విద్యుత్ తీగలు తెగిపడి రైతు మృతి | Farmer dies due to electrocution | Sakshi
Sakshi News home page

విద్యుత్ తీగలు తెగిపడి రైతు మృతి

Published Thu, Jul 23 2015 3:44 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

విద్యుత్ తీగలు తెగిపడి రైతు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

ఆదిలాబాద్ : విద్యుత్ తీగలు తెగిపడి రైతు మృతిచెందిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం కోలూరు గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. కోలూరు గ్రామానికి చెందిన శివమూర్తి తులసీరాం(35) అనే రైతు నీళ్లు పెట్టడానికి పొలం వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలు తెగిపడి ఉండటాన్ని గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతునికి భార్య లక్ష్మిబాయితో పాటు ఒక కొడుకు ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement