పెరిగిన ఎక్స్గ్రేషియా ►పశువులకు రూ.40 వేలకు పెరిగిన పరిహారం సాక్షి, హైదరాబాద్: విద్యుదాఘాతం మరణాలకు పరిహారం చెల్లింపుల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ఇక ఏమాత్రం జాప్యం చేయడానికి వీల్లేదు. మృతుల కుటుంబాలు/ మూగజీవాల యజమానులు దరఖాస్తు చేసుకున్న నెల ముగిసిన నాటి నుంచి మరో రెండు నెలల గడువులోపు (ఉదాహరణకు జనవరిలో ఏ తేదీన దరఖాస్తు చేసినా.. ఆ నెల ముగిసిన తర్వాత రెండు నెలల్లోపు) పరిహారం చెల్లించాలి. ఒకవేళ ఆలస్యం జరిగితే 12 శాతం వార్షిక వడ్డీతో సహా పరిహారం చెల్లించాల్సిందే. అదేవిధంగా విద్యుదాఘాతంతో మరణించే వ్యక్తులు, మూగజీవాలకు ఇకపై రెట్టింపు పరిహారం ఇవ్వనున్నారు. ఈమేరకు విద్యుదాఘాత మరణాల పరిహారంపై తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (టీఎస్ఈఆర్సీ) కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది. చెల్లింపుల్లో తీవ్ర జాప్యంపై మృతుల కుటుంబాలు, రైతు సంఘాలు, వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. 2016 జనవరి 1 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. పరిహారం చెల్లింపు ఇలా.. విద్యుదాఘాతంతో విద్యుత్ శాఖేతర వ్యక్తుల కుటుంబాలకు చెల్లించే రూ. 4 లక్షల పరిహారాన్ని రెండుగా విభజిస్తారు. రూ.50 వేలు నగదు రూపంలో, మిగిలిన రూ.3.50 లక్షలను కుటుంబ సభ్యుల పేరు మీద బ్యాంకులో ఐదేళ్ల కాలానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ చెల్లించేలా ఏర్పాట్లు చేస్తారు. అంత మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని బాధిత కుటుంబాలు విజ్ఞప్తి చేస్తే.. మిగిలిన రూ.3.50 లక్షలను సైతం నగదు రూపంలో చెల్లించవచ్చు. అదేవిధంగా మృతుల కుటుంబీకులంతా 60 ఏళ్లకు పైబడిన వారున్నా మొత్తం నగదు రూపంలో చెల్లించవచ్చు. మూగ జీవాలకు సంబంధించిన పరిహారం పూర్తిగా నగదు రూపంలోనే చెల్లిస్తారు. దరఖాస్తు ఇలా.. విద్యుదాఘాత మరణాల పరిహారం కోసం ఇకపై ఎన్నో రకాల ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరం ఉండదు. దీన్ని నియంత్రణ కమిషన్ సరళీకృతం చేసింది. దరఖాస్తుల స్వీకరణకు ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిస్కంలను ఆదేశించింది. విద్యుదాఘాతంతో మరణించిన 24 గంటల్లోపు స్థానిక అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏఈ)కు మౌఖికంగా/ రాతపూర్వకంగా/ ఎస్ఎంఎస్ రూపంలో ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చు. బాధిత కుటుంబాల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించేందుకు డిస్కంలు వెబ్సైట్ ఏర్పాటు చేయనున్నాయి. మృతిచెందిన వ్యక్తుల విషయంలో ఎఫ్ఐఆర్, పంచనామా, పోస్టుమార్టం, డెత్ సర్టిఫికెట్, వారసుల సర్టిఫికెట్ ప్రతులను దరఖాస్తుతో పాటు జత చేయాలి. మూగ జీవాల విషయంలో మాత్రం స్థానిక సంస్థ నుంచి యాజమాన్య ధ్రువీకరణ పత్రం, వెటర్నరీ వైద్యుడు ఇచ్చిన పోస్టుమార్టం నివేదిక, పంచనామా నివేదికతోపాటు మృతిచెందిన జంతువు ఫొటోను జత చేయాలి. ఆన్లైన్ దరఖాస్తుకు బదులు పైధ్రువీకరణ పత్రాలతో ఏడీఈ కార్యాలయంలో సాధారణ పద్ధతిలో సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. -
విద్యుదాఘాతానికి రైతు బలి
పెద్దతిప్ప సముద్రం (చిత్తూరు) : వ్యవసాయ బావి వద్ద విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో.. ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నించిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం బూచిపల్లి వద్ద సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్సింహా రెడ్డి(45) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం పొలం వద్ద కరెంట్ సరఫరా నిలిచి పోవడంతో..ఫ్యూజ్ వేయడానికి ప్రయత్నిస్తూ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమా షూటింగ్లో అపశృతి: వ్యక్తి మృతి
హయత్నగర్ (హైదరాబాద్) : సినిమా షూటింగ్లో అపశృతి చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం పరిధిలోని సంఘీ నగర్లో శనివారం నాని హీరోగా నటిస్తున్న ఓ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో తిరుపతి అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. దీంతో భయపడిపోయిన యూనిట్ సిబ్బంది షూటింగ్ నిలిపివేసి వెళ్లిపోయారు. తిరుపతి మృతదేహాన్ని కూడా అక్కడి నుంచి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత
జి.మాడుగుల (విశాఖ) : లారీపై ప్రొక్లెయినర్ను తరలిస్తుండగా దానిపైన ఉన్న ఆపరేటర్ విద్యుత్ తీగలు తగిలి షాక్తో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం ఓబలగరువు సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ప్రొక్లెయినర్ను తీసుకెళ్తున్న లారీ జి.మాడుగుల వైపు వెళ్తుండగా ఓబలగరువు గ్రామ సమీపంలో విద్యుత్ తీగలు అడ్డువచ్చాయి. దీంతో వాటిని తొలగించేందుకు ప్రయత్నించిన ప్రొక్లెయినర్ ఆపరేటర్ షాక్కు గురయ్యాడు. తీవ్ర గాయాలతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. మృతునిది విజయనగరం జిల్లా సాలూరు సమీపంలోని ఎస్.కోట గ్రామమని సమాచారం. -
విద్యుత్ పనులు చేస్తుండగా ఒకరికి షాక్
వెల్దుర్తి (మెదక్) : విద్యుత్ లైన్లు సరిచేస్తున్న ఓ వ్యక్తి షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. మెదక్ జిల్లా వెల్దుర్తికి చెందిన బెస్త మల్లేశం స్థానికంగా జరుగుతున్న కరెంటు పనుల్లో కూలీకి వెళ్తున్నాడు. శనివారం మధ్యాహ్నం స్తంభం పైకెక్కి తీగలు సరిచేస్తుండగా ప్రమాదవశాత్తు షాక్కు గురై కిందపడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ముందుగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించి మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
కరెంట్ షాక్ తగిలి టీడీపీ కార్యకర్త మృతి
-
కరెంట్ షాక్ తగిలి టీడీపీ కార్యకర్త మృతి
గుంటూరు : గుంటూరు జిల్లా పిట్లవానిపాలెం మండలం ఖాజీపాలెంలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు బుధవారం కరెంట్ షాక్ తగిలింది. దీంతో సహచర కార్యకర్తలు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వారిని గుంటూరులోని జిల్లా ఆసుపత్రికి తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో వారిని గుంటూరు తరలించారు. అయితే తగిలి శ్రీనివాస్ అనే కార్యకర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో ఇద్దరు కార్యకర్తలు నర్సింహమూర్తి, వీరయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురువారం ఖాజీపాలెంలో జనచైతన్య యాత్రను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ ఫ్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు గ్రామంలో కడుతున్నారు. ఆ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలను సదరు పార్టీ కార్యకర్తలు చూసుకోలేదు. దీంతో వారికి కరెంట్ షాక్ కోట్టింది. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కమలాపురం (కరీంనగర్) : వ్యవసాయ బావి వద్దకు వెళ్లిన రైతు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. అడవి పందుల నుంచి పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ కంచెకు తాకి రైతు మృతిచెందాడు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లా కమలాపురం మండలం ఉప్పల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బండారు మొగిలి(48) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం పంట పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంటు షాక్తో ఉపసర్పంచ్ మృతి
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా) : జమ్మికుంట మండలం శాయంపేట గ్రామ ఉపసర్పంచ్ గోపాల్ రావు(32) మంగళవారం కరెంటు షాక్తో మృతిచెందాడు. తన వ్యవసాయబావి వద్ద మోటారు ఆన్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గోపాల్ రావుకు భార్యా, ఇద్దరు పిల్లలున్నారు.