Adilabad District
-
కంగ్టి గిరిజన సంక్షేమ హాస్టల్లో విద్యార్థులతో చాకిరీ
కంగ్టి(నారాయణఖేడ్): విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించరాదన్న నిబంధనలున్నా సంబంధిత విద్యాసంస్థల సిబ్బంది యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. కంగ్టి మండలం గిరిజన బాలుర రెసిడెన్షియల్ కళాశాల వసతిగృహంలో విద్యార్థులతో అల్పాహారాన్ని వండించిన విషయం గురువారం బయటకు వచ్చింది. దీనిపై ప్రిన్సిపాల్ విజయ్ను వివరణ కోరగా.. అల్పాహారం తయారీలో విద్యార్థుల సహా యం తీసుకొంటామని స్పష్టం చేశారు. ఈ విషయం మీడియా ద్వారా జిల్లా కలెక్టర్కు చేరడంతో.. నారాయణఖేడ్ ఆర్డీవో అశోక్ చక్రవర్తిని విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆర్డీవో కళాశాలను సందర్శించి విద్యార్థులు, సిబ్బందిని అడిగి విషయాలు తెలుసు కున్నారు. నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నట్లు ఆర్డీవో తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ నజీమోద్దిన్, డీటీ జుబేర్ అహ్మద్, సీనియర్ అసిస్టెంట్ తాజోద్దిన్ ఉన్నారు. వడ వద్దన్నందుకు చితకబాదాడుకొందుర్గు: కడుపునొప్పిగా ఉందని, వడ తింటే పడటం లేదని చెప్పినా వినకుండా తినాల్సిందేనంటూ ఓ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విద్యార్థి వీపుపై వాతలు తేలేలా కొట్టారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గురువారం ఉదయం అల్పాహారంగా వడ వడ్డించారు. కడుపునొప్పితో బాధపడుతున్న 9వ తరగతి విద్యార్థి సందీప్ వడ తినడానికి ఇష్టపడలేదు. దీంతో వడ వద్దంటావా అంటూ ప్రిన్సిపల్ మహ్మద్ కుర్షీద్ విద్యార్థి వీపుపై వాతలు వచ్చేలా కర్రతో చితకబాదారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో డైనింగ్ హాల్లోకి వెళ్లిన ప్రిన్సిపాల్.. అక్కడ విద్యార్థులు కూరగాయల తొక్కలు కింద పడేయడాన్ని గమనించారు. వాటిని తిరిగి ప్లేట్లలో వేయించి విద్యార్థులతోనే తినిపించారు. కాగా, తమ అబ్బాయిని కొట్టిన విషయం తెలుసుకున్న సందీప్ తల్లిదండ్రులు మహేశ్వరి, యాదయ్య ప్రిన్సిపల్తో గొడవకు దిగారు. దీంతో తప్పయిందని ఆయన అంగీకరించారు. షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బుధవారం ఈ విద్యాసంస్థను తనిఖీ చేసిన మర్నాడే ఈ ఘటన జరగడం గమనార్హం. ఏక్ నిరంజన్ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచాలంటూ ఉన్నతాధికారులు, ప్రభుత్వం పదేపదే ఆదేశిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అందుకు ఆదిలాబాద్ (Adilabad) రూరల్ మండలంలోని సాలేవాడ ప్రాథమిక పాఠశాలనే నిదర్శనం. ఈ బడిలో మొత్తం 13 మంది విద్యార్థులు ఉండగా ఉదయం 10 గంటలకు పాఠశాలను ‘సాక్షి’ సందర్శించిన సమయంలో కేవలం ఒకే ఒక విద్యార్థి ఉండగా టీచర్ ఆ విద్యార్థికి బోధిస్తుండటం గమనార్హం. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్‘పీఎం ఇంటర్న్షిప్’ దరఖాస్తుకు మార్చి 10 గడువుసాక్షి, హైదరాబాద్: భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం (Prime Minister Internship Scheme) కింద మార్చి 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పరిశ్రమల శాఖ సంచాలకుడు జి.మల్సూర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థులకు 12 నెలలకు రూ.6 వేలు ఒకేసారి బ్యాంకు ఖాతాలో నేరుగా జమచేయనున్నట్లు వెల్లడించారు.దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయసు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలని, ఈ ఇంటర్న్షిప్కు ఎంపికైన విద్యార్థులకు ఆరు నెలల పాటు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. దరఖాస్తు చేసే విద్యార్థులు పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, డిగ్రీలలో ఏదైనా పూర్తి చేసి ఉండాలని, వారి కుటుంబ వార్షికాదాయం రూ.8 లక్షలలోపు ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ‘పీఎంఇంటర్న్షిప్.ఎంసీఏ.జీఓవీ.ఇన్’ వెబ్సైట్ ద్వారా లాగిన్ అయి దరఖాస్తును పూరించాలని సూచించారు. -
అంగరంగ వైభవంగా నాగోబా జాతర..ఆకట్టుకున్న ఆదివాసీల సాంస్కృతి (ఫొటోలు)
-
నాగోబా వైభవం: ఆడపడుచులు... కొత్తకోడళ్లు
నాగోబా అంటే మహిళామణుల మహా జాతర దేశంలో రెండో అతి పెద్ద గిరిజన జాతర ‘నాగోబా’ మహిళలకు పెద్ద పీట వేస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్లో జాతర మొదలైంది. ‘ఈరోజు కోసమే’ అన్నట్లుగా సంవత్సరమంతా ఎదురు చూసిన ఇంద్రవెల్లి కొండలు, కెస్లాపూర్ పరిసరాలు పండగ కళతో వెలిగిపోతున్నాయి. ఈ జాతరలో మహిళలది ప్రేక్షక పాత్ర కాదు. అడుగడుగునా ప్రధాన పాత్ర...నాగోబా జాతర సందడి మొదలైంది. గిరిజనుల్లోని ఆదివాసీ మెస్రం వంశీయులకు సర్ప దేవుడు ఆరాధ్య దైవం. భక్తిశ్రద్ధలతో ప్రతియేడు పుష్య అమావాస్యలో ఆ దేవుడికి మహాపూజలు అందించడం ద్వారా ఈ జాతరకు అంకురార్పణ జరుగుతుంది. ఈ మహాపూజకు ముందు, వెనకాల జరిగే తంతులలో మెస్రం వంశంలోని మహిళల పాత్రే కీలకం. ఇంటి ఆడపడుచులను అందలం ఎక్కిస్తూనే, ఆ ఇంటికి వచ్చిన కోడళ్లకు అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఈ క్రతువులో వీరిద్దరి భాగస్వామ్యం మనకు కనిపిస్తుంది.ఆడపడుచులకు ప్రాధాన్యతమెస్రం వంశీయులు తమ ఇంటి ఆడపడుచుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తారు. మహాపూజకు ముందు కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులే ముందు ఉంటారు. ముందుగా పురుషులు అందరూ కలిసి నాగోబా ప్రతిమను తీసుకొని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. మహిళలు బిందెల్లో నీళ్లు, గుళ్లల్లో ఆవుపేడను తీసుకొస్తారు. ఆలయ ప్రవేశం తర్వాత అందరు కలిసి నాగోబా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత సంప్రదాయ పూజలు మొదలుపెడతారు. ఈ ప్రక్రియలో ఆడపడుచుకు ఎంత విలువ ఇస్తారనేది మన కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. కొత్త కుండలను ఆడపడుచులకు అందజేస్తారు. ఈ కుండలను అందుకున్న ఆడపడుచులు, తమ భర్తతో కలిసి ఒక వరుసలో తలపై కుండలను మోసుకుంటూ ఆలయ ఆవరణలోని మర్రిచెట్టు దగ్గర ఉన్న కోనేరు దగ్గరకు వెళ్తారు. అక్కడ కుండల్లో నీళ్లు తీసుకొని అదే వరుసలో తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఆ తర్వాత మెస్రం అల్లుళ్లు పాత పుట్టలను తొలగిస్తారు. ఆపై ఆడపడుచులు పుట్టమట్టి, ఆవుపేడ, కోనేరు నుంచి తీసుకొచ్చిన జలంతో కలిపి కొత్త పుట్టలను తయారు చేస్తారు.కొత్త కోడళ్లు వస్తారునాగోబా మహాపూజ ముగిసిన తర్వాత అర్ధరాత్రి మరో ముఖ్యమైన ఘట్టం ఈ కత్రువులో ఆవిష్కృతం అవుతుంది. ఇంటి ఆడపడుచును ఏవిధంగా ఆరాధిస్తారో ఆ ఇంటి గడపకు వచ్చిన కోడళ్లకు కూడా అంతే విలువ ఇస్తారు అనడానికి ఈ ప్రక్రియ నిదర్శనంగా నిలుస్తుంది. నాగోబా సన్నిధికి వచ్చే కొత్త కోడళ్లు మొదట సతీ దేవతకు పూజలు చేస్తారు. తరువాత మెస్రం పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. ఆపై నాగోబా దేవుడిని దర్శించుకుంటారు. దీన్ని మెస్రం వంశీయులు ‘భేటింగ్’గా సంబోధిస్తారు. అర్ధరాత్రి మొదలయ్యే ఈ తంతు తెల్లవారుజాము వరకు జరుగుతుంది. ఈ భేటింగ్ తర్వాతనే ఆ కొత్త కోడళ్లు నాగోబా దర్శనానికి ఎప్పుడైనా వచ్చేందుకు ఆస్కారం ఏర్పడుతుంది.ఎప్పుడు వచ్చినా కొత్తగానే..‘కొత్త పుట్టల తయారీలో ఆడపడుచులను, అల్లుళ్లను భాగస్వాములను చేస్తాం. వ్యవస్థలో మహిళలు, పురుషులకు సమ్రపాధాన్యత అనేది ఈ ఘట్టం ద్వారా తెలుస్తుంది. కొత్త కోడళ్లు దేవుడి దర్శనం ద్వారా మా సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుసుకుంటారనేదే ఈ కార్యంప్రాధాన్యత’ అంటున్నాడు ఉట్నూర్కు చెందిన మెస్రం మనోహర్.‘నాగోబా జాతరకు ఎన్నోసార్లు వచ్చాను. విశేషం ఏమిటంటే ఎప్పుడు వచ్చినా కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక కొత్త విశేషం తెలుసుకుంటూనే ఉంటాను. నాగోబా జాతర అంటే మహిళలకుప్రాధాన్యత ఇచ్చే మహా జాతర’ అంటుంది హైదరాబాద్కు చెందిన గిరిజ.‘నాగోబా’ చుట్టూ ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. తరగని మౌఖిక కథలు ఉన్నాయి. అన్నింట్లో మహిళ మహారాణిగా, మíßమాన్వితంగా వెలిగిపోతూనే ఉంటుంది. అదే ఈ మహ జాతర ప్రత్యేకత. పవిత్రత. – గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి. -
ఆదిలాదాబాద్ : వైభవంగా నాగోబా జాతర..గంటల తరబడి క్యూలో భక్తులు (ఫొటోలు)
-
కెస్లాపూర్ లో అత్యంత వైభవంగా ప్రారంభమైన నాగోబా జాతర
-
అంగరంగ వైభవంగా ఆదివాసీ ‘నాగోబా జాతర’ ప్రారంభం (ఫొటోలు)
-
రేపే నాగోబా మహాజాతర
ఇంద్రవెల్లి: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా జాతరకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 28న మహాపూజతో సంబరం మొదలు కానుంది. ఇప్పటికే పవిత్ర గంగాజలంతో వచ్చిన మెస్రం వంశీయులు కేస్లాపూర్ గ్రామ పొలిమేరలో పడియోర్ జన్మ స్థలమైన మర్రిచెట్టు వద్ద గుడారాలు వేసుకుని బస చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా తరలివచ్చారు. రెండు రోజులుగా ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. రాత్రి వేళలో ప్రదాన్ కితకు చెందిన వారు కిక్రి వాయిస్తూ నాగోబా, 22 కితల వంశీయుల చరిత్ర చెబుతున్నారు. ఆదివారం ఉదయం మహిళలు కితల వారీగా జొన్న గట్కా, సంప్రదాయ పిండి వంటలు చేసి ఆచారం ప్రకారం నైవేద్యాలు సమర్పింపంచారు. 22 కితల్లో మరణించిన పెద్దల పేరుతో రాత్రి తూమ్ (కర్మకాండ) పూజలు చేపట్టినట్లు ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్ తెలిపారు. మరణించిన వారు ఈ పూజలతో నాగోబా సన్నిధికి చేరినట్లు భావిస్తామని పేర్కొన్నారు. పూజల్లో జొన్నగట్కా ప్రత్యేకం పూజల్లో భాగంగా సమర్పించే నైవేద్యంలో జొన్న గట్కాకు ప్రత్యేక స్థానం ఉంది. పూజల ప్రారంభం నుంచి ముగింపు వరకు ఇంటి నుంచి తీసుకువచ్చిన జొన్న పిండితో గట్కా, ఇతర పిండి పదార్థాలు తయారు చేస్తారు. నైవేద్యంగా సమర్పించిన తర్వాత కితల వారీగా పంపిణీ చేసి భోజనం చేస్తారు. ఆలయానికి చేరిన కుండలు నాగోబా మహాపూజ, సంప్రదాయ పూజలకు అవసరమయ్యే సిరికొండలోని గుగ్గిల స్వామి తయారుచేసిన ఏడు రకాల కుండలు ఆదివారం సాయంత్రం ఆలయానికి చేరాయి. మొత్తం 350 మట్టి పాత్రల్లో పెద్ద బాణాలు, సాధారణ కుండలు, మూతలు, కడుముంతలు, దీపాంతలు ఉన్నాయి. వీటిని ఆలయంలో భద్రపరిచారు. తూమ్ పూజలతో దేవుడి సన్నిధికి..ఆదివాసీల్లో మరణించిన పెద్దలకు కుటుంబ సభ్యులు తమ కుల దేవతల వద్దకు వెళ్లి తూమ్ పూజలు నిర్వహించడం ఆనవాయితీ. దీంతో మరణించిన వారు దేవుడి సన్నిధికి చేరినట్లుగా భావిస్తారు. ఈ పూజల అనంతరమే వంశంలోని తమ కితకు చెందిన కోడళ్ల బేటింగ్ (దేవుడి పరిచయం)తో పాటు ఇతర పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది.నాగోబా జాతరకు దృశ్య రూపంఎనిమిదేళ్ల పాటు పరిశోధన చేసిన యంగ్ డైరెక్టర్ జెన్నిఫర్ ఆల్ఫాన్స్సాక్షి, హైదరాబాద్: ఎంతో ప్రాచీనమైన నాగోబా జాతర గురించి మనకు తెలిసింది ఎంత? అంటూ వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో ఆదిలాబాద్ బాట పట్టారు యంగ్ డైరెక్టర్ జెన్నిఫర్ ఆల్ఫాన్స్. ఎనిమిదేళ్ల పరిశోధన తర్వాత ‘నాగోబా జాతర’పేరుతో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశారు. తాను తెలుసుకున్న విషయాలు, చిత్రీకరించిన ఫొటోలతో అందమైన పుస్తకాన్ని కూడా ప్రచురించారామె. నాగోబా జాతరలోని ప్రతి ఘట్టాన్ని అందంగా చిత్రించారు. ఇందుకు తన పరిశోధనే కారణమంటారామె. ‘సినిమా చిత్రీకరణ ఒక్క టే నాకు తెలిసిన కళ. నా దృష్టికొచ్చిన గొప్ప విషయాన్ని నాకు చేతనైన మాధ్యమంలో ఒక రూపం కల్పించానని చెప్పడానికి గర్వంగా ఉంది’అన్నారు జెన్నిఫర్. ‘గుస్సాడీ’పుస్తకం ఆమెజాన్లో ఉంది. ఈ పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బును ఆమె తీసుకోలేదు. నేరుగా ఆదివాసీల అభ్యు న్నతి కోసం ఏర్పాటు చేసిన నిధికి చేరుతోంది. ‘నాగోబా జాతర’రచన మార్కెట్లో విడుదల కావాల్సి ఉంది. ఆదిలా బాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల పరిధిలోని కేస్లాపూర్లో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి ఒకటి వరకు నాగోబా జాతర జరగనుంది. జెన్నిఫర్ హైదరాబాదీ హైదరాబాద్లో పుట్టి పెరిగిన జెన్నిఫర్ ఆల్ఫాన్స్ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఆమె తీసిన ‘కచరా’ఫిల్్మకు మూడు నంది అవార్డులు వచ్చాయి. ‘స్ట్రేంజర్’సినిమా కేన్స్లో స్క్రీన్ అయ్యింది. దానికి 20కి పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్లు చేస్తారు. ఆ డబ్బుతో ఆదివాసీల జీవనం, కళలపై రీసెర్చ్ చేస్తున్నారు.ఇవి మన సంస్కృతి మూలాలుహైదరాబాద్లోని శిల్పారామంలో గుస్సాడీ నృత్యం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. మూలాలను వెతుక్కుంటూ ఆదిలాబాద్ అడవులకెళ్లాను. గుస్సాడీ మీద ఒక డాక్యుమెంటరీ, పుస్తకం తెచ్చాను. 2014 నుంచి ఇప్పటివరకు రెండు డాక్యుమెంటరీలు, రచనలు వచ్చాయి. మూడవది ఆదివాసీ దేవత జంగుబాయి డాక్యుమెంటరీ చిత్రీకరణ దశలో ఉంది. నా పుస్తకాలను చూసిన మన తెలుగువారు చాలామంది ఆఫ్రికాలో షూట్ చేశారా అని అడిగారు. మన మూల సంస్కృతి అడవి దాటి బయటకు రాకపోతే ఇక ప్రపంచానికి ఏమి చెబుతాం? ప్రపంచదేశాలకు తెలియచేయడానికి ఇంగ్లిష్ వాయిస్ ఓవర్ ఇచ్చాను. డాక్యుమెంటరీ మన తెలుగుదనాన్ని కోల్పోకూడదని ఆదివాసీల మాటలను అలాగే ఉంచాను. – జెన్నిఫర్ ఆల్ఫాన్స్, ఫిల్మ్ డైరెక్టర్ -
ఆదిలాబాద్లో రైతు ఆత్మహత్య.. హరీశ్రావు కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలానికి చెందిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి హరీశ్రావు స్పందించారు. రైతు మామిళ్ల నర్సయ్య ఆత్మహత్యపై హరీశ్రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్రావు శనివారం(జనవరి25)ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నడు. అందరికి అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నది. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న సీఎం రేవంత్రెడ్డి అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కొట్లాడుదాం. అధైర్య పడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది’అని హరీశ్రావు తెలిపారు. -
ఆదిలాబాద్ : నాగోబా జాతర..ఇంద్రాదేవికి ‘మెస్రం’ పూజలు (ఫొటోలు)
-
కల్యాణలక్ష్మి డబ్బునుంచి పంట రుణం కోత
సిరికొండ: నిరుపేద ఆడపిల్లల పెళ్లికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభు త్వం కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థిక సహాయం చేస్తుండగా, ఈ పథకం కింద వచ్చిన డబ్బు నుంచి బ్యాంకు అధికారులు పంట రుణాన్ని జమచేసుకున్నారు. దీంతో ఓ తల్లి తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని లచ్చింపూర్(బీ) గ్రామానికి చెందిన గిరిజన మహిళ పెందురు సోమ్బాయికి ఆరుగురు కూతుళ్లు ఉన్నారు. రెండో కూతురుకు గత వేసవిలో వివాహం చేసింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా గతవారం ప్రభుత్వం ద్వారా రూ.1,00,116 చెక్కు అందుకుంది.తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఈ నెల 17న వోచర్ రాసి ఇచ్చింది. ఈ డబ్బులు డ్రా చేసుకోవడానికి శుక్రవారం బ్యాంకుకు వెళ్లింది. అయితే బ్యాంకు ఖాతాలో రూ.40 వేలు మాత్రమే జమ అయ్యాయి. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ను అడిగితే.. ఆమె పంట రుణం రూ.1.60 లక్షలు ఉండగా, వడ్డీ రూ.60 వేలు అయిందని, దీంతో కల్యాణలక్ష్మి డబ్బుల నుంచి వడ్డీ కింద రూ.60 వేలు జమ చేసుకున్నామని చెప్పగా, ఆమె అవాక్కయింది. తనకు వచ్చిన పూర్తి డబ్బులను ఇవ్వాలని ఎంత వేడుకు న్నా బ్యాంకు సిబ్బంది కనికరించలేదని ఆమె ఆవే దన వ్యక్తం చేసింది. పెళ్లి కోసం చేసిన అప్పులు తీర్చాలని అనుకుంటే, పంట రుణం కింద జమ చేసుకోవడం అన్యాయమని బోరుమంది. ఈ విషయమై బ్యాంకు మేనేజర్ నరేశ్కు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. -
రోడ్డుపై వెల్కమ్ చెప్తున్న పులి
-
ఆదిలాబాద్ లో సింగిల్ డిజిట్ కి పడిపోయిన ఉష్ణోగ్రతలు
-
ఆదివాసీల వింత సంప్రదాయం.. 2 కిలోల నూనె తాగిన మహిళ
-
యూపీకి వెళ్తున్న తెలంగాణ బస్సులో మంటలు.. వ్యక్తి సజీవదహనం
లక్నో/హైదరాబాద్: తెలంగాణ నుంచి ఉత్తరప్రదేశ్లోని కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ప్రమాదానికి గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. ఈ ప్రమాద ఘటన యూపీలోని బృందావనంలో చోటు చేసుకుంది.వివరాల ప్రకారం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బైంసా నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీకి పర్యాటకులతో బస్సు బయలుదేరింది. కాశీకి వెళుతున్న బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మృతుడిని నిర్మల్ జిల్లా పల్సికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.కాగా, అగ్ని ప్రమాద సమయంలో 50 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టు సమాచారం. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన బస్సు డ్రైవర్ అప్రమత్తం చేయడంతో ప్రయాణికులంతా హుటాహుటిన బస్సు దిగిపోయారు. ఇక, బస్సులోనే ఉండిపోయిన ఆ వ్యక్తి మాత్రం సజీవ దహనమయ్యాడు. దీంతో, అతడి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అటవీశాఖ అధికారులపై కేశవపట్నం గ్రామస్తుల దాడి..!
-
ఆదిలాబాద్: అటవీ శాఖ సిబ్బందిపై గ్రామస్తుల రాళ్ల దాడి
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఘటన జరిగింది. తెల్లవారుజామున కేశవపట్నం గ్రామంలో అటవీ అధికారులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కార్డెన్ సెర్చలో పలు ఇళ్లలో కలప దుంగలు, ఫర్నిచర్ దొరికాయి. కలప దుంగలు స్వాధీనం చేసుకుంటున్న క్రమంలో అటవీ అధికారులపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అటవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు.ఈ ఘటనలో ఇద్దరు అటవీశాఖ సిబ్బందికి గాయాలయ్యాయి. అటవీ శాఖ వాహనం అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనలో బీట్ ఆఫీసర్ జాధవ్ నౌశిలాల్ స్వల్పంగా గాయపడ్డారు. అటవీ శాఖకు సంబంధించిన ఓ వాహనంంపై దాడి చేసిన స్థానికులు అద్దాలు పగలగొట్టారు. కేశవపట్నం చేరుకున్న పోలీసు బలగాలు.. గ్రామాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. దాడి విషయాన్ని అటవీ శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.ఇదీ చదవండి: మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు -
ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత
-
మైనర్ బాలికపై దారుణం..
-
ఆదిలాబాద్ @ 4.7 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. చాలాచోట్ల సాధారణం కంటే సగటున 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో అత్యంత తక్కువగా ఆదిలాబాద్లో కనిష్ట ఉష్ణోగ్రత 4.7డిగ్రీ సెల్సియస్గా నమోదైంది. ఇక్కడ ఈ సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కంటే 8.1 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.పటాన్చెరు, హకీంపేట్, హనుమకొండ, మెదక్, నిజామాబాద్, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో సాధారణం కంటే 4డిగ్రీ సెల్సియస్కు పైబడి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా నెలకొన్న వాతావరణ పరిస్థితులతో ఉష్ణోగ్రతలు పతనమైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఈశాన్య దిశనుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. రానున్న రెండ్రోజులు ఉదయం పూట పొగమంచు ఏర్పడుతుందని, దీంతో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.రానున్న మూడురోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 4డిగ్రీల వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై ప్రాంతాలు ఆదిలాబాద్ : 4.7 డిగ్రీలు, అర్లి : 6.3డిగ్రీలు, తండ్ర: 6.6 డిగ్రీలు, తిర్యాణి: 6.7 డిగ్రీలు, కొహిర్: 6.8డిగ్రీలు, జుక్కల్: 7.6డిగ్రీలు, కొట్గిరి: 7.7 డిగ్రీలు, శివంపేట్: 8 డిగ్రీలు, మల్లాపూర్: 8 డిగ్రీలు, మోమీన్పేట్: 8.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
TG: చిరుత దాడితో మహిళకు గాయాలు.. టెన్షన్లో ప్రజలు
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వన్య మృగాల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురిపై పులి దాడి చేయగా.. తాజాగా చిరుత సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. ఓ మహిళపై చిరుత దాడి చేయడంతో ప్రజలు వణికిపోతున్నారు.వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం అధికారులు, ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా డెడ్రా సమీపంలో ఓ మహిళపై చిరుత దాడి చేసింది. ఈ క్రమంలో మహిళలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను స్థానిక ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. ఇక, చిరుత దాడి నేపథ్యంలో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.ఇదిలా ఉండగా.. ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే ఓ మహిళపై పులి దాడి చేయడంతో ఆమె మరణించిన విషయం తెలిసిందే. అనంతరం, ఆదిలాబాద్ జిల్లాలోనే మరో ఇద్దరికిపై పులి దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. వన్య ప్రాణుల వరుస దాడుల నేపథ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. -
పులి కోసమే వెతుకుతున్నాం సర్..
కాగజ్నగర్ డివిజన్లో ఇటీవల ఇద్దరిపై దాడి చేసిన పులి ఆచూకీ కోసం అటవీ అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. సిర్పూర్ రేంజ్లో అటవీ అధికారి ఫోన్లో మాట్లాడుతుండగా.. ఆయన కార్యాలయంలో నిజమైన పులిని తలపిస్తున్న పులి బొమ్మ ఆసక్తి రేపుతోంది.పులి భయంతో.. జ్వరం!ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టి మండలం దుబ్బగూడలో రైతు రౌత్ సురేశ్పై పులి దాడి చేయడాన్ని చూసిన అతని భార్య సుజాత జ్వరంతో మంచం పట్టింది. ఏ క్షణాన ఎవరిపై పులి దాడి చేస్తుందో తెలియక.. దుబ్బగూడ.. పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. – ఫొటోలు: సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఆదిలాబాద్లో పెద్దపులి హల్చల్
నార్నూర్: ఆదిలాబాద్ జిల్లా నార్నూర్, గాదిగూడ మండలాల్లో గత నాలుగు రోజులుగా పెద్దపులి హల్చల్ చేస్తోంది. గత రెండ్రోజులుగా నార్నూర్ మండలం చోర్గావ్ గ్రామంలో తిష్టవేసి ఆవును తింటున్న దృశ్యం అటవీశాఖ అధికారులు అమర్చిన కెమెరాకు చిక్కింది. దీంతో చోర్గావ్, సుంగాపూర్, బాబేఝరి, మంజ్రి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. గురువారం గాదిగూడ మండలం ఖడ్కి గ్రామం మీదుగా బుడుకుంగూడ, సావురి గ్రామం మీదుగా రాంపూర్ చేరుకుంది. వేకువజామున గిరిజన రైతు ప్రకాశ్కు చెందిన ఆవుపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు అప్రమత్తమై చప్పుడు చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇదేరోజు మధ్యాహ్నం నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామ శివారులో పత్తి ఏరుతున్న మహిళలకు పులి కనిపించడంతో భయంతో పరుగులు తీశారు. అక్కడి నుంచి గంగాపూర్, మాన్కాపూర్ వైపు పులి వెళ్లిందని ప్రచారం జరగడంతో మాన్కాపూర్, రాజులగూడ, నార్నూర్, మహగావ్, నాగల్కొండ, భీంపూర్ గ్రామాల ప్రజలు అప్రమత్తం అయ్యారు. వ్యవసాయ పనులకు వెళ్లిన వారంతా మధ్యాహ్నం ఇంటిబాట పట్టారు. ఎఫ్ఎస్వో సుదర్శన్ ఆధ్వర్యంలో అటవీ అధికారులు బృందాలుగా విడిపోయి పులి జాడకోసం గాలిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. -
అమ్మో.. పులి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ఏటా శీతాకాలంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న పులులు.. ఉమ్మడి ఆదిలాబాద్ వాసుల్లో అలజడి రేపుతున్నాయి. జనావాసాలకు సమీపంలో సంచరిస్తూ.. పశువులపై దాడి చేసి చంపి తింటున్నాయి. ప్రస్తుతం జానీ, ఎస్–12గా పిలుస్తున్న రెండు పులులు తిరుగుతున్నట్టు గుర్తించారు. ఇలా పులుల రాకను అటవీ అధికారులు, పర్యావరణవేత్తలు స్వాగతిస్తుండగా.. అడవి సమీప ప్రాంతాల ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. పత్తి పంట చేతికొచ్చే వేళ పొలాలకు వెళ్లలేకపోతున్నామని గిరిజన రైతులు వాపోతున్నారు.అక్కడ సరిపోక.. మ హారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి అభయారణ్యాలలో పులుల సంఖ్య పెరిగింది. అక్కడి ఇరుకు ఆవాసం వల్ల ఆ పులులు తెలంగాణ వైపు వస్తున్నాయి. వాటిలో మగపులులే అధికమని అధికారులు చెప్తున్నారు. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్, కుంటాల, సారంగాపూర్, మామడ, పెంబి మండలాల్లో ఎనిమిదేళ్ల మగపులి(జానీ) సంచరిస్తున్నట్టు గుర్తించారు. సుమారు రెండేళ్ల వయసున్న మరో మగ పులి (ఎస్ 12) మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, బెల్లంపల్లి అటవీ ప్రాంతంలో తిరుగుతోంది. ఇంకో పులి కెరమెరి మండలంలోని లక్మాపూర్, కరంజివాడ ప్రాంతాల్లో కనిపించి వెళ్లిపోయింది.ఇక్కడ కోర్ ఏరియాలోకి వెళ్లలేక.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ జోన్ల నుంచి వస్తున్న పులులు.. కవ్వాల్లోని కోర్ ఏరియాకు చేరుకోవాలంటే, 200 కిలోమీటర్లకుపైగా నడవాలి. ఇది వాటికి పెద్ద సమస్య కాకపోయినా.. మధ్యలో జాతీయ రహదారులు, బొగ్గు గనులు, సాగునీటి ప్రాజెక్టులు, పోడు సాగు, పంట పొలాలు పులుల రాకకు ఆటంకంగా మారాయి. రహదారుల వెంట అండర్ పాస్లు, ఓవర్ పాస్లు ఏర్పాటు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. అయితే ఆ పులులు అడవి అంచుల్లోనే సంచరిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు కవ్వాల్ బయట కాగజ్నగర్ డివిజన్లో ఐదు పెద్దవి, నాలుగు చిన్నవి కలిపి 9 పులులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు.మనుషులపై దాడులతో కలకలం రాష్ట్రంలోకి వస్తున్న పులులు.. పశువులు, మనుషులపై దాడి చేస్తున్నాయి. 2020 నవంబర్లో 18 రోజుల వ్యవధిలో ఏ2 అనే మగపులి ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడకు చెందిన సిడాం విగ్నేశ్ (21)పై, పెంచికల్పేట మండలం కొండపల్లికి చెందిన పసుల నిర్మల (18)పై పొలాల్లో దాడిచేసి చంపేసింది. గత ఏడాది నవంబర్లో మరో పులి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖానాపూర్కు చెందిన రైతు సిడాం భీము (69)పై దాడి చేసి ప్రాణాలు తీసింది. నాటి ఘటనల నేపథ్యంలో.. ఇప్పుడు అటవీ అధికారులు ఏజెన్సీ ప్రజలను అప్రమత్తం చేశారు.కోర్ ఏరియాలోకి వెళ్లేలా చూస్తున్నాం.. టైగర్ జోన్ వెలుపల సంచరించే కొత్త పులులు కోర్ ఏరియాలోకి వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నాం. వేటగాళ్లు ఉచ్చులు వేయకుండా, స్థానికులకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పులి దాడి చేసిన పశువుల యజమానులకు వెంటనే పరిహారం ఇస్తున్నాం. పులి సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. – శాంతారామ్, ఫీల్డ్ డైరెక్టర్, ప్రాజెక్టు టైగర్, కవ్వాల్ టైగర్ రిజర్వుపులుల సంచారంతో భయంగా ఉందిపులి భయంతో పత్తి తీసే పనులు సాగడం లేదు. మా చేన్ల వైపు పులి రాకుండా అటవీ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే రైతులు చాలా నష్టపోతారు. – ఆత్రం జైతు, భుర్కరెగడి గ్రామం, నిర్మల్ జిల్లా -
ఇదో జానీ.. వాకర్.. ప్రేమ కథ
ప్రేమ కథ అన్నారు.. పులి బొమ్మ వేశారేంటనేగా మీ డౌటు.. ఏం.. మనుషులకేనా ప్రేమ కథలు.. పులులకుండవా.. ఇది జానీగాడి ప్రేమ కథ.. లవర్ కోసం వందల కిలోమీటర్లు వాకింగ్ చేసొచ్చిన ఓ పెద్ద పులి కథ.. కట్ చేస్తే.. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం.. జానీ ఉండేది ఇక్కడే. గత నెల్లో ఒకానొక శుభముహూర్తాన మనోడికి ‘ప్రేమ’లో పడాలనిపించింది. తీరా చూస్తే.. తనకు ఈడైన జోడు అక్కడ ఎవరూ కనిపించలేదు. దాంతో తోడు కోసం తన ప్రేమ ప్రయాణం మొదలుపెట్టాడు. వెతుక్కుంటూ.. వెతుక్కుంటూ.. ఏకంగా 200 కిలోమీటర్లు నడిచి మన రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా అడవుల్లోకి వచ్చేశాడు.అక్టోబర్ 25న నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడెల్లి ప్రాంతంలోకి వచ్చిన జానీ.. ఎక్కడా కుదురుగా ఉండటం లేదు. ఓసారి వెనక్కి మహారాష్ట్ర సరిహద్దు దాకా వెళ్లాడు.. మళ్లా తిరిగొచ్చాడు. రోజుకో మండలమన్నట్లు తిరుగుతూనే ఉన్నాడు. ఈ నెల 10వ తేదీనైతే.. రాత్రిపూట మహబూబ్ ఘాట్ రోడ్డుపై కనిపించి అందరికీ కంగారు పెట్టించేశాడు. పెద్ద పులంటే మాటలా మరి.. మంగళవారం మామడ–పెంబి అటవీ ప్రాంతంలో ఎద్దుపై దాడిచేసి చంపేశాడు. ప్రస్తుతం జానీ అదే ప్రాంతంలో తిరుగుతున్నాడు. తన తోడు కోసం.. గూడు కోసం.. ఇంతకీ అటవీ అధికారులేమంటున్నారు? మిగతా క్రూర జంతువులతో పోలిస్తే పులులు కొంచెం డిఫరెంటుగానే ఉంటాయట. మేటింగ్ సీజన్లో తగిన తోడు, గూడు దొరికేదాకా ఎంత దూరమైనా వెళ్తాయట. ఇప్పటివరకూ జానీ.. 500 కిలోమీటర్ల దూరం నడిచాడట. నిర్మల్– ఆదిలాబాద్ మధ్య దట్టమైన అడవులు, నీటి వనరులు, వన్యప్రాణులు ఉండటంతో ఈ ప్రాంతంలోనే తిరుగుతున్నాడట. ఇలా వచ్చిన పులులను సంరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ‘జానీ’ అనే ఈ పులి ఎటువైపు వెళ్తుందో గమనిస్తూ ఆయా ప్రాంతాల వారిని అప్రమత్తం చేస్తున్నామని, పులి సంరక్షణకు సంబంధించిన సూచనలు చేస్తున్నామని నిర్మల్ డీఎఫ్వో నాగిని భాను తెలిపారు. చదవండి: ‘బాహుబలి’ ఏనుగులకు పెద్ద కష్టం... భూమాతకు తీరని శోకం! -
పత్తిపై తేమ, ధరల కత్తి
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ మార్కెట్లో పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన నెలకొంది. తేమ శాతం, తక్కువ ధర ఖరారుపై వివాదం ఏర్పడటంతో కొనుగోళ్లు జరగలేదు. తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనాలంటూ రైతులు రాత్రివరకు తమ ఆందోళన కొనసాగించారు. వివరాలిలా ఉన్నాయి.. సీసీఐతో పాటు ప్రైవేట్ వ్యాపారులు పత్తి కొనుగోళ్లు ప్రారంభించేందుకు శుక్రవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు చేరుకున్నారు. సీసీఐ క్వింటాల్ పత్తికి మద్దతు ధర రూ.7,521తో కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు మొదట క్వింటాల్ పత్తికి రూ.6,700 ధర వేలం ద్వారా నిర్ణయించి, ఆ తర్వాత రూ.10, రూ.20 పెంచుతూ రూ.7,150 వరకు చేరుకున్నారు.ఆ తర్వాత ధర పెంచేందుకు ససేమిరా అన్నారు. దీంతో కలెక్టర్ రాజర్షిషా, మార్కెట్ అధికారులు ధర పెంచాలని ప్రైవేట్ వ్యాపారులకు సూచించినప్పటికీ వారు ఒప్పుకోలేదు. దీంతో ప్రతిష్టంభన నెలకొంది. సీసీఐతో పోలి్చతే ప్రైవేట్ ధర తక్కువగా ఉండడంతో రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్ వారికి నచ్చజెప్పినప్పటికీ వినకుండా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో కలెక్టర్ సీసీఐ, ప్రైవేట్ వ్యాపారులతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు.ప్రైవేట్ వ్యాపారులు రూ.7,200కు కొనుగోలు చేసేందుకు ఒప్పించారు. మరోవైపు సీసీఐ అధికారులు కూడా నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని తెలిపారు. 8 నుంచి 12 మధ్య శాతం తేమ ఉంటేనే పత్తిని కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. అది దాటితే క్వింటాలుకు రూ.75.21 చొప్పున కోత విధిస్తామని పేర్కొనడంతో రైతుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తేమతో సంబంధం లేకుండా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మద్దతు తెలిపారు. కలెక్టర్ ఘెరావ్..ఉద్రిక్తత ప్రైవేట్ వ్యాపారులు, సీసీఐ అధికారులు, రైతులతో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కలెక్టర్ పలుమార్లు చర్చించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ రూ.7,200కు కొనుగోలు చేసేలా ఒప్పించిన తర్వాత వాహనంలో వెళ్లేందుకు ప్రయత్నించగా రైతులు ఘెరావ్ చేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. మొత్తం మీద రాత్రి వరకు తేమ పేచీ తేలలేదు. తేమ శాతంతో సంబంధం లేకుండా పత్తి పంటను కొనుగోలు చేయాలని రైతులు పట్టుబట్టారు. కానీ నిబంధనల ప్రకారమే కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు చెప్పడం, ధర పెంచేందుకు ప్రైవేట్ వ్యాపారులు ఒప్పుకోక పోవడంతో రైతులు ఆందోళనకు దిగారు.దీంతో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌస్ ఆలం, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, మార్కెటింగ్ అధికారులు మరోసారి సీసీఐ అధికారులు, ప్రైవేట్ వ్యాపారులతో చర్చించినా ఎటూ తేలలేదు. కోపోద్రిక్తులైన రైతులు మార్కెట్ యార్డు నుంచి పంజాబ్ చౌక్ చేరుకొని రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రోడ్డుకిరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. రాత్రి వరకు ప్రైవేట్ వ్యాపారులతో చర్చలు జరిపిన జిల్లా కలెక్టర్.. చివరకు మొదటి రోజు తీసుకొచ్చిన పత్తిని తేమతో సంబంధం లేకుండా క్వింటాల్ రూ.6,696 చొప్పున శనివారం కొనుగోలు చేసేలా వ్యాపారులను ఒప్పించారు. -
ఈ ఇల్లు పాఠాలు నేర్పుతుంది
తల్లిదండ్రులు మడావి లక్ష్మణ్, కమలాబాయిలతో టీచరు ఉద్యోగం సాధించిన కుమార్తెలు కవిత, దివ్య, కళ్యాణి, టీచర్ కావడమే లక్ష్యమంటున్న చిన్నకుమార్తె కృష్ణప్రియ (కుడి చివర) ‘ఎంత మంది పిల్లలు?’ అనే ప్రశ్న వినిపించినప్పుడల్లా లక్ష్మణ్ గుండెల్లో రైళ్లు పరుగెత్తినంత పనయ్యేది. ఎందుకంటే...‘నాకు అయిదుగురు ఆడపిల్లలు’ అనే మాట లక్షణ్ నోటినుంచి వినిపించడమే ఆలస్యం ‘అయ్యో!’ అనే అకారణ సానుభూతి వినిపించేది. ‘ఇంట్లో ఒకరిద్దరు ఆడపిల్లలు ఉంటేనే కష్టం. అలాంటిది అయిదుగురు ఆడపిల్లలంటే మాటలా! నీ కోసం చాలా కష్టాలు ఎదురుచూస్తున్నాయి’ అనేవాళ్లు. అయితే వారి పెదవి విరుపు మాటలు, వెక్కిరింపులు తనపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించలేకపోయాయి. ఈ ఇల్లు పిల్లలకు బడి పాఠాలు చెప్పే ఇల్లే కాదు... ఆడపిల్లల్ని తక్కువ చేసి చూసేవారికి గుణపాఠాలూ చెబుతుంది.ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్కు చెందిన మడావి లక్ష్మణ్ బాల్యమంతా పేదరికంలోనే గడిచింది. ఆదివాసీ తెగకు చెందిన లక్ష్మణ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తరువాత ఆర్థిక కష్టాలు తీరాయి. లక్ష్మణ్– కమలాబాయి దంపతులకు మొదటి సంతానంగా ఆడపిల్ల పుట్టింది.‘ఆడపిల్ల ఇంటికి అదృష్టం’ అన్నారు చుట్టాలు పక్కాలు, పెద్దలు.రెండోసారి ఆడపిల్ల పుట్టింది. వాతావరణంలో కాస్త మార్పు వచ్చింది. ‘మళ్లీ ఆడపిల్లేనా!’ అన్నారు.‘ఇద్దరు పిల్లలు చాలు’ అనుకునే సమయంలో ‘లేదు... లేదు... అబ్బాయి కావాల్సిందే’ అని పట్టుబట్టారు ఇంటి పెద్దలు.మూడో సారి... అమ్మాయి. ‘ముత్యాల్లాంటి ముగ్గురు పిల్లలు చాలు’ అనుకునే లోపే....‘అలా ఎలా కుదురుతుంది....అబ్బాయి...’ అనే మాట మళ్లీ ముందుకు వచ్చింది.నాల్గోసారి... అమ్మాయి.‘ఇక చాలు’ అని గట్టిగా అనుకున్నా సరే... పెద్దల ఒత్తిడికి తలవొంచక తప్పలేదు.‘ఆరు నూరైనా ఈసారి కొడుకే’ అన్నారు చాలా నమ్మకంగా పెద్దలు. దేవుడికి గట్టిగా మొక్కుకున్నారు.అయిదోసారి... అమ్మాయి. ‘అయ్యయ్యో’ అనే సానుభూతులు ఆకాశాన్ని అంటాయి. అయితే లక్ష్మణ్, కమలాబాయి దంపతులు ఎప్పుడూ నిరాశపడలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయినప్పటికీ ఖర్చులకు సరిపడా జీతం రాకపోవడంతో ఖర్చులు పెరిగాయి. ‘ఎంత ఖర్చు అయినా, అప్పు చేసైనా సరే పిల్లలను బాగా చదివించాలి’ అని గట్టిగా నిర్ణయించుకున్నాడు లక్ష్మణ్. పిల్లల్ని చదివించడమే కాదు ఆడపిల్లలు అనే వివక్ష ఎక్కడా ప్రదర్శించేవారు కాదు. ఆటల్లో, పాటల్లో వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవారు. పిల్లలు బాగా చదువుకోవాలంటే బెత్తం పట్టుకోనక్కర్లేదు. వారికి నాలుగు మంచి మాటలు చెబితే సరిపోతుంది. ఆ మాటే వారికి తిరుగులేని తారకమంత్రం అవుతుంది.అయిదుగురు పిల్లల్ని కూర్చోపెట్టుకొని ‘‘అమ్మా... మీ నాయిన టీచర్. మా నాయినకు మాత్రం చదువు ఒక్క ముక్క కూడా రాదు. నాకు మాత్రం సదువుకోవాలనే బాగా ఇది ఉండే. అయితే మా కుటుంబ పరిస్థితి చూస్తే... ఇంత దీనమైన పరిస్థితుల్లో సదువు అవసరమా అనిపించేది. ఎందుకంటే సదువుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కావాలి. ఏ రోజుకు ఆరోజే బువ్వకు కష్టపడే మా దగ్గర డబ్బు ఎక్కడిది! అయినా సరే సదువుకోవాలని గట్టిగా అనుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డాను...’ అని నాన్న చిన్నప్పుడు చెప్పిన మాటలు పిల్లలపై బలమైన ప్రభావాన్ని చూపాయి. వారు చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఆ ఫలితం వృథా పోలేదు.ఇప్పుడు...రెండో కూతురు కవిత, మూడో కూతురు దివ్య, నాల్గో కూతురు కళ్యాణి ప్రభుత్వ ఉపాధ్యాయులు. చిన్న కూతురు కృష్ణప్రియ కొద్ది మార్కుల తేడాతో టీచర్ అయ్యే చాన్స్ మిస్ అయింది. అక్కలలాగే టీచర్ కావాలని కలలు కంటున్న కృష్ణప్రియకు మరోప్రయత్నంలో తన కల నెరవేర్చుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అప్పుడు ఒకే ఇంట్లో నలుగురు టీచర్లు!ఇంటర్ వరకు చదివిన పెద్ద కూతురు రత్నకుమారి చెల్లెళ్ల స్ఫూర్తితో పై చదువులు చదవాలనుకుంటోంది. వారిలాగే ఒక విజయాన్ని అందుకోవాలనుకుంటుంది. ఇప్పుడు లక్ష్మణ్ను చూసి జనాలు ఏమంటున్నారు? ‘నీకేమయ్యా... ఇంటినిండా టీచర్లే!’ ‘మీది టీచర్స్ ఫ్యామిలీ’నాన్న మాటలుతల్లిదండ్రులు మమ్మల్ని ఎప్పుడూ చిన్నచూపు చూడలేదు. వారి ఆశీర్వాద బలంతోనే టీచర్ అయ్యాను. ‘చదువే మన సంపద’ అని నాన్న ఎప్పుడూ చెబుతుండే వాడు. ఆయన మాటలు మనసులో నాటుకు΄ోయాయి.– కవిత, రెండో కుమార్తెనేను టీచర్... అక్కహెడ్మాస్టర్అక్క కవితకు, నాకు ఒకేసారి ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం నేను జైనూర్ మండలం జెండాగూడలో ఎస్జీటీగా పనిచేస్తున్నాను. మా స్కూలుకు అక్క కవితనే ప్రధానో΄ాధ్యాయురాలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మేము ఇప్పుడు ఒకే బడిలో పనిచేస్తుండటం సంతోషంగా ఉంది.– దివ్య, మూడో కుమార్తెఆరోజు ఎంత సంతోషమో!మొన్నటి డీఎస్సీలో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండలో నాకు ΄ోస్టింగ్ ఇచ్చారు. మొన్ననే విధుల్లో చేరాను. టీచర్గా మొదటి రోజు స్కూల్కి వెళ్లినప్పుడు నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ‘మా ముగ్గురు పిల్లలు టీచర్లే అని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాను’ అంటున్నాడు నాన్న.– కళ్యాణి, నాలుగో కుమార్తెటీచర్ కావడమే నా లక్ష్యంఅక్క కళ్యాణితో కలిసి నేను కూడా మొన్నటి డీఎస్సీ పరీక్ష రాశాను. కొద్ది మార్కుల తేడాతో నాకు ఉద్యోగం చేజారింది. అయితే నా లక్ష్యాన్ని మాత్రం వీడను. ఎలాగైనా టీచర్ కొలువు సాధిస్తాను.– కృష్ణప్రియ, ఐదో కుమార్తె – గోడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్ఫొటోలు: చింతల అరుణ్ రెడ్డి -
అడవిలో అన్నలు లేనట్లేనా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: వామపక్ష తీవ్రవాద ప్రాంతాల జాబితా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను కేంద్ర హోంశాఖ తొలగించింది. గత కొన్నేళ్లుగా ఇక్కడ మావోయిస్టుల కార్యక్రమాలేవి లేకపోవడం, భద్రత బలగాలు పూర్తి పట్టు సాధించడంతో ఎల్డబ్ల్యూఈ(లెఫ్ట్ వింగ్ ఎక్స్స్ట్రిమిజం ఎఫెక్టెడ్) ప్రాంతాల నుంచి తప్పించింది. గత మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం కారణంగా ప్రత్యేక పథకాల అమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భద్రత బలగాల పర్యవేక్షణ కొనసాగతున్నాయి. భవిష్యత్లో ఈ కార్యకలాపాలు క్రమంగా తగ్గనున్నాయి.ప్రత్యేక పథకాలతో నిధులుదేశంలో నక్సలిజాన్ని తగ్గించేందుకు ఆపరేషన్ ‘సమాధాన్’, రాష్ట్రంలో ‘గ్రీన్హంట్’ పేర్లతో మావోయిస్టుల ఏరివేత కొనసాగింది. 2010లో 96జిల్లాల్లో ‘మావో’ల ప్రభావం ఉండగా, 2021నాటికి 46కు పడిపోయి, తాజాగా 38జిల్లాలకు చేరింది. ఈ నెల 7న వామపక్ష ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాలను వా మపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలుగా కొనసాగించాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. గత కొన్నేళ్లుగా ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం లేకపోవడంతో ఎల్డబ్ల్యూఈ నుంచి తొలగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాలు మాత్రమే ఉన్నాయి. నక్సల్స్ కారణంగా ఎన్నికల సమయంలో ఓటింగ్ గంట ముందే నిలిపివేయడం, అధికారులు, ప్రజాప్రతినిధులకు భద్రత పెంపు, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో రాష్ట్ర, కేంద్ర బలగాల పహారా, స్థానికులపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. దేశంలో 2026నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని తగ్గించేలా కేంద్రం చర్యలు చేపట్టింది.సమసమాజ స్థాపన లక్ష్యంగాపేద, ధనిక మధ్య అంతరాలను తొలగిస్తూ భూ స్వామ్య, పెట్టుబడిదారి వ్యవస్థలకు వ్యతిరేకంగా ఐదు దశాబ్దాల క్రితం నక్సలిజం పురుడు పోసుకుంది. కార్మిక, కర్షక, రైతాంగ సమస్యల పరిష్కారానికి విప్లవ పంథాలోనే సమసమాజ స్థాపన సాధ్యమని ఆ పార్టీ ఇచ్చిన పిలుపుతో ఉమ్మడి జిల్లా నుంచి యువత నక్సలిజం వైపు మళ్లారు. మూడు దశాబ్దాలపాటు మావోయిస్టు పార్టీ గిరిజన, మైదాన ప్రాంతాలు, ఇటు సింగరేణి ప్రాంతంలో సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) సంస్థలు విప్లవ బావుటా ఎగురవేశాయి. ప్రజల మద్దతుతో అనేక పోరాటాల్లో పోలీ సులపై పైచేయి సాధించారు. లక్సెట్టిపేట, ఇంద్రవెల్లి, ఉట్నూరు, ఖానాపూర్, తిర్యాణి, సిర్పూర్, చెన్నూరు, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, ఆదిలాబాద్, జ న్నారం తదితరచోట్ల భీకర పోరాటాలు జరిగాయి. దొరల ఇళ్లపై దాడులు, దోపిడీదారులు, ప్రజాకంఠకులను ప్రజాకోర్టులో శిక్షించేవారు. ఆ సమయంలోనే నిరుపేదలకు భూపంపిణీ జరిగింది. బలగాలు, నక్సల్స్కు మధ్య నిత్యం ఘర్షణ వాతావరణం ఉండగా క్రమంగా తగ్గుముఖం పట్టింది.‘కడంబా’ ఘటన చివరిదిఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతంతోపాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలు, ప్రాణహిత, పెన్గంగా, గోదావరి తీర గ్రామాలకు గత పదేళ్లుగా కొత్త రోడ్లు, సమాచార వ్యవస్థతో మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి. రూ.కోట్లు వెచ్చించి ఆసుపత్రులు, గిరిజన యువతకు పథకాలు తె చ్చారు. దీంతో నక్సలిజం తగ్గింది. తెలంగా ణ ఏర్పడ్డాక కేబీఎం(కుమురంభీం మంచి ర్యాల) కమిటీ తిరిగి కార్యకలాపాలు సాగించేందుకు ప్రయత్నించింది. గిరిజన యువతను ఉద్యమం వైపు ఆకర్షించి దళంలో చే ర్చుకునే ప్రయత్నం చేసింది. 2020లో కాగజ్నగర్ మండలం కడంబా అడవుల్లో భద త్రా బలగాల చేతిలో ఛత్తీస్గఢ్కు చెందిన చుక్కాలు, నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్కు చెందిన బాదీరావు మృతిచెందారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర సభ్యుడు అడెళ్లు భాస్కర్ పట్టు పెంచే ప్రయత్నాలు చేసినా వీలు కాలేదు. రెండేళ్ల క్రితం ఆయన సహచరి కంతి లింగవ్వ చనిపోయింది. పార్టీ బలోపేతం లక్ష్యంగా మూడేళ్ల క్రితం ఉమ్మడి జిల్లాలో ఇంద్రవెల్లి, సిర్పూర్, మంగీ, చెన్నూరు, మంచిర్యాల ఏరియాలకు కొత్త నియామకాలు చేపట్టింది. ఈ కమిటీలు దండకారణ్యం కేంద్రంగానే కార్యకలా పాలు సాగించాయి. కోవిడ్ తర్వాత పలు మార్లు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రవేశించే ప్రయత్నాలు జరిగాయి. కానీ నిలదొక్కులేకపోయారు. ప్రస్తుతం కోల్బెల్ట్ కమిటీ పేరుతో సింగరేణి కార్మి కుల పక్షాన, స్థానిక ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూ పత్రిక ప్రకటనలు మాత్రం వెలువడుతున్నాయి. -
Konda Laxman Bapuji: ఉద్యమాల కొండ..
తెలంగాణ ప్రాంతానికి దాస్య విముక్తి కల్పించిన నాయకుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఒకరు. ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని వాంకిడి అనే కుగ్రామంలో ఒక నిరు పేద చేనేత కుటుంబంలో 1915 సెప్టెంబర్ 27న బాపూజీ జన్మించారు. భూమికోసం, భుక్తికోసం, నిజాం సంస్థానంలో సుదీ ర్ఘకాలం కొనసాగిన సంగ్రామంలో జనానికి అండగా నిలిచారు. ఆయన ఇచ్చిన ‘జై తెలంగాణ‘ నినాదం ప్రజాబాహుళ్యాన్ని జాగృత పర్చింది.1938లో తాను మెట్రిక్యులేషన్ చదువుతున్న ప్పుడే హైద్రాబాద్ స్టేట్ కాంగ్రెస్లో చేరి పౌర హక్కుల ఉద్యమం, వందేమాతర ఉద్యమం, ఆంధ్ర మహా సభల్లో క్రియాశీలక పాత్ర పోషించి పలువురు జాతీయ నాయకుల దృష్టిని ఆకర్షించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో ఆబిడ్స్ పోస్ట్ ఆఫీసుపై, కోఠిలో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీపై జాతీయ జెండా ఎగురవేసి సంచలనం సృష్టించారు. నవాబుల పాలనలో నలిగి పోతున్న ప్రజానీకాన్ని రక్షించాలంటే మీర్–ఉస్మాన్ అలీఖాన్ను అంతమొందించడం ఒక్కటే మార్గమని భావించి షోలాపూర్, బొంబాయి, అహ్మదా బాద్లలో ‘పహాడీ’ (కొండ) పేరుతో ప్రచ్ఛన్న కార్యకలాపాలు నిర్వహించి నిజాం రాజుపై బాంబు దాడికి వ్యూహం రచించారు.రెండు దఫాలు మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా సేవలందించారు. ముల్కీ ఉద్యమం నుండి మొన్నటి తెలంగాణ ఉద్యమం దాక ముందుండి నడిపించారు. కార్మికులను, చేతివృత్తుల వారిని సమీకరించి సహకార రంగం పరిధి లోకి తీసుకొచ్చారు. బీసీల స్థితిగతులను అధ్యయనం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కాకా కాలేల్కర్ కమిటీ, మండల కమిషన్లకు జనాభా దామాషా ప్రకారం రేజర్వేషన్లతో పాటు రాజ్యాధికారంలో బీసీలకు వాటా దక్కేలా చూడాలని నివేదించారు. ప్రభుత్వాలు సమగ్ర కుల గణన చేపట్టి ఆ దిశలో ముందడుగు వేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి. – డా. వంగర భూమయ్య, పాలమూరు విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులుఇవి చదవండి: భారత విప్లవ ప్రతీక! -
రూ.2.25 కోట్ల గంజాయి స్వాధీనం
ఆదిలాబాద్టౌన్: అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. బుధవారం తలమడుగు మండలంలోని మహారాష్ట్ర సరిహద్దులో లక్ష్మీపూర్ చెక్పోస్టు వద్ద పోలీసులు ఈ ముఠాలోని ఇద్దరిని అరెస్ట్ చేయగా, ఆరుగురు పరారయ్యారు. ఆంధ్ర, ఒడిశా బార్డర్ అటవీ ప్రాంతం నుంచి ఈ ముఠా దేశంలోని వివిధ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున గంజాయిని సరఫరా చేస్తోంది. ఉత్తరాఖండ్కు చెందిన కంటెయినర్ ఆదిలాబాద్ పట్టణం నుంచి మహారాష్ట్ర వైపు వెళ్తుండగా పోలీసులు తనిఖీ చేయడంతో ఈ ముఠా గుట్టు రట్టయింది. కంటెయినర్ లోపల 292 ప్యాకెట్లలో దాదాపు 9 క్వింటాళ్ల గంజాయి లభించింది. దీని విలువ సుమారు రూ.2.25 కోట్లు ఉంటుందని జిల్లా ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. ఈ కేసులో ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేశారు. అరెస్టయినవారిలో ఉత్తరప్రదేశ్కు చెందిన కంటెయినర్ డ్రైవర్ వసీమ్ అన్సారి, క్లీనర్ అర్మాన్లు ఉన్నారు. కాగా ఒడిశా రాష్ట్రం మ ల్కాజిగిరికి చెందిన ఆశిష్, యూపీలోని మీరట్కు చెందిన పండిత్జీ, మహారాష్ట్రలోని బుల్దాన, దులే జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు, అలాగే ఉత్తరాఖండ్కు చెందిన అన్షుజైన్, సోను అన్సారీలు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి ఐచర్ కంటైనర్తో పాటు 292 గంజాయి ప్యాకెట్లు, రెండు సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నారు. -
ఆదిలాబాద్లో భారీగా గంజాయి పట్టివేత
-
కవలల అడ్డా.. వడ్డాడి
ఒకే పోలికలుండే కవలలను గుర్తు పట్టడానికి ఎవరైనా తికమక పడుతుంటారు. అలాంటిది ఒకే గ్రామంలో పదుల సంఖ్యలో కవలలుంటే?.. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడిలో 20 మంది వరకు కవలలు ఉండడంతో.. ఆ గ్రామాన్ని కవలల విలేజ్గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఐదు కవలల జంటలు స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో విద్య అభ్యసిస్తుండగా.. మిగతా పిల్లలు ఇతర చోట్ల చదువుతున్నారు. గ్రామ పాఠశాలలో విరాట్–విశాల్, కావ్య–దివ్య, గౌతమి–గాయత్రి, హర్షిత్–వర్షిత్, ప్రణాళిక–ప్రత్యక్ష చదువుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
ఇటు న్యాయం! అటు సాయం!!
సాక్షి, సిటీబ్యూరో: నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు.. ఆయనకు చదువు విలువ తెలుసు.. చదువుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందో.. ఎంత గౌరవం ఉంటుందో తెలియజేసే నిలువెత్తు నిదర్శనం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల కష్టాలు స్వయంగా అనుభవించారు. అందుకే తనకు చేతనైనంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏటా విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, స్కూల్ బ్యాగ్స్, వాటర్ బాటిల్స్ అందిస్తూ సమాజ సేవకు నడుం బిగించారు. చేతనైనంత సాయం చేస్తే ప్రకృతి కూడా మనకు సాయపడుతుందని చెబుతారు న్యాయవాది సంగిశెట్టి బాబు. ఆయన గురించిన మరిన్ని విషయాలు..ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయ్పూర్లో ఓ నిరుపేద కుటుంబంలో యాదమ్మ, శంకరయ్య దంపతులకు జన్మించారు సంగిశెట్టి బాబు. చిన్నప్పటి నుంచి కడుపేదరికం అనుభవించారు. అయితే తమ జీవితాలను చదువు మాత్రమే మారుస్తుందన్న మాటను తు.చ. తప్పకుండా పాటించారు. అందుకే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కాలేజీల్లో విద్యాభ్యాసం కొనసాగించారు. అనంతరం ఎల్ఎల్బీ పూర్తి చేశారు. ఎల్ఎల్ఎంలో గోల్డ్ మెడల్ సాధించారు. లా ప్రాక్టీస్ చేసుకుంటూనే పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. చిన్నప్పుడు తాను పడ్డ కష్టాలు ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు పడొద్దనే తలంపుతో తన వంతు సాయంగా ముందడుగు వేస్తున్నారు.ఒక్క రూపాయి లేనిస్థితి నుంచి..తన తల్లిదండ్రుల పేరుతో 2016లో యాదశంకర మెమోరియల్ ఫౌండేషన్ పేరుతో ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదట. కానీ సంకల్ప బలం తోడైతే ఏదైనా సాధించవచ్చని నమ్మే బాబుకు.. విద్యా సామగ్రి పిల్లలకు అందజేసే ముందురోజు కేసులకు సంబంధించిన డబ్బులు వచ్చాయట. అందుకే తాను నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు వెళ్తున్నాన్నంటారు బాబు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో..హైదరాబాద్ చుట్టుపక్కల చాలామంది ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఆదిలాబాద్ వంటి జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లోని పిల్లలు చదువుకోవడమే కష్టం అవుతుందన్న విషయం గుర్తు చేసుకున్నారు. అంతే ఏటా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోని పలు మండలాల్లోని పిల్లలకు సామగ్రి అందజేస్తున్నారు. మౌలిక సదుపాయాలు లేక ఎవరూ చదువు మధ్యలో ఆపేయొద్దనేదే తన ఉద్దేశమని బాబు అంటున్నారు. భవిష్యత్తులో పిల్లల కోసం ఎంత కష్టమైనా తాను ముందుంటానని చెబుతున్నారు. బాబు నేపథ్యం స్ఫూర్తిదాయకం అయితే.. ఆయన సేవాగుణం ఆదర్శప్రాయం అనడంలో అతిశయోక్తి లేదు.ఇవి చదవండి: సాయపు చేతులు..! -
ఊరంతా బావులే..!
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం అడెగామ(బి) గ్రామంలో పెద్దపెద్ద బావులే దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో ఆ బావుల్లో నీరు భూ ఉపరితలానికి సమాంతరంగా.. నిండుకుండలా కనిపిస్తున్నాయి. వర్షాధారంపైనే ఆధారపడినా, వర్షాకాలం ముగిసిన తర్వాత ఈ బావుల్లోని నీటిని మోటార్ల ద్వారా పంటలకు నీటితడులు అందిస్తామని ఆ గ్రామ రైతులు చెబుతున్నారు. నీటిఎద్దడిని అధిగమించేందుకు..అడెగామ(బి)లో 309 రైతు కుటుంబాలు ఉన్నాయి. 772 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దశాబ్దాలుగా వర్షాకాలం కాకుండా ఇతర కాలాల్లో పంటలకు బావుల ద్వారే నీటితడులు అందిస్తూ రక్షించుకుంటున్నారు. బోరు వేసుకోవడం తక్కువ ఖర్చు అయినా, దాని ద్వారా సరిపడా నీరు పంటలకు అందించని పరిస్థితి ఉండడంతో ఈ గ్రామ రైతులు ప్రత్యామ్నాయంగా బావుల వైపు దృష్టి సారించారు. తద్వారా వర్షాకాలంలో నిండుకుండలా, మిగతా కాలాల్లో నీటి ప్రదాయినిగా ఈ బావులు నిలుస్తున్నాయి. ఖర్చుతో కూడుకున్నదే..బోరు 300 ఫీట్ల లోతులో వేయించినా అయ్యే ఖర్చు లక్ష రూపాయలపైనే.. అదే ఇలాంటి బావులు తవ్వించాలంటే రైతుకు సమయంతోపాటు పెద్ద మొత్తం వెచ్చించాల్సిందే. కనిష్టంగా రూ.6 లక్షల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రధానంగా పంటలకు నీరు అందించేందుకు రైతులు ఈ ఖర్చుకు వెనుకాడకపోవడం గమనార్హం. బావిని తవ్విన తర్వాత పైనుంచి సుమారు 25 ఫీట్ల వరకు సిమెంట్తో తయారు చేసిన రింగులు చుట్టూరా వేస్తున్నారు.సమృద్ధిగా నీటితడులు అందించగలుగుతున్నాంనాకు మూడెకరాల చేను ఉంది. వానాకాలంలో పత్తి, సోయా, కూరగాయలు, యాసంగిలో శనగ, కూరగాయలు సాగు చేస్తున్నా. అక్టోబర్, నవంబర్లలో పత్తి పూత, కాత దశకు వస్తుంది. ఆ సమయంలో రెండు, మూడు నీటితడులు అందిస్తే మంచి దిగుబడులు వస్తాయి. ఆ సమయంలో బోర్ల నుంచి సరిపడా నీళ్లులేని పరిస్థితి. బావుల నుంచి సమృద్ధిగా నీటితడులు అందించగలుగుతున్నాం. మిగతా పంటలకు సరిపడా నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. – శివ శంకర్, రైతు, అడెగామ(బి)బావుల్లో అధికంగా నీటి ఊటలుఅడెగామ(బి) గ్రామ పరిస్థితుల దృష్ట్యా ఆ రైతులు బావులు తవ్వించుకున్నారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో బోర్లు లోతులో అధికంగా ఉన్నప్పటికీ వెడల్పు తక్కువ ఉంటుంది. కాబట్టి నీటి ఊటలు తక్కువ స్థాయిలో వస్తాయి. అదే బావుల వెడల్పు అధికంగా ఉండడంతో భూమి పొరల నుంచి జలాలు ఎక్కువగా బావుల్లోకి వస్తాయి. తద్వారా బావుల్లో అనేక పొరల నుంచి జలాలు ఊరుతాయి. తద్వారా ఆ రైతులకు ఉపయుక్తంగా మారుతుంది. – పుల్లయ్య, భూగర్భ జలశాస్త్రవేత్త, ఆదిలాబాద్ -
#TeejFestival : ఆదిలాబాద్ : ఘనంగా తీజ్ సంబరాలు (ఫొటోలు)
-
వాగులూ... వంకలూ..
సాక్షి, నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలతో పలు జిల్లాలకు జలకళ సంతరించుకుంది. ములుగు జిల్లాలో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి 14.38 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. మల్లూరువాగు మధ్యతరహా ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 26 ఫీట్లు కాగా ప్రస్తుతం 19 ఫీట్ల నీటిమట్టం ఉంది.వాజేడు మండలం టేకులగూడెం సమీపంలో 163 నంబరు జాతీయ రహదారిపైకి గోదావరి వరద చేరడంతో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మధ్యన రాకపోకలు నిలిచిపోయాయి. చీకుపల్లిలోని బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చి ప్రవహిస్తోంది. ⇒ వరంగల్ జిల్లా ఖానాపురం మండలం పాకాల సరస్సు 30.3 ఫీట్లకు 21.9 అడుగులకు నీటిమట్టం చేరింది. ⇒ హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి శివారు మధ్యతరహా చలివాగు ప్రాజెక్టు సామర్థ్యం 18 ఫీట్లు ఉండగా.. ప్రస్తుతం నీటి మట్టం 15.2ఫీట్లకు చేరి నిండుకుండను తలపిస్తోంది. ⇒ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాన జోరు తగ్గడం లేదు. వర్షాలతో పంటలు నీట మునుగుతున్నాయి. పత్తి చేలల్లో ఇసుక మేటలు వేశాయి. ప్రాణహితకు భారీగా వరద పోటెత్తడంతో వేమనపల్లి పుష్కరఘాట్ వద్ద తెలంగాణ–మహారాష్ట్ర మధ్య నడిచే నాటుపడవలను నిలిపివేశారు.వాగులో ఇద్దరు గల్లంతుచెట్టు కొమ్మ పట్టుకొని ఒకరు బయటకు..జాడ తెలియని మరొకరు ఉట్నూర్ రూరల్: రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో ఒకరు గల్లంతైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని చోటు చేసుకుంది. బొప్పరికుంట గ్రామానికి చెందిన టేకం రాజు, టేకం లక్ష్మణ్(28) సొంత పనులపై ఉట్నూ ర్కు సాయంత్రం వచ్చారు.పని ముగించుకొని తిరిగి రాత్రి గ్రామానికి కాలినడకన బయలుదేరారు. గంగాపూ ర్ వద్ద వాగు దాటే క్రమంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఇద్దరు కొట్టుకుపోయారు. రాజు చెట్టు కొమ్మ పట్టుకొని బయటకు వచ్చాడు. లక్ష్మణ్ వాగులో గల్లంతయ్యాడు. రెస్క్యూ టీం సాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గాలింపునకు అంతరాయం కలిగింది. -
అందరి మాటతోనే ‘భరోసా’
సాక్షి, ఆదిలాబాద్: ‘రైతు భరోసాను నిర్దిష్టంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో ఓపె న్ మైండ్తో ఉన్నాం. మాకు మేము ఏదో నిర్ణయం తీసుకోవడం లేదు. అందరితో చర్చించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలనే సదుద్దేశంతోనే ఉన్నాం. అన్ని జి ల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ పర్యటించి ప్రజాక్షేత్రంలో అభిప్రాయాలు సేకరించి...అసెంబ్లీలో నివేదిక పొందుపరుస్తాం. రైతుభరోసా పేద, బడుగువర్గాలకు న్యాయం చేసేదిగా ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు ఖరారు కాలేదు. గ్రామం యూనిట్గా తీసుకోవాలని ఎక్కువమంది రైతులు సూచిస్తున్నారు.. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కుమురంభీం కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల నుంచి అభిప్రాయాలు, సలహాల ను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది. ఈ కమిటీ చైర్మన్ మ ల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల్లో కీలకమైన రైతుభరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి తీరుతామని డిప్యూటీ సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. నిజమైన రైతులకే రైతుభరో సా అందించేందుకు అన్నివర్గాల ప్రజల నుంచి అభిప్రాయా లు స్వీకరిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మరోమంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాట్లాడు తూ ఇంకా ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు రైతులకు భూమికి సంబంధించి సరైన పత్రాలు కూడా లేవని తెలిపారు. ఇలా అన్ని విషయాల్లోనూ ఆలోచన చేస్తామని చెప్పా రు. ఎకరం భూమి లేకున్నా, ఏదో ఒకవిధంగా సాగు చేస్తు న్న రైతులకు లబ్ధి చేకూర్చాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా బడ్జెట్లో 20 శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు కోరారు.వైఎస్ అమలు చేసిన కౌలురైతు చట్టాన్ని తీసుకురావాలి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2011లో అమలు చేసిన కౌలు రైతు చట్టాన్ని తీసుకురావాలని రైతులు, రైతు సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాగుచేస్తున్న వారిలో 30 నుంచి 40 శాతం మంది కౌలురైతులే ఉన్నారని వివరించారు. 95 శాతం ఆత్మహత్య లు కౌలు రైతులవేనని పేర్కొన్నారు. పట్టాదారులకు భరోసా కల్పించి కౌలు రైతులకు న్యాయం చేయాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరారు. రైతు భరోసానే కాకుండా మిగతా వాటి విషయంలోనూ కౌలు రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాలన్నారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో పహాణీలు, పోడు భూముల సమస్య కారణంగా మెజారిటీ రైతులు ప్రభుత్వ సాయం పొందలేక పోతున్నారన్నారు. పేద, దళిత, గిరిజన రైతులకు రైతు భరో సా అందించాలని పలువురు కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ప్రత్యేకంగా తీసుకొని పదెకరాలు సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు. ఎంపిక చేసిన వారితోనే మాట్లాడించారు ఎంపిక చేసిన రైతులతోనే మాట్లాడిస్తున్నారని నిజమైన రైతులతో మాట్లాడించడం లేదని కొందరు ఆరోపించారు. దీంతో స్పెషల్ రోప్ పార్టీ పోలీసులు ఎంటర్ అయ్యారు. వేదిక ముందు ప్రజాప్రతినిధులకు రక్షణగా ఇటువైపు నుంచి అటు వైపు వరకు కూర్చున్నారు. కాగా రైతులను తాము ఎంపిక చేయలేదని, వ్యవసాయ అధికారులే గుర్తించారని ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. కాగా కేబినెట్ సబ్కమిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
విద్యుత్ స్తంభంపైనే ఆగిన ఊపిరి
ఆదిలాబాద్ రూరల్: ఓ ఇంటికి విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో మరమ్మతులు చేసేందుకు కరెంట్ స్తంభం ఎక్కిన ప్రైవేటు ఎలక్ట్రీషియన్.. దానిపైనే షాక్కు గురై మృతిచెందాడు. ఆదిలాబాద్ జిల్లా రాములుగూడలో ఈ ఘటన జరిగింది. ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని రాములుగూడ గ్రామానికి చెందిన దడంజే మోతీరాం (35) కొన్నేళ్లుగా ప్రైవేట్ ఎలక్ట్రీషియన్గా పని చేస్తున్నాడు. ఆదివారం ఓ ఇంటికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో మోతీరాంను పిలిచారు. ఆయన వచ్చి సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ స్తంభం ఎక్కాడు.అయితే పైనుంచి వెళ్తున్న త్రీఫేజ్ విద్యుత్ తీగలు తగలడంతో షాక్కుగురై అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మోతీరాం మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన చేశారు. తమకు పరిహారం చెల్లించే వరకు మృతదేహాన్ని కిందకు దించొద్దని డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు అక్కడికి రావడం ఆలస్యం కావడంతో మోతీరాం మృతదేహం స్తంభంపైనే నాలుగు గంటలపాటు ఉండిపోయింది. పోలీసులు, విద్యుత్ అధికారులు బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.మోతీరాం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా మోతీరాం మృతికి.. తమకు ఎలాంటి సంబంధం లేదని మండల విద్యుత్ శాఖ అధికారి తిరుపతిరెడ్డి తెలిపారు. విద్యుత్ స్తంభంపైకి ఎక్కిన మోతీరాం తమ లైన్మన్, జూనియర్ లైన్మన్కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. -
ఈ ఏడాది.. వికసించిన 'మే పుష్పం' ఇదే!
వాతావరణంలో జరిగే కాలాల మార్పుల కారణంగా అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. ప్రతీ సంవత్సరం కేవలం మే నెలలో మాత్రమే ఈ పువ్వు పూస్తుందట. మరి అదేంటో చూసేద్దామా!ఆదిలాబాద్, సోన్ మండలంలోని న్యూవెల్మల్ గ్రామంలో మే పుష్పం వికసించింది. ఏటా మే నెలలో మాత్రమే పూసే ఈ పువ్వు గ్రామానికి చెందిన ఎలుగు రాజలింగం ఇంటి ఆవరణలో మంగళవారం వికసించింది. ఒకేసారి మూడు పువ్వులు పూయడం సంతోషంగా ఉందని రాజలింగం కుటుంబ సభ్యులు తెలిపారు. ఈఏడాది మొత్తం ఐదు పువ్వులు పూశాయని పేర్కొన్నారు. ఈ పూలను చూసేందుకు స్థానికులు తరలి వస్తున్నట్లు వారు తెలిపారు.ఇవి చదవండి: కోటి థెరపీల ఉత్సవం! ఏఎస్డీ..? -
రైతులపై దాడి.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: అదిలాబాద్లో రైతన్నలపైన లాఠీచార్జిని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతన్నలపైన దాడి చేసిన ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. ‘‘ రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉండడం సిగ్గుచేటు. రాజకీయాలు పక్కన పెట్టి రైతన్నల సమస్యలను పట్టించుకోవాలని ముఖ్యమంత్రికి సూచన. ఐదు నెలల్లోనే రాష్ట్రం వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోవడం ముమ్మాటికి ప్రభుత్వ పరిపాలన వైఫల్యమే. రాష్ట్రంలో రైతన్నల సమస్యలపైన ముఖ్యమంత్రి వెంటనే ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించాలి. రైతన్నలపైన లాఠీచార్జ్ చేసిన అధికారులపైన కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలి. రైతన్నలపైన ప్రభుత్వ దాడులు బిఆర్ఎస్ పార్టీ ఊరుకోదు’’అని కేటీఆర్ మండిపడ్డారు.‘‘ విత్తనాల కోసం బారులు తీరిన రైతన్నలపై లాఠీచార్జ్ అత్యంత దారుణం, ఇది రైతన్నలపైన ప్రభుత్వ దాడి. ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లో రాష్ట్ర వ్యవసాయం ముఖ్యంగా రైతన్నల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. రైతన్నలకు కావాల్సిన సాగునీటి నుంచి మొదలుకొని, రైతుబంధు పెట్టుబడి సహాయం వరకు, చివరికి కనీసం విత్తనాలు అందించలేని దుర్మార్గపూరిత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మార్పు తెస్తాం, ప్రజా పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ రైతన్నలపైన లాఠీఛార్జ్ పేరుతో దాడులు చేయడమే కాంగ్రెస్ పార్టీ తీసుకువస్తామన్న మార్పా?’’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు.ఆదిలాబాద్ లో రైతన్నలపై లాఠీచార్జిని తీవ్రంగా ఖండించిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.రైతన్నలపై దాడి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలి.రాష్ట్రంలో రైతన్నలపైన దాడులు జరుగుతుంటే ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం, ఢిల్లీ పర్యటనలో బిజీగా… pic.twitter.com/5ZVCew2IKV— BRS Party (@BRSparty) May 28, 2024 -
గాలి వాన బీభత్సం
కైలాస్నగర్/నిజామాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన బీభత్సం సృష్టించింది. సాయంత్రం 4 గంటల వరకు ఎండ దంచికొట్టగా.. అనంతరం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రెండు జిల్లాల పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి వాంకిడి సమీపంలో గల జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలకొరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.తాంసిలో ఓ ఇంటి ఆవరణలో గల కొబ్బరిచెట్లు విరిగి పడ టంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు తెచి్చన జొన్నలు తడిసిపోయాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందు లు పడ్డారు. తలమడుగు మండలం ఉండం గ్రామ సమీపంలోని 33 కేవీ వి ద్యుత్ స్తంభం విరిగిపడటంతో తాంసి, తలమడుగు మండలాల్లోని పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తలమడుగు మండలంలోని పూనగూడ, పల్సి–బి, పల్సి–కే గ్రామాలలో ఈదురుగాలుల దెబ్బ కు పలు ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. బోథ్ మండలం మర్లవాయిలో ఇంటి పైకప్పుపై ఉన్న రేకులు ఎగిరిపోయి విద్యుత్వైర్లపై పడ్డాయి. -
Lok Sabha Election 2024: రెండు రాష్ట్రాల్లోనూ ఓటు!
ఒకే ఓటరుకు రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఓటు వేసే అవకాశం వస్తే? అవి కూడా రెండు రాష్ట్రాల పరిధిలోని స్థానాలైతే! అదెలా అనుకుంటున్నారా? చట్టబద్ధంగా అయితే అవకాశం లేదు. కానీ ఒకటో రెండో కాదు... ఏకంగా 14 గ్రామాల ప్రజలకు ఇలా రెండు రాష్ట్రాల పరిధిలో ఓటు హక్కుంది. ఒక్కొక్కరికి రెండు ఓటరు గుర్తింపు కార్డులున్నాయి. అంతే కాదు, రెండు రాష్ట్రాల తరఫునా సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నారు. ఈ గమ్మత్తేమిటో తెలుసుకోవాలంటే ఆదిలాబాద్ జిల్లా కెరమెరి, మహారాష్ట్రలోని జీవతి తాలూకాలకు వెళ్లాల్సిందే... 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో 14 గ్రామాలు ఎవరికి చెందాలన్నది ఎటూ తేలలేదు. ఇవి పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీల పరిధిలో 30 కిలోమీటర్లలో విస్తరించి ఉన్నాయి. వాటిలో 6,000 మంది నివసిస్తున్నారు. వారికి రెండు రాష్ట్రాల తరఫున ఓటరు ఐడీ కార్డులు, ఆధార్లు, కులం సర్టిఫికెట్లు ఉన్నాయి. ఈ ఊళ్లలో స్కూళ్లు కూడా తెలుగు, మరాఠీ మాధ్యమాల్లో రెండేసి ఉంటాయి! ఈ గ్రామాలు అటు మహారాష్ట్రలోని చంద్రపూర్ లోక్సభ స్థానంతో పాటు ఇటు తెలంగాణలోని ఆదిలాబాద్ లోక్సభ పరిధిలోకి కూడా వస్తాయి! సర్పంచ్లూ ఇద్దరు పరందోలి, అంతాపూర్ గ్రామ పంచాయితీలకు ఇద్దరేసి సర్పంచ్లు ఉండటం మరో విశేషం. వీరు తెలంగాణ, మహారాష్ట్రలో వేర్వేరు పారీ్టలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 14 గ్రామాల వారికీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అభివృద్ధి నిధులు కూడా వస్తుంటాయి. సంక్షేమ పథకాల ప్రయోజనాలూ అందుతున్నాయి. రెండువైపులా ఓటు అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో తాము రెండు రాష్ట్రాల్లోనూ ఓటు వేస్తూ వస్తున్నట్టు పరందోలి సర్పంచ్ లీనాబాయ్ బిరాడే మీడియాతో చెప్పడం విశేషం. ఆయనది మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ‘‘రెండు రాష్ట్రాల్లోనూ ఒకే తేదీన పోలింగ్ ఉంటే మాకు వీలైన స్థానంలో ఓటేస్తాం. వేర్వేరు తేదీల్లో ఉంటే మాత్రం రెండు రాష్ట్రాల్లోనూ ఓటేస్తాం. రెండు రాష్ట్రాల నుంచి మాకు సౌకర్యాలు అందుతున్నాయి’’ అని లీనాబాయ్ వివరించారు. చంద్రాపూర్ లోక్సభ స్థానానికి ఏప్రిల్ 19న తొలి విడతలో పోలింగ్ ముగిసింది. అందులో ఈ 14 గ్రామాల ఓటర్లు పాల్గొన్నారు. ఇప్పుడు సోమవారం నాలుగో విడతలో ఆదిలాబాద్ లోక్సభ స్థానానికి కూడా ఓటేయనున్నారు! ఒకచోట తొలగించండి...! ఇలా రెండు లోక్సభ స్థానాల పరిధిలో రెండుసార్లు ఓటేయడం సరికాదని ఎన్నికల అధికారులు అంటున్నారు. దీనిపై చంద్రాపూర్, ఆదిలాబాద్ జిల్లా అధికారులు ఇటేవలే వారితో సమావేశం కూడా నిర్వహించినట్టు చంద్రాపూర్ కలెక్టర్ వినయ్ గౌడ వెల్లడించారు. రెండుసార్లు ఓటేయడం చట్ట విరుద్ధమని ఆయా గ్రామాల ప్రజలకు చెప్పామన్నారు. స్థానిక నేతలు మాత్రం రెండు చోట్ల ఓటు వేయవద్దని తమకు చెప్పేముందు తమ గ్రామాలు ఏ రాష్ట్రం పరిధిలోకి వస్తాయో తేల్చాలని కోరుతున్నారు. ‘‘మేము రెండుసార్లు ఓటు వేస్తున్నాం. ఇది చట్టవిరుద్ధమైతే సమస్యను పరిష్కరించాల్సిందిగా రెండు రాష్ట్రాలను ఎన్నికల సంఘం కోరాలి. ఒక నియోజకవర్గ పరిధి నుంచి మా ఓట్లను తొలగించమనండి. మాకు సమస్యేమీ లేదు. కాకపోతే మేము మహారాష్ట్రకు చెందుతామా, లేక తెలంగాణకా అన్నది తేల్చాలి’’ అని పరందోలి సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు నింబదాస్ పతంగె అన్నారు. ‘‘ఈ 14 గ్రామాల వారు మహారాష్ట్ర, తెలంగాణల్లో ఏదో ఒక్క చోటే ఓటేయాలి. ఇప్పటికే చంద్రపూర్ లోక్సభ స్థానం పరిధిలో ఓటేసిన వారిని మళ్లీ ఓటేయడానికి అనుమతించొద్దు. తెలంగాణ ప్రభుత్వానికి ఈ మేరకు సూచించాలని ఈసీని కోరాం’’ – ఎస్.చొక్కలింగం, మహారాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘ఆయన’గెలిచారు..ఆమెకు తెలియదు
సాక్షి, ఆదిలాబాద్: జీవితంలో ఎవరైనా ఏదైనా సక్సెస్ సాధిస్తే మొదట కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకుంటారు.. అయితే మాజీ ఎంపీ మధుసూదన్రెడ్డికి మాత్రం ఈ సంతోషం పంచుకునేందుకు ఆ అవకాశం లేకుండా పోయింది.. ఆయన భార్య అప్పటికే విగత జీవి.. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖరారైన తర్వాత కొద్ది రోజులకు ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు కారులో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా తుప్రాన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోగా ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మార్చిలో ఈ ప్రమాదం జరగగా ఏప్రిల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. మూడేళ్ల తర్వాత ఆయన ఎంపీగా ఉన్న కాలంలోనే ఆమె అదే పరిస్థితిలో ఈ లోకం విడిచి వెళ్లిపోయింది.న్యాయవాద వృత్తి నుంచి..ఆదిలాబాద్లో టి.మధుసూదన్రెడ్డి అప్పటికే దశాబ్దాలుగా ప్రముఖ న్యాయవాదిగా పేరు గడించారు. అప్పుడు 58 ఏళ్ల మధ్య వయస్సు.. భార్య భూలక్ష్మి, అప్పటికే పెళ్లిళ్లు జరిగిన కుమారుడు ప్రకాష్రెడ్డి, కూతురు సంగీత, మనుమలు, మనుమరాళ్లతో సంతోషంగా గడుపుతున్నారు. 2004లో ఆయనకు బీఆర్ఎస్ నుంచి ఆదిలాబాద్ ఎంపీ టిక్కెట్ ఖరారైంది. మార్చి 1న ఆయన ఆదిలాబాద్కు చెందిన ఓ న్యాయవాది కూతురి వివాహం హైదరాబాద్లో ఉండడంతో మధుసూదన్రెడ్డి భార్య భూలక్షి్మతో కలిసి కారులో డ్రైవర్తో సహా బయల్దేరి వెళ్లారు. అయితే మార్గమధ్యలో మధుసూదన్రెడ్డి కారు నడుపుతుండగా భార్య ముందర కూర్చుంది.డ్రైవర్ వెనుక సీటులో ఉన్నాడు. తుప్రాన్ వద్ద అనుకోని పరిస్థితిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భూలక్షి్మకి తీవ్ర గాయాలు కాగా మధుసూదన్రెడ్డికి మెడ వద్ద స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ఈ ఇద్దరిని హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే భూలక్ష్మి కోమాలోకి వెళ్లిపోయింది. మధుసూదన్రెడ్డి చికిత్స అనంతరం తేరుకున్నారు. ఏప్రిల్ 20న 14వ లోక్సభ మొదటిదశ ఎన్నికలు జరిగాయి. మే 13న ఫలితాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మధుసూదన్రెడ్డి 4,15,429 ఓట్లు, టీడీపీ అభ్యర్థి వేణుగోపాల్చారి 3,74,455 ఓట్లు సాధించారు. ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ప్రముఖ న్యాయవాదిగా తన విజయాన్ని చూసిన భాగస్వామి భూలక్ష్మి ప్రజాప్రతినిధిగా ఎంపికయ్యారన్న విషయం కూడా తెలియకుండానే కోమాలోనే 2007లో ఆమె కన్ను మూశారు.మొదటిసారి ఎన్నికల్లో..బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీ 2001 సంవత్సరంలో ఆవిర్భవించింది. 2004 సాధారణ ఎన్నికల్లో యూపీఏ భాగస్వామ్య పార్టీలతో కలిసి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసింది. కాంగ్రెస్, వామపక్ష పార్టీలతో కలిసి రాష్ట్రంలో పోటీ చేసింది. కొత్త పార్టీగా ఆ ఎన్నికల్లో 26 అసెంబ్లీ స్థానాలతో పాటు ఐదు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొందింది. ఈ ఎన్నికల్లోనే ఆదిలాబాద్ ఎంపీగా మధుసూదన్రెడ్డి గెలిచారు. ఆ ఐదుగురు ఎంపీల్లో పార్టీ అధినేత కేసీఆర్ కరీంనగర్ నుంచి గెలుపొందగా మెదక్ నుంచి ఆలె నరేంద్ర, హన్మకొండ నుంచి బి.వినోద్ కుమార్, వరంగల్ నుంచి దరావత్ రవీందర్ నాయక్ ఉన్నారు. దేశంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఉండగా, ఆ దిశగా యూపీఏ ప్రభుత్వం నుంచి ఎలాంటి ముందడుగు లేకపోవడంతో 2006లో బీఆర్ఎస్ యూపీఏ నుంచి వైదొలిగింది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. అందులో మధుసూదన్రెడ్డి కూడా ఉన్నారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో మధుసూదన్రెడ్డి తిరిగి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆదిలాబాద్ నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రకరణ్రెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. దీంతో కృంగిపోకుండా ఆయన తిరిగి న్యాయవాది వృత్తి చేపట్టడం గమనార్హం. 2015లో ఆయన గుండెపోటుతో మృతి చెందారు. -
ఎన్నికల తర్వాత రేవంత్ అక్కడికే: కేటీఆర్
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ముఖ్యమైన మార్పులు జరుగుతాయని, ఇందులో ప్రధానమైన మార్పు సీఎం రేవంత్రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం(ఏప్రిల్16) ఆదిలాబాద్లో జరగిన బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్లో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్లో గెలిచిన ఎంపీలను తీసుకుని రేవంత్ బీజేపీలోకి పోవడం ఖాయమన్నారు. ‘రాహుల్ గాంధీ మోదీ ని చౌకీదార్ చోర్ హై అంటే..రేవంత్రెడ్డి మాత్రం మా పెద్దన్న అంటున్నాడు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ అంటే.. రేవంత్రెడ్డి తెలంగాణను గుజరాత్ చేస్తానంటున్నాడు. రాహుల్ అదానీ చొర్ అంటే రేవంత్ అదానీ ఫ్రెండ్ను అంటాడు. రాహుల్గాంధీ లిక్కర్ స్కామ్ జరగలేదు,కేజ్రీవాల్ అరెస్ట్ తప్పు అంటే రేవంత్ లిక్కర్ స్కాం జరిగింది కవితను,కేజ్రీవాల్ను అరెస్ట్ చేయడం సబబే అంటాడు. రేవంత్ కాంగ్రెస్ పార్టీ కొసం పనిచేస్తున్నాడా లేక బీజేపీ కోసం పనిచేస్తున్నాడా?తెలంగాణలో జరగనున్న అన్ని ఎన్నికల్లో ఎగిరేది గులాబి జెండానే. జేబుల్లో కత్తెర పెట్టుకొని రేవంత్రెడ్డి తిరుగుతున్నాడు. పేగులు మెడలో వేసుకుంటా అంటున్నావ్.. అసలు నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోడివా? మేం మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం అని ప్రచారం చేస్తున్నావ్.. నువ్వు అయిదేళ్ళు ఉండాలి. ప్రజలు నిన్ను తరిమికొట్టాలి. బీజేపీ మేకిన్ ఇండియా అని మాటలు చెప్పి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోంది. శ్రీరాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదీ చదవండి.. కవితకు బ్యాడ్టైమ్.. బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా -
5 జిల్లాల్లో 43 డిగ్రీల పైనే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, జోగుళాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో 43.3 డిగ్రీల సెల్సియస్, సంగారెడ్డిలో 43.2 డిగ్రీలు, ఆదిలాబాద్లో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలోని 18 మండలాలకు చెందిన 20 గ్రామాల్లో 43 డిగ్రీలు దాటిపోయింది. ఈ జిల్లాలోని మాడుగులపల్లి మండల కేంద్రంతోపాటు మునుగోడు మండలం గూడాపూర్లో 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దామరచర్ల మండల కేంద్రం, అనుముల మండలం ఇబ్రహీంపేట, కనగల్ మండల కేంద్రం, మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామాల్లో 43.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఎండలు తీవ్రం కావడంతో వడదెబ్బ కారణంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు మృతిచెందారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం వెంకటాద్రిపేట గ్రామానికి చెందిన గాదె జయపాల్రెడ్డి (55) గురువారం వడదెబ్బకు గురికాగా హనుమకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందాడు. మహబూబాబాద్ జిల్లాలో సికింద్రాబాద్ తండా గ్రామానికి చెందిన ధరావత్ మంచ్యా (55) వడదెబ్బకు గురై శుక్రవారం మృతిచెందాడు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీకి చెందిన స్వర్ణలత (45) రెండ్రోజుల క్రితం నిజామాబాద్లో పెళ్లికి హాజరైంది. ఎండల తీవ్రతతో అస్వస్థతకు గురైంది. నిర్మల్కు వచి్చన తర్వాత గురువారం రాత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందింది. అలాగే నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం శ్రీరంగాపూర్ గ్రామానికి చెందిన రైతు మర్రిపల్లి ఈరయ్య (70) పొలం పనులకు వెళ్లి ఎండ దెబ్బతగలడంతో గురువారం మృతి చెందాడు. -
Test article qid_1234570
test body text 1st para- test article text test body text 2nd para - test article text -
మండుతున్న ఎండలు.. తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. ఇక, ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో మంగళవారం 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లాలోని తలమడుగు, జైనథ్ మండలాల్లో మంగళవారం గరిష్ఠంగా 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. బేల మండలం చప్రాలలో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. ఇక, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్లో 42 డిగ్రీలు నమోదైంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40.8 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 26.03.2024 DAILY WEATHER REPORT OF TELANGANA pic.twitter.com/Uxr05ZS5oZ — mchyderabad dwr (@mchyderaba94902) March 26, 2024 మరోవైపు.. రానున్న మూడు రోజులు కూడా సాధారణం కన్నా రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. కాగా.. రాష్ట్ర అభివృద్ధి, ప్రణాళికా సంస్థ ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ‘ఆరెంజ్’ హెచ్చరికలను జారీచేసింది. ఎండలో పనిచేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు సైతం ఎండలో తిరగరాదని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పలుచోట్ల వర్షం కురిసిన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
తడారిన తండాలు ..ఏజెన్సీ ప్రజల పాట్లు
ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ రూరల్ మండలంలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఇక్కట్లు మొదలయ్యాయి. ఖండాల గ్రామంలో మిషన్ భగీరథ నీరు వారం, పది రోజులకోసారి సరఫరా అవుతోంది. దీంతో గ్రామస్తులు సమీపంలోని వ్యవసాయ బావి వద్దకు వేకువనే కాలినడకన వెళ్లి తెచ్చుకోవలసిన దుస్థితి. పూనగూడ గ్రామస్తులు ఎడ్లబండిపై నాలుగైదు కి.మీ. దూరంలోని చెరువు, బావుల నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఆయా గ్రామాల్లో ఆదివారం వేకువజామున కనిపించిన దృశ్యాలివి. – ఆదిలాబాద్ రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
కాంగ్రెస్లో చేరిన కోనప్ప
కాగజ్నగర్ రూరల్: సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగజ్ నగర్ పట్టణంలోని విన య్ గార్డెన్లో గురువా రం నిర్వహించిన సమా వేశంలో ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క కండువా కప్పి కోనప్పను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కోనప్పతోపాటు ఆయన సోదరుడు, ఇన్చార్జ్ జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కాగజ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ షాహీనా సుల్తానా, వైస్చైర్మన్ రాజేందర్, పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ముఖ్య నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదిలాబాద్ ఎంపీ స్థానాన్ని గెలిపించడానికి కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్రావు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రావి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
BRS Party: మల్కాజ్గిరి, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థుల ప్రకటన
సాక్షి, హైదరాబాద్: మరో రెండు లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీరిద్దరి పేర్లను అధికారికంగా నేడు వెల్లడించింది బీఆర్ఎస్. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి వరకు బీఆర్ఎస్ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ నేడు భేటీ అయ్యారు.. నందినగర్లోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై చర్చించారు. ఈఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ మంత్రులు వేణుగోపాలచారి, జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. అయితే కేసీఆర్ సమావేశానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ భేటీలోనే రెండు పార్లమెంట్ స్థానాల అభ్యర్ధి ఎంపిక విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నగేష్ ఇటీవలే బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావును కాదని కాషాయ పార్టీ నగేష్కు టికెట్ కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు లోక్ సభ టికెట్ కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రకటించిన పార్లమెంటు స్థానాలు 1) ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు 2) మహబూబాబాద్ -(ఎస్టీ) మాలోత్ కవిత 3) కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్ 4)పెద్దపల్లి(ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్ 5) మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి 6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ 7) వరంగల్ (ఎస్సీ)-డాక్టర్ కడియం కావ్య 8 ) జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్ 9) నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి -
'బీజేపీ టికెట్' నగేశ్కే..
ఆదిలాబాద్: బీజేపీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా గోడం నగేశ్ పేరునే ఆ పార్టీ అధిష్టానం ఖరా రు చేసింది. ఇటీవలే ఆయన బీఆర్ఎస్ నుంచి కమలం పార్టీలో చేరగా తాజాగా టికెట్ కూడా ఆయనకే కేటాయించారు. సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు కు చుక్కెదురైంది. కాగా ఆయన కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే లంబాడా సామాజిక వర్గంలో ఎవరికై నా టికెట్ ఇవ్వాలని ఆ సామాజికవర్గ నేతలనుంచి డిమాండ్ వ్యక్తం కాగా రాజకీయ సమీకరణల్లో భాగంగా ఈ స్థానాని కి ఆదివాసీ అభ్యర్థి వైపే మొగ్గు చూపారు. మహబూబాబాద్లో లంబాడా నేత సీతారాం నాయక్కు చోటు కల్పించగా, ఇక్కడ గోండు అయిన నగేశ్కు స్థానం కల్పించారు. దీంతో పార్టీ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, మార్కె ట్ కమిటీ మాజీ చైర్మన్ జాదవ్ రాజేశ్బాబు, అభినవ్ సర్దార్, ఇతరులకు నిరాశ తప్పలేదు. ఢిల్లీ పరిణామాల తర్వాత.. బీఆర్ఎస్కు చెందిన మాజీ ఎంపీ గోడం నగేశ్ గత ఆదివారం ఢిల్లీలో కమలం పార్టీలో చేరారు.ఆ రోజు ఐదుగురు నేతలు కాషాయం కండువా కప్పుకోగా అందులో అజ్మీరా సీతారాం నాయక్, గోమాస శ్రీని వాస్,సైదారెడ్డితోపాటు నగేశ్కు ఈరోజు టికెట్ ఖ రారు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే నగేశ్ పార్టీ లో చేరిన మరుసటి రోజే పార్టీలో టికెట్ ఆశిస్తున్న నేతలు ఢిల్లీ బాట పట్టారు. వారితో పాటు పార్టీ ముఖ్య బాధ్యులు కూడా హస్తినకు చేరుకున్నారు. అగ్రనేతలను కలిశారు. పార్టీలో కొత్తగా చేరే వారికి టికె ట్ ఇవ్వవద్దని, ఈ పార్లమెంట్ స్థానంలో సమర్థులై న నాయకులున్నారని, నగేశ్కు టికెట్ ఇస్తే సహకరించమని అధిష్టానానికి స్పష్టం చేశారు. దీంతో నగేశ్కు టికెట్ ఇవ్వకపోవచ్చనే ప్రచారం సాగింది. అయితే అధిష్టానం మాత్రం ఆ నేతవైపే ఆసక్తి కనబరుస్తూ ఎంపిక చేసింది. దీంతో ఆశావహులకు చుక్కెదురైంది. మూడు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో.. నగేశ్ మూడు దశాబ్దాలుగా క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆతర్వాత బీఆర్ఎస్లో చేరారు. తాజా గా బీజేపీలో చేరి ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చే యనున్నారు. కాగా 2014లో పార్లమెంట్ ఎన్నికల కు ముందే ఆయన టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎంపీగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసినప్పటికీ బీజేపీ అభ్య ర్థి సోయం చేతిలో ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎ న్నికల్లో బోథ్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రయత్నించినా టికెట్ దక్కలేదు. బయోడెటా.. పేరు: గోడం నగేశ్ తల్లిదండ్రులు: భీమాబాయి, రామారావు భార్య: లత (గృహిణి) సంతానం: కూతురు మనోజ్ఞ(లా చదువుతోంది), కుమారుడు రిత్విక్(లండన్లో ఎంబీఏ పూర్తి చేశాడు) కులం: ఎస్టీ (గోండు) విదార్హతలు: ఎంఏ, ఎంఈడీ పదవులు: 1994, 1999, 2009లో టీడీపీ నుంచి బోథ్ ఎమ్మెల్యేగా గెలుపు. తొలిసారి గెలిచినప్పుడే గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఎన్టీఆర్ ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. 2014లో బీఆర్ఎస్లో చేరిక.. ఆదిలాబాద్ ఎంపీగా గెలుపు. తండ్రి రామారావు రెండు సార్లు బోథ్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపు. ఎన్టీఆర్ కేబినెట్లో గిరిజన సంక్షేమశాఖమంత్రిగా పనిచేశారు. ఇవి చదవండి: పారాచూట్లకే ప్రాధాన్యం! -
ఆదిలాబాద్ లో కాక రేపుతున్న చేరికలు
-
నా జీవితం దేశం కోసం అంకితం..
-
రేవంత్.. మోదీ పెద్దన్న ఎలా అవుతారు?: కవిత సీరియస్
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీని పెద్దన్న అని సంభోదించిన సీఎం రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ పెద్దన్న ఎలా అవుతాడో చెప్పాలన్నారు. కాగా, ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీని రేవంత్ పెద్దన్న అని సంభోదించారు. దీంతో, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అని అర్ధం అవుతుంది. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని మోదీ.. ఎలా పెద్దన్న అవుతాడని ప్రశ్నించారు. ఇదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం కొత్తగా జీవో నంబర్-3ను తీసుకొచ్చింది. ఈ జీవోను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. దీనికి నిరసనగా ఈనెల ఎనిమిదో తేదీన మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్లో నల్ల రిబ్బన్లతో ధర్నాలో పాల్గొంటాం. నిరసన కార్యక్రమాలు చేపడతాం. మహిళలకు, అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. 33 శాతం రావాల్సిన రిజర్వేషన్ పూర్తిగా వెనక్కి పోయింది. రోస్టర్ విధానంతో ఎక్కువ మంది మహిళలకు ఉద్యోగాలు రాకుండా పోయే ప్రమాదం ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. -
దేశమంతా నా కుటుంబమే: ప్రధాని మోదీ
సాక్షి,ఆదిలాబాద్: బీఆర్ఎస్, కాంగ్రెస్లు రెండూ ఒకటేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం జూట్, లూఠ్ రెండే కుటుంబ పార్టీలకు తెలుసని ఆయన మండిపడ్డారు. సోమవారం ఆదిలాబాద్లో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ ప్రసంగించారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని తొలుత మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. లోక్సభ ఎన్నికలకు ఇంకా షెడ్యూలే రాలేదని, ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి సభ అని చెప్పారు. సభలో మోదీ మాట్లాడుతూ ‘తెలంగాణలో టీఆర్ఎస్, బీఆర్ఎస్గా మారిన తర్వాత ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏమీ మార్పు రాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కుంభకోణం చేస్తే ఆ స్కామ్ ఫైళ్లను కాంగ్రెస్ తొక్కి పట్టింది. మీరు తిన్నారు. మేమూ తింటాం అని కాంగ్రెస్ అంటోంది. మోదీ గ్యారెంటీపై ప్రస్తుతం దేశంలో చర్చ జరుగుతోంది. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ. వేల కోట్ల అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. దేశంలో అభివృద్ధి ఉత్సవం జరుగుతోంది. తెలంగాణప్రజల మద్య ఈ ఉత్సవం జరుపుకోవడానికి నేను ఇక్కడికి వచ్చా. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి ఉత్సవం చేస్తోంది. ఈ పదిహేను రోజుల్లో వివిధ రాషష్టట్రాల్లో రెండు ఐఐటీలు, 3 ఐఐఎంలు, ఒక్క ఐఐఎస్, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. ఇప్పుడు చెప్పండి ఇది అభివృద్ధి ఉత్సవం అవునా కాదా.. ఎన్నికలు వచ్చినపుడు ఎన్నికల గురించి చూసుకుందాం. నిన్న మంత్రి వర్గం, అధికారులు అందరం కలిసి రోజంతా వికసిత్ భారత్ గురించి చర్చించాం. వికసిత్ భారత్పై 15 లక్షల మంది ప్రజలు తమ సూచనలు చేశారు. ఇప్పటికి 3 వేల సమావేశాలు పెట్టాం. 11 లక్షల మంది వికసిత్ భారత్లో భాగస్వాములయ్యారు. తెలంగాణలోని గ్రామగ్రామంలో యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు అందరూ కలిసి అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అని నినదిస్తున్నారు. అబ్ కీ బార్ నాలుగు వందలపైన.. బీజేపీకి ఓటు వెయ్యాలి. రాంజీగోండు, కొమురం భీములు పుట్టిన భూమి ఇది. వాళ్లు స్వాతంత్రం కోసం పోరాడారు. బీజేపీ రాకపోతే ఆదివాసి మహిళ దేశానికి రాషష్ట్రపతి అయ్యేదా. భగవాన్ బిర్సాముండా పుట్టినరోజును అధికారికంగా జరుపుకునే వాళ్లమా. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న ట్రైబల్ మ్యూజియమ్కు రాంజీ గోండు పేరు పెడుతున్నాం. కుటుంబ పార్టీలకు ఇది సహించదు. మేం జాతి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వారు అడ్డుపడుతున్నారు. బీజేపీ ఆదివాసిల కోసం పనిచేస్తోంది. ఆదివాసీల కోసం బీజేపీ పీఎంజన్మన్యోజన ప్రారంభించింది. తెలంగాణలో సమ్మక్కసారక్క ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. మోదీకి గ్యారెంటీపై దేశంలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తి అయ్యే గ్యారెంటీ. తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఇచ్చాం. పసుపు రైతులకు అన్ని రకాల మద్దతు ఇస్తాం. తెలంగాణకు ఒక మెగాటెక్స్టైల్ పార్కు ఇచ్చాం. నా జీవితం తెరిచిన పుస్తకం. దేశమంతా నా కుటుంబమే.. నేను చిన్నప్పుడు ఒక కలతో ఇళ్లు విడిచిపెట్టా. దేశ ప్రజల కోసం జీవించాలని ఇళ్లు విడిచిపెట్టా. మీ కలల కోసమే నా సంకల్పం. నాకు ప్రత్యేక కలలు ఏమీ లేవు. ఇందుకే దేశంలోని కోట్ల మంది నన్ను వారి కుటుంబ సభ్యుడు అని అనుకుంటారు. 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులే. నా దేశం నా కుటుంబం అన్న భావనతో మీ కోసం నేను జీవిస్తున్నా. అందుకే దేశం ఈరోజు నాది మోదీ కుటుంబమే(మై హూ మోదీకా పరివార్) అని చెబుతోంది. అయోధ్య రామ మందిరంలో బంగారు దర్వాజ, మందిరంలోని బంగారు ధ్వజ స్తంభం నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఉంది. రామ్లల్లా ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఉంటుంది. వికసిత్ తెలంగాణ లక్ష్యాన్ని మేం తప్పకుండా పూర్తిచేస్తాం. రానున్న 25 ఏళ్లలో కష్టపడి దేశాన్ని ప్రపంచంలోనే అగ్ర దేశాల్లో ఒకటిగా తయారు చేయాలి. మీ ఆశీర్వాదం నాకు కావాలి. మీ ప్రేమ కావాలి’ అని మోదీ తన ప్రసంగాన్నిముగించారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్ -
ఒకే వేదికపై పీఎం మోదీ, సీఎం రేవంత్
-
రాజ్ భవన్కు చేరుకున్న ప్రధాని మోదీ
PM Modi Telangana Tour Updates.. ►రాజ్ భవన్కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ రాత్రికి అక్కడే బస ►మరికాసేపట్లో రాజ్ భవన్కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ►స్వాగతం పలుకనున్న గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్. ►నా తెలంగాణ కుటుంబ సభ్యులారా.. నా తెలంగాణ కుటుంబ సభ్యులకు నమస్కారాలు అంటూ తెలుగులో మోదీ ప్రసంగం ప్రారంభం. ►బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఇది ఎన్నికల సభ కాదు.. ఎన్నికల తేదీలు ఇంకా ప్రకటించనే లేదు. మీరందరూ వికసిత్ భారత్ కోసం ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. ►దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టాం. బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందుతోంది. 15 రోజుల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. 15 రోజుల్లో రెండు ఐఐటీలు, ఓ ట్రిపుల్ ఐటీ, ఒక ఐఐఎం, ఎయిమ్స్ను ప్రారంభించాం. దేశ అభివృద్ధి కోసం రూ.వేల కోట్ల పనులను చేపట్టాం. తెలంగాణలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. వికసిత్ భారత్పై నిన్న మంత్రులు, అధికారులతో సుదీర్ఘంగా చర్చించాం. ►బీజేపీతో తెలంగాణ అభివృద్ధి సాధ్యం. కుటుంబ పార్టీలను నమ్మవద్దు. కుటుంబ పార్టీలో రెండే అంశాలు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటే. ఒకటి దోచుకోవడం, రెండోది అబద్ధాలు చెప్పడం. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు జరిగిందేమీ లేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగింది అన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేస్తోంది?. ►నా జీవితం తెరచిన పుస్తకం. మోదీ అంటే పక్కా గ్యారెంటీ అభివృద్ధి. నా ఇంటిని వదిలిపెట్టి.. ఓ లక్ష్యంతో వచ్చాను. నా జీవితం దేశం కోసం అంకితం. మీ బిడ్డల కోసం నేను పరితపిస్తున్నాను. ►ఆదీవాసీ సమాజం కోసం బీజేపీ కృషి చేస్తుంది. ఆదివాసీల గౌరవాన్ని పెంచేందుకు బీజేపీ పనిచేస్తుంది. బీజేపీ రాకముందు ఆదివాసీ మహిళ రాష్ట్రపతి అవుతుందని ఎవరైనా ఊహించారా?. మోదీ గ్యారంటీపై దేశవ్యాపంగా చర్చ జరుగుతుంది. మోదీ గ్యారంటీ అంటే కచ్చితంగా నెరవేరుతుంది. వచ్చే ఎన్నికల్లో 400 సీట్లకుపైగా లోక్సభ స్థానాల్లో గెలుపే మా లక్ష్యం. ►రాంజీ గోండు పేరుతో హైదరాబాద్లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఏడు టెక్స్టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయించాం. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ, రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశాం. ►బీజేపీ సభలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ.. పదేళ్లలో దేశ ముఖచిత్రాన్ని ప్రధాని మోదీ మార్చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీజేపీకి 17 సీట్లు రావాలి. కేసీఆర్ పార్టీ నిన్నటి పార్టీ. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేసే పరిస్థితి లేదు. కుటుంబ, అవినీతి పాలనను కేసీఆర్ తెలంగాణ ప్రజలపై రుద్దారు. ►బీజేపీ సభలో ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ.. గత 40 ఏళ్ల కాలంలో ప్రధాని హోదాలో ఒక్క ప్రధాని కూడా రాలేదు. ప్రధాని మోదీ మాత్రమే ఆదిలాబాద్కు వచ్చారు. ఆదిలాబాద్ అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తోంది. ►ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బీజేపీ సభకు హాజరైన ప్రధాని మోదీ. ►ఆదిలాబాద్లో పార్టీ వేదికపైకి చేరుకున్న ప్రధాని మోడీ ►మోదీకి స్వాగతం పలికిన కిషన్ రెడ్డి, బండి సంజయ్, సోయం బాపూరావ్, నలుగురు ఎమ్మెల్యేలు ► ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో జరుగుతున్న అభివృద్ధికి ఆదిలాబాద్ కార్యక్రమాలు నిదర్శనం. తెలంగాణ ప్రజల కలను సాకారం చేసేందుకు కేంద్రం సహకరిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు అవుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే మా ఆకాంక్ష. తెలంగాణలో హైవేలను అభివృద్ధి చేస్తున్నాం. ►వికసిత్ భారత్ లక్ష్యంగా పాలన సాగిస్తున్నాం. రూ.56వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టాం. ఎన్టీపీసీ రెండో యూనిట్తో తెలంగాణ అవసరాలు తీరుతాయి. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఎన్టీపీసీని జాతికి అంకితం చేశాం. ఆర్ధిక వ్యవస్థ బలపడితే రాష్ట్రాలకు లాభం కలుగుతుంది. ►ఆర్థిక వ్యవస్థ బలపడితే దేశంపై విశ్వాసం పెరుగుతుంది. పేదలు, దళితుల అభివృద్ధికి కేంద్రం అనేక చర్యలు చేపట్టింది. వచ్చే పదేళ్లలో భారత్ అభివృద్ధిపరంగా మరింత ముందుకెళ్తుంది. కేంద్రం తీసుకున్న చర్యలతో దేశవ్యాప్తంగా 25కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. ► రామగుండం ఎన్టీపీసీ స్టేజ్ వన్ పవర్ ప్లాంట్ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ.. ములుగు, బేలాలో రెండు జాతీయ రహదారులకు వర్చువల్గా శంకుస్థాపన. ఆరు ప్రాజెక్ట్లకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. ►ఇప్పటికే పూర్తి అయిన 1600 మెగావాట్ల విద్యుత్ కేంద్రం. సుమారు 10,599 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ నిర్మాణం. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిలో సహకరిస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ప్రాజెక్ట్లో మిగిలిన వాటికి అన్ని విధాలుగా సహకరిస్తాం. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ప్రధానికి సాదర స్వాగతం. గత ప్రభుత్వ నిర్ణయాలతో విద్యుత్ ఉత్పత్తిలో వెనుకబడ్డాం. కేంద్రంతో పదేపదే ఘర్షణాత్మకమైన వైఖరితో ఉంటే రాష్ట్ర అభివృద్ధి వెనుకబడుతుంది. రాష్ట్రాభివృద్ధి కార్యాచరణతో ముందుకెళ్తాం. ►మావైపు నుంచి ఎలాంటి భేషజాలు లేవు. గుజరాత్లా తెలంగాణ అభివృద్ధి చెందేందుకు మీ సహకారం కావాలి. ప్రధానమంత్రి అంటే మాకు పెద్దన్నలాంటివారు. విభజన చట్టంలో నాలుగువేల మెగావాట్లకు బదులు కేవలం 1600 మెగావాట్ల విద్యుత్ మాత్రమే సాధించాం. దేశంలో ఐదు ట్రిలియన్ ఎకానమీ సాధనకు తెలంగాణ సహకరిస్తుంది. కంటోన్మెంట్ రక్షణ శాఖ భూములను రాష్ట్రానికి బదలాయించారు. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలకమైన స్కైవేల నిర్మాణానికి ఇది ఉపయోగపడుతుంది. ఆదిలాబాద్కు నీళ్లు ఇవ్వాలంటే తుమ్మిడిహట్టి నిర్మించాలి. దీని కోసం భూసేకరణకు కావాల్సిన పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. ► ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ..ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. పలు ప్రాజెక్ట్లను ప్రారంభించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ►ఆదిలాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ.. ►ఆదిలాబాద్ చేరుకున్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ నేతలు.. ►ఆదిలాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ►నేడు ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. కాగా, మోదీ పర్యటన షెడ్యూల్లో చివరి నిమిషంలో స్వల్ప మార్పు జరిగింది. ఆయన ఈరోజు ఉదయం 11:30 గంటలకు నాగ్పూర్లో హెలిప్యాడ్ వద్దకు రానున్నారు. అంతకుముందు షెడ్యూల్(10:20 గంటలకు) కన్నా ఒక గంట ఆలస్యంగా పర్యటన ప్రారంభం కానుంది. ►ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండురోజుల పర్యటన కోసం నేడు తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అలాగే, తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ►ఇక, తెలంగాణలో మొత్తం రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు (4న ఆదిలాబాద్లో రూ.6,697 కోట్లు, 5న సంగారెడ్డిలో రూ.9,021 కోట్లు) ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు. ►అలాగే, రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోసం ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లకు గాను ఇప్పటికే 9 మంది అభ్యర్థులను బీజేపీ నాయకత్వం ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని సభలు పార్టీ యంత్రాగానికి మరింత ఊపు తెస్తాయని బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఆదిలాబాద్లో హైఅలర్ట్ ప్రధాని మోదీ, సీఎం రేవంత్ పర్యటనల నేపథ్యంలో భారీ భద్రత ఎస్పీజీ భద్రతా వలయంలో ఏరోడ్రం, ఇందిర ప్రియదర్శిని స్డేడియం రెండువేల మంది భద్రతతో రక్షణ వలయం మోదీ పర్యటన ఇలా.. ►ప్రధాని సోమవారం మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి ఉదయం 10.20 గంటలకు ఆదిలాబాద్ జిల్లా కేందానికి చేరుకుంటారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్రెడ్డితో పాటు కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి ప్రధానికి స్వాగతం పలకనున్నారు. కాగా మోదీ రోడ్డు మార్గంలో స్టేడియానికి చేరుకుంటారు. ►అక్కడ రెండు వేదికలు ఏర్పాటు చేయగా, అందులో మొదటి వేదిక నుంచి పలు అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పాల్గొంటారు. ►అనంతరం రెండో వేదికపైకి వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇందులో కిషన్రెడ్డితో పాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు బండి సంజయ్, ఏలేటి మహేశ్వర్రెడ్డి, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొననున్నారు. ఆదిలాబాద్లో మోదీ సుమారు రెండు గంటల పాటు ఉండనున్నారు. ఇక్కడినుంచి మధ్యాహ్నం 12.10 గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి నాందేడ్కు, అక్కడినుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకు వెళ్లనున్నారు. సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుని రాత్రికి రాజ్భవన్లో బస చేయనున్నారు. ►మంగళవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో సివిల్ ఏవియేషన్ రీసెర్చి ఆర్గనైజేషన్ (సీఏఆర్ఓ)ను జాతికి అంకితం చేస్తారు. అనంతరం సంగారెడ్డి పర్యటనలో పాల్గొంటారు. అక్కడ కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ►ప్రధాని పర్యటన పురస్కరించుకుని మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇలావుండగా సోమవారం ఆదిలాబాద్కు వస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేశామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క తెలిపారు. -
ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సాయం బాపురావు సంచలన వ్యాఖ్యలు
-
బీజేపీ లిస్ట్లో ‘నో’ ప్లేస్.. సోయం బాపురావు సంచలన కామెంట్స్
సాక్షి, ఆదిలాబాద్: తనకు లోక్సభ స్థానం నుంచి టికెట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారని బీజేపీ ఎంపీ సోయం బాపురావు సంచలన కామెంట్స్ చేశారు. నా బలం.. బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, బీజేపీ హైకమాండ్ రానున్న లోక్సభ ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటు, తెలంగాణలో కూడా తొమ్మిది మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు పేరు తొలి లిస్టులో రాలేదు. ఆదిలాబాద్ గురించి హైకమాండ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక, తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో బాపురావు స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో బాపురావు ఆదివారం మీడియాతో మాట్లాడూతూ.. నాకు టికట్ రాకుండా పార్టీ అగ్రనేతలే అడ్డుపడ్డారు. ఆదివాసీ నేతకు టికెట్ రాకుండా పావులు కదిపారు. నేను ఎక్కడో గెలుస్తానో అనే భయం వాళ్లకు ఉంది. కొమ్మపై ఆధారపడే పక్షిని కాదు నేను.. రెక్కల మీద ఆధారపడిన పక్షిని.. నేను స్వతహాగా ఎగురగలను. టికెట్ రాకపోతే నా దారి నేను చూసుకుంటాను. ఆదిలాబాద్ పార్లమెంట్ సీటు నాదే.. గెలిచేది కూడా నేనే. పార్టీ ఏదనేది అధిష్ఠానం ఆలోచించుకోవాలి. 2019లో టికెట్ ఇస్తా అంటే పారిపోయిన నేతలే టికెట్ కోసం ఇప్పుడు పోటీపడుతున్నారు. ఏ బలంలేని సమయంలో నా సొంత బలంతో బీజేపీకి విజయం అందించాను. జడ్పీటీసీలను, ఎంపీపీలను, చివరికి నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించాను. నా బలం, బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుంది. రెండో లిస్ట్లో నాకు టికెట్ వస్తుందని భావిస్తున్నాను. ఎవరి మీద ఆధారపడే నేతను నేను కాదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం..విద్యార్థి ఆత్మహత్య
-
తెలంగాణకు మరోసారి ప్రధాని మోదీ.. రెండు రోజులు ఇక్కడే..
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మార్చి నాలుగో తేదీన అదిలాబాద్, మార్చి ఐదో తేదీన సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తున్నారు. వచ్చే నెల 4, 5 తేదీల్లో మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్టు సమాచారం. షెడ్యూల్ ఇలా.. నాలుగో తేదీన ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు ఆదిలాబాద్లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్లకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మోదీ 11.15 గంటల నుండి 12 గంటల వరకు పబ్లిక్ మీటింగ్ రాత్రి హైదరాబాద్ రాజ్ భవన్లో బస చేస్తారు. ఐదో తేదీన సంగారెడ్డిలో పర్యటన ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలుదేరనున్న మోదీ ఉదయం 10:45 నుండి 11:15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు 11:30 నుండి 12:15 వరకు బీజేపీ బహిరంగ సభ తెలంగాణ పర్యటన తర్వాత ఒడిషా వెళ్లనున్న ప్రధాని మోదీ -
15 ఏళ్ల వధువు.. 33 ఏళ్ల వరుడు!
ఆదిలాబాద్టౌన్: తొమ్మిదో తరగతి చదువుతున్న 15ఏళ్ల బాలికకు కుటుంబీకులు, మధ్యవర్తులు కలిసి 33 ఏళ్ల వ్యక్తితో బాల్య వివాహం జరిపించారు. విషయం ఏడాది తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను భర్త వేధింపులకు గురిచేయడంతో ఆమె తన కుటుంబ సభ్యులకు తెలియజేసింది. విషయం ఆనోటా.. ఈనోటా బయట పడడంతో పాఠశాలలో జగిత్యాల జిల్లా బాలల కమిషన్ విద్యార్థి వివరాలు సేకరించింది. జిల్లా బాలల సంరక్షణ అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో జిల్లా అధికారులు బేలలోని ఆమె అత్తారింటికి వెళ్లి బాధితురాలిని తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలోని బాలసదన్లో ఉంచారు. బేల పోలీసుస్టేషన్లో బాల్య వివాహం కేసు నమోదైంది. ఏడాది క్రితం.. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన 15 ఏళ్ల బాలికకు గత మార్చిలో తల్లిదండ్రులతో పాటు మధ్యవర్తులు బాల్య వివాహం జరిపించారు. 9వ తరగతి వార్షిక పరీక్షలు ముగిసిన వెంటనే ఈ పెళ్లి జరిగింది. అయితే మధ్యవర్తులు బేలకు చెందిన పెళ్లి కొడుకు (33 ఏళ్ల వ్యక్తి) కుటుంబీకుల నుంచి డబ్బులు తీసుకొని పెళ్లి జరిపించినట్లు పలువురు చెబుతున్నారు. బాలిక తల్లి పాచిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, తండ్రి దివ్యాంగుడు. ముంబాయ్లో ఉంటున్నాడు. పెళ్లయిన తర్వాత నుంచి ఒకట్రెండు సార్లు మాత్రమే బాలిక పుట్టింటికి వచ్చింది. కాగా పెళ్లి కొడుకు కుటుంబీకుల నుంచి మధ్యవర్తులు డబ్బులు తీసుకొని వాటిలో నుంచి ఆ బాలికకు సెల్ఫోన్ కొనిచ్చారు. కొంత డబ్బులు ఆమె కుటుంబీకులకు ఇచ్చినట్లు సమాచారం. బాలిక భర్త గొడవలు, వేధింపులకు పాల్పడేవారని ఆమె తల్లి పేర్కొంది. 15 రోజులుగా బాలసదన్లో.. బాల్య వివాహం జరిగిందనే సమాచారం అందడంతో బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు బేలకు చేరుకొని బాధిత బాలికను జిల్లా కేంద్రంలోని బాలసదన్కు 15 రోజుల క్రితం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆమె ఇక్కడే ఉంటుంది. ఆమెకు ఛాతినొప్పితో పాటు పచ్చకామెర్లు వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. అయితే పలుసార్లు బాలసదన్ సిబ్బంది ఆమెను రిమ్స్లోని ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. ఆమె అక్కడ ఉండనంటూ పుట్టింటికి వెళ్తానంటూ కన్నీరుమున్నీరవుతోంది. ఈ విషయమై ఐసీపీఎస్ అధికారి ప్రసాద్ను ‘సాక్షి’ వివరణ కోరగా.. పక్షం రోజుల క్రితం విషయం తెలియడంతో బాలికను బాలసదన్ను తీసుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. కుటుంబీకులపై బేల పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయించినట్లు పేర్కొన్నారు. బేల ఎస్సైని వివరణ కోరగా, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని, పోక్సో యాక్ట్కు సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నామని తెలిపారు. ఇరు కుటుంబీకులతో పాటు పెళ్లికి హాజరైన వారిపై సైతం కేసులు నమోదు చేయనున్నట్లు వివరించారు. -
ప్రజా ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే..ప్రజలు ఊరుకోరు!
అలా చేస్తే ఊర్లలోకి రానిస్తరా? ‘‘ఈ మధ్య కొందరు మాట్లాడుతున్నరు. మూడు నెలలు, ఆరు నెలల్లో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడు, ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని అంటున్నారు. నీ అయ్యా.. ఎవడు పడగొట్టేటోడు.. మా యువకులు వేలాది మంది ఇక్కడ ఉన్నారు. పడగొడితే వారంతా చూస్తూ ఊరుకుంటరా? ఊర్లలోకి రానిస్తరా? ఎవడైనా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తే.. మీ ఊర్ల వేపచెట్టుకు కట్టేసి కొట్టండి. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఇదేమైనా మీరు దోపిడీ చేసిన లక్ష కోట్ల కాళేశ్వరం కూలినట్టు అనుకున్నరా? ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరు’’ సాక్షి, ఆదిలాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని, త్వరలోనే కేసీఆర్ మళ్లీ సీఎం అవుతాడని కొందరు మాట్లాడుతున్నారని.. ప్రజాప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తే ప్రజలు ఊరుకోబోరని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంసం చేశారని.. తాము పునర్నిరి్మంచే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. హామీ ఇచ్చినట్టుగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, పదిహేను రోజుల్లో కానిస్టేబుల్ నియామకాలను చేపడతామని ప్రకటించారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పునర్నిర్మాణ సభ నిర్వహించింది. సీఎం రేవంత్ ఇందులో పాల్గొని మాట్లాడారు. ప్రసంగం వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణను కొల్లగొట్టి విధ్వంస రాష్ట్రంగా మార్చారు. కేసీఆర్ తన సొంత కుటుంబ సభ్యుల కోసమే తప్ప ఏనాడూ ప్రజల కోసం ఆలోచించలేదు. మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు దోచుకున్నారు. నాడు ఇంద్రవెల్లి సాక్షిగా సమరశంఖం పూరించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. అందుకే అభివృద్ధి కార్యక్రమాలను ఈ ప్రాంతం నుంచే ప్రారంభిస్తున్నాం. మళ్లీ ఇదే ఇంద్రవెల్లి సాక్షిగా పార్లమెంట్ ఎన్నికలకు సమరశంఖం పూరిస్తాం. గత పదేళ్ల పాలనలో ఏనాడైనా అడవి బిడ్డల గురించి, ఇంద్రవెల్లి అమరుల కుటుంబాల గురించి ఆలోచించారా? గూడేలు, తండాలకు నిజంగా నీళ్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు మేం రూ.65 కోట్లతో ఇంద్రవెల్లిలో పనులు మొదలుపెట్టాల్సి వచ్చేదా? ప్రగతిభవన్ వద్ద నాడు గద్దర్ను నిరీక్షించేలా చేసిన కేసీఆర్కు ఉసురు తగిలింది. మోదీ దగ్గర గులాంగిరీ.. దేశంలో రెండే కూటములు ఉన్నాయి. ఒకటి ఎన్డీఏ కూటమి, రెండోది ఇండియా కూటమి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది ఎంపీ సీట్లను గెలిస్తే.. కేసీఆర్ వాటిని ఢిల్లీలో తాకట్టు పెట్టి మోదీ దగ్గర గులాంగిరీ చేశారు. ఇప్పుడు మోదీ, కేడీ ఒక్కటై ముందుకొస్తున్నారు. మతం పేరిట బీజేపీ, మద్యంతో కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పి కాంగ్రెస్ను గెలిపించాలి. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలి. నాటి ఘటనకు క్షమాపణ చెప్తున్నా.. 1981 ఏప్రిల్లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇంద్రవెల్లి పోరాటకారులను కాల్చి చంపి, ఇప్పుడు నివాళులు అరి్పస్తున్నారంటూ కొందరు ఆరోపిస్తున్నారు. నాటి సీమాంధ్ర పాలకుల కారణంగా ఆ ఘటన జరిగింది. దానిపట్ల నేను క్షమాపణ చెప్తున్నాను. ఆదివాసీలను గుండెల్లో పెట్టి చూసుకుంటాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. ధరణితో కోల్పోయిన భూములను అప్పగిస్తాం: భట్టి అటవీప్రాంతాల్లోని గిరిజనులకు నీటి వనరులను అందుబాటులోకి తెస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ధరణి ద్వారా కోల్పోయిన భూములను గోండు గిరిజనులకు తిరిగి అప్పగిస్తామని ప్రకటించారు. సీఎం కార్యక్రమాల్లో మంత్రులు కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వర్రావు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ప్రేమ్సాగర్రావు, వినోద్, వివేక్, సీనియర్ నేతలు షబ్బీర్ అలీ, వీహెచ్, మల్లురవి, మధుయాష్కీ తదితరులు పాల్గొన్నారు. నాగోబాకు పూజలు చేసి.. మహిళలతో భేటీ.. ఇంద్రవెల్లి పర్యటన సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు, నేతలు నివాళి అర్పించారు. అమరవీరుల కుటుంబాలకు ఇళ్లస్థలాల పట్టాలు అందజేశారు. ఇక్కడి కేస్లాపూర్లోని నాగోబా ఆలయాన్ని సందర్శించి.. ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన మెప్మా, వివిధ ప్రభుత్వ శాఖల స్టాళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా నాగోబా దర్బార్ హాల్లో మహిళా స్వయం సహాయక సంఘాలతో సీఎం రేవంత్ ముఖాముఖి నిర్వహించారు. మహిళలు ఆత్మగౌరవంతో బతకాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. ప్రభుత్వ బడుల్లోని విద్యార్థుల స్కూల్ యూనిఫారాలు కుట్టే అవకాశాన్ని మహిళా సంఘాలకు ఇస్తామని హామీ ఇచ్చారు. -
ఆదిలాబాద్ ను దత్తత తీసుకుంటాం: రేవంత్ రెడ్డి
-
రేపు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్.. అమలులోకి మరో మూడు గ్యారెంటీలు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేపు(శుక్రవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత ఇది ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించనున్నారు. మూడు పథకాల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, సీఎం రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను సెంటిమెంట్గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే మొదటి సభ నిర్వహించారు. నాడు ‘దళిత, గిరిజన దండోరా’ పేరిట నిర్వహించిన సభకు లక్షకు పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటినుంచే కాంగ్రెస్పై ప్రజల్లో మక్కువ పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. దానికి తగ్గట్టుగానే ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడం, రేవంత్రెడ్డి సీఎం కావడం జరిగిపోయాయి. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి గడ్డ మీదనుంచే మొదలుపెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, శాసనసభ ఎన్నికల్లో నాలుగు బీజేపీ, రెండు బీఆర్ఎస్ గెలువగా, ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్గా తీసుకొని సెంటిమెంట్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. మొత్తంగా ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఈ గడ్డ మీద నుంచి సమరశంఖం పూరించనున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. నవ దంపతుల ఆత్మహత్య
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలంలోని కొల్హరి గ్రామానికి చెందిన దంపతులు విజయ్, పల్లవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు..మహారాష్ట్రకు చెందిన పల్లవికి కొల్హారి గ్రామానికి విజయ్కు గత మే నెలలో వివాహం జరిగింది. సంక్రాంతికి పుట్టింటికి వెళ్ళి వచ్చిన పల్లవి.. శుక్రవారం మధ్యాహ్నం అత్తగారి ఇంటికి వచ్చింది. సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగింది. కుటుంబసభ్యులు వ్యవసాయ పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పల్లవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.. దీంతో తనపై అపవాదు వస్తుందన్న భయంతో ఆమె భర్త విజయ్ శ్మశాన వాటికకు వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
Adilabad:అవార్డు అందుకున్న రోజే హఠాన్మరణం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ మేనేజర్ చెన్నమాధవ దివాకర్ (56) హఠాన్మ రణం చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన కలెక్టర్ రాహుల్రాజ్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అనంతరం పట్టణంలోని అంబికానగర్లో గల తన ఇంటికి వెళ్లారు. అల్పాహారం తింటుండగా శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దివ్యాంగుడైన దివా కర్కు భార్య నాగలక్ష్మి, కుమా రులు మణికంఠ సాయి, గిరిధర్ సాయి ఉన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన దివాకర్ 2003లో ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో టైపిస్ట్గా నియుక్తులయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. అవార్డు వచ్చిన ఆనందంలో ఇంటికి వెళ్లిన ఆయన గంట వ్యవధిలోనే మృత్యుఒడికి చేరడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: బేగంపేట పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు -
పత్తి రైతుల ఆందోళన
సాక్షి, ఆదిలాబాద్: సీసీఐ, వ్యాపారులు పత్తి కొనుగోళ్లు చేయకపోవడంతో కొన్ని గంటలపాటు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ స్తంభించింది. జిన్నింగ్ మిల్లుల్లో స్థలం లేకపోవడంతో తాము పత్తి కొనలేమంటూ వారు చేతులెత్తారు. దీనిపై రైతులకు ఏ సమాచారం లేకపోవడంతో శుక్రవారం మార్కెట్కు పెద్ద ఎత్తున రైతులు పత్తి బండ్లతో వచ్చారు. ఉదయం కొద్దిమంది నుంచి పత్తి కొనుగోలు చేసి, ఆపై నిలిపివేశారు. దీంతో రైతులు ఆందోళనకు దిగారు. ఒక్కసారిగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ట్రాన్స్పోర్టర్లు, వ్యాపారులతో అధికారులు సమావేశమై సయోధ్య కుదర్చడంతో మధ్యాహ్నం నుంచి తిరిగి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. సమ్మెను సాకుగా చూపుతూ ఆదిలాబాద్లో ఇప్పటివరకు వ్యాపారులు 3 లక్షల క్వింటాళ్లకు పైగా, సీసీఐ 8 లక్షల క్వింటాల పత్తిని కొనుగోలు చేసింది. జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని బేళ్లుగా మార్చి భారీ వాహనాల ద్వారా తమిళనాడుకు తరలిస్తారు. అయితే ఆదిలాబాద్లో నాలుగు రోజులుగా ట్రాన్స్పోర్టర్లు పత్తి బేళ్లు లిఫ్ట్ చేయడం లేదని సీసీఐ, వ్యాపారులు ఆరోపిస్తున్నారు. నూతన రవాణా చట్టాన్ని నిరసిస్తూ సమ్మెలో భాగంగా తాము ట్రాన్స్పోర్ట్ చేయడం లేదని అసోసియేషన్ నేతలు చెబుతున్నారు. దీంతో జిన్నింగ్ మిల్లుల్లో పెద్ద ఎత్తున నిల్వలు పేరుకపోయాయి. ఈ పరిస్థితుల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేయడమే రైతుల ఆందోళనకు దారితీసింది. సయోధ్య కుదిర్చినా.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి ట్రాన్స్పోర్టర్లు, వ్యాపారులను చర్చలకు పిలిచారు. రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. దీంతో మధ్యాహ్నం నుంచి పత్తి కొ నుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే ఈనెల 14 నుంచి 17 వరకు పత్తి కొనుగోళ్లు చేయమని సీసీఐ ప్రకటించింది. జిన్నింగ్ మిల్లుల్లో నిల్వలు పేరుకుపోవడంతోనే తాము కొనుగోలు చేయలేమని మార్కెటింగ్ అధికారులకు వారు స్పష్టం చేశారు. దీంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఆ 32 నియోజకవర్గాల్లో.. గల్ఫ్ కార్మికులు, చెరకు రైతులది కీలకం
చెరకు సాగు.. నిజాం షుగర్స్ సాక్షి, నిజామాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం ఫలితాన్ని తారుమారు చేసిన సంగతి తెలిసిందే. పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్ రైతులకు బాండ్ రాసిచ్చిన నేపథ్యంలో ఎంపీగా ప్రజలు పట్టం కట్టారు. ఈ శాసనసభ ఎన్నికల్లో కూడా సత్తా చాటాలనే లక్ష్యంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రధాని మోదీ ద్వారా పసుపు బోర్డు ప్రకటన చేయించింది. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఈ అంశం అనుకున్నంత స్థాయిలో ప్రభావం చూపడం లేదనే చెప్పాలి. ఇప్పుడు గల్ఫ్ కార్మికుల సంక్షేమం, నిజాం షుగర్స్ అంశాలే ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్, వరంగల్ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో (మొత్తం 32 నియోజకవర్గాలు) సుమారు 15 లక్షల మంది గల్ఫ్ కార్మికులు ఉన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు అంతగా లేకపోవడంతో గల్ఫ్కు వలస వెళ్లారు. ఈ కార్మిక కుటుంబాలు తమ సంక్షేమం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రత్యేకంగా గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత ఎన్నికల్లో గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దొనికెన కృష్ణ(స్వతంత్ర), వేములవాడ నుంచి గుగ్గిల్ల రవిగౌడ్, నిర్మల్ నుంచి స్వదేశ్ పరికిపండ్ల, ధర్మపురి నుంచి భూత్కూరి కాంత, కోరుట్ల నుంచి చెన్నమనేని శ్రీనివాసరావు ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుపున బరిలో ఉన్నారు. గల్ఫ్ జేఏసీ నాయకులు గల్ఫ్ దేశాల్లో పర్యటించి వలస కార్మికులతో సమావేశమై ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా ప్రచారం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. కాగా గల్ఫ్యేతర దేశాల్లో మరణించిన వారి మృతదేహాలను రాష్ట్ర ప్రభుత్వం సొంత ఖర్చుతో తెప్పిస్తోంది. గల్ఫ్ మృతుల విషయంలో మాత్రం వివక్ష కనిపిస్తోందన్న విమర్శ ఉంది. గల్ఫ్ బోర్డు ఏర్పడితే ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదని ఆ కార్మికులు చెబుతున్నారు. నిజాం షుగర్స్ అంశాన్ని సైతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నాయి. తాము గెలిస్తే నిజాం షుగర్స్ యూనిట్లను తెరిపిస్తామని హామీ ఇస్తున్నాయి. తద్వారా ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లోని 12 నియోజకవర్గాల్లో చెరకు రైతులను ఆకట్టుకునేందుకు ప్రచారం చేస్తున్నాయి. చెరకు పంట విస్తీర్ణం పెంపు విషయమై రెండు జాతీయ పార్టీలు మాట్లాడుతున్నాయి. బోధన్ (ఉమ్మడి నిజామాబాద్), మంబోజిపల్లి (ఉమ్మడి మెదక్), ముత్యంపేట (ఉమ్మడి కరీంగనర్) జిల్లాల్లోని నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెరిపిస్తామని ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సైతం ప్రకటించారు. గల్ఫ్ బోర్డు ద్వారానే సమస్యలు పరిష్కారం.. గల్ఫ్ బోర్డు ద్వారానే వలస కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయి. వలస కార్మికుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీని ఏర్పాటు చేయాలి. గల్ఫ్ ప్రవాసులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదు. గల్ఫ్ ప్రవాసుల ద్వారా ప్రతి ఏటా సంవత్సరానికి వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వాలకు లభిస్తోంది. – మంద భీమ్రెడ్డి, గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకుడు చక్కెర ఫ్యాక్టరీని పునరుద్ధ్దరించాలి.. ఏళ్ల తరబడి చెరకు పంట పండిస్తున్నాం. మా ప్రాంత భూములు చెరకు పంటకు అనుకూలమైనవి. ఈ సీజన్లోనూ 5 ఎకరాల్లో చెరకు పండిస్తున్నాను. బోధన్ నిజాం షుగర్స్ను మూసేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని మూసినప్పటి నుంచి కామారెడ్డి జిల్లాలోని గాయత్రి షుగర్స్కు తరలించి అమ్ముతున్నాం. బోధన్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపిస్తే మాకు మేలు కలుగుతుంది. కొత్త ప్రభుత్వం నిజాం షుగర్స్నూ పునరుద్ధరించాలని ఆకాంక్షిస్తున్నాం. – పల్లె గంగారాం, రైతు, హున్స గ్రామం, సాలూర మండలం -
ఆధిపత్యం ఎవరిది!?
వెనుకబడిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో స్థానిక అంశాలే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించబోతున్నాయి. ఆదివాసీలు, సింగరేణి కార్మికులు, రైతులు, కూలీలతో పాటు యువతరం ఈసారి అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చబోతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ వెంట నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాగా వేసేందుకు కాంగ్రెస్ శక్తివంచన లేని కృషి పట్టు సాధించేందుకు బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. పది నియోజకవర్గాలున్న ఉమ్మడిజిల్లాలో ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ ఎస్టీలకు రిజర్వు కాగా, బెల్లంపల్లి, చెన్నూరు ఎస్సీల రిజర్వ్డ్ స్థానాలు. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, పేదలకు అందించిన సంక్షేమ పథకాలు, సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కల్పన వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, కాళేశ్వరం ప్రాజెక్టు కారణంగా ఉమ్మడి జిల్లాకు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అభ్యర్థులు ముందున్నారు. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వల్ల ముంపునకు గురవుతున్న భూముల సమస్యపై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్ చేస్తున్నాయి. బీఎస్పీ తరపున పోటీ చేస్తున్న ఆర్ఎస్.ప్రవీణ్ కుమార్ ప్రధాన పక్షాలకు సవాల్ విసురుతున్నారు. అధికార బీఆర్ఎస్కు ఉమ్మడి జిల్లాలో తూర్పు ప్రాంతమైన మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, ఆసిఫాబాద్లలో కాంగ్రెస్ బలమైన ప్రత్యర్థిగా ఉండగా, పశ్చిమాన ఆదిలాబాద్, బోథ్, ముథోల్, నిర్మల్లలో బీజేపీ గట్టి పోటీనిస్తోంది. ఖానాపూర్, సిర్పూర్లలో వివిధ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఆదిలా‘బాద్షా’ ఎవరో? బీఆర్ఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ సీనియర్ ఎమ్మెల్యే జోగు రామన్న మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత ఎన్నికల్లో జోగు రామన్నకు ప్రధాన ప్రత్యర్థిగా నిలిచిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ మరోసారి బరిలో నిలిచి సవాల్ విసురుతున్నారు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్రెడ్డి బరిలోకి దిగారు. ఆదిలాబాద్లో నెలకొన్న సామాజిక, రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి కూడా బీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఆదిలాబాద్లో జరిగిన అభివృద్ధి, పేదలకు అందిన సంక్షేమ పథకాలు, మైనారిటీ ఓటు బ్యాంకుతో మళ్లీ విజయం వరిస్తుందనే ఆశాభావంతో జోగు రామన్న ఉన్నారు. ప్రభుత్వంతో పాటు జోగు రామన్న పట్ల సహజంగా ఉండే అసంతృప్తి, పెరిగిన బీజేపీ బలం తనకు కలిసి వస్తుందని పాయల్ శంకర్ భావిస్తున్నారు. ప్రభుత్వంపై అసంతృప్తి నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస్రెడ్డి సైతం విజయంపై ధీమాతో ఉన్నారు. బోథ్: ఆదివాసీలే కీలకం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలై, బీజేపీలో చేరి ఆదిలాబాద్ ఎంపీగా గెలిచిన సోయం బాపూరావు మరోసారి బోథ్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2018లో కాంగ్రెస్ టికెట్ రాక ఇండిపెండెంట్గా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచిన అనిల్ జాదవ్ ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆదివాసీల ప్రభావం అధికంగా ఉండే ఈ నియోజకవర్గం నుంచి ఆ వర్గం అభ్యర్థిగా ప్రధాన పార్టీల నుంచి సోయం బాపూరావు మాత్రమే బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి ఆడె గజేందర్ ఇద్దరూ లంబాడీ వర్గానికి చెందిన వారే. బీఎస్పీ నుంచి మరో ఆదివాసి మెస్రం జంగుబాపు బరిలో ఉన్నప్పటికీ, ఆదివాసీల ప్రతినిధిగా సోయం బాపూరావునే ఆ వర్గీయులు భావిస్తుండడం ఆయనకు కలిసివచ్చే అంశం. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు సైతం బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు మద్దతిస్తుండటం గమనార్హం. ఆసిఫాబాద్: కలిసి రానున్న‘ఆదివాసీ’ ఓటు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు బీఆర్ఎస్లో చేరినప్పటికీ, ఈసారి ఆయనకు మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన కోవా లక్ష్మినే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్కు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో ఆమె తన భర్త మాజీ ఆర్టీఏ అధికారి శ్యాం నాయక్తో పాటు కాంగ్రెస్ లో చేరారు. దీంతో శ్యాంనాయక్ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడంతో, అప్పటివరకు కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారు బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ అభ్యర్థిగా ఆత్మారాంనాయక్ బరిలో నిలిచినప్పటికీ, ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది. పోటీ పడుతున్న ముగ్గురు అభ్యర్థుల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి ఒక్కరే ఆదివాసీ కావడం, ఆదివాసీ ఓట్లు ఏకంగా 70 వేల ఓట్లు ఉండడం ఆమెకు కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఖానాపూర్: అభ్యర్థి మారినా ‘రాత’ మారుతుందా? సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ అభ్యర్థిత్వాన్ని కాదని కేటీఆర్కు సన్నిహితుడిగా పేరున్న జాన్సన్నాయక్కు బీఆ ర్ఎస్ ఇక్కడ సీటిచ్చింది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ పోటీ పడుతుండగా, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ఆది వాసీ ఉద్యమ నాయకుడు వెడ్మ బొజ్జును బరిలో నిలిపింది. ఈ నియోజకవర్గంలో ప్రధానంగా ఈ ముగ్గురి మధ్యనే త్రిముఖ పోటీ నెలకొంది. అయితే బీఆర్ఎస్, బీజేపీ తరపున పోటీ పడుతున్న అభ్యర్థులు ఇద్దరు లంబాడీ వర్గానికి చెందిన వారు కావడం, కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుకు కలిసి వచ్చే అంశం. ఆదివాసీ ఓట్లతో పాటు లంబాడీ వర్గం ఓట్లు భారీగానే ఉన్నప్పటికీ, లంబాడీ ఓట్ల చీలిక కాంగ్రెస్కు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ను మార్చడం బీఆర్ఎస్కు కలిసివచ్చే అంశంగా భావిస్తున్నప్పటికీ, జాన్సన్నాయక్ను లంబాడీలు ఆదరించడంపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. సిర్పూరు: ‘ఏనుగు’ మళ్లీ ఎగురుతుందా? 2004లో కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోనేరు కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరారు. ఆయనే 2018లో టీఆర్ఎస్ తరపున పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో నిలవగా, ఆయనకు చెక్ పెట్టేందుకు ఈసారి మూడు పార్టీలు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్. ప్రవీణ్కుమార్ ‘ఏనుగు’ గుర్తుపై పోటీలో నిలిచి రాష్ట్ర స్థాయిలో అందరినీ ఆకర్షిస్తున్నారు. గతంలో కోనప్ప గెలిచిన బీఎస్పీ తరపునే పోటీ చేసి ఆయనను ఓడించాలనే ధ్యేయంతో అటవీ, మైదాన ప్రాంతాల్లో కలియతిరుగుతున్నారు. సిర్పూరులో ఎస్సీ, బుద్ధిస్ట్ ఓట్లు భారీగా ఉండడం, మైనారిటీలతో పాటు గిరిజన వర్గాల ఓట్లు కూడా చీలి తనకు కలిసి వస్తుందని ప్రవీణ్కుమార్ భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కోనప్పపై కాంగ్రెస్ తరపున పోటీ చేసి రెండోస్థానంలో నిలిచిన పాల్వాయి హరీశ్బాబు ఈసారి బీజేపీ పక్షాన పోరాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి రావి శ్రీనివాస్ బరిలో నిలిచారు. ప్రధాన పోటీ బీఆర్ఎస్, బీఎస్పీ, బీజేపీ మధ్యనే నెలకొంది. నిర్మల్: కారు, కమలం మధ్యన పోటీ.. సీనియర్ నేత, మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్లో ఈసారి రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి బీజేపీలో చేరి ఆపార్టీ అభ్యర్థిగా పోటీ ఇస్తున్నారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు కూచాడి శ్రీహరిరావు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో స్థానాన్ని బీజేపీ గెలుచుకున్న ప్రభావం, భైంసా, నిర్మల్లలో జరిగిన మతఘర్షణల నేపథ్యంలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఇక్కడ బీజేపీ బలం పెరిగిందని అంటున్నారు. కాగా మైనారిటీ ఓట్లు, మున్నూరు కాపు ఓట్లతో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులపై అల్లోల్ల ఇంద్ర కరణ్రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ముథోల్: ఇక్కడా బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే.. రాష్ట్రంలో సున్నిత ప్రాంతంగా పేరున్న భైంసా ప్రధాన కేంద్రంగా ఉన్న ముథోల్ నియోజకవర్గంలో అధికార పార్టీకి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి గెడ్డన్నగారి విఠల్రెడ్డికి బీజేపీ అభ్యర్థి, గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పవార్ రామారావు పటేల్ గట్టి పోటీ ఇస్తున్నారు. గ్రామీ ణ ఓటర్లతో పాటు ముస్లిం మైనారిటీ ఓట్లతో విజయం తనదేనని సిట్టింగ్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి ధీమాతో ఉన్నారు. భైంసాలోని ముస్లిం మైనారిటీల ఓట్లతో బీఆర్ఎస్ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, భైంసాలో నెలకొన్న పరిస్థితుల వల్లనే హిందూ ఓట్లన్నీ ఈసారి గంపగుత్తగా బీజేపీకే పడతాయని ఆపార్టీ భావిస్తుంది. గత ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని కాంగ్రెస్ పార్టీ ఈసారి కూడా పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. మంచిర్యాల: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్రావు ఐదో విజయం కోసం బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో 4,877 ఓట్ల తేడాతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్రావు ఈసారి కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరోసారి తనను గట్టెక్కిస్తాయనే నమ్మకంతో దివాకర్రావు ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పార్టీ అభ్యర్థిపై ప్రజల్లో నెల కొన్న అసంతృప్తి తనను ఈసారి విజయ తీరాలకు చేరుస్తుందని ప్రేంసాగర్రావు ఆశాభావంతో ఉన్నారు. గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి వెరబెల్లి రఘునాథ్ మరోసారి బరిలో నిలవగా, ఆయనకు వచ్చే ఓట్లు ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది ప్రశ్నార్థకం. ప్రధాన పార్టీల నుంచి పోటీ చేస్తున్న ముగ్గురిది వెలమ సామాజికవర్గమే. బెల్లంపల్లి: గెలుపుపై రెండు పార్టీల్లోనూ ధీమా.. సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పట్ల నెలకొన్న వ్యతిరేకత, బీఆర్ఎస్ మండల స్థాయి నాయకుల వ్యవహారశైలి... కాంగ్రెస్ అభ్యర్థి, గత ఎన్నికల్లో తక్కువ ఓట్ల తేడాతో ఓడిన మాజీ మంత్రి గడ్డం వినోద్పై ఉన్న సానుభూతి బెల్లంపల్లిలో కాంగ్రెస్కు కలిసివచ్చే అంశం. అయితే ప్రభుత్వ పథకాల లబి్ధదారులు, బీఆర్ఎస్ శ్రేణులు తనను గట్టెక్కిస్తారనే ధీమాతో చిన్నయ్య ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి బరిలో ఉన్నప్పటికీ పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే నెలకొంది. చెన్నూరు: నువ్వా నేనా..? బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ విజయం నల్లేరు మీద నడక అనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ గడ్డం వివేకానంద రావడం రాజకీయ పరిస్థితులను ఒక్కసారిగా మార్చేసింది. చెన్నూరులో రూ. వందల కోట్లతో చేసిన అభివృద్ధి, సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, సంక్షేమ పథకాలను చూసి ఓటేయాలని సుమన్ కోరుతున్నారు. వివేక్ రాకతో బీఆర్ఎస్కు చెందిన పలువురు జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు సుమన్కు వ్యతిరేకంగా కాంగ్రెస్లో చేరడం గమనార్హం. వివేక్ చెన్నూరులో విజయం కోసం కోట్లు వెచ్చిస్తున్నారని, నాయకులను కొంటున్నారని ఎమ్మెల్యే సుమన్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈడీ రైడ్స్ చెన్నూరులో రాజకీయాలను మరింత రక్తి కట్టిస్తున్నాయి. దీంతో ఈ నియోజకవర్గంలో ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీనెలకొంది. విజయం కోసం ఇద్దరూ శ్రమిస్తున్నారు. కేసీఆర్ వల్లనే సింగరేణి వారసత్వ ఉద్యోగం.. సింగరేణిలో ఇక రావు అనుకున్న డిపెండెంట్ ఉద్యోగాలను కేసీఆర్ ఇప్పించారు. టీడీపీ హయాంలో రద్దయిన ఈ ఉద్యోగాలను ఏ ప్రభుత్వం మళ్లీ ఇవ్వదనుకున్నాం. నేను ఎంఏ, బీఈడీ చదివాను. వారసత్వ ఉద్యోగాల్లో అల్లుళ్లకు కూడా ఉద్యోగాలివ్వడంతో మా మామ ఉద్యోగం నాకు వచ్చింది. సింగరేణి పరంగా బీఆర్ఎస్ హయాంలో కార్మికులకు అనేక హక్కులతో పాటు సదుపాయాలు కూడా వచ్చాయి. గతంలో క్వార్టర్లలో ఉంటే బేసిక్ జీతంపై ఒక శాతం విద్యుత్చార్జీలు వసూలు చేసేవారు. ఇప్పుడు దాన్ని తీసేశారు. ఏసీ కూడా పెట్టుకుంటున్నాం. మా తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం కూడా అందిస్తున్నారు. – దుర్గం రవికుమార్, జనరల్ మజ్దూర్, ఆర్కే 5 గని వీధి వ్యాపారిగా మారిన.. రెక్కల కష్టం తప్ప మాకు ఏ ఆధారం లేదు. నా భర్త నృత్య కళాకారుడు. వందలాదిమంది కళాకారులను తయారు చేశారు. ఆయనకు కళాకారుల ఉద్యోగం ఈ సర్కారులో రాలేదు. బీసీబంధు పథకం మాకు ఇయ్యలేదు. పేదలకుమేలు చేస్తున్నామని సర్కారు చెప్పుకునుడే తప్ప అమల్లో లేదు. ఏ ఒక్క ప్రభుత్వ పథకం మంజూ రు కాని మేము అనేక కష్టనష్టాలు పడుతున్నాం. చివరికి వీధి వ్యాపారిగా మారాల్సి వచ్చింది. – హనుమాన్ల సువర్ణ, చిరు వీధి వ్యాపారి, బెల్లంపల్లి కాళేశ్వరం బ్యాక్ వాటర్తో అపార నష్టం.. నాకు మూడున్నర ఎకరాల సాగు భూమి ఉంది. పత్తి సాగు చేశాను. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో గత నాలుగేళ్లుగా పంట మునిగిపోతోంది. తీవ్రంగా నష్టపోయిన. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పరిహారం రాలేదు. మాకోసం ఆలోచించే వారినే మేం గెలిపించుకుంటాం. –సుంకరి మల్లయ్య, రైతు, కోటపల్లి (చెన్నూరు) డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదుబీఆర్ఎస్ పార్టీ ఎన్నో మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది. ఏవేవో పథకాలన్నారు. ఎన్ని పథకాలు పెట్టినా పేదలకు మాత్రం ఎలాంటి ఫాయిదా లేదు. నాకు ఇల్లు లేదు. డబుల్ బెడ్ రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న. ఎంతో ఆశతో ఎదురు చూసినా మంజూరు చేయలేదు. పదేళ్లు బీఆర్ఎస్ను చూసాం. పేదోళ్లకు ఏం మేలు జరగలేదు. ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చి చూస్తాం. – సయ్యద్ ఖాజాపాషా, పంక్చర్ కొట్టు నిర్వాహకుడు, బెల్లంపల్లి - ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి పోలంపల్లి ఆంజనేయులు -
ఆదిలాబాద్ @ 16.7
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సాధారణంగా ఈశాన్య రుతుపవనాల ప్రవేశంతోనే చలి తీవ్రత మొదలవుతుంది. కానీ ఈసారి ఈశాన్య రుతుపవనాల రాక ఆలస్యం కావడం... వాతావరణంలో నెలకొన్న మార్పులతో కొంత కాలంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతూ వచ్చాయి. మధ్యలో రెండు మూడురోజులు చలి పెరిగినా తర్వాత పెరిగిన ఉష్ణోగ్రతలు ఇప్పుడు క్షీణించడం ప్రారంభించాయి. పగటి ఉష్ణోగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతుండడం, రాష్ట్రానికి తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి గాలులు వీస్తుండడంతో చలి పెరుగుతోంది. మరో మూడురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఖమ్మంలో 34 డిగ్రీ సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్లో 16.7 డిగ్రీ సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్తో పాటు మెదక్, నల్లగొండల్లో చలి పెరిగింది. రానున్న మూడురోజులు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆ తర్వాత మరింత తగ్గుతాయని చెబుతున్నారు. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది ఇదే సమయంలో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
పోలీసు సిబ్బందిని భయపెడుతున్న దెయ్యం!
ఆదిలాబాద్టౌన్: జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దెయ్యం ఉందంటూ పుకార్లు సాగుతున్నాయి. దీంతో రాత్రి వేళలో నిద్రిస్తున్న సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఓపెన్ స్కూల్ పరీక్షల నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే వారు సైతం కార్యాలయంలో దెయ్యం ఉన్నట్లు సిబ్బందితో తెలిపిన ట్లు సమాచారం. ఈ క్రమంలో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగి మాంత్రికుడిని తీసుకొ చ్చి అక్కడి మరుగుదొడ్లను చూపించగా.. అక్క డ దెయ్యాలున్నాయని చెప్పడంతో కొంత మంది ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. దీంతో డీఈవో విషయాన్ని జన విజ్ఞాన వేదిక దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం రాత్రి సిబ్బందితో పాటు వేదిక జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంతోష్, రవీందర్రెడ్డితో పాటు జిల్లా సైన్స్ అధికారి రఘురమణ రాత్రి సమయంలో కార్యాలయంలో నిద్రించారు. తమకు ఎలాంటి శబ్ధాలు వినిపించలేదని, దెయ్యం ఉన్నట్లు వస్తున్న పుకార్లు అవాస్తవమని స్పష్టం చేశారు. ఈ విషయమై డీఈవోను వివరణ కోరగా, దెయ్యాలు లేవని, కావాలనే కొంత మంది పుకార్లు చేస్తున్నారని వివరించారు. రాత్రి సమయంలో విధులు నిర్వహించడం ఇష్టం లేకనే ఇలా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మూఢనమ్మకాలను దూరం చేసి శాస్త్రీయ దృక్పదా న్ని పెంపొందించాలి్సన విద్యాశాఖలోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చోద్యంగా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. -
‘మన భవిష్యత్తు వాళ్ల చేతుల్లో పెడదామా?’
సాక్షి, ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు మంత్రి హరీష్రావు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం అన్న హరీష్రావు.. కాంగ్రెస్ అంటే బూటకమన్నారు. ఆదిలాబాద్లో ప్రజాశీర్వాద సభలో మాట్లాడిన హరీష్రావు.. ‘ కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ఖిల్లాగా మారింది. అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందింది..కేసీఅర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే ఒక బూటకం. కేసీఆర్ చావు నోట్లోకి వెళ్లి తెలంగాణ తెచ్చిండు. ఇంటింటా నళ్లా నీరు ఇచ్చాం.. కాంగ్రెస్లో కుర్చీల కోసం కొట్లాడే నాయకులున్నారు. కొందరు బూతులు మాట్లాడే నాయకులు ఉన్నారు. కుర్చీ కోసం కోట్లాడే నాయకులకు ఓట్లు వేద్ధామా?, మన భవిష్యత్తు వాళ్ల చేతులో పెడుదామా? అని హరీష్రావు ప్రజలను ప్రశ్నించారు. చదవండి: ప్రత్యర్థి ఎవరైనా..? 'గులాబీ కార్' స్పీడ్కు బ్రేకులు వేయలేరు..! ‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’ -
దడ పుట్టిస్తున్న ఇన్ఫ్లూయెంజా వైరస్.. వాళ్లకి రిస్క్ ఎక్కువ
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఇన్ఫ్లూయెంజా (శ్వాసకోశ సంబంధిత వ్యాధి) దడ పుట్టిస్తోంది. ఏ ఇంటికెళ్లినా ఎవరో ఒకరు దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఈ వైరస్ కోవిడ్ మాదిరిగానే ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. బాధితులు దాదాపు పది నుంచి పక్షం రోజుల వరకు జ్వరం బారిన పడతారు. జ్వరం తగ్గిన కూడా ఒళ్లు నొప్పులు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా సోకుతోంది. దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న వారికి తీవ్ర ప్రమాదం ఉందని సూచిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఎక్కువ మందికి ఇన్ఫ్లూయెంజా లక్షణాలే కనిపిస్తున్నాయి. చిల్డ్రన్ వార్డులో ఎక్కువ మంది చిన్నారులు శ్వాస సంబంధిత ఇబ్బందులతో అవస్థలు పడుతున్నారు. కొంత మంది మృత్యువాత పడిన ఘటనలు సైతం ఉన్నాయి. అతలాకుతలం.. ప్రస్తుతం జిల్లాలో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఏజెన్సీతో పాటు మైదాన ప్రాంతాల్లో వీటి బారిన పడి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు డెంగీ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 104 కేసులు నమోదయ్యాయని పేర్కొంటుండగా, అనధికారికంగా 200కు పైగానే బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్తో పాటు జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి, ఉట్నూర్, బోథ్ ఏరియా ఆస్పత్రులు జ్వర పీడితులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈనెలలోనే 32 మంది డెంగీ బారిన పడినట్లు వైద్యారోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. కాగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి లెక్క తేలడం లేదు. మరికొంత మంది బాధితులను హైదరాబాద్, నిజామాబాద్తో పాటు మహారాష్ట్రలోని యవత్మాల్, నాగ్పూర్ తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దోచుకుంటున్న ల్యాబ్లు.. సీజనల్ వ్యాధులను అదునుగా చేసుకొని కొంత మంది ల్యాబ్ల నిర్వాహకులు అందినకాడికి దండుకుంటున్నారు. జిల్లాలో డెంగీ, మలేరియా, టైఫాయిడ్ తదితర వ్యాధులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు సంబంధిత ల్యాబ్లకు పంపి బాధితుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. నిర్వాహకులకు 40 శాతం అందజేసి 60 శాతం వైద్యులు తీసుకుంటుండడంతో వీరి బిజినెస్ జోరుగా సాగుతోంది. అర్హతలు లేకున్నప్పటికీ చాలా మంది ల్యాబ్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీంతో వారు రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు సమాచారం. ఇంకొంత మంది శిక్షణ పూర్తి కాకుండానే ప్రైవేట్ ల్యాబ్లలో పనిచేస్తూ సొంతంగా పరీక్షలు జరుపుతున్నారనే ప్రచారం ఉంది. ఈ తతంగమంతా వైద్యారోగ్య శాఖ అధికారులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. నిబంధనల ప్రకారం ప్యాథలాజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, మైక్రోబయాలజిస్ట్ కోర్సు పూర్తి చేసినవారు మాత్రమే ల్యాబ్ నిర్వహణ చేపట్టవచ్చు. అయితే దీనికి విరుద్ధంగా అనర్హులు ల్యాబ్లను ఏర్పాటు చేసి వైద్యులతో కలిసి అక్రమ దందా సాగిస్తున్నారు. కిక్కిరిసిన చిల్డ్రన్ వార్డు.. రిమ్స్ ఆస్పత్రి చిల్డ్రన్ వార్డు చిన్నారులతో కిక్కిరిసి కనిపిస్తోంది. నెలరోజులకు పైగా ఇదే పరిస్థితి. వార్డులో 70 బెడ్లు ఉంటే.. వందకు పైగా చిన్నారులు జ్వరాలతో చికిత్స పొందుతుండడం గమనార్హం. వీరిలో ఎక్కువగా ఇన్ఫ్లూయెంజా లక్షణాలు ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. చాలా మంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పక్షం దాటిన జ్వరం వీడటం లేదు. అలాగే మహిళా వార్డు పరిస్థితి కూడా ఇ లాగే ఉంది. జ్వరాలకు సంబంధించి అన్ని వార్డులకు కలిపి దాదాపు 400 మంది వరకు చికిత్స పొందుతున్నారు. కొద్ది రోజులుగా రిమ్స్లో ఓపీ 1600 వరకు నమోదవుతుంది. ఆయా పీహెచ్సీల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 500 వరకు ఓపీ ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వ్యాధుల కట్టడికి చర్యలు.. జిల్లాలో వ్యాధుల నివారణకు చర్యలు చేపడుతున్నాం. వాతావరణ మా ర్పుల కారణంగా జ్వరపీడితుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కువ మంది శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. ఈ ఏడాది 104 డెంగీ కేసులు నమోదయ్యాయి. వారానికి రెండుసార్లు డ్రైడే పాటించాలని అవగాహన కల్పిస్తున్నాం. – మెట్పెల్లివార్ శ్రీధర్,జిల్లా మలేరియా నివారణ అధికారి -
అడవికి రాజెవరో?
ఆకుల రాజు : అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్లో ఓట్ల వేట హోరాహోరీగా సాగనుంది. ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాల పరిధిలో ఉన్న పది అసెంబ్లీ స్థానాల్లో అన్ని రాజకీయ పార్టీల ప్రచారం అప్పుడే ముమ్మరంగా నడుస్తోంది. భౌగోళికంగా చూస్తే పశ్చిమ ప్రాంతంగా ఉన్న నిర్మల్, ముథోల్, బోథ్, ఖానాపూర్, ఆదిలాబాద్, తూర్పున మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు, సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు మైదాన, గిరిజన, కోల్బెల్ట్ ఓటర్లతో నిండి ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఆదివాసీ, గిరిజన, ఓసీ, బీసీ, మైనార్టీ వర్గాల వారీగా ఓట్ల కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి. పూర్వ వైభవం కోసం కాంగ్రెస్.. బోణీ కొట్టేందుకు బీజేపీ పోరాటం గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన రెండు ఎన్నికల్లోనూ పదింటా ఒక్కో స్థానానికే పరిమితమైంది. ప్రస్తుతం అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతోంది. పది స్థానాలకు 94మంది దరఖాస్తు చేసుకున్నారు. మళ్లీ పూర్వ వైభవం వస్తుందంటూ కాంగ్రెస్ నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవని బీజేపీ ఈసారి సత్తా చాటేందుకు చెమటోడుస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా ఆదిలాబాద్ ఎంపీగా సోయం బాపురావు గెలవడంతో పార్టీకి హైప్ తెచ్చింది. ఈసారి కచ్చితంగా మెజారిటీ సీట్లు గెలుస్తామనే ధీమాతో కమలనాథులు ఉన్నారు. ప్రచారంలో ‘కారు’ స్పీడు.. అభ్యర్థులను ముందే ప్రకటించి ‘కారు’ పార్టీ ప్రచారంలో స్పీడ్గా ఉంది. అభ్యర్థులు తమ పర్యటనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను పదే పదే వల్లె వేస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యే ప్రధాన పోటీ ఉండగా, ప్రస్తుతం బీజేపీతోపాటు కొన్ని చోట్ల బీఎస్పీ, సీపీఐ అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములు ప్రభావితం చేయనున్నాయి. ముప్పై ఏళ్ల రాజకీయం, ఐదు ఎన్నికలను ఎదుర్కొన్న మంత్రి ఐకే రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావుతో పాటు ఎన్నికలంటే తెలియని, ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ లాంటి వారు కూడా పోటీలో ఉండడం ఆసక్తి కలిగిస్తోంది. విపక్షాల ప్రచార అస్త్రాలు ♦ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై భూ కబ్జాలు, అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు ♦ డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళిత, బీసీ బంధు అర్హులందరికీ రాకపోవడం ♦ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయం చూపకపోవడం ♦ గిరిజన ప్రాంతాల్లో విద్యా, వైద్యం, రోడ్లు లేకపోవడం ♦ జిల్లాల్లో మూత పడిన పరిశ్రమలు తెరవకపోవడం అధికార పార్టీ ప్రచారాస్త్రాలు ♦48వేల మందికి, లక్ష ఎకరాల పోడు పట్టాల పంపిణీ ♦ ఏడు వేలకు పైగా సింగరేణి స్థలాలకు ఇళ్ల పట్టాల పంపిణీ ♦మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటు ♦ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులు బోథ్, ఖానాపూర్లో బీఆర్ఎస్కు ఇక్కట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్కు బదులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్నేహితుడైన భూక్య జాన్సన్ నాయక్కు, బోథ్లో రాథోడ్ బాçపూరావును కాదని అనిల్కుమార్ జాదవ్కు టికెట్ ఇచ్చారు. ఆసిఫాబాద్లో కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే ఆత్రం సక్కును పక్కకు పెట్టి, గత ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ అభ్యర్థి, కుమురంభీం జిల్లా జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్షి్మకి మళ్లీ అవకాశం ఇచ్చారు. దీంతో ఖానాపూర్, బోథ్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతామని ప్రకటించారు. ఈ క్రమంలో వీళ్లిద్దరూ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తి రేపుతోంది. ఇక చెన్నూరులో ఎమ్మెల్యే సుమన్తో పొసగక, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీ వీడి కాంగ్రెస్ నుంచి పోటీకి సిద్ధపడ్డారు. టికెట్ దక్కని మాజీ ఎంపీ నగే«శ్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ పార్టీలోనే ఉన్నా అంటీముట్టనట్టు ఉంటున్నారు. బహుజనవాదంతో బీఎస్పీ బహుజన వాదంతో ఇక్కడి ఓట్లను పట్టేందుకు బీఎస్పీ సిద్ధమైంది. సిర్పూర్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బరిలో ఉంటానని చెప్పడం ఆసక్తి రేపుతోంది. ఖానాపూర్లో బన్సీలాల్కు అవకాశం ఇచ్చారు. కామ్రేడ్ల ఆశలు బెల్లంపల్లి నుంచి సీపీఐ బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంది. పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఏఐటీయూసీ బలంతో కార్మిక వాడల్లో నాయకులు ప్రచారం మొదలు పెట్టారు. కాంగ్రెస్తో పొత్తు ఉంటే..సీటు ఇస్తారో లేదా చూడాలి. సామాజిక సమీకరణాలు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, సిర్పూర్, ముథోల్లో బీసీ ఓట్లు. ఖానాపూర్, ఆసిఫాబాద్, బోథ్లో ఎస్టీ ఓట్లు, బెల్లంపల్లిలో నేతకాని, ఎస్సీ చెన్నూరులో నేతకాని, ఎస్సీ ఓట్లు మంచిర్యాలలో పెరిక, మున్నూరుకాపు, యాదవ, పద్మశాలి, గౌడ ఓట్లు, ఆదిలాబాద్లో మున్నూరుకాపు, పద్మశాలి, యాదవ, ముదిరాజ్, నిర్మల్లో మున్నూరుకాపు, పద్మశాలి, ముదిరాజ్, సిర్పూర్లో గిరిజన, బుద్ధిస్టు, ముస్లిం, ముథోల్లో ముస్లిం ఓట్లు గెలుపోటముల్లో కీలకం. -
తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అమిత్షా సభకు భారీ బందోబస్తు చేసిన పోలీసులు
-
కేసీఆర్ను గద్దె దించండి: అమిత్షా
Amit Sha Adilabad Public Meeting Updates సాక్షి ఆదిలాబాద్: జనగర్జన వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్లో నినాదిస్తే.. హైదరాబాద్లో కేసీఆర్కు వినిపించాలన్న అమిత్షా.. డిసెంబర్ 3 తర్వాత తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం రావాలి.. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాల్లో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తామని అమిత్ షా ప్రకటించారు. కోమరం భీం పేరు విని రోమాలు నిక్కబోడుచుకుంటాయన్న ఆయన.. పదేళ్ల కేసీఆర్ పాలనలో సామాన్యులు, రైతులు, ఆదివాసీల సమస్యలు తీరలేదన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమన్నారు. ‘‘పదేళ్లలో కేటీఆర్ను సీఎం ఎలా చేయాలనే ఆలోచన మాత్రమే చేశారు. కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయడమే కేసీఆర్ లక్ష్యం. కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసమేపని చేశారు. కేసీఆర్ తన కుమార్తె, కుమారుడి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ప్రధాని మోదీ ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి చేశారుజ ఆదివాసీల అభివృద్ధి కోసం బీజేపీ ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదు. కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు’’ అంటూ అమిత్ షా ధ్వజమెత్తారు. ‘‘తెలంగాణలో ఆధునిక రజాకర్ల నుంచి ప్రజలను బీజేపీ మాత్రమే రక్షిస్తుంది. గులాబీ పార్టీ కారు స్టీరింగ్ అసదుద్దీన్ దగ్గర ఉంది. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో బీఆర్ఎస్ పనిచేస్తుంది. బీఆర్ఎస్ను ఇంటికి పంపి బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి. తెలంగాణలో జనతా సర్కార్ రావాలి. కొడుకు, కూతురు కోసం పనిచేసే ప్రభుత్వం కాదు. పేదలు, రైతులు, ఆదివాసీల కోసం పనిచేసే ప్రభుత్వం రావాలి. 2024లో మరోసారి మోదీని ప్రధానిని చేయాలి. కేసీఆర్ను గద్దె దించి.. బీజేపీకి అధికారం ఇచ్చేందుకు పిడికిలి బిగించండి. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అక్కడా.. ఇక్కడా మోదీయే. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు కాబోతుంది. రూ.200 కోట్లతో ఆదివాసీ వీరుల స్మారక మ్యూజియాలు నిర్మిస్తున్నాం’’ అని అమిత్షా తెలిపారు. బీఆర్ఎస్ ఏం చేసిందని ఓటు వేయాలి ►ఇప్పటి వరకు ఒక్క గ్రూప్ 1కి నోటిఫికేషన్ ఇవ్వలేదు ►యువతకి ఉద్యోగాలు ఇచ్చారా? ►బీఆర్ఎస్ ఏం చేసిందని ప్రజలు ఓటేయాలి? ►కర్ణాటకలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ ►మోదీ రాజ్యం కావాలా? ఎంఐఎం రాజ్యం రావాలా? ►ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్లు అధికారం పంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి ►రాష్ట్రంలో బీజేపీని గెలిపించుకుని.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ::: బండి సంజయ్ కామెంట్స్ ఐదు రాష్ట్రాల్లో అధికారం బీజేపీదే ►తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం ► తెలంగాణలోనే కాదు.. ఐదురాష్ట్రాలలో బీజేపీ విజయం సాధిస్తుంది ► ఆదిలాబాద్ టూ అర్మూర్ రైల్వే లైన్ మంజూరు చేయించా ►త్వరలో ఐదువేల కోట్లతో రైల్వే పనులు చేయిస్తా :::ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు ► జనగర్జన సభా ప్రాంగణానికి చేరుకున్న అమిత్ షా ►ఆదిలాబాద్కు చేరుకున్న అమిత్ షా ► నాగపూర్ నుంచి హెలికాప్టర్లో ఆదిలాబాద్కు చేరిక ► స్వాగతం పలికిన కిషన్రెడ్డి, ఎంపీ సోయంబాపురావు.. బీజేపీ శ్రేణులు ►కాసేపట్లో జనగర్జన సభా స్థలికి అమిత్ షా చేరిక ► ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యాక రాష్ట్రంలో బీజేపీ నిర్వహించనున్న తొలి బహిరంగ సభ కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. ►బీజేపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆ పార్టీ జాతీయ స్థాయి కీలక నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ఆదిలాబాద్ రానున్నారు. జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. జనగర్జనగా దీనికి నామకరణం చేశారు. ► తాజాగా.. ఎన్నికల షెడ్యూల్ జారీ కావడంతో ఈ సభ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పరిధిలోకి వెళ్లనుంది. ► జనగర్జన నేపథ్యంలో బీజేపీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. ఆదిలాబాద్ పట్టణాన్ని కాషాయ జెండాలతో నింపేసింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, ఇతర రాష్ట్ర నేతల ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. షా షెడ్యూల్ ఆదిలాబాద్ జనగర్జన తర్వాత.. నేరుగా హైదరాబాద్కు చేరుకుంటారు. ఇంపీరియల్ గార్డెన్లో జరిగే మేధావుల సదస్సులో పాల్గొని.. ఆపై ITC కాకతీయలో ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం, డిన్నర్లో పాల్గొంటారు. రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి వెళ్లారు. ఇది కూడా చదవండి: రాజకీయం గరం గరం ‘సాక్షి’ తెలుగు న్యూస్ కోసం వాట్సాప్ చానల్ను ఫాలో అవ్వండి -
తెలంగాణలో దూకుడుగా వెళ్లాలని బీజేపీ ప్లాన్
-
తెలంగాణకు కేంద్రమంత్రి అమిత్ షా.. షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్షా మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ నెల 10వ తేదీన అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి అధికారిక షెడ్యుల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్లో జరగనున్న బహిరంగసభలో అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్నగర్, 3న నిజామాబాద్లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో పార్టీపరంగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అమిత్ షా సభను బీజేపీ నిర్వహించనుంది. కాగా రాజేంద్రనగర్ నియోజకవర్గపరిధిలోని శంషాబాద్లో అదేరోజు సాయంత్రం అమిత్ షా సభ నిర్వహించాలని తొలుత భావించింది. అయితే ఈ సభ రద్దు అయింది. దీనికి బదులు సాయంత్రం సికింద్రాబాద్ సిఖ్ విలేజీలోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొనున్నారు. 6.20 నుంచి 7.20 వరకు ఈ భేటీ కొనసాగనుంది. అదేవిధంగా సాయంత్రం తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో అమిత్షా సమావేశం కానున్నారు. రాత్రి 7.40 గంటలకు ఐటీసీ కాకతీయలో రెండు గంటలపాటు ఈ భేటీ జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు. పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది. చదవండి: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు విడుదల.. తెలంగాణలో ఎప్పుడంటే..? అమిత్ షా షెడ్యూల్: ► మధ్యాహ్నం 1.45 కు బేగంపేట ఎయిర్ పోర్ట్కు అమిత్ షా ►2.35కు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ చేరుకుంటారు. ►మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ సభలో పాల్గొననున్నారు. ►4.15 కు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు బయలుదేరనున్నారు. ►5.05 బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ►5. 20 నుంచి 6 గంటల ఐటీసీ కాకతీయలో సమావేశం ► 6 గంటలకు ఇంపీరియల్ గార్డెన్కు బయల్దేరనున్నారు. ►6.20 నుంచి 7.20 వరకు ఈ భేటీ కొనసాగనుంది. ► రాత్రి 7 గంటల 40 నిమిషాలకు ఐటీసీ కాకతీయలోబీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం ►రెండు గంటల పాటు కొనసాగనున్న భేటీ ►రాజకీయ పరిణామాలు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించే అవకాశం ►9.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. -
10న ఆదిలాబాద్లో అమిత్ షా సభ
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 10న మధ్యాహ్నం ఒంటి గంటకు ఆదిలాబాద్లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్లో జరగనున్న బహిరంగసభలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్నగర్, 3న నిజామాబాద్లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో పార్టీపరంగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అమిత్ షా సభను బీజేపీ నిర్వహించనుంది. 10న రాజేంద్రనగర్ నియోజకవర్గపరిధిలోని శంషాబాద్లో అదేరోజు సాయంత్రం అమిత్ షా సభ నిర్వహించాలని తొలుత భావించింది. అయితే ఈ సభ రద్దు అయింది. దీనికి బదులు సికింద్రాబాద్ సిఖ్ విలేజీలోని ఇంపీరియల్ గార్డెన్లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొనున్నారు. మేధావుల సదస్సు సక్సెస్పై ఆదివారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో లీగల్ సెల్తోపాటు ఇతర మేధావులతో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి భేటీ అయ్యారు. సదస్సుకు అన్ని వర్గాల మేధావులను ఆహ్వనించి మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై వారి నుంచి బీజేపీ సలహాలు తీసుకోనుంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో ఆదిలాబాద్ సభలో అమిత్ షా వివ రిస్తారని అన్నారు. కేసీఆర్కు హఠావో, బీజేపీకో జీతావో.. తెలంగాణకో బచావో... అనేదే బీజేపీ నినాదామని చెప్పారు. ప్రధాని మోదీ దిష్టిబోమ్మలను ఎందుకు దగ్ధం చేస్తున్నారో కాంగ్రెస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం రూ.9 లక్షల కోట్లు ఇచ్చినందుకా, ఇటీవల రాష్ట్రానికి పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ వంటివి ప్రకటించినందుకా, కృష్ణానదీలో తెలంగాణ నీటి వాటా ఖరారుకు ట్రిబ్యునల్ వేసినందుకా.. మోదీ దిష్టిబో మ్మలు దగ్ధం చేస్తున్నారు’అని నిలదీశారు.