Farmer Deaths
-
ఆదిలాబాద్లో రైతు ఆత్మహత్య.. హరీశ్రావు కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలానికి చెందిన రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవడంపై మాజీ మంత్రి హరీశ్రావు స్పందించారు. రైతు మామిళ్ల నర్సయ్య ఆత్మహత్యపై హరీశ్రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు హరీశ్రావు శనివారం(జనవరి25)ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే గడిచిన వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. రైతుల మరణ మృదంగం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నట్లు? కాంగ్రెస్ పాలనలో రైతన్నకు భరోసా లేక మనోధైర్యం కోల్పోతున్నడు. అందరికి అన్నం పెట్టే అన్నదాతకు సున్నం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ. నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచి, నమ్మక ద్రోహం చేస్తున్నది. రుణమాఫీ పూర్తి చేసినట్లు రంకెలేస్తున్న సీఎం రేవంత్రెడ్డి అప్పులు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతులకు ఏమని సమాధానం చెబుతారు. రైతుల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఆత్మహత్యలు పరిష్కారం కావు, బతికుండి కొట్లాడుదాం. అధైర్య పడొద్దు, బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది’అని హరీశ్రావు తెలిపారు. -
ఏనుగు దాడిలో మరో రైతు మృతి
పెంచికల్పేట్ (సిర్పూర్): మహారాష్ట్ర మీదుగా ప్రాణహిత నది దాటి కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి అడుగుపెట్టిన ఏనుగు మరో రైతు ను బలితీసుకుంది. చింతలమానెపల్లి మండలం బూరెపల్లి గ్రామ శి వారు మిరప చేనులో పని చేసుకుంటున్న రైతు అల్లూరి శంకర్ను బుధవారం పొట్టన పెట్టుకోగా.. గురువారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్తున్న పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన కారు పోశన్న(60)పై దాడి చేసి చంపేసింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం వేకువజామున పంటకు నీళ్లు పెట్టేందుకు రైతు పోశన్న పొలానికి వెళ్లగా, రహదారికి సమీపంలోని పొలం వద్ద ఉన్న ఏనుగు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అనంతరం ఏనుగు రోడ్డుపైకి రావడంతో అక్కడే వాకింగ్ చేస్తున్న యువకులు గమనించి పరుగులు తీసి ఫోన్ ద్వారా గ్రామస్తులకు విషయం తెలియజేశారు. మృతుడికి భార్య సుశీల, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఘటనాస్థలాన్ని అదనపు కలెక్టర్ వేణు, కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్, అటవీ అధి కారులు పరిశీలించారు. ఏనుగు దాడి నేపథ్యంలో దహెగాం, చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో 144 సెక్షన్ విధించి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటవీశాఖ అధికారులతో వాగ్వాదం బుధవారమే ఓ రైతు ఏనుగు దాడిలో మృతిచెందినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అందువల్లే గురువారం పోశన్న ఏనుగు దాడిలో ప్రాణాలు కోల్పోయాడని గ్రామస్తులు అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దశలో అటవీ వర్గాలపై దాడికి యత్నించడంతో అక్కడే ఉన్న డీఎస్పీ కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామస్తులను అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్గ్రేషియా, ఐదెకరాల వ్యవసాయ భూమి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. అటవీశాఖలో కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగావకాశమిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. లోడుపల్లి అడవుల్లోకి గజరాజు గురువారం రైతును చంపిన ఏనుగు మళ్లీ రాత్రి 8 గంటల కు కొండపల్లి టర్నింగ్ వద్ద కనిపించింది. అటు నుంచి లోడుపల్లి అడవుల్లోకి వెళ్లినట్టు గుర్తించారు. పెంచికల్పేట్– సలుగుపల్లి రోడ్డులో రాకపోకలను నిలిపివేశారు. ఏనుగుకు హాని తలపెట్టొద్దు.. బెజ్జూర్: కుమురంభీం జిల్లాలో సంచరిస్తున్న ఏనుగుకు ప్రజలు ఎలాంటి హానీ తలపెట్టొద్దని రాష్ట్ర వైల్డ్ లైఫ్ పీసీసీఎఫ్ పర్గేన్ సూచించారు. బెజ్జూర్ రేంజ్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. కాగజ్నగర్ డివిజన్ ప్రాంతంలో దాని ముఖ్య ఆహారం చెరుకు దొరకకపోవడంతో తిరిగి చత్తీస్గఢ్కు వెళ్లే అవకాశం ఉందన్నారు. అటవీశాఖ అప్రమత్తం సాక్షి, హైదరాబాద్: ఏనుగు సంచరిస్తున్న ప్రదేశాలలో అటవీశాఖ అధికారులు.. సమీప గ్రామాలలోని ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతీ ఒక్క నివాసాన్ని సందర్శించి వారిని బయటికి వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. హుల్లా పార్టీ (సంప్రదాయ పద్ధతిలో వెలిగించిన మషాల్, డప్పులు కొట్టడం ద్వారా ఏనుగును తరిమికొట్టడానికి ఉపయోగించే ప్రొఫెషనల్) మహారాష్ట్రలోని సమీప అటవీ ప్రాంతాల నుండి కూడా రప్పించి ఏనుగును జనావాసం నుంచి అటవీ ప్రాంతంలోకి మళ్లించే యత్నం చేస్తున్నారు. -
హడలెత్తిస్తున్న ఏనుగు.. దాడిలో ఇద్దరి రైతుల విషాదం!
ఆదిలాబాద్: కుమురంభీం జిల్లా ప్రజలను గజరాజు హడలెత్తిస్తున్నాడు. 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు రైతులు ఏనుగు దాడిలో మృత్యువాత పడటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఆచూకీ చిక్కకుండా తిరుగుతున్న ఏనుగు గ్రామీణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. రెండేళ్ల క్రితం ఇదే ప్రాంతంలో దహెగాం, కొండపల్లి గ్రామాలకు చెందిన ఇద్దరిని పెద్దపులి హతమార్చగా.. ఇప్పుడు ఏనుగు రూపంలో మృత్యువు వెంటాడుతోందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇద్దరు రైతుల మృతి.. బూరెపల్లి సమీపంలోని ప్రాణహిత నదిలో బుధవారం తెల్లవారుజామున ఏనుగును కొంతమంది గ్రామస్తులు గమనించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. సమాచారాన్ని విశ్వసించని అటవీ అధికారులు ఏనుగును నియంత్రించకపోవడంతో అది నది దాటి చింతలమానెపల్లి మండలంలోకి ప్రవేశించింది. ఉదయం 11 గంటల సమయంలో బూరెపల్లి సమీపంలోని వ్యవసాయ భూముల వద్దకు వచ్చిన ఏనుగు అక్కడే మిరపతోటలో పని చేస్తున్న రైతు అల్లూరి శంకర్పై దాడి చేసి చంపేసింది. ఆందోళనకు గురైన గ్రామస్తులు ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు దానిని అనుసరించగా.. గంగాపూర్, ఖర్జెల్లి గ్రామాల పక్కన ఉన్న ప్రాణహి త చేవేళ్ల ప్రాజెక్టు కాలువ పక్క నుంచి రుద్రాపూర్ గ్రామం వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి అధికారులు ఏనుగు కదలికలను గుర్తించలేదు. మళ్లీ గురువారం తెల్లవారుజామున పెంచికల్పేట్ మండలం కొండపెల్లి గ్రామానికి చెందిన కారు పోశన్న(60)పై దాడి చేసి చంపింది. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎల్కరి సుధాకర్ను వెంబడించగా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఏనుగు పలువురికి చెందిన తోటలు, పంటలు ధ్వంసం చేసింది. చింతలమానెపల్లి మండలం నుంచి బెజ్జూర్, పెంచికల్పేట్ మండలాల్లో సంచరించింది. ఈమండలాలతో పాటు పక్కన ఉన్న కౌటాల, దహెగాం మండలాలు కలిపి రెండు రోజులుగా ఏనుగు ఐదు మండలాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోకి ప్రవేశించిన ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని అటవీశాఖ ధ్రువీకరించడం లేదు. ఇప్పటివరకు కచ్చితమైన సమాచారం లేకపోవడంతో అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించడం లేదు. కాగా గత మంగళవారం ఏనుగు బూరెపల్లి వద్ద ప్రాణహిత నదికి అవతలి వైపు ఉన్న చౌడంపల్లి అటవీ ప్రాంతంలో సంచరించినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. చింతలమానెపల్లి మండలానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలోని గడ్చిరోలి జిల్లా రేపన్పల్లి రేంజ్ పరిధిలోని కమలాపూర్లో ఏనుగుల సంరక్షణ కేంద్రం ఉంది. అక్కడి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఏనుగు అడవుల్లో సంచరించేది. దక్షిణ గడ్చిరోలి ప్రాంతంగా పిలిచే మాలెవాడ, మురుంగావ్ ప్రాంతం ఛత్తీస్గఢ్, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉంది. ఛత్తీస్గఢ్లోని దట్టమైన అభయారణ్యం ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంతో కలిసి ఉంటుంది. కొన్నేళ్లుగా ఇక్కడి ప్రాంతంలో ఏనుగుల సంచారం ఉంది. మూడేళ్ల క్రితం మాలెవాడ అటవీ ప్రాంతానికి 25 నుంచి 30 ఏనుగుల బృందం వచ్చినట్లు అక్కడి అటవీ అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతంలోని ఏనుగుల గుంపు నుంచే ఓ ఏనుగు ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. గడ్చిరోలి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ధనోరాలో ఈ ఏనుగుల గుంపు కొద్ది నెలలుగా తీవ్ర విధ్వంసం సృష్టిస్తున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఓ డ్రైవర్ సహా మరో ముగ్గురిపై దాడి చేసి చంపేశాయి. ఈ ఏనుగులు కర్ణాటక రాష్ట్రం నుంచి అటవీ ప్రాంతం గుండా గడ్చిరోలిలోని మాలెవాడ అటవీ ప్రాంతానికి చేరుకున్నట్లు వారు చెబుతున్నారు. అటవీశాఖపై విమర్శలు.. బూరెపల్లి వద్ద ఏనుగు సంచరిస్తున్న సమచారాన్ని అటవీశాఖకు చేరవేసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికుల నుంచి విమర్శలు వస్తున్నాయి. సరైన సమయంలో స్పందించని కారణంగానే అల్లూరి శంకర్ ఏనుగు దాడిలో మరణించాడని ఆరోపిస్తున్నారు. ఒకరిపై దాడి చేసిన అనంతరం స్వయంగా జిల్లా అటవీ అధికారి పర్యవేక్షణలో ఉండగానే పెంచికల్పేట్ మండలంలోని కొండపల్లి వద్ద మరొకరు ఏనుగు దాడిలో మృతి చెందడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పరిసర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంలో అటవీశాఖ నిర్లక్ష్యం వహించిందని, గోప్యత పాటించడంతోనే ప్రమాదాలు పెరుగుతున్నాయని మండిపడుతున్నారు. కాగజ్నగర్ డివిజన్ పరిధిలో కొన్ని నెలల క్రితం అటవీ అధికారుల నిర్లక్ష్యంతో రెండు పులులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అధికారులను బాధ్యులు చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు పలువురిపై వేటు వేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ.. ఎస్పీ సురేశ్కుమార్, అటవీ కన్జర్వేటర్ శాంతారాం, జిల్లా అటవీ అధికారి నీరజ్ టోబ్రివాల్, డీఎస్పీ కరుణాకర్ స్వయంగా ఆయా మండలాలలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అధికారులు చింతలమానెపల్లి, కౌటాల, బెజ్జూర్, పెంచికల్పేట్, దహెగాం మండలాలలో 144 సెక్షన్ విధించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోడుపల్లి అడవుల్లోకి గజరాజు.. పెంచికల్పేట్(సిర్పూర్): పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో గురువారం వేకువజామున రైతును చంపిన ఏనుగు మళ్లీ రాత్రి 8 గంటలకు బెజ్జూర్ నుంచి పెంచికల్పేట్ వెళ్తున్న ఆర్టీసీ బస్సుకు కొండపల్లి టర్నింగ్ వద్ద ఎదురొచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పీసీసీఎఫ్ శాంతారాం, డీఎఫ్వో నీరజ్కుమార్ ఏనుగు సంచారాన్ని నిర్ధారించారు. లోడుపల్లి అడవుల్లోకి వెళ్లిందని తెలిపారు. అటవీశాఖ అధికారులు ఇచ్చిన సమాచారంతో ఎస్సై కొమురయ్య ఆధ్వర్యంలో పెంచికల్పేట్– సలుగుపల్లి రహదారిలో రాకపోకలను నిలిపివేశారు. నా వెంట పడింది.. ఉదయం పూట కొండప ల్లి సమీపంలో వాకింగ్కు వెళ్లా. ఏనుగు ఘీంకరించిన శబ్దం వినిపించింది. దూరంగా ఉన్న ఇద్దరు మిత్రులను అప్రమత్తం చేస్తూ అరవడంతో ఏనుగు నా వెంట పడడంతో పరుగెత్తి తప్పించుకున్నా. తర్వాత ఏను గు ఉన్న స్థలంలో చూడడానికి వెళ్లగా అక్కడ కారు పోశన్న మృతదేహం కనిపించింది. – ఎల్కరి సుధాకర్, పెంచికల్పేట్ -
Farmers movement: నేడు రైతు సంఘాల ‘బ్లాక్ డే’
చండీగఢ్: పంజాబ్–హరియాణా సరిహద్దు ల్లో ఖనౌరి వద్ద బుధవారం చోటుచేసుకున్న రైతు మరణంపై హరియాణా ముఖ్యమంత్రి, హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. రైతు మృతికి సంతాపం ప్రకటిస్తూ దేశవ్యాప్తంగా శుక్రవారం ‘బ్లాక్ డే’ గా పాటించాలని రైతులను కోరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హరియాణా సీఎం ఖట్టర్, రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ల దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 26వ తేదీన రైతులంతా తమ ట్రాక్టర్లతో జాతీయ రహదారులను దిగ్బంధించాలని పిలుపునిచ్చింది. అదేవిధంగా, మార్చి 14వ తేదీన ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో మహాపంచాయత్లో చేపట్టనున్నట్లు తెలిపింది. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని సంయుక్త కిసాన్ మోర్చా(రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చా(కేఎంఎం)లు కలిసి చేపట్టగా ఎస్కేఎం మద్దతు మాత్రమే ఇస్తోంది. 2020–21లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సుదీర్ఘంగా పోరాడిన ఎస్కేఎం నేతలెవరూ ‘ఢిల్లీ చలో’లో పాలుపంచుకోవడం లేదు. గురువారం ఎస్కేఎం నేతలు చండీగఢ్లో సమావేశమై సరిహద్దుల్లోని శంభు, ఖనౌరిల వద్ద నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. అనంతరం ఎస్కేఎం నేతలు బల్బీర్ సింగ్ రాజేవాల్, జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, రాకేశ్ తికాయత్, దర్శన్పాల్ మీడియాతో మాట్లాడారు. ఖనౌరి వద్ద బుధవారం జరిగిన ఆందోళనల్లో శుభ్కరణ్ సింగ్ అనే రైతు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం ఖట్టర్, మంత్రి విజ్లపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిద్దరూ వెంటనే పదవులకు రాజీనామా చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి పరిహారంగా రూ.కోటి చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అతడికున్న రూ.14 లక్షల రుణాలను మాఫీ చేయాలన్నారు. ఈ నెల 26వ తేదీన ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) దిష్టిబొమ్మను కూడా దహనం చేస్తామన్నారు. ఎస్కేఎం(రాజకీయేతర)ను కూడా కలుపుకుని పోయేందుకు చర్చలు ప్రారంభిస్తామని చెప్పారు. -
దద్దరిల్లిన సరిహద్దులు
చండీగఢ్: పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, వ్యవసాయ రుణాల రద్దుతో సహా ఇతర డిమాండ్లపై రైతు సంఘాలు, కేంద్ర మంత్రుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. రెండు రోజుల విరామం తర్వాత బుధవారం నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సమస్యలు పరిష్కారం అయ్యేదాకా తమ పోరాటం ఆగదని తేలి్చచెప్పారు. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణలతో పంజాబ్–హరియాణా సరిహద్దులోని శంభు, ఖనౌరీ బోర్డర్ పాయింట్లు దద్దరిల్లిపోయాయి. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ సంఖ్యలో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, జేసీబీలపై నిరసనకారులు తరలివచ్చారు. సరిహద్దుల్లో వేలాది మంది గుమికూడారు. రక్షణ వలయాన్ని ఛేదించుకొని ముందుకు దూసుకెళ్లడానికి ప్రయతి్నంచారు. వాహనాలతో బారీకేడ్లను ధ్వంసం చేసే ప్రమాదం ఉందని పోలీసులు అనుమానించారు. నిరసనకారులను చెదరగొట్టడానికి హరియాణా పోలీసులు డ్రోన్తో బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు. శంభు బోర్డర్ పాయింట్ వద్ద బుధవారం మూడుసార్లు బాష్పవాయువు ప్రయోగం చోటుచేసుకుంది. డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెంచారు. ఖనౌరీలోనూ రైతుల ఆందోళన కొనసాగింది. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఢిల్లీ వెళ్లడానికి తమను అనుమతించడానికి డిమాండ్ చేశారు. పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి, వారిని చెదరగొట్టారు. బాష్పవాయువు ప్రభావం నుంచి తప్పించుకోవడానికి చాలామంది రైతులు మాసు్కలు, కళ్లద్దాలు ధరించారు. -
అవన్నీ రైతు ఆత్మహత్యలు కావు..
వరంగల్ క్రైం: పంట నష్టం, అప్పుల బాధ తదితర కారణాలతో గ్రామాల్లో జరిగే రైతుల ఆత్మహత్యలపై వరంగల్ పోలీస్ కమిషనర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గురువారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నకిలీ విత్తన ముఠాల వివరాలు వెల్లడించిన సీపీ.. అనంతరం పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో రైతు ఆత్మహత్యలపై మాట్లాడుతూ ‘గ్రామాల్లో జరుగుతున్నవన్నీ రైతు ఆత్మహత్యలు కాదు.. గుండెపోటు, అనారోగ్యంతో చనిపోయినా రైతు ఆత్మహత్యలుగా నమోదయ్యేవి. గతంలో రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం రూ.లక్ష పరిహారం ఇచ్చేది. అందుకే రైతు ఆత్మహత్యగా నమోదు చేసేవాళ్లం. ఎలా చనిపోయినా రైతు ఆత్మహత్యగానే నమోదు చేయడంతో సంఖ్య ఎక్కువగా ఉంది..’అని అన్నారు. ఈ వ్యాఖ్యలు మీడియాలో రావడంతో సీపీ వివరణ ఇచ్చారు. 6 నెలలుగా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు: రైతు ఆత్మహత్యలపై ఎలాంటి వివాదం లేదని సీపీ వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించడం ద్వారా ఆరు నెలల కాలంగా ఏ ఒక్క రైతు కూడా ఆర్థిక, పంటనష్టం కారణంతో ఆత్మహత్యకు పాల్పడలేదని, ఈ కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎక్కడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతుల అభ్యన్నతి కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో భాగంగానే రైతుబీమా పథకాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ పథకం ద్వారా రైతు ఏ కారణంతో మరణించినా ఆ కుటుంబానికి ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారన్నారు. కానీ రైతులు, పోలీసులకు ఈ పథకంపై సరైన అవగాహన లేకపోవడంతో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఇతర కారణాలతో రైతులు మరణిస్తే 2004లో అప్పటి ప్రభుత్వం జారీచేసిన 421 జీఓ నిబంధనల ప్రకారమే ఆర్థిక సాయం కోసం రైతు ఆత్మహత్యలుగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు. అయితే ప్రస్తుతం రైతులు ఏ విధంగా మరణించినా బాధిత కుటుంబాలకు రైతుబీమా ద్వారా ఐదు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తున్నారని తెలిపారు. -
కామారెడ్డి జిల్లా అడ్లూర్లో ఉద్రిక్తత
-
కామారెడ్డిలో ఉద్రిక్తత.. బెడిసికొట్టిన మున్సిపల్ మాస్టర్ ప్లాన్!
సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని అడ్లూరులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాస్టర్ ప్లాన్లోని భూమి కోల్పోవడంతో రాములు అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రాములు ఆత్మహత్యతో రైతులు ఆందోళనకు దిగారు. అయితే, గత నెలరోజులుగా మాస్టర్ ప్లాన్పై కామారెడ్డి రైతులు ధర్నా చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ విషయంలో రాములు సూసైడ్ నోట్తో ఈ రగడ మరింతగా ముదిరింది. జరిగింది ఇదే.. కామారెడ్డి టౌన్: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పయ్యావుల రాములు(42)కు కామారెడ్డి పట్టణ శివారులోని ఇలి్చపూర్ వద్ద 3 ఎకరాల సాగుభూమి ఉంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాములు ఆ భూమిని గతంలోనే అమ్మకానికి పెట్టాడు. మున్సిపల్ నూతన మాస్టర్ప్లాన్ ప్రతిపాదనల్లో ఆయన భూమిని ఇండ్రస్టియల్ జోన్లోకి మార్చడంతో భూమి అమ్ముడుపోవడం లేదు. దీంతో మనస్తాపానికి గురైన రాములు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు బుధవారం మృతదేహాన్ని ట్రాక్టర్లో తీసుకుని బల్దియా వద్ద ఆందోళన చేయడానికి బయలుదేరగా.. పోలీసులు కామారెడ్డి బస్టాండ్ వద్ద అడ్డుకున్నారు. దీంతో రైతులు రెండు గంటలపాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదం జరిగింది. రైతులు మృతదేహాన్ని అక్కడే వదిలేసి బల్దియా కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేశారు. అనంతరం పోలీసులు కొత్తబస్టాండ్ వద్దనున్న మృతదేహాన్ని అశోక్నగర్ కాలనీ, రైల్వేగేట్, పాత బస్టాండ్ మీదుగా జిల్లా ఆస్పత్రికి తరలించారు. బల్దియా వద్ద ధర్నా తన భర్త మృతదేహన్ని అనుమతి లేకుండా పోలీసులు ఏరియా ఆస్పత్రికి తరలించడంపై మృతుడి భార్య శారద నిరసన తెలిపింది. ఆమె పెద్ద కుమారుడు అభినందు, చిన్న కుమారుడు నిషాంత్, బంధువులతో కలిసి మున్సిపల్ కార్యాలయం ముందున్న అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైతులు మున్సిపల్ కార్యాలయం గేటు వద్ద ఆందోళన చేశారు. కమిషనర్ కమీషనర్ రాగానే ఆయనతో వాగ్వాదానికి దిగారు. మద్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆందోళన కొనసాగింది. ఆందోళనలో లింగాపూర్, అడ్లూర్ఎల్లారెడ్డి, ఇలి్చపూర్ తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు. నా కుటుంబాన్ని ఆదుకోండి తన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఆత్మహత్య చేసుకున్న రాములు భార్య పయ్యావులు శారద కోరింది. బుధవారం రాత్రి ఆమె ఆందోళన విరమించి, కుటుంబ సభ్యులతో కలి సి ఏరియా ఆస్పత్రికి వెళ్లింది. ప్రభుత్వం, అధి కారుల నిర్లక్ష్యం వల్ల తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా మని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గ్రామనికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. -
ప్రతి ముగ్గురు రైతుల్లో.. ఒకరు కౌలుదారే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రతీ ముగ్గురు వ్యవసాయదారుల్లో ఒకరు కౌలురైతు ఉన్నారని రైతు స్వరాజ్య వేదిక సర్వేలో వెల్లడైంది. రాష్ట్రంలో కౌలురైతుల స్థితిగతులపై ఆ వేదిక ఆధ్వర్యంలో అధ్యయనం జరిపారు. 20 జిల్లాల్లో 34 గ్రామాల్లో మొత్తం 7,744 మంది రైతులను సర్వే చేయగా, వారిలో 2,753 మంది (35.6 శాతం) కౌలురైతులు ఉన్నట్లు తేలింది. సర్వే చేసిన మొత్తం 2,753 కౌలురైతుల్లో 523 మంది ఏమాత్రం భూమి లేనివారే. వీరు 19 శాతం మంది ఉన్నారు. 81 శాతం మంది ఎంతోకొంత సొంత భూమి ఉండి, అది జీవనోపాధికి సరిపోక అదనంగా మరి కొంతభూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలురైతుల సగటు సొంతభూమి 2.3 ఎకరాలు కాగా, సగటున కౌలుకు తీసుకున్న భూమి విస్తీర్ణం 5.1 ఎకరాలు. 31 శాతం మంది కౌలు రైతులు 5 ఎకరాల కంటే ఎక్కువ భూమిని కౌలుకు తీసుకున్నారు. కౌలు రైతుల్లో 60.9 శాతం మంది బీసీలున్నారు. ఎస్సీలు 22.9 శాతం, ఎస్టీలు 9.7 శాతం మంది ఉన్నారు. ఓసీలు 4.2 శాతం, ముస్లిం మైనారిటీలు 2.4 శాతం మంది ఉన్నారు. భూమిని కౌలుకు ఇస్తున్న యజమానుల్లో 49 శాతం మంది బీసీలు కాగా, 33 శాతం మంది ఓసీలు, 10 శాతం మంది ఎస్సీలు, మిగిలిన 7 శాతం మంది ఎస్టీలు, మైనారిటీలు. సర్వేలో ముఖ్యాంశాలు... ► భూయజమానుల్లో 26 శాతం మంది మాత్రమే స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. 55 శాతం మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యాపారం, కాంట్రాక్టులు, ఇతర వృత్తుల్లో ఉన్నవారే. మిగిలినవారు ఇతర వృత్తి లేనివారు లేదా వృద్ధులు. ► 25 శాతం భూ యజమానులు నగరాల్లో ఉండగా, ఒక శాతం విదేశాల్లో ఉంటున్నారు. నగరాలు, విదేశాలలో ఉన్నవారిలో సగం మంది ఆ గ్రామాలతో కానీ, వ్యవసాయంతోకానీ ఎటువంటి సంబంధం లేనివారే. కేవలం పెట్టుబడి కోసం వీరు భూములను కొని కౌలుకు ఇస్తున్నారు. ► కౌలు రైతుల్లో 9.5 శాతం మహిళలున్నారు. మహిళా కౌలురైతులలో 22.7 శాతం భూమి లేని వారే. ► 73 శాతం కౌలు రైతులు ఒకే భూమిలో కనీసం మూడేళ్లు లేదా అంతకుపైగా సాగు చేస్తున్నారు. 39 శాతం మంది 5 ఏళ్లకుపైగా, 18 శాతం మంది 10 ఏళ్లకుపైగా ఒకే భూమిలో కౌలు సాగుచేస్తున్నారు. ► 91.1 శాతం కౌలు రైతులు కౌలు మొత్తాన్ని నగదురూపంలో, 7.5 శాతం మాత్రమే పంట రూపంలో చెల్లిస్తున్నారు. చాలా కొద్దిమంది మాత్రమే పంట భాగస్వామ్యం పద్ధతిలో కౌలు ఇస్తున్నారు. నగదురూపంలో కౌలు చెల్లించేవారిలో 38.3 శాతం మంది సీజన్ ముందే పూర్తిగా చెల్లిస్తున్నారు. 20.5 శాతం మంది కౌలు ధరలో సగం ముందుగా చెల్లించి సగం చివరిలో చెల్లిస్తున్నారు. 41 శాతం మంది పంటకోతల తర్వాత చెల్లిస్తున్నారు. ► కౌలురైతుల్లో 69 శాతం వ్యవసాయ కూలీలుగా ఉన్నారు. హమాలీ/భవన నిర్మాణ కార్మికులుగా 13 శాతం మంది, పశుపోషణపై 9.6 శాతం మంది, మేకలు, గొర్రెల పెంపకంపై 3 శాతం మంది ఆధారపడ్డారు. ఇతరులు బీడీ కారి్మకులుగా, ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటోడ్రైవర్లుగా, చిన్నవ్యాపారులుగా అదనపు ఆదాయం సంపాదిస్తున్నారు. ► రాష్ట్రవ్యాప్తంగా ప్రతికౌలు రైతు కుటుంబానికి సగటు రుణం రూ.2.7 లక్షల వరకు ఉంది. దానిలో రూ. 2 లక్షలు ప్రైవేట్ రుణాలే. కౌలుభూమి మీద పంటసాగు కోసం బ్యాంకు రుణాలు అందడంలేదు. వాళ్లకు ఉన్న ► మొత్తం రుణాల్లో 25 శాతం మాత్రమే బ్యాంక్ రుణాలు ఉన్నాయి. ప్రైవేట్ అప్పులపై వడ్డీ 24 శాతం నుంచి 60 శాతం వరకు ఉంది. ఇదీ చదవండి: చక్కని సాగుకు.. చిన్న డ్రోన్లు -
కేసీఆర్ 8 ఏళ్ళ పాలనలో 8 వేల మంది రైతులు బలి
-
AP: అన్నదాతకు ఆత్మస్థైర్యం
సాక్షి, అమరావతి: ఏ అన్నదాతకూ ఆత్మహత్య చేసుకునేంత దుస్థితి రాకూడదు. అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడితే... పాలకులు ఆ కుటుంబాన్ని అక్కున చేర్చుకుని భరోసా ఇవ్వాలి. కానీ చంద్రబాబు హయాంలో... పరిహారం కోసమే ప్రాణాలు తీసుకుంటున్నారని వారిని ఎగతాళి చేశారు. సాయాన్నీ గాలికొదిలేశారు. ‘ప్రశ్నిస్తా!’ అని పదేపదే అరిచే జనసేనాని పవన్కల్యాణ్ ఈ దురాగతంపై నోరెత్తితే ఒట్టు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక రైతు ఆత్మహత్యలపై రీసర్వే చేయించారు. చంద్రబాబు హయాంలో మరణించిన 469 మంది రైతుల కుటుంబాలకు పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి 7 లక్షలకు పెంచి మరీ అందజేశారు. దీన్ని ప్రశ్నించలేని జనసేనాని కొత్త రాగం అందుకున్నారు. రైతుల ఊసెత్తకుండా.. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ప్రభుత్వం సాయం చేయలేదంటున్నారు. ఏం! కౌలు రైతుల వివరాల్ని గ్రామ సచివాలయాల స్థాయిలో నమోదు చేసుకుని లక్షల మందికి సీసీఆర్సీ (గుర్తింపుకార్డులు) ఇచ్చింది ఈ ప్రభుత్వం కాదా? వారందరికీ రైతు భరోసా అమలు చేసిన తొలి రాష్ట్రం ఏపీ కాదా? పంటల బీమా సహా రైతులకిచ్చే అన్ని పథకాలనూ కౌలు రైతులకూ వర్తింపజేసింది ఈ ప్రభుత్వం కాదా? ఎవరు చనిపోయినా కౌలు రైతే అంటే ఎలా? కౌలురైతులు కాని సామాన్యులు ఆత్మహత్యకు పాల్పడినా వైఎస్సార్ బీమా కింద ప్రభుత్వం సాయం అందిస్తుండటం మీకు తెలీదా? చంద్రబాబు హయాంలో రైతులకు సైతం సాయం ఎగవేస్తే ప్రశ్నించలేదు ఈ దత్తపుత్రుడు. ఇపుడు కౌలు రైతులంటూ ఎందుకీ డ్రామా అన్నదే అందరి ప్రశ్న!!. ► మట్టినే నమ్ముకుని సేద్యం చేస్తున్న కౌలు రైతుల కడగండ్లను గుర్తిస్తూ దేశంలోనే తొలిసారిగా రైతు భరోసా నుంచి పంటల బీమా దాకా అన్ని రకాల ప్రయోజనాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అందచేస్తోంది. లక్షల మంది కౌలు రైతులకూ గ్రామ సచివాలయాల ద్వారా సీసీఆర్సీ కార్డులను ఇచ్చి పంట రుణాలు సమకూర్చి వెన్ను తడుతోంది. గత సర్కారు హయాంలో వంచనకు గురై ఆత్మహత్యలకు ఒడిగట్టిన 469 మంది అన్నదాతల కుటుంబాలకు ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిహారం కింద రూ.23.45 కోట్లను చెల్లించింది. రుణమాఫీ పేరుతో మోసపోయిన రైతన్నలకు సాంత్వన చేకూరుస్తోంది. గ్రామస్థాయిలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి అన్ని సేవలను అక్కడే అందచేస్తోంది. విత్తనం నుంచి నూర్పిళ్ల దాకా ప్రతి అడుగులోనూ వారికి తోడుగా ఉండే బాధ్యతను సంతోషంగా స్వీకరించింది. సాయంపై సేనాని బుకాయింపు గత సర్కారుకు రైతుల ఆత్మహత్యలను గుర్తించేందుకే మనసు రాలేదు. రుణమాఫీ పేరుతో అన్నదాతలను నిలువునా ముంచేసింది. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.లక్ష ఎక్స్గ్రేషియా చెల్లిస్తే ఆ డబ్బుల కోసమే చనిపోతారని వ్యాఖ్యానిస్తూ ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్న సమయంలో పరిహారాన్ని చంద్రబాబు ఎత్తివేశారు. రైతుల ప్రాణాలకు వెల కట్టి చులకనగా మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవేవీ పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఇప్పుడు కౌలు రైతులతో సహా రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకుంటున్న ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తుండటం, తాను వచ్చాకే సాయం అందుతోందంటూ బుకాయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాపరికం లేకుండా.. పశ్చిమ గోదావరి జిల్లాలోనే 2019 జూన్ 1వతేదీ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 2వతేదీ వరకు ఆత్మహత్యలు చేసుకున్న 41 మంది రైతన్నల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా చెల్లించింది. గత సర్కారు రైతుల ఆత్మహత్యలను కనీసం నమోదు చేయకపోగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాపరికం లేకుండా పారదర్శకంగా పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేస్తోంది. ఎప్పటికప్పుడు వెంటనే బాధిత కుటుంబాలను ఆదుకుంటోంది. రైతు శ్రేయస్సే ధ్యేయంగా.. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతు శ్రేయస్సుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా గత సర్కారు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు, కౌలు రైతుల వివరాలు సేకరించి ఆదుకోవాలని ఆదేశించారు. 2014 నుంచి 2019 మే 31 వరకు ఆత్మహత్యలకు పాల్పడ్డ 773 మంది రైతులకు సంబంధించి పునఃపరిశీలన చేయాలని నిర్దేశించారు. విచారణ అనంతరం 469 రైతు కుటుంబాలు ఎక్స్గ్రేషియాకు అర్హులని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు రూ.ఐదు లక్షల చొప్పన మొత్తం రూ.23.45 కోట్లను చెల్లించారు. ఇందులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 19 మంది కూడా ఉన్నారు. పరిహారం పెంపు.. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తూ ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేషియాను రూ.7 లక్షలకు పెంచుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు 2019 అక్టోబర్ 14న జీవో 102 జారీ అయింది. పెంచిన పరిహారాన్ని 01–06–2019 నుంచి వర్తింప చేసేందుకు వీలుగా 20–02–2020న మరో జీవో 43 జారీ చేశారు. ఈ జీవోల ప్రకారం 01–06–2019 నుంచి 31–12–2019 వరకు ఆత్మహత్యలు చేసుకున్న 308 మంది రైతు కుటుంబాలకు రూ.ఏడు లక్షల చొప్పున రూ.21.56 కోట్లను ఎక్స్గ్రేషియాగా చెల్లించారు. ఇదే ప్రకారం 2020 సంవత్సరంలో ఆత్మహత్యలు చేసుకున్న 260 రైతు కుటుంబాలకు రూ.ఏడు లక్షల చొప్పున రూ.18.20 కోట్లను పరిహారంగా చెల్లించారు. ఇక 2021 సంవత్సరంలో 126 రైతు కుటుంబాలకు రూ.8.82 కోట్లను అందచేశారు. గత సర్కారు హయాంలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలతో కలిపి 2021 వరకు ఎక్స్గ్రేషియా కింద రూ.72.145 కోట్లను చెల్లించారు. కలెక్టర్ల వద్ద కార్పస్ నిధి ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను తక్షణం ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో జిల్లా కలెక్టర్ వద్ద కార్పస్ నిధిగా కోటి రూపాయల చొప్పున అందుబాటులో ఉంచింది. 2021–22 బడ్జెట్లో బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించేందుకు రూ.20 కోట్లను కేటాయించగా రూ.15.345 కోట్లు వ్యయం చేసింది. 2022–23 బడ్జెట్లోనూ పరిహారం కోసం రూ.20 కోట్లను కేటాయించారు. పశ్చిమలో 41 కుటుంబాలకు పరిహారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2019 జూన్ 1 నుంచి 2022 ఫిబ్రవరి 2 వరకు 41 మంది రైతుల ఆత్మహత్యలు నమోదు కాగా ప్రభుత్వం అందరికీ పరిహారం చెల్లించింది. సాగు చేస్తున్నట్లు నిర్థారించిన 26 మందికి రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇవ్వగా ఇతరులకు అలాంటి రుజువులు లేకున్నా మానవత్వంతో వైఎస్సార్ బీమా కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించారు. ఇందులో నాలుగు రైతు కుటుంబాలకు రూ.రెండు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెల్లించగా 11 కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పరిహారం అందింది. పరిహారంతో పాటు పథకాలూ.. బాధిత కుటుంబాలకు కేవలం ఎక్స్గ్రేషియా మాత్రమే కాకుండా వివిధ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటోంది. ఒక్కో కుటుంబానికి కనిష్టంగా రెండు.. గరిష్టంగా ఏడు పథకాలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మ ఒడి, రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న తోడు, వైఎస్సార్ పెన్షన్ కానుక, వైఎస్సార్ ఆసరా, సున్నా వడ్డీ తదితర పథకాలను ఆ కుటుంబాలకు వర్తింప చేస్తున్నారు. -
ఆశ పోయింది.. శ్వాస ఆగింది..కొనుగోలు కేంద్రంలోనే ఆగిన రైతు గుండె
హుజూరాబాద్/జమ్మికుంట: ధాన్యంరాశి వద్ద ఇరవై రోజులుగా పడిగాపులు కాసినా, కొనే నాథుడులేడనే ఆవేదనతో అన్నదాత కన్ను మూశా డు. ఈ విషాదకర ఘటన కరీంనగర్ జిల్లాలో మంగళవారం జరిగింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన బిట్ల ఐలయ్య (59)కు 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. అందులో పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు 20 రోజుల క్రితం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. ధాన్యం తేమగా ఉందని అధికారులు కొర్రీ పెట్టడంతో ఐలయ్య అక్కడే ధాన్యం ఆరబోసి 20 రోజులుగా పడిగాపులు కాస్తున్నాడు. ఎప్పటిలాగే మంగళ వారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి మళ్లీ కొనుగోలు కేంద్రానికి వచ్చాడు. ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురై వడ్ల రాశిపైనే కుప్పకూలి విగతజీవిగా మారాడు. ఆయనకు భార్య లక్ష్మి, కూతురు నిత్య ఉన్నారు. కొనుగోలులో జాప్యం చేయడం వల్లే ఐలయ్య మృతి చెందాడని, మృతుడి కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సంపత్రావు డిమాండ్ చేశారు. వడ్లు తెచ్చి 20 రోజులైతాంది వడ్లను కేంద్రానికి తీసుకొచ్చి 20 రోజులైతాంది. తేమ ఉందని ఆరబెట్టాలని సార్లు చెప్పిన్లు. అప్పటిసంది కేంద్రంలోనే రోజూ ధాన్యం ఎండబెడుతున్నం. ఈ రోజు నా భర్త భోజనం చేసి, వడ్లను బస్తాలలో నింపేందుకు పోయిండు. కొద్దిసేపటికే చనిపోయిండని చెప్పిన్లు. నాకు దిక్కెవరు. ప్రభుత్వం ఆదుకోవాలె. – లక్ష్మి, మృతుడి భార్య టోకెన్ ఇచ్చాం ఐలయ్య వారం క్రితం కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. ఆరబెట్టిన తర్వాత ఈ టోకెన్ జారీ చేశాం. ఈరోజు గన్నీ తీసుకొని నింపుతుండగా అస్వస్థతకు గురై గుండెపోటుతో చనిపోయాడని తెలిసింది. – తిరుపతి, పీఏసీఎస్ సెంటర్ ఇన్చార్జి ఐలయ్యది ఆకస్మిక మరణం: అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఐలయ్య ధాన్యాన్ని గన్నీ సంచుల్లో నింపే సమయంలో గుండెపోటుతో మృతి చెందారని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 4న 10–10 రకానికి చెందిన దాదాపు 50 బస్తాల ధాన్యాన్ని తీసుకురాగా, 6న టోకెన్ జారీచేశామని పేర్కొన్నారు. ఐలయ్య మృతిపై జిల్లా సహకార అధికారి కార్యాలయం సీనియర్ ఇన్స్పెక్టర్ ప్రసూనతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు. -
సీన్ రీక్రియేషన్.. లఖీమ్పూర్కు ఆశిష్ మిశ్రా
అఖీమ్పూర్ ఖేరి: ఉత్తరప్రదేశ్లో లఖీమ్పూర్ ఖేరి హింసాకాండపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) తన కార్యాచరణను వేగవంతంగా చేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు, ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాతోపాటు ఇదే కేసులో అరెస్టు చేసిన మరో ముగ్గురిని గురువారం ఘటనా స్థలానికి తీసుకొచి్చంది. హింసకు దారితీసిన పరిణామాలను తెలుసుకొనేందుకు లఖీమ్పూర్లో చోటుచేసుకున్న వరుస ఘటనలను రీక్రియేట్ చేసింది. రైతుల స్థానంలో కొన్ని బొమ్మలను పెట్టి, వాహనంతో ఢీకొట్టించినట్లు తెలుస్తోంది. పటిష్టమైన భద్రత మధ్య నిందితులను టికోనియా–బన్బరీపూర్ రోడ్డులో ఘటనా స్థలానికి చేర్చారు. అక్టోబర్ 3న జరిగిన ఘటనపై వారిని ప్రశ్నించారు. అంతకముందు అధికారులు జిల్లా జైలుకు చేరుకొని, నిందితులు దాస్, లతీఫ్, భారతిని తమ కస్టడీలోకి తీసుకొని, లఖీమ్పూర్కు బయలుదేరారు. ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాను పోలీసు కార్యాలయం నుంచి తీసుకొచ్చారు. దుర్ఘటన జరిగిన ప్రాంతం జిల్లా కేంద్రం లఖీమ్పూర్ సిటీకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్టోబర్ 3న రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లడంతో నలుగురు మరణించిన సంగతి తెలిసిందే. అనంతరం చెలరేగిన హింసాకాండలో మరో నలుగురు బలయ్యారు. వీరిలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఒక డ్రైవర్, ఒక జర్నలిస్టు ఉన్నారు. -
లఖీమ్పూర్ ఘటనను ఖండించాలి
బోస్టన్: ఉత్తరప్రదేశ్లో నలుగురు రైతుల ప్రాణాలను బలి తీసుకున్న లఖీంపూర్ ఖేరి ఘటనను తీవ్రంగా ఖండించాల్సిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు. అదే సమయంలో ఆ తరహా ఘటనలు దేశంలో ఎక్కడ జరిగినా గళమెత్తాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న సీతారామన్ మంగళవారం హార్వర్డ్ కెన్నెడీ స్కూలులో జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ కొందరు సీతారామన్ను రైతులు బలిగొన్న ఘటనపై ప్రశ్నల వర్షం కురిపించారు. లఖీంపూర్ ఖేరి ఘటనపై ప్రధానమంత్రి, ఇతర సీనియర్ మంత్రులు ఎందుకు పెదవి విప్పడం లేదని, బీజేపీ దేనికి ఆత్మరక్షణలో పడిపోయిందని సూటిగా ప్రశ్నించారు. దీనికి సీతారామన్ బదులిస్తూ లఖీంపూర్ ఖేరి ఘటనని ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారని ఆ తరహా ఘటనలు దేశంలో ఇతర ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయని వాటి గురించి కూడా మాట్లాడాలని అన్నారు. ‘‘దేశంలో ఏ ప్రాంతంలో ఈ తరహా ఘటనలు జరిగినా అందరూ గళమెత్తాలి. భారత్ గురించి బాగా తెలిసిన డాక్టర్ అమర్త్యసేన్ వంటి వారు ఎక్కడ ఇలాంటి ఘటనలు జరిగినా లేవనెత్తాలి. యూపీలో బీజేపీ అధికారంలో ఉండడం, కేంద్ర మంత్రి కుమారుడు ప్రమేయంపై ఆరోపణలున్నాయి కాబట్టే అందరూ మమ్మల్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఈ పని ఎవరు చేసినా న్యాయస్థానంలో తేలిపోతుంది. ఇదంతా నేను మా ప్రధానిని కానీ, మా పార్టీని కానీ వెనకేసుకొని రావడం కాదు. నేను భారత్ గురించి మాట్లాడతాను. నిరుపేదలకు జరగాల్సిన న్యాయం గురించి మాట్లాడతాను’’అని సీతారామన్ సమాధానమిచ్చారు. -
మరణావస్థలో కాంగ్రెస్!: సిద్ధూ
చండీగఢ్: కాంగ్రెస్ను తనదైన శైలిలో ఇబ్బందులు పెడుతున్న నవజోత్సింగ్ సిద్దూ మరోమారు గళం విప్పారు. యూపీలో జరిగిన రైతు మరణాలకు సంబంధించి ఆయన మొహాలి నుంచి లఖిమ్పూర్కు యాత్ర చేపట్టారు. దీని ఆరంభానికి ముందు పంజాబ్ సీఎం రాక ఆలస్యం కావడంతో ఆయన అసహనంగా కనిపించారు. దీంతో సిద్ధూను కేబినెట్మంత్రి పర్గాత్ సింగ్ శాంతింపజేయడానికి ప్రయతి్నస్తున్న వీడియో ఒకటి మీడియాలో ప్రత్యక్షమైంది. సీఎం త్వరలో వస్తారని పర్గాత్ చెప్పడం, ఈ యాత్ర విజయవంతమవుతుందని కాంగ్రెస్ పంజాబ్ సీడబ్లు్యసీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సముదాయించడం వీడియోలో కనిపించింది. వీరి మాటలకు సిద్ధూ స్పందిస్తూ ‘‘విజయం ఎక్కడ? నాకు పగ్గాలు అప్పజెప్పిఉంటే మీకు విజయం కనిపించేది. ఇప్పుడు కాంగ్రెస్ మృతావస్థలో ఉంది.’’ అని ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా కనిపించింది. సీఎం మార్పునకు నిరసనగా కాంగ్రెస్ పంజాబ్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సిద్ధూ అనంతరం అధిష్టానం బుజ్జగింపుతో మెత్తబడ్డట్లు కనిపించారు. అయితే ఆయన రాజీనామాను అధికారికంగా ఉపసంహరించుకోలేదు. ఆయనలో అసంతృప్తి చల్లారలేదని తాజా వ్యాఖ్యలు చూపుతున్నాయి. సిద్ధూకు దళితులపై గౌరవం లేదని, కేవలం ఎన్నికల కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని ప్రతిపక్ష అకాలీదళ్ విమర్శించింది. కాంగ్రెస్ సమస్యలకు తక్షణ పరిష్కారాలు దొరకవు! న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సమస్యల పరిష్కారానికి తక్షణ మార్గాల్లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. లఖీమ్పూర్ ఘటనతో పార్టీకి తక్షణ పునర్వైభవం వస్తుందని ఆశించేవారు నిరాశ పడకతప్పదంటూ ట్వీట్ చేశారు. కాంగ్రెస్లో చేరడానికి ప్రశాంత్ తయారవుతున్నారన్న ఊహాగానాల నడుమ ఆయన తాజా ట్వీట్ అందరినీ ఆకర్షిస్తోంది. జీఓపీ(గ్రాండ్ ఓల్డ్ పార్టీ– కాంగ్రెస్) వెనువెంటనే పునర్వికాసం చెందేందుకు లఖీమ్పూర్ ఘటన ఉపయోగపడుతుందని చాలామంది ఆశిస్తున్నారని, వీరంతా త్వరలో అతిపెద్ద నిరాశను ఎదుర్కొంటారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్లో ప్రశాంత్ చేరికను కొందరు వ్యతిరేకిస్తున్నారు. తాజా ట్వీట్తో తనకు, పార్టీ నాయకత్వంతో విభేదాలున్నట్లు ప్రశాంత్ పరోక్షంగా చెప్పినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఎంతమందిని అరెస్టు చేశారు?
సాక్షి, న్యూఢిల్లీ: లఖీమ్పూర్ ఖేరి ఘటనలో నలుగురు రైతులతో సహా మొత్తం 8 మంది మృతి చెందడం దురదృష్టకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఉదంతంలో తాజా పరిస్థితులపై నివేదిక అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. హింసాకాండకు సంబంధించి ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు? ఎంతమందిని అరెస్టు చేశారు? అనే వివరాలతో నివేదిక వెంటనే ఇవ్వాలని స్పష్టం చేసింది. యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్), జ్యుడీషియల్ కమిషన్ వివరాలను సైతం తమకు తెలియజేయాలని వెల్లడించింది. ఈ సుమోటో కేసుపై తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఘటనపై విచారణ చేపట్టాలంటూ న్యాయవాదులు శివకుమార్ త్రిపాఠి, సీఎస్ పాండా సుప్రీంకోర్టు సీజే జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశారు. గురువారం జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లిల ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. న్యాయవాది త్రిపాఠి వాదనలు వినిపించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. లేఖ ద్వారా ఏం ఉపశమనం కావాలని కోరుకుంటున్నారో చెప్పాలని లాయర్ను సీజేఐ ప్రశ్నించారు. ఘటనపై విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని విన్నవించారు. జస్టిస్ హిమాకోహ్లి జోక్యం చేసుకొని ఘటనను సరిగ్గా పరిశీలించలేదని, ఎఫ్ఐఆర్ సరిగ్గా నమోదు చేయలేదని పేర్కొన్నారు. అనంతరం యూపీ అదనపు అడ్వొకేట్ జనరల్ గరీమా ప్రసాద్ వాదనలు వినిపించారు. ఉదంతంపై ప్రభుత్వం ‘సిట్’ వేసిందని, దర్యాప్తు కోసం జ్యుడీషియల్ కమిషన్ను నియమించిందని తెలిపారు. రైతు తల్లికి తగిన వైద్య సేవలందించండి ‘అలహాబాద్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం పరిస్థితిని నివేదికలో తెలియజేయండి. శుక్రవారం విచారణ జరుపుతాం’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ‘‘హత్యకు గురైన వారిలో రైతులతోపాటు ఇతరులు ఉన్నారు. ఎవరెవరిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యింది? ఎవరిని అరెస్టు చేశారో తెలుసుకోవాలనుకుంటున్నాం. అందుకే తాజా పరిస్థితిపై నివేదిక దాఖలు చేయండి’’ అని జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. అంతకుముందు.. సుమోటో కేసుపై విచారణ ప్రారంభిస్తూ జస్టిస్ ఎన్.వి.రమణ న్యాయవాదులు లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. వారు కోరుతున్నట్లుగానే లఖీమ్పూర్ ఖేరి ఘటనపై విచారణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా కూడా స్క్రీన్ మీద కనిపించేసరికి ఎవరి తరఫున వాదిస్తున్నారని ప్రశ్నించారు. పౌరుల స్వేచ్ఛ కోసం బార్ సభ్యుడిగా వాదనలు వినిపిస్తానని హన్సారియా బదులిచ్చారు. ఆశిష్ మిశ్రాకు సమన్లు జారీ చేసిన ఉత్తరప్రదేశ్ పోలీసులు లఖీమ్పూర్ ఖేరి: లఖీమ్పూర్ ఖేరి హింసాకాండ ఘటనలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రాను ప్రశి్నంచేందుకు శుక్రవారం ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసినట్లు ఐజీ లక్ష్మీసింగ్ చెప్పారు. సమన్లకు స్పందించకపోతే చట్టప్రకారం ముందుకెళ్తామని తెలిపారు. ఈ హింసాకాండతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న బన్బీర్పూర్కు చెందిన లవకుశ్, నిఘాసన్ తహసీల్కు చెందిన ఆశిష్ పాండేను అరెస్ట్ చేసి ప్రశి్నస్తున్నట్లు చెప్పారు. హింసాకాండలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్పై ఎఫ్ఐఆర్ నమోదవడం తెల్సిందే. ఏకసభ్య జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు లఖీమ్పూర్ ఖేరి హింసాకాండపై న్యాయ విచారణకు అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రదీప్కుమార్ శ్రీవాస్తవ సభ్యుడిగా జ్యుడీíÙయల్ కమిషన్ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు గురువారం ఈ విషయం వెల్లడించారు. ఏకసభ్య కమిషన్ ఏర్పాటుపై ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. లఖీమ్పూర్ ఖేరి కేంద్రంగానే ఈ కమిషన్ పని చేస్తుందని, న్యాయ విచారణను పూర్తి చేయడానికి రెండు నెలల సమయం ఇస్తున్నట్లు తెలిపింది. -
హైడ్రామా నడుమ రాహుల్ పరామర్శ
లక్నో: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాం«దీ, తన సోదరి ప్రియాంక గాం«దీతో కలిసి లఖీమ్పూర్ ఖేరిలో బాధిత రైతు కుటుంబాలను పరామర్శించారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ చన్నీ, ఛత్తీస్గఢ్ సీఎం బఘేల్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, సూర్జేవాలేలతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి లక్నో విమానాశ్రయానికి రాహుల్ చేరుకున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించడానికి యూపీ ప్రభుత్వం అనుమతినిచి్చనప్పటికీ పోలీసులు రాహుల్ సొంత వాహనంలో వెళ్లడానికి అంగీకరించలేదు. పోలీసు వాహనంలో వెళ్లాలని చెప్పారు. దీంతో లక్నో విమానాశ్రయంలో రాహుల్ ధర్నా చేశారు. ‘నాకు వాహనం ఏర్పాటు చేయడానికి మీరెవరు? నేను నా సొంత వాహనంలో వెళతాను’ అంటూ పోలీసులు, భద్రతా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నా వాహనంలో వెళ్లడానికి అనుమతించేవరకు నేను ఇక్కడే కూర్చుంటాను. రైతుల్ని అణిచివేస్తున్నారు. వారిని దోచేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను ఎవరి కోసం చేశారో అందరికీ తెలుసు’’ అని రాహుల్ అన్నారు. రాహుల్ ధర్నాతో దిగొచి్చన యూపీ పోలీసులు సొంత వాహనంలో వెళ్లడానికి అనుమతించారు. లక్నో నుంచి సీతాపూర్ గెస్ట్హౌస్లో ఉన్న ప్రియాంక గాంధీని ఆయన కలుసుకున్నారు. మూడు రోజులుగా నిర్బంధంలో ఉన్న ప్రియాంక గాం«దీని విడుదల చేస్తున్నట్టు అదనపు మెజిస్ట్రేట్ ప్రకటించారు. ఆ తర్వాత రాహుల్, ప్రియాంక కలిసి కాల్పుల్లో మరణించిన లవ్ప్రీత్ సింగ్, రమన్కాశ్యప్ కుటుంబాలను పరామర్శించారు. అనతంతరం మరో బాధితుడు నచార్ సింగ్ ఇంటికి బయలుదేరారు. రాహుల్, ప్రియాంక కన్నా ముందు ఆప్ పారీ్టకి చెందిన నేతల బృందం బాధిత కుటుంబాలను పరామర్శించారు. గురువారం అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ నేత మిశ్రాలు బాధిత కుటుంబాల పరామర్శకు రానున్నారు. అమిత్షాతో అజయ్ మిశ్రా భేటీ రైతు మరణాలకు నైతిక బా«ధ్యత వహిస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్లు ఊపందుకున్న నేపథ్యంలో బుధవారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలుసుకున్నారు. రైతులపైకి వాహనాన్ని అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ నడిపాడని ఆరోపణల నేపథ్యంలో అమిత్ షాకి మిశ్రా వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన సమయంలో తాను కానీ, తన కుమారుడు కానీ అక్కడ లేరని చెప్పుకొచ్చారు. సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు నేడు సీజేఐ నేతృత్వంలో విచారణ ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరీలో రైతుల నిరసన సందర్భంగా చోటుచేసుకున్న హింసాకాండను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం దీనిపై విచారణ చేపట్టనుంది. ఈ మేరకు కేసులిస్టును సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీ సభ్యులుగా ఉన్నారు. 8 మంది మరణానికి కారణమైన లఖీమ్పూర్ ఖేరీ హింసపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో న్యాయ విచారణకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక పథకం ప్రకారం రైతులపై దాడులు దేశంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదని, నియంతృత్వమే రాజ్యమేలుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. రైతులపై ఒక పథకం ప్రకారం దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం లక్నోకు బయలుదేరే ముందు ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం లక్నోకి వచ్చినప్పటికీ లఖీమ్పూర్ ఖేరికి వెళ్లడానికి తీరిక దొరకలేదని అన్నారు. యూపీలో కొత్త తరహా రాజకీయాలు నెలకొన్నాయని, క్రిమినల్స్ తమ ఇష్టారాజ్యంగా దారుణాలకు తెగబడి యధేచ్ఛగా తిరుగుతున్నారని, బాధితులకి న్యాయం చెయ్యమని అడిగితే నిర్బంధిస్తున్నారన్నారు. -
రైతు దారుణ హత్య
విడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం): పొలాన్ని కౌలుకు ఇచ్చిన రైతు మోడెం చంద్రశేఖర్రెడ్డి (56)ని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. సీఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన చంద్రశేఖర్రెడ్డికి చెందిన 13 ఎకరాల పొలాన్ని కోవూరు మండలం పాటూరు గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో పంటను కోయాలని సురేష్ అనుకున్నాడు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎకరానికి 13 వేల రూపాయలను కౌలుగా చెల్లించాల్సి ఉంది. కానీ చంద్రశేఖర్రెడ్డి తనకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని గత పది రోజుల కిత్రం డిమాండ్ చేశాడు. దీనికి కౌలు రైతు సురేష్ ఒప్పుకోలేదు. అయితే, పంట తాను కోసుకుని ధాన్యాన్ని విక్రయించి మిగిలిన డబ్బులు ఇస్తానని చంద్రశేఖర్రెడ్డి తెలిపాడు. దీనికి సురేష్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈనెల 14న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన చంద్రశేఖర్రెడ్డి కనిపించకపోవడంతో అతని భార్య వసుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు చంద్రశేఖర్రెడ్డి మొబైల్ ఆధారంగా సురేష్తో ఫోన్లో మాట్లాడారు. దీంతో తాము దొరికిపోయామని గ్రహించి సురేష్ పోలీసులకు లొంగిపోయి జరిగిన విషయాన్ని తెలిపాడు. నిందితుడు ఈనెల 14న చంద్రశేఖర్ను రేబాలలోని నిర్మానుష్యమైన ప్రాంతానికి రమ్మని చెప్పి అక్కడ అతని చేత పూటుగా మద్యం తాగించాడు. తర్వాత చంద్రశేఖర్రెడ్డిని కొట్టి తాడుతో మెడకు ఉరివేసి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా వెంకటేశ్వరపురం వద్ద ఉన్న పెన్నానదిలో పూడ్చి వేశాడు. ఈ మేరకు నిందితుడిని తీసుకెళ్లి పూడ్చిన స్థలానికి చేరుకుని చంద్రశేఖర్రెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈ హత్యలో మొత్తం 6 మంది పాల్గొన్నారని, మిగిలిన 5 మందిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
దొర గారికి చీమకుట్టినట్లైనా లేదా? వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిహారం అందక బాధితులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటుంటే దొర గారికి చీమకుట్టినట్లైనా లేదని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల విమర్శించారు. ముంపు బాధితుల ప్రాణాలు తీసిన పాపం సర్కారుదేనని దుయ్యబట్టారు. పరిహారం చెల్లింపులో ఎందుకింత పరిహాసమని ప్రశ్నించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నా..పరిహారం, ఇళ్లు, ప్లాట్లు ఇవ్వకుండా ఎర్రవల్లి, పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగట్టు కిష్టాపూర్ గ్రామాలకు నీళ్లు, కరెంట్ నిలిపివేయడాన్ని ఆక్షేపించారు. 70 ఏళ్ల వయసులో రైతు మల్లారెడ్డి ఆత్మహత్యకు ఒడిగట్టాడంటే ఆయన ఎంత క్షోభను అనుభవించి ఉంటాడో ఆలోచించాలన్నారు. అధికారుల నిర్లక్ష్యమే మల్లారెడ్డిని బలి తీసుకుందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు షర్మిల కార్యాలయం శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఏనుగు దాడిలో రైతు దుర్మరణం
గంగాధరనెల్లూరు (చిత్తూరు జిల్లా): ఏనుగు దాడిలో ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలంలో జరిగిన ఈ ఘటన స్థానికులను ఆందోళనకు గురిచేసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు.. బొమ్మవారిపల్లిలో బుధవారం ఓ ఏనుగు విధ్వంసం సృష్టించింది. మామిడి చెట్లు, ఫెన్సింగ్ను ధ్వంసం చేసింది. నాశంపల్లి ఎస్టీ కాలనీకి చెందిన కళావతిని గాయపరిచింది. అక్కడ ఉన్న ప్రజలు పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి ఏనుగు వెళ్లిపోయింది. కళావతిని 108 అంబులెన్స్లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఏనుగు గంగాధరనెల్లూరు వైపు వచ్చింది. పొలం పనులు చేసుకుంటున్న లక్ష్మి ఆ ఏనుగును దగ్గర్నుంచి చూడటంతో భయంతో పరుగులుదీసింది. ఈ క్రమంలో ఓ రాయిపై పడింది. తలకు తీవ్ర గాయం కావడంతో ఆమెను వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. అనంతరం నీవా నది పక్కన పొలం పనులు చేసుకుంటున్న వేల్కూరు ఇందిరానగర్ కాలనీకి చెందిన వజ్రవేల్(48)పై ఏనుగు దాడి చేసింది. దంతాలతో పొడవడంతో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని తిరుపతి రుయాకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. -
అకాల వర్షాలతో రైతులు లబోదిబో
(విశాఖ దక్షిణ)/పీలేరు /గంగవరం(చిత్తూరు జిల్లా)/పెదదోర్నాల/హిందూపురం: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో పిడుగు పాటుకు ఒకరు మరణించగా, ఓ ఆవు మృతి చెందింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. కల్లాల్లో మిర్చి తడిసిపోయింది. శ్రీకాకుళం జిల్లా రాజాం, పాలకొండ తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. అనంతపురం జిల్లా హిందూపురంలో గాలివాన హోరెత్తింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లేపాక్షి మండలంలోని కల్లూరు ఎస్సీ కాలనీలో కొబ్బరి చెట్టుపై భారీ శబ్దంతో పిడుగు పడటంతో స్థానికులు ఆందోళన చెందారు. చిత్తూరు జిల్లా పీలేరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రైతు పి.వెంకటరమణ (50) పిడుగుపాటుకు గురై మరణించగా.. గొర్రెలు మేపుకునేందుకు వెళ్లిన నాగరాజ, హరిబాబు, చంద్రకళ తీవ్రంగా గాయపడ్డారు. వారిని పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గంగవరం మండలం మామడుగు గ్రామానికి చెందిన త్యాగరాజులు పొలం వద్ద నుంచి పాడి పశువును ఇంటికి తోలుకొస్తుండగా పిడుగు పడింది. ఈ క్రమంలో ఆవును వదిలేసి త్యాగరాజులు పరుగులు తీశాడు. అయితే ఆవు మాత్రం అక్కడికక్కడే మృతి చెందింది. రానున్న 48 గంటల్లో మోస్తరు వర్షాలు కొమరిన్ ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల మీద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, పశ్చిమ బెంగాల్లో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా రానున్న 48 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు, కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు 30–40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం వివరాలు.. చిత్తూరు జిల్లా ముడివేడులో 58 మి.మీ, శ్రీకాకుళం జిల్లా భామనిలో 52, అనంతపురం జిల్లా హిందూపురం ఆర్టీవో ఆఫీసు ప్రాంతంలో 50, ప్రకాశం జిల్లా బి.చెర్లపల్లిలో 45, మార్కాపురం ప్రాంతంలో 44, అనంతపురం జిల్లా హిందూపూర్ ప్రాంతంలో 44, విజయనగరంలో 41 మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు చెప్పారు. పాడేరులో రెండు సెంటీ మీటర్లు, చింతపల్లిలో సెంటీ మీటర్ వర్షపాతం నమోదైంది. -
రైతు మృతదేహాన్ని కొరికి తిన్న ఎలుకలు
చంఢీగడ్: వ్యవసాయ చట్టాల రద్దు కోసం చేస్తున్న ఉద్యమంలో పాల్గొన్న రైతు గుండెపోటుతో మరణించగా.. అతడి మృతదేహాన్ని ఎలుకలు పీక్కు తిన్నాయి. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచిన శవాన్ని ఎలుకలు కొరికి తినడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. దీనిపై కుటుంబసభ్యులతోపాటు రైతు సంఘాల నాయకులు, ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటన హరియాణా రాష్ట్రం సోనిపట్ జిల్లాలో చోటుచేసుకుంది. సోనిపట్ జిల్లాలోని బయాన్పూర్ గ్రామానికి చెందిన రైతు రాజేందర్ (72). దేశవ్యాప్తంగా సాగుతున్న రైతు ఉద్యమంలో పాల్గొంటున్నాడు. అయితే బుధవారం ఆయన గుండెపోటుకు గురవడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతిచెందాడు. దీంతో సానిపట్లోని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో రాజేందర్ మృతదేహం భద్రపర్చారు. గురువారం వచ్చిచూసేసరికి మృతదేహంపై గాట్లు.. గాయాలు ఉన్నాయి. దీనిపై కుటుంబసభ్యులు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎలుకలు మృతదేహాన్ని కొరకడంతో గాట్లు పడ్డాయని వైద్యాధికారులు గుర్తించారు. అయితే ఆస్పత్రిలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వైద్యాధికారులు తెలిపారు. హరియాణా బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ మండిపడింది. రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణదీదీప్ సూర్జేవాలా స్పందించారు. ఈ ఘటనపై ట్విటర్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. 73 साल में ऐसा दर्दनाक मंजर शायद कभी ना देखा हो ! शहीद किसान के शव को चूहे कुतर जाएँ और भाजपा सरकारें तमाशबीन बनी रहें। शर्म से डूब क्यों नही मार गए भाजपाई !#FarmersProtests pic.twitter.com/7jE9yaNYfz — Randeep Singh Surjewala (@rssurjewala) February 19, 2021 -
ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలబుల్’
న్యూఢిల్లీ: లాక్డౌన్ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ ఎన్డీఏ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్డీఏ అంటే ‘నో డాటా అవైలవుబుల్’ అంటూ ఎద్దేవా చేశారు. వలస కార్మికులు, రైతు ఆత్మహత్యలు, కోవిడ్ -19, ఆర్థిక వ్యవస్థపై డాటా లేదు అంటూ శశిథరూర్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. (చదవండి: అవి రైతుల పాలిట మరణ శాసనాలే!) ఈ మేరకు ‘ది నేమ్ ఛేంజర్స్’ అనే కార్టూన్ను ట్విట్టర్లో షేర్ చేశారు థరూర్. దీనిలో మోదీ, నిర్మలా సీతారామన్, అమిత్ షాలు ‘నో డాటా అవైలబుల్’ అనే ప్లకార్డులు పట్టుకున్నట్లు ఉన్న కార్టూన్ని ట్వీట్ చేశారు. దాంతో పాటు ‘వలస కార్మికులకు సంబంధించి నో డాటా.. రైతు ఆత్మహత్యల గురించి నో డాటా..ఆర్థిక ఉద్దీపనపై తప్పుడు డాటా, కోవిడ్ -19 మరణాలపై సందేహాస్పద డాటా, జీడీపీ వృద్ధిపై మేఘావృత డాటా. ఈ ప్రభుత్వం ఎన్డీఏ అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇస్తుంది’ అంటూ శశి థరూర్ ట్వీట్ చేశారు. (రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్) No #data on migrant workers, no data on farmer suicides, wrong data on fiscal stimulus, dubious data on #Covid deaths, cloudy data on GDP growth — this Government gives a whole new meaning to the term #NDA! pic.twitter.com/SDl0z4Hima — Shashi Tharoor (@ShashiTharoor) September 22, 2020 వ్యవసాయ రంగంలో సంభవించే ఆత్మహత్యలు, అందుకు గల కారణాలకు సంబంధించి కేంద్రం దగ్గర ఎలాంటి డాటా లేదంటూ ప్రభుత్వం ప్రకటన చేసిన నేపథ్యంలో శశి థరూర్ ఈ ట్వీట్ చేశారు. అంతేకాక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మాట్లాడుతూ.. ‘నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు రైతు ఆత్మహత్యలకు సంబంధించి ఎలాంటి డాటా లేదని నివేదించాయని తెలిపారు. ఈ పరిమితి కారణంగా, వ్యవసాయ రంగంలో ఆత్మహత్యకు గల కారణాలపై జాతీయ సమాచారం ఆమోదించడం కానీ విడిగా ప్రచురించడం కానీ జరగలేదు’ అని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ సమయంలో మరణించిన వలసదారుల సంఖ్యపై తమ దగ్గర ఎలాటి డాటా లేదని గతంలో పార్లమెంటులో ప్రభుత్వం అంగీకరించిన సంగతి తెలిసిందే. -
నారా వారి పాలనలో నేలరాలిన కర్షకులెందరో!
సాక్షి, అమరావతి: ఒకవైపు ప్రకృతి ప్రకోపం.. మరోవైపు గత సర్కారు నిర్లక్ష్యం వెరసి ఆంధ్రప్రదేశ్లో గడచిన ఐదేళ్లలో వ్యవసాయ రంగంలో బలవన్మరణాలు పెరిగాయి. ఇందుకు సంబంధించి తాజాగా విడుదలైన ఎన్సీఆర్బీ–2018 నివేదికలోనూ ఏపీ నాలుగో స్థానంలో కొనసాగింది. 2014లో రైతు ఆత్మహత్యల్లో ఏపీ 7వ స్థానంలో ఉండగా.. 2015లో 6వ స్థానానికి చేరింది. 2016లో అన్నదాతల ఆత్మహత్యలు భారీగా పెరగ్గా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు వెల్లువెత్తడంతో అప్పటి ప్రభుత్వం ఎన్సీఆర్బీకి లెక్కలు తగ్గించి పంపించిందన్న విమర్శలున్నాయి. అయినప్పటికీ దేశ వ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు తగ్గుముఖం పడితే, ఆ ఏడాదీ ఏపీ 4వ స్థానానికి చేరడం గమనార్హం. ఆ తరువాత 2017, 2018 ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం మన రాష్ట్రం 4వ స్థానంలోనే కొనసాగింది. ఇలా చంద్రబాబు పాలనలో 7, 6 స్థానాల నుంచి నాలుగో స్థానానికి దిగజారి రైతుల ఆత్మహత్యల్లో హ్యాట్రిక్ సాధించినట్లైంది. ఐదేళ్లలో 3,832 మంది.. ఎన్సీఆర్బీ నివేదికల ప్రకారం 2014 నుంచి 2018 వరకు రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో 3,832 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. వీరిలో సొంత భూమి గల రైతులు 1,043 మంది, కౌలు రైతులు 612 మంది, కూలీలు 2,177 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెరిగాయి అన్నదాతల ఆత్మహత్యలను నిలువరించడంలో గడచిన ఐదేళ్లలో దేశ వ్యాప్తంగా గట్టి ప్రయత్నాలే జరిగాయి. తద్వారా పలు రాష్ట్రాలు మంచి ఫలితాలు సాధించాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం చివరి మూడేళ్లూ ఆత్మహత్యలు పెరిగాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాలు వివిధ కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగంలో మరణాలను నిరోధించగలిగాయి. 2014లో 4వ స్థానంలో ఉన్న కేరళ రైతులను ఆదుకుని బలవన్మరణాలను నివారించడంలో మంచి ఫలితాలు సాధించింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడంతో మరణాలు మరింత పెరిగాయనే విమర్శలున్నాయి. -
వలస బతుకుల్లో ఆశల మోసులు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఈ ఏడాది అనంతపురం జిల్లా వ్యవసాయ ముఖచిత్రం అనూహ్యంగా మారిపోయింది. కొన్నేళ్లుగా కరువుతో అల్లాడిన జిల్లా రైతుల ముఖాల్లో ఇప్పుడు ‘వర్షా’తిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వలస బాట పట్టిన రైతులు, రైతు కూలీలు సొంతూళ్లకు తరలివస్తూ పొలం బాట పడుతున్నారు. జిల్లా నుంచి ఏటా సుమారు 4 లక్షల మంది పనుల కోసం వలస వెళ్తుంటారు. వర్షపు చినుకు మీద ఆశతో పంట వేసిన రైతు.. అది పండకపోతే ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో గత ఐదేళ్లలో ఏకంగా 300 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ ఏడాది జిల్లాలో అద్భుతం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో కుంటలు, చెరువులు నిండిపోయాయి. గత ఆగస్టులో భూగర్భ నీటి మట్టం 27.75 మీటర్ల లోతున ఉండగా... ప్రసుత్తం 19.72 మీటర్లకు చేరింది. బోర్లు రీచార్జ్ అయ్యాయి. జిల్లాలో 70 వేల బోర్లు రీచార్జ్ కాగా, భూగర్భంలో 56 టీఎంసీల నీరు ఇంకిందని లెక్కలు చెబుతున్నాయి. హంద్రీ–నీవా ద్వారా చెరువులకు నీరు విడుదల చేయడంతో అదనంగా 50 వేల ఎకరాలు, హెచ్చెల్సీ కింద అదనంగా 20 వేల ఎకరాలు సాగులోకి వచ్చింది. దీంతో ఇప్పటికే సగం మంది వలస రైతులు సొంత గ్రామాలకు తిరిగొచ్చి పంటలు సాగు చేసుకుంటున్నారు. వీటన్నింటికీ తోడు వైఎస్సార్ రైతు భరోసా కింద జిల్లాలో 7,12,625 మంది అన్నదాతలకు లబ్ధి కలిగింది. అమ్మఒడి, నేతన్న నేస్తం, తదితర ప్రభుత్వ పథకాలు ఆయా వర్గాల వారికి భరోసా కల్పించడంతో ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వారు తిరిగి వస్తున్నారు. పెరిగిన సాగు.. చేతినిండా పని జిల్లాలో మొత్తం 63 మండలాలకు గాను ఈ ఏడాది 21 మండలాల్లో 20 శాతం అధిక వర్షపాతం నమోదైంది. 32 మండలాల్లో సాధారణ వర్షాలు కురిశాయి. 10 మండలాల్లో మాత్రమే తక్కువ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 483.8 మిల్లీమీటర్లు కాగా, ఈ ఏడాది నవంబర్ 8 నాటికే 492.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జూన్, జూలైలో వర్షాలు లేక వేరుశనగ సాగు కొంత తగ్గింది. పత్తి, ఉలవలు, జొన్న, ఆముదం సాగు బాగా పెరిగింది. రబీలో కూడా సాగు విస్తీర్ణం పెరగనుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రబీలో 1,14,193 హెక్టార్లు సాధారణ సాగు విస్తీర్ణం కాగా>, లక్షా 20 వేల హెక్టార్ల వరకూ సాగు కావచ్చని భావిస్తున్నారు. దీంతో వ్యవసాయ పరంగా కూలీలకు పనులు బాగా దొరుకుతున్నాయి. ఈ రైతు పేరు కృష్ణమూర్తి. అనంతపురం జిల్లా రొళ్ల మండలం హెచ్టీ హళ్లి గ్రామం. తనకున్న 2.75 ఎకరాల కోసం బోరు బావి తవ్వించాడు. వర్షాభావంతో ఎండిపోయింది. బోరుపై రూ.2 లక్షల వరకు పెట్టి నష్టపోయాడు. కుటుంబాన్ని పోషించుకునేందుకు భార్యా పిల్లలతో 2017లో బెంగళూరుకు వలసపోయాడు. అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చాడు. ఈ ఏడాది భారీ వర్షాలతో జిల్లాలో భూగర్భ జలమట్టం పెరగడంతో కృష్ణమూర్తి బోరు నుంచి నీళ్లు పుష్కలంగా వస్తున్నాయి. దీంతో గత నెలలో స్వగ్రామానికి వచ్చి వ్యవసాయ పనులు ప్రారంభించాడు. రైతు వెంకటేశులది గుమ్మఘట్ట మండలంలోని రంగచేడు. రెండు నెలల క్రితం వరకూ బెంగళూరు, మైసూర్, చిక్మగులూరు ప్రాంతాల్లో కూలి పనులు చేసేవాడు. ఇప్పుడు గ్రామంలో సమృద్ధిగా వర్షాలు పడడంతో తనకున్న 5 ఎకరాల పొలంలో వరి, పత్తి సాగు చేశాడు. మొన్నటి వరకు కూలీగా పనిచేసిన తను.. ఇప్పుడు ఇంకొకరికి కూలి పని ఇస్తున్నానని ఆనందంగా చెబుతున్నాడు. ప్రభుత్వ భరోసా పెరిగింది.. ఈ ఏడాది వర్షాలు బాగా పడ్డాయి. దీంతో బెంగళూరు నుంచి మా ఊరికి వచ్చేశాము. 2 ఎకరాల్లో పంటలను సాగు చేశా. 4 పాడి గేదెలను పెట్టుకున్నా. ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా పెరిగింది. – శివన్న, కాకి గ్రామం, రొళ్ల మండలం వలస వెళ్లిన వారు తిరిగొస్తున్నారు జిల్లాలో వర్షాలు బాగా కురవడంతో పనుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు తిరిగొస్తున్నారు. హంద్రీ–నీవా కాలువ సామర్థ్యాన్ని 6 వేల క్యూసెక్కులకు పెంచడం, సమాంతర కాలువను 4 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించేందుకు సీఎం అంగీకరించారు. ఇది జరిగితే జిల్లాలో వలస అనే మాటే వినపడదు. – సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ రైతులు సంతోషంగా ఉన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడటంతో బోర్లు రీచార్జ్ అయ్యాయి. ప్రభుత్వం ఇచ్చిన రైతు భరోసా మొత్తం రైతులకు మరింత ధైర్యాన్నిచ్చింది. సాగు విస్తీర్ణం పెరిగింది. చిరుధాన్యాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. – హబీబ్ బాషా, వ్యవసాయశాఖ జేడీ -
మృతిచెందిన యజమాని కోసం.. కుక్క పడిగాపులు
-
మృతిచెందిన యజమాని కోసం.. కుక్క పడిగాపులు
బ్యాంకాక్: విశ్వాసానికి మరోపేరు కుక్క. మూడురోజుల క్రితం థాయ్లాండ్లో జరిగిన ఓ ఘటన దాన్ని మరోసారి రుజువుచేసింది. యజమాని ప్రమాదానికి గురై మరణించినా.. ఇకనైనా వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న ఓ శునకం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. థాయ్లాండ్లోని చాంతాబురిలో సోంపార్న్ సితోంగ్కుమ్ (56) అనే రైతు శుక్రవారం ఉదయం పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లాడు. బావి గట్టున ఉన్న స్పింక్లర్ వాల్వ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ బావిలో పడిపోయాడు. అతనికి ఈదడం తెలియకపోవడంతో నీట మునిగి మరణించాడు. అయితే, అప్పటి వరకు వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్న తన యజమాని కనిపించకపోవడంతో తన పెంపుడు కుక్క ‘మ్హీ’ అతన్ని వెతుక్కుంటూ బావి వద్దకు వచ్చింది. బావి గట్టుపై ఉన్న సోంపార్న్ చెప్పులు, టార్చ్లైట్ వద్ద అతనికోసం పడిగాపులు కాసింది. ఈక్రమంలో తన సోదరుణ్ణి వెతుక్కుంటూ పొలం వద్ద వచ్చిన సోంపార్న్ చెల్లెలు బావి గట్టున ‘మ్హీ’ని చూసి ఆందోళనకు గురైంది. సోంపార్న్ కోసం ఎంత కేకలేసిన లాభం లేకపోయింది. తన అన్న ప్రమాదావశాత్తూ బావిలో పడిపోయి ఉండొచ్చని గ్రహించిన ఆమె వెంటనే రెస్క్యూ టీంకు సమాచారం ఇచ్చింది. రెస్క్యూ బృందం బావిలోంచి సోంపార్న్ మృతదేహాన్ని బయటకు తీశారు. సోంపార్న్కు ఆరోగ్యం సరిగా లేదని, అందువల్ల స్పింక్లర్ వాల్వ్ ఆన్ చేసే సమయంలో తూలి బావిలో పడిపోయి ఉండొచ్చని ఆమె కన్నీరుమున్నీరైంది. ‘మ్హీ’ సోంపార్న్ మంచి స్నేహితులని ఆమె సోదరి తెలిపింది. యజమాని మరణంతో దీనంగా కూర్చున్న ‘మ్హీ’ పరిస్థితిపై నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. -
పరాకాష్టకు చేరిన సంక్షోభం
ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించి, సహకార బ్యాంకులలో రైతులు చేసిన అప్పుల్లో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ పంజాబ్లో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ సంవత్సరం జనవరి నుంచి జూలై మధ్యలోనే 645 మంది రైతులు అప్పుల వల్ల కలుగుతున్న అవమానాలను భరించలేక దారుణంగా జీవితాలను ముగించుకున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు, సూక్ష్మరుణ కల్పన సంస్థల ఏజెంట్లు, బ్యాంకింగేతర ద్రవ్య సంస్థలు కలిసి రైతుల ఊపిరిని తీసివేస్తున్నాయి. రుణభారం మోయలేక పంజాబ్లో మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు ప్రాణాలు తీసుకోవడం అరుదైన ఘటన. ఇది పంజాబ్లో వ్యవసాయ సంక్షోభం పరాకాష్టకు చేరిందనడానికి సూచిక. వ్యవసాయ మెషినరీని అమ్మడానికి మాత్రమే కార్యాచరణలోకి దిగుతున్న ప్రభుత్వం.. మరోవైపున రైతుల ఆత్మహత్యలకు ఏవి కారణాలో తెలుసుకునేందుకు ఎందుకు ప్రయత్నించడం లేదన్నది నాకు అర్థం కాని ప్రశ్నే. లవ్ప్రీత్ సింగ్ ఎన్నో కలలతో బతుకుతున్న యువ రైతు. కుటుంబ వారసత్వంగా రూ. 8 లక్షల అప్పు తన నెత్తిమీద ఉందని తెలిసి కూడా వ్యవసాయంలో తన అదృష్టం పరీక్షించుకోవాలని భావించాడు. కానీ అప్పు తీర్చలేకపోవడంతో చివరికి జీవితాన్ని ముగించుకున్నాడు. అతడి వయస్సు 22 సంవత్సరాలు మాత్రమే. బర్నాలా జిల్లాకు చెందిన లవ్ప్రీత్ సింగ్ ఆత్మహత్య పంజాబ్ మొత్తంగా ప్రకంపనలు సృష్టించింది. మూడు తరాలుగా వీరి కుటుంబంలో అయిదుగురి వ్యవసాయ సంక్షోభం బలిగొంది. ఒకటిన్నర సంవత్సరం క్రితం తన తండ్రి కుల్వంత్ సింగ్ ఉరివేసుకుని జీవితం చాలించాడు. పంజాబ్ ప్రభుత్వం రుణమాఫీ తొలి విడత పంపిణీని ప్రారంభించడానికి సరిగ్గా ఒక రోజు ముందు ఈ విషాదం చోటు చేసుకుంది. అంతకుముందు లవ్ ప్రీత్ సింగ్ తాత కూడా ఇలాగే ఆత్మహత్య పాలయ్యాడు. ఎకరాకు సంవత్సరానికి రూ. 50 వేలు చెల్లించి 8 ఎకరాల భూమిని లీజుకు తీసుకున్నాం. కానీ 2017లో పెనుతుపాను వల్ల గోధుమపంట పూర్తిగా దెబ్పతింది. దాన్నుంచి మేం కోలుకోలేకపోయాం అంటూ లవ్ప్రీత్ సింగ్ తల్లి మీడియాకు చెప్పింది. రుణభారం మోయలేక పంజాబ్లో మూడు తరాలకు చెందిన కుటుంబ సభ్యులు ప్రాణాలు తీసుకోవడం ఇదే మొదటి ఘటన కాబోలు. గతంలో ఇక్కడ తల్లిదండ్రులు, వారి కుమారులు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జరిగాయి కానీ ఆర్థిక సంక్షోభం ఒక రైతు నుంచి అతడి తదుపరి రెండు తరాల వరకు ప్రభావం చూపిందంటే ఇది ఎంత ఉపద్రవకరమైన ఘటనో స్పష్టంగా బోధపడుతుంది. జస్వంత్ సింగ్ అనే మరొక రైతు తన అయిదేళ్ళ కుమారుడిని తన వీపుకు కట్టుకుని నీటి కాలువలోకి దూకిన ఘటన నాకు గుర్తుకొచ్చింది. నీటి రూపంలోని సమాధిలోకి తన చిన్నారి కుమారుడిని కూడా తన వెంట తీసుకుపోవడం అన్యాయం అని తనకు తెలుసు కానీ తన నెత్తిమీద ఉన్న రూ. 10 లక్షల రుణాన్ని తన కుమారుడు ఎన్నటికీ తీర్చలేడని తెలుసు కాబట్టే ఈ చర్యకు పాల్పడుతున్నానని నోట్ రాసి మరీ కాలువలో దూకాడాయన. కెప్టెన్ అమరీందర్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించి, సహకార బ్యాంకులలో రైతులు చేసిన అప్పుల్లో 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ పంజాబ్లో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఈ సంవత్సరంలో జనవరి నుంచి జూలై మధ్యలోనే 645 మంది రైతులు అప్పుల వల్ల కలుగుతున్న అవమానాలను భరించలేక దారుణంగా జీవితాలను ముగించుకున్నారు. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, బ్యాంకులు, సూక్ష్మరుణ కల్పన సంస్థల ఏజెంట్లు, బ్యాంకింగేతర ద్రవ్య సంస్థలు కలిసి రైతుల ఊపిరిని తీసేస్తున్నాయి. దీంతో వారు వేరే మార్గం లేకుండా ఆత్మహత్యల దారి పడుతున్నారు. భారతీయ కిసాన్ యూనియన్ రూపొందించిన డేటా ప్రకారం 2017 ఏప్రిల్ 1 నుంచి 2019 ఆగస్టు 31 లోగా 1280 మంది రైతులు, వ్యవసాయ కూలీలు పంజాబ్లో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలుస్తోంది. దేశ గోధుమ ధాన్యాగారంగా పేరొందిన పంజాబ్ వాస్తవానికి కొన్నేళ్లుగా రైతు ఆత్మహత్యల మృత్యు శయ్యగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ ఆత్మహత్యలకు తెలియని కారణాలేవీ లేవు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణాల మాఫీ పథకం ప్రారంభించినప్పటి నుంచి రూ.4,609 కోట్ల వ్యవసాయ మొండిబకాయలను రద్దు చేసింది. ఈ పథకం ద్వారా ఇంతవరకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన 5,61,886 మంది రైతులు లబ్ధి పొందడం వాస్తవమే. అయితే భవిష్యత్తులో తాము ఇంకా బకాయిపడి ఉన్న మొండి రుణాలను రద్దు చేస్తారనే ఆశ లేశమాత్రంగా కూడా లేకపోవడంతో రైతులు మరో మార్గం చూసుకుంటున్నారు. గత ఎన్నికల్లో పంజాబ్లో అధికార పార్టీ రైతులు సహకార బ్యాంకులు, జాతీయ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న వ్యవసాయ రుణాలను మొత్తంగా తీర్చి వేస్తానని వాగ్దానం చేసింది. ప్రభుత్వం కూడా దీన్ని ఇప్పుడు తృణీకరించలేదు కానీ ఈ రుణాలను మొత్తంగా తీర్చాలంటే రూ. 90,000 కోట్లు అవసరం అవుతుంది. ఇంతమొత్తం తన వద్ద లేదంటూ పంజాబ్ ప్రభుత్వం చేతులెత్తేసింది. 2019 వరకు పంజాబ్లో జరిగిన రైతు ఆత్మహత్యలను పరిశీలిస్తే, ప్రతి రోజూ సగటున ముగ్గురు రైతులు బలవుతున్నారని స్పష్టమవుతుంది. 2017–18లో వరి ఉత్పత్తిలో అత్యుత్తమ ఫలితాలను సాధించినందుకు గానూ ప్రతిష్టాత్మకమైన క్రిషి కర్మాన్ అవార్డును అందుకున్న పంజాబ్లో మరోవైపున ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూండటమే పరమ విషాదకరమైన అంశం. 2009–10 నుంచి సెంట్రల్ పూల్కి వరిని అత్యధికంగా అందిస్తున్న రాష్ట్రం పంజాబ్. 2010–11లో మాత్రమే పంజాబ్, ఆంద్రప్రదేశ్ కంటే వెనుకబడింది. ఇక గోధుమ విషయానికి వస్తే 2008–09 నుంచి పంజాబ్ జాతీయ ధాన్య నిధికి గోధుమను అందిస్తున్న అగ్రగామి రాష్ట్రంగా రికార్డును నెలకొల్పుతోంది. అంటే మన దేశ ఆహార నిల్వల్లో 37.83 శాతం వాటా పంజాబ్ నుంచే వస్తోందన్నమాట. తన భూభాగంలోని 98 శాతం వ్యవసాయ యోగ్యంగా ఉంటూ, గోధుమ, వరి ఉత్పత్తిలో అధిక వాటాను కేంద్ర పూల్కి సమర్పిస్తూన్న పంజాబ్లో పెరుగుతున్న పంటల ఉత్పాదకతకు, తీవ్రమవుతున్న వ్యవసాయ దుస్థితికి మధ్య అంత అగాధానికి కారణమేమిటనేది బహుశా ఎవరూ వివరించలేరేమో.. ఇప్పుడు క్రిషి కర్మాన్ అవార్డు కోసం నిర్దేశించిన మూడు వర్గీకరణలకేసి చూద్దాం. అత్యధిక ఉత్పత్తిని సాధిస్తున్నందుకు 55 మార్కులను కేటాయించారు. రెండోది, రికార్డు స్థాయిలో ఉత్పత్తిని సాధించడం కోసం ప్త్రత్యేక చొరవను తీసుకుంటున్నందుకు 30 మార్కులు విధించారు. చివరగా ఆహార ధాన్యాల అభివృద్ధి పథకాలకు అయ్యే వ్యయం కోసం 15 మార్కులను రిజర్వ్ చేశారు.. పంజాబ్లో వ్యవసాయ సంక్షోభం నిరంతరం ఎందుకు కొనసాగుతోందో ఇప్పుడు స్పష్టంగా బోధపడుతోంది. రైతులు పండిస్తున్న పంటల నుంచి 50 శాతాన్ని వారి సంక్షేమానికే కేటాయించేలా ప్యాకేజీని రీడిజైన్ చేసి ఉంటే ఈ ఉత్పాతం కొనసాగేది కాదు. తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతు సమాజానికి స్వావలంబనతో కూడిన జీవితానికి హామీ కల్పించేలా ప్రభుత్వ విధానాలు ఇకనైనా దృష్టి పెట్టాలి. ప్రభుత్వాలు వరుసగా లక్ష్యంగా విధిస్తున్న రికార్డు పంటను ఉత్పత్తి చేయడంకోసం నిరంతరం కృషి చేస్తున్న రైతుల సంరక్షణకు పాటు పడకుండా ఎలాగైనా సరే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంమీదే ప్రభుత్వ విధానాలు దృష్టి పెడుతున్నంత కాలం పంజాబ్ రైతుల దుస్థితి మారదు గాక మారదు. కొన్ని అధ్యయనాల ప్రకారం తృణధాన్యాలైన గోధుమ, వరి, జొన్న పంటల్లో పంజాబ్ ప్రపంచస్థాయి ఉత్పత్తి ప్రమాణాల్లో అగ్రగామిగా ఉంటోంది. కానీ అదే పంజాబ్ తన రైతుల పాలిట సమాధిగా మారుతోంది. మరొక ఉదాహరణ తీసుకుందాం. పొలాల్లోని చెత్తను తగులబెట్టడాన్ని నిరోధించడానికి పంజాబ్ 6,400 రైతు బృందాలను ఏర్పర్చి వారికి మెషీన్లను ఇవ్వడానికి పూనుకొంది. పంట కోతలు పూర్తయ్యాక పొలంలో మిగిలే వరి దంట్లను ఎందుకు తగులబెట్టకూడదో రైతులను ఎడ్యుకేట్ చేయడానికి కూడా ప్రభుత్వం పూనుకుంటోంది. పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు, రాష్ట్ర వ్యవసాయ శాఖకు చెందిన శాస్త్రవేత్తలు ఈ రైతుల బృందాలతో నిత్యం సంబంధాల్లో ఉంటారు. అత్యధిక సబ్సిడీతో అందించే మెషీన్లను అమ్మడానికి 6,400 రైతు బృందాలను ఏర్పర్చారు. అదే సమయంలో తీవ్రమవుతున్న వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు, వ్యవసాయదారుల ఆత్మహత్యలకు ఏవి కారణాలో తెలుసుకునేందుకు ఇలాంటి బృందాలను ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఈ సమాచారాన్ని పూర్తిగా సేకరించి కార్యాచరణకు ప్రభుత్వం ఎందుకు పూనుకోదు? వ్యవసాయ మెషినరీని అమ్మడానికి మాత్రమే కార్యాచరణలోకి దిగుతున్న ప్రభుత్వం.. మరోవైపున ఇంత పెధ్ద మానవీయ కర్తవ్యాన్ని పరిపూర్తి చేయడం కోసం ఎందుకు పూనుకోదు? దేవీందర్ శర్మ వ్యాసకర్త వ్యవసాయ నిపుణులు ఈ–మెయిల్ : hunger55@gmail.com -
యూరియా కోసం వెళ్లి రైతు మృతి!
దుబ్బాక టౌన్: యూరియా బస్తాల కోసం లైన్లో నిలబడ్డ ఓ రైతు గురువారం ఆకస్మికంగా గుండె పోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సుభాష్గౌడ్, బాధిత రైతు కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అచ్చుమాయపల్లికి చెందిన రైతు చేర్వాపురం ఎల్లయ్య (69)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. దీనికితోడు మరో రెండెకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ నాలుగు ఎకరాల్లో వరి, మొక్క జొన్న, పత్తి పంటలు సాగు చేశాడు. పంటలకు అవసరమైన యూరియా ఎరువు కోసం మూడు రోజుల నుంచి ఎల్లయ్య దుబ్బాకకు వస్తున్నా దొరకలేదు. గురువారం వ్యవసాయ సహకార సంఘం వద్దకు యూరియా లారీ వచ్చిం దని తెలవడంతో ఉదయం తన భార్య లచ్చమ్మతో కలసి అక్కడికి చేరుకున్నాడు. అప్పటికే యూరియా కోసం వందల మంది రైతులు లైన్లో నిలుచున్నారు. దీంతో ఎల్లయ్య లైన్లో నిలబడగా ఆయన భార్య లచ్చమ్మ సైతం మహిళా రైతుల లైన్లో నిలుచుంది. సుమారు గంటసేపు లైన్లో నిలుచున్న ఎల్లయ్య, ఒక్కసారిగా సొమ్ముసిల్లి పడిపోయాడు. దీంతో అక్కడ ఉన్న రైతులు ఎల్లయ్యను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గ మధ్యలోనే మృతి చెందాడు. ఆసుపత్రిలో ఎల్లయ్యను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారించారు. ఎల్లయ్య భార్య లచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుబ్బాక పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురు కూతుళ్లు.. మృతిచెందిన రైతు ఎల్లయ్యకు నలుగురు కూతుళ్లు. వీరిలో పెద్ద కూతురు శ్యామల భర్త ఏడేళ్ల క్రితమే మరణించడంతో ఆమె కుటుంబాన్ని కూడా ఎల్లయ్యనే పోషిస్తున్నాడు. రెండో కూతురు నర్సవ్వకు వివాహం అయింది. మూడో కూతురు రేణుక వికలాంగురాలు. చిన్న కూతురు మమతకు నాలుగు నెలల క్రితమే అప్పుచేసి వివాహం చేశాడు. -
రైతన్న ఉసురు తీసిన యూరియా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతులను యూరియా కొరత వేధిస్తోంది. గోదాములు, ఎరువుల షాపుల వద్ద అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ఇదే పరిస్థితి. పొలాలు, ఇళ్లు వదలి యూరియా పంపిణీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. లైన్లో చెప్పులు పెట్టి మరీ వేచి చూడాల్సిన దుస్థితి. అవసరానికి తగినంత యూరియాను అధికారులు సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్యూలో నిలబడి మృతి చెందిన రైతు యూరియా కోసం క్యూలైన్లో నిలబడి రైతు మృతిచెందిన విషాద ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో చోటు చేసుకుంది. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద యూరియా కోసం క్యూలో నిలబడిన రైతు ఎల్లయ్య(69) ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో అతన్నివెంటనే స్థానిక అస్పత్రికి తరలించి చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. మృతుడు అచ్చుమాయపల్లి వాసిగా గుర్తించారు. ఎల్లయ్య మృతిపై రైతులు ఆందోళన చేపట్టారు. ఎల్లయ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. తూప్రాన్లో రైతన్నల ధర్నా మెదక్ జిల్లా తూప్రాన్ మండల కేంద్రంలో యూరియా కొరతపై రైతులు ఆందోళనకు దిగారు. బుధవారం ఉదయం నుండి యూరియా వస్తుందని పడిగాపులు కాసి రాత్రి వరకు అక్కడే ఉండి ఇంటికి వెళ్లారు. గురువారం ఉదయం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద బారులు తీరారు. చెప్పులు లైన్లో పెట్టి యూరియా కోసం ఎదురు చూశారు. అధికారులు ఎవరు రాకపోవడంతో రైతులు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిద్దిపైట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో యూరియా కోసం రైతు సేవాసమితి వద్ద బారులు తీశారు. జనగామా జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల పెద్ద ఎత్తున లైన్లో నిలబడ్డారు. యూరియా కోసం పనులు వదిలిపెట్టుకుని క్యూలో నిలబడ్డా ఒక్క బస్తా కూడా దొరకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు మృతి చెందడం దురదృష్టకరం రైతు ఎల్లయ్య మృతి పట్ల సిద్ధిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు నరోత్తంరెడ్డి విచారం వ్యక్తం చేశారు. యూరియా కోసం క్యూలో నిలబడి రైతు మృతి చెందడం దురదృష్టకరం అన్నారు. గురువారం ఆయన బీజేపీ బూత్స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో యూరియా కోసం రైతులు చెప్పులు క్యూలో పెట్టేవారని ఎగతాళి చేసిన కేసీఆర్కు.. రాష్ట్ర రైతుల బాధ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 30 రోజుల ప్రగతి పేరుతో గ్రామాల్లో పన్నులు వసూలు చేసేందుకు ప్రభుత్వం సిద్దమైందని, దీనిని బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. -
యూరియా కోసం క్యూలైన్లో నిలబడి.. రైతు మృతి
-
పురుగుల మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య
సాక్షి, పాతపట్నం: స్థానిక కోటగుడ్డి కాలనీకి చెందిన కౌలు రైతు గుర్రం రాంబాబు (39) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..రాంబాబు రెండు ఏకరాల భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. కలాసీగా పని దోరకపోవడంతో వ్యవసాయం చేస్తున్నాడు. పెట్టుబడి కోసం అప్పులు చేశాడు. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో మనస్థాపం చెంది ఈ నెల 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకోవడంతో రాంబాబు మరదలు కుమారి చూసింది. కూలి పనికి వెళ్లినరాంబాబు భార్య జయలక్ష్మికి సమాచారం చేరవేసింది. రాంబాబును ఆటోలో పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు కిషోర్ ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం ఆదివారం రాత్రి శ్రీకాకుళం రిమ్స్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తిరిగి పాతపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకుచ్చి శవ పంచనామా, పోస్టుమార్టం నిర్వహించారు. తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్ ఆస్పత్రికి చేరుకుని రాంబాబు మృతి గల కారణాలను భార్య జయలక్ష్మి, కుటుంబ సభ్యులకు అడిగి తెలుసుకున్నారు. మృతుడుకి కుమారుడు చందు, కుమార్తె నీలిమ ఉన్నారు. మృతుడి భార్య జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్చార్జి ఎస్ఐ పి.సిద్ధార్థకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యవ‘సాయం’ కరువై..అప్పులే దరువై..
నేల తల్లినే నమ్ముకుని రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. కష్టాల సేద్యంలో అప్పులే దిగుబడి అయినా గుండె దిటవు చేసుకున్నాడు. ఏదో ఒక రోజు తన ఇబ్బందులు తొలగిపోతాయనే నమ్మకంతో వ్యవసాయానికి అప్పులు చేస్తూ వచ్చాడు. చివరకు అప్పుల మోత పెరిగి, రుణదాతల ఒత్తిళ్లు తీవ్రం కావడంతో కుంగిపోయాడు. పురుగుల మందును ఆశ్రయించాడు. తాను నమ్ముకున్న భూమాత ఒడిలోనే తుదిశ్వాస విడిచాడు. సాక్షి, చౌడేపల్లె/ చిత్తూరు: అప్పులు తీర్చలేక పురుగుల మందుతాగి రైతు బలవన్మరణం చెందిన విషాద సంఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలు.. దిగువపల్లె పంచాయతీ భవానీ నగర్కు చెందిన ఏ.దొరస్వామినాయుడు(43) నిరుపేద రైతు. అతనికి పక్షిరాజపురానికి సమీపంలో పొలం ఉంది. రెక్కలు ముక్కలు చేసుకుని వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించేవాడు. తనకున్న పొలంలో నాలుగేళ్ల కాలంలో నాలుగు బోర్లు వేశాడు. ఇందు కోసం రూ.4లక్షలు అప్పు చేశాడు. అలాగే ఇతరుల వద్ద వడ్డీకి కూడా రుణాలు తీసుకున్నాడు. 1000–1050 అడుగుల లోతుతో బోర్లు వేసినా ఆశించిన ఫలితం శూన్యం. ఇటీవల వేసిన బోరులో అరకొరగా నీళ్లు రావడంతో ఆ గంగనే నమ్ముకున్నాడు. పంట బాగా పండితే అప్పులు తీర్చవచ్చనే కొండంత ఆశతో మళ్లీ లక్ష రూపాయలకు పైగా ఖర్చుచేసి టమాట పంట సాగు చేశాడు. అంతేకాకుండా ఈ ఏడాది కృష్ణమూర్తి అనే వ్యక్తిని వ్యవసాయంలో భాగస్వామిగా చేసుకుని ఇరు కుటుంబాల మహిళల నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి, వ్యవసాయానికి రూ.85వేలు పంట రుణం తీసుకున్నాడు. అప్పటికే బ్యాంకు, ప్రైవేటు రుణాలు కలిపి రూ.12లక్షల వరకు అప్పు చేరింది. ఈ నేపథ్యంలో ఉన్న బోరులో నీటి సామర్థ్యం తగ్గి పంటలకు నీళ్లు సరిపోలేదు. చేతికొస్తుందనుకున్న పంట కళ్లెదుటే ఎండిపోతుండడంతో ఆందోళన చెందాడు. మరోవైపు రుణదాతల ఒత్తిళ్లు పెరిగిపోయాయి. అప్పులు కంటికి కునుకు లేకుండా చేశాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి భోజన సమయంలో తన కుటుంబ సభ్యుల వద్ద అప్పుల విషయమై తీవ్రంగా కలత చెందినట్టు తెలిసింది. శుక్రవారం ఉదయం టిఫిన్ చేయకుండా అన్యమనస్కంగా పొలానికి వెళ్లాడు. బోరు వద్ద కూర్చుని ఏదో పనిలో నిమగ్నమయ్యాడు. అక్కడే దరిదాపుల్లోని పొలం పనిలో ఉన్న అతడి చిన్నాన్న భార్య గోపాలమ్మ అతడిని చూసి వ్యవసాయ పనులు చేస్తున్నాడని తలచి కొంతసేపటికి వెళ్లిపోయింది. అప్పటికి ఉదయం 9 గంటలు. 10.30 గంటల సమయంలో ఆర్ఆర్ కాలనీకి చెందిన అంజి అటు వైపు వెళ్లాడు. బోరు వద్ద నోటిలో నురుగ వస్తూ, అపస్మారక స్థితిలో పడి ఉన్న దొరస్వామిని చూశాడు. అతడి పక్కనే పురుగుల మందు డబ్బా పడి ఉండడంతో విషయం అర్థమైంది. కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. దొరస్వామి కుటుంబీకులు, గ్రామస్తులు హుటాహుటిన దొరస్వామి నాయుడుని మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచాడు. మృతుడికి భార్య భారతి, పిల్లలు రేవతి, కీర్తి, జయంతి, జగదీశ్ ఉన్నారు. ఇక మాకు దిక్కెవ్వరు? అంటూ మృతురాలి భార్య తన పిల్లల్ని పట్టుకుని గుండెలవిసేలా రోదించడం పలువురినీ విచలితుల్ని చేసింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్ఐ అనిల్కుమార్, ఆర్ఐ ప్రకాష్, వీఆర్వో నారాయణ మృతుని పొలం వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం మదనపల్లె ప్రభుత్వాçసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడారు.రైతు ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుని కుటుంబాన్ని ఆదుకుంటాం దొరస్వామినాయుడు కుటుంబాన్ని ఆదుకుంటా మని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖమంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. రైతు ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఆయన మృతుని కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ అంజిబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ సంతాపం వ్యక్తం చేశారు. -
కాటేసిన కరెంట్: పండగపూట పరలోకాలకు..
సాక్షి, రాజాపేట (ఆలేరు): కరెంట్ కాటుకు మరో రైతు బలయ్యాడు. ఈ విషాదకర ఘటన రాజా పేట మండలం మల్లగూడెంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని సాయిలు, బాలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు రామచంద్రం, ఆంజనేయులు, నాగేష్లు. వీరిది వ్యవసాయ కుటుంబం, వీరంతా ఎవరికి వారు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా ఆంజనేయులు (28)కు భార్య స్వప్న, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరికి రెండు ఎకరాలపైన భూమి ఉండగా పత్తి, మొక్కజొన్న, వరి సేద్యం చేశాడు. గురువారం రాఖీ పండుగ రోజు కావడం, ఉదయమే వరిపొలంలో ట్రాక్టర్ ద్వారా మడి దున్నిస్తున్నాడు. ట్రాక్టరుకు అడ్డుగా కిందికి వేలాడుతున్న విద్యుత్ సర్వీస్ వైరును కర్రసాయంతో పైకిలేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ఆంజనేయులు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్నవయస్సులో ఆంజనేయులు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ఆస్పత్రికి తరలించారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగేశ్వర్రావు తెలిపారు. -
రికవరీ పేరుతో రైతులను వేధిస్తున్న బ్యాంకులు
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణి ప్రదరిస్తూ పారిశ్రామికవేత్తలను సంతృప్తి పరిచేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని రైతు ఆత్మహత్యల అంశాన్ని రాహుల్ గురువారం లోక్సభలో లేవనెత్తారు. రైతులకు ఊరట ఇచ్చే ఎలాంటి చర్యలూ కేంద్ర బడ్జెట్లో తీసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు కేవలం రూ 4.3 లక్షల కోట్ల పన్ను మినహాయింపులు ఇచ్చిన కేంద్రం సంపన్న పారిశ్రామికవేత్తలకు మాత్రం రూ 5.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని దుయ్యబట్టారు. కేంద్రం రైతుల పట్ల వివక్ష చూపుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆరోపించారు. వ్యవసాయ రుణాలు, గిట్టుబాటు ధరలపై ప్రధాని నరేంద్ర మోదీ ఐదేళ్ల కిందట ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రుణభారంతో తన నియోజకవర్గం వయనాడ్లో బుధవారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడని సభ దృష్టికి తీసుకువచ్చారు. రుణ బకాయిలున్న రైతులకు బ్యాంకులు రికవరీ నోటీసులు జారీ చేసి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నాయని, దిక్కుతోచని స్ధితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రుణాలపై మారటోరియం విధించిందని, బ్యాంకులు రుణ వసూళ్లను నిలిపివేసి రుణాల రీషెడ్యూల్ చేయాల్సిందిగా ఆర్బీఐని ఆదేశించాలని కోరారు. -
పొలం వేలం వేస్తారన్న ఆందోళనతో అన్నదాత ఆత్మహత్య
మార్టూరు/బల్లికురవ/దువ్వూరు/చీరాల రూరల్: గడువులోపు బ్యాంకు రుణం తీర్చకపోవటంతో పొలాన్ని వేలం వేస్తామని అధికారులు నోటీసులు ఇచ్చి.. ఒత్తిడికి గురి చేయటంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా మార్టూరు మండలం రాజుపాలెంలో శనివారం చోటుచేసుకుంది. బల్లికురవ మండలం కె.రాజుపాలెం గ్రామానికి చెందిన శాఖమూరి హనుమంతరావు (40), రాధిక దంపతులు పదేళ్లుగా మార్టూరు మండలం రాజుపాలెం సమీపంలోని శాంతినగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి కె.రాజుపాలెంలో 1.83 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దానికి తోడు మరో రెండెకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి, జూట్ పంటలను సాగు చేస్తున్నాడు. మార్టూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో తన భూమిని తనఖా పెట్టి 2016 జూన్ 10న హనుమంతరావు రూ.1.80 లక్షల రుణం తీసుకుని.. 2017 జూన్ 14న ఆ అప్పును రెన్యువల్ చేయించుకున్నాడు. మధ్యలో రూ.14 వేలు వడ్డీ చెల్లించగా.. రూ.2.40 లక్షలు బకాయిపడ్డాడు. అప్పు తీర్చాలంటూ బ్యాంకు అధికారులు నోటీసులు పంపించగా.. డబ్బు సర్దుబాటు కాకపోవడంతో తీర్చలేకపోయాడు. ఇతడికి రెండు విడతల్లో రూ.41 వేలు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఈ క్రమంలో గతవారం బ్యాంకు అధికారులు హనుమంతరావుకు చెందిన భూమిని జూలై 3న మార్టూరులోని బ్యాంకు ఆవరణలో వేలం వేస్తున్నట్టు పేర్కొంటూ హనుమంతరావు ఇంటి ముందు గల ప్రాథమిక పాఠశాల గోడలకు, కాలనీ ముఖద్వారంలో ఉన్న బస్షెల్టర్, మరి కొన్నిచోట్ల నోటీసులు అతికించారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పొలానికి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పిన హనుమంతరావు తన సొంత భూమిలోని వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చుట్టుపక్కల పొలాల రైతులు గమనించి భార్య రాధికకు, అధికారులకు సమాచారం అందించారు. హనుమంతరావు గత సంవత్సరం ఇదే భూమిలో మిరప పంట సాగు చేయగా బొబ్బర తెగులు సోకి రూ.లక్ష నష్టం వాటిల్లినట్లు భార్య రాధిక తెలిపింది. మార్టూరు స్టేట్బ్యాంకులో వ్యవసాయ రుణం రూ.లక్ష, ముత్తూట్ ఫైనాన్స్లో బంగారాన్ని కుదువపెట్టి రూ.లక్ష, వడ్డీ వ్యాపారుల వద్ద రూ.3 లక్షలు కలిపి అప్పు మొత్తం సుమారు రూ.9 లక్షల వరకు ఉన్నట్టు మృతుడి భార్య రాధిక తెలిపింది. ఘటనాస్థలాన్ని బల్లికురవ ఎస్సై పి.అంకమ్మరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అసువులు తీసిన అప్పులు అప్పుల బాధలు తాళలేక పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సుధాకర్ కథనం ప్రకారం.. ఈపురుపాలెం పంచాయతీ పరిధిలోని బోయినవారిపాలేనికి చెందిన చిప్పలపల్లి ఆదినారాయణ (30)కు ఐదెకరాల పొలం ఉంది. దాంతోపాటు మరో ఐదెకరాలను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో నష్టం రావడం, అప్పులు పేరుకుపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. శనివారం గేదెలను తోలుకుని పొలానికి వెళ్లిన ఆదినారాయణ మద్యంలో పురుగు మందు కలుపుకుని తాగాడు. సాయంత్రం అపస్మారక స్థితిలో ఉన్న అతడిని గుర్తించిన గ్రామస్తులు భార్య రమకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు వెళ్లేసరికి మృతి చెందాడు. అప్పులు తీర్చే దారిలేక.. వ్యవసాయంలో నష్టాలు రావడం, అప్పులిచ్చిన వారు ఒత్తిడి చేయడంతో వైఎస్సార్ జిల్లా దువ్వూరు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన ఇంజేటి రాముడు (60) ఆత్మహత్య చేసుకున్నాడు. రాముడు తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని వరి, పసుపు సాగు చేశాడు. తెగుళ్ల కారణంగా తీవ్రంగా నష్టపోయాడు. కానగూడూరు ఏపీజీబీలో రూ.50 వేలు పంట రుణం పొంది మూడేళ్లు దాటింది. కడప మార్కెట్ యార్డులో పసుపు వ్యాపారుల నుంచి రూ.1.50 లక్షలు, ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.7 లక్షలు, పురుగు మందులు, ఎరువుల వ్యాపారుల వద్ద నుంచి మరో రూ.లక్ష కలిపి మొత్తం రూ.10 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. అప్పులిచ్చిన వారి నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో శనివారం తన పొలంలోకి వెళ్లి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. -
పాము కాటు కన్నా కార్పొ‘కేటు’తో రైతన్న మరణం
సాక్షి, మదనపల్లె(చిత్తూరు) : పాముకాటుకు గురైన ఓ రైతు అపస్మారక స్థితిలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడారు. జిల్లాలోని రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ఫలితం లేదు. చివరకు సోమవారం వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గం మధ్యలో మృతిచెందారు. చికిత్సలు చేస్తామని డబ్బులు గుంజుకున్న తిరుపతి లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు మూడు రోజుల తరువాత చేతులెత్తేయడంతోనే ఈ దారుణం జరిగిందని మృతుని కుటుంబసభ్యులు రోదిస్తున్నారు. బాధితుల కథనం మేరకు కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ కమతంపల్లెకు చెందిన కాకర్ల గుడ్రాజప్ప కుమారుడు రైతు కే శ్రీనివాసులు (50) వ్యవసాయం చేసుకుంటూ భార్య రెడ్డెమ్మ, ముగ్గురు కుమార్తెలను పోషించుకునేవారు. అతడు గురువారం పొలంలో పనులు చేస్తుండగా కాలుపై పాముకాటు వేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీనివాసులును కుటుంబసభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. మదనపల్లె ప్రభుత్వాస్పత్రి వద్ద అంబులెన్స్ నడుపుతున్న ఓ యువకుడు అతడిని రుయా ఆస్పత్రికి తీసుకెళ్లకుండా కార్పొరేట్ వైద్యులు ఇచ్చే కమీషన్కు కక్కుర్తిపడి తిరుపతిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్చించి వచ్చేశాడు. ఆ ఆస్పత్రిలోని వైద్యులు వివిధ రకాల పరీక్షలు, చికిత్సల పేరుతో సుమారు రూ.1.50 లక్షలు వసూలు చేశారు. మూడు రోజుల తర్వాత తమవల్ల కాదని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని అపస్మారక స్థితిలో ఉన్న అతడిని పంపేశారు. మళ్లీ అతడిని మదనపల్లెలోని ప్రభుత్వాస్పత్రికి సోమవారం ఉదయం తీసుకువచ్చి చేర్పించారు. తరువాత అదే రోజు చికిత్స కోసం బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా అతడు మరణించారు. భార్య, ముగ్గురు ఆడబిడ్డలు అనాథలయ్యారు. -
అప్పుల భారంతో అన్నదాతల ఆత్మహత్య
లింగపాలెం/రెంటచింతల (మాచర్ల)/బెళుగప్ప/శ్రీరంగరాజపురం: అప్పుల భారంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు రైతులు, మరో ఇద్దరు కౌలు రైతులు ఆత్మహత్యకు పాల్పడగా, సాగుభూమిని ఆన్లైన్లో నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఇంకో రైతు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టారు. వివరాలివి. అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలంలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన రైతు బోయ పాండురంగ (32)కు 10 ఎకరాల పొలం ఉంది. అదే గ్రామంలో మరో 3 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని ఎనిమిదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు. 13 ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తుండగా, తీవ్ర వర్షాభావం కారణంగా నాలుగేళ్ల నుంచి నష్టాల పాలయ్యారు. దీనికి తోడు తన పొలంలో బోరు వేయించడానికి రూ.లక్ష వరకు ఆ గ్రామానికి చెందిన వారినుంచి అప్పు చేశారు. బోర్లలో చుక్కనీరు కూడా రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందారు. పంట పెట్టుబడి కోసం బయట వ్యక్తులతో చేసిన అప్పుల మొత్తం రూ 3.70 లక్షలకు చేరింది. అప్పులు తీర్చే దారిలేక పాండురంగ శనివారం తన పొలంలోనే వేప చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తండ్రి హనుమంతప్ప ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ప్రస్తుతం నిండు గర్భిణి. పాండురంగ మృతి స్థానికులను కలచివేసింది. ఇద్దరు కౌలు రైతుల బలవన్మరణం అప్పుల భారంతో ఇద్దరు కౌలు రైతులు శనివారం ఆత్మహత్యకు ఒడిగట్టారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా నరసన్నపాలెంకు చెందిన కౌలు రైతు కొమ్ము నాగరాజు (38) ఆరేళ్లుగా గ్రామంలోని కూరపాటి లక్ష్మికి చెందిన 6 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని నాటు పొగాకు సాగు చేస్తున్నారు. పెట్టుబడులు పెరగడం, ఆశించిన దిగుబడులు రాకపోవడంతో నాగరాజు అప్పుల పాలయ్యారు. పంట రుణం కోసం బంగారాన్ని కూడా బ్యాంకులో తాకట్టు పెట్టడంతో భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో మనోవేదనకు గురైన నాగరాజు శనివారం పురుగు మందు తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చింతలపూడిలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అప్పటికే నాగరాజు మృతిచెందారు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ధర్మాజీగూడెం ఎస్సై రాజేష్ కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే.. గుంటూరు జిల్లా మంచికల్లు గ్రామానికి చెందిన మల్లెం సాంబయ్య (62) తనకున్న 30 సెంట్ల పొలంతో పాటు మరో 20 ఎకరాలను కౌలుకు తీసుకుని తన కుమారులు నరసింహరావు, రమేష్తో కలిసి ఏటా వరి సాగు చేస్తున్నారు. సాగు కలిసి రాకపోవడంతో రూ.12 లక్షల వరకు అప్పులు పేరుకుపోయాయి. గత రబీలో పైరు ఆశాజనకంగా ఉన్న సమయంలో కాలువలకు సాగునీటి విడుదల నిలిచిపోయింది. కళ్లముందే పంట నిలువునా ఎండిపోయింది. పంట దెబ్బతినడం, అప్పులు కొండలా పేరుకుపోవడంతో మనోవ్యథకు గురైన సాంబయ్య శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందును తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బావులు ఎండిపోవడంతో.. అప్పులు పేరుకుపోవడం, గొట్టపు బావులు ఎండిపోవడంతో చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం మూలూరు గ్రామానికి చెందిన వెంకటేశులరెడ్డి (56) శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంకటేశులరెడ్డికి నాలుగు ఎకరాల పొలం ఉండటంతో వరి, వేరుశనగ పంటలు సాగు చేస్తున్నాడు. పొలంలో గొట్టపు బావులు వేసేందుకు 7 సంవత్సరాల క్రితం సుమారు రూ.4 లక్షలు అప్పు చేశాడు. రెండేళ్ల క్రితం బ్యాంకులో రూ.2.70 లక్షల పంట రుణం తీసుకున్నాడు. వర్షాభావంతో 6 నెలల క్రితం బోర్లు ఎండిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో అప్పు ఎలా తీర్చాలో అర్థంకాని వెంకటేశులురెడ్డి మనస్తాపానికి గురై శనివారం గ్రామం సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకున్నాడు. భూమి వివరాలను ఆన్లైన్ చేయకపోవడంతో.. వంగర: సాగులో ఉన్న భూమి వివరాలను ఆన్లైన్లో నమోదు చేయమని పదే పదే వేడుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శ్రీకాకుళం జిల్లా వంగర మండలం వెలుగు కార్యాలయంలో శనివారం ఈ ఘటన జరిగింది. సంగాం గ్రామానికి చెందిన బోను లక్ష్మీనారాయణమ్మ పేరుతో ఉన్న సాగు భూమిని ఆన్లైన్లో నమోదు చేయాలని ఆమె కుమారుడు మధు 40 రోజులుగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో వెలుగు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న డెప్యూటీ తహసీల్దార్ బి.గోవిందరావు వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి బైఠాయించారు. తమ సమస్యను పట్టించుకోలేదంటూ అసహనానికి గురైన మధు టిన్నుతో తెచ్చిన పెట్రోల్ను ఒంటిపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. డీటీ గోవిందరావుతోపాటు అక్కడ ఉన్న వారు అడ్డుకుని సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య సద్దుమణిగింది. భూములను పరిశీలించి ఆన్లైన్లో నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ బండారు రామారావు హామీ ఇచ్చారు. -
ఆ రైతు కుటుంబాలకు రూ.39 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 49 రైతు కుటుంబాలకు ఊరట లభించింది. వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార కార్పొరేషన్ ద్వారా కేటగిరీ–1 యూనిట్ల కింద ఆ కుటుంబాలను ఆర్థిక సహకార పథకాలకు ఎంపిక చేసిన ప్రభుత్వం, తాజాగా నిధులు విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఉపాధి యూనిట్లు తెరుచుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందులో 80 శాతం మొత్తాన్ని ప్రభుత్వం రాయితీ రూపం లో ఇస్తుండగా, 20 శాతాన్ని లబ్ధిదారు వ్యక్తిగతంగా భరించడమో లేదా బ్యాం కు రుణం తీసుకోవడంతో ఈ యూనిట్ను ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ఇందులో భాగంగా 49 మందికి 80 శాతం రాయితీ కింద ఒక్కో కుటుంబానికి రూ.80 వేల చొప్పున మొత్తం రూ.39.20 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం గురువారం ఆదేశాలు జారీ చేశారు. -
చేయూత కరువు
ఒంగోలు సబర్బన్: గతంలో తుపాన్ల వల్ల రైతులు పంటలు ఎక్కువగా నష్టపోయేవారు. అలాంటిది గత ఐదు సంవత్సరాల నుంచి జిల్లా ప్రజలు తుపాన్లు రావాలని ఎదురు చూడటం పరిపాటిగా మారింది. ప్రకృతి ప్రకోపానికి రైతన్న తీవ్ర నష్టాల పాలయ్యాడు...తద్వారా వచ్చిన కరువు రైతన్నను వెంటాడి కాటేస్తున్నా పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా కనీసం సాయం కూడా అందని దుస్థితి. నష్టంపై సరైన నివేదికలు పంపించకపోవటం, ఒకవేళ పంపించినా తరువాత పట్టించుకోకపోవటంతో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే నష్టం అంచనాలు పంపించినా ఆమోదించిన ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేసింది. ఐదేళ్ల నుంచి కరువు కాటేసినా వరుసగా ఈ రెండేళ్లు పరిస్థితి మరీ దారుణంగా మారింది. కరువు వచ్చినా... ప్రకృతి వైపరీత్యాలు బుసకొట్టినా రైతులకు మాత్రం నష్టపరిహారం దక్కడం లేదు. కరువు చేసిన కరాళ నృత్యం కళ్లారా చూసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనీసం కనికరం కూడా కలగలేదు. దీంతో ఇప్పటికే అప్పులు ఊబిలో కూరుకుపోయిన రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడాల్సిన పరిస్థితి దాపురించింది. కరువు, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతాంగానికి రెండేళ్ల నుంచి కరువు నష్టం కింది ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ అందనే లేదు. 2017–18, 2018–19 వ్యవసాయ సీజన్లకు గాను రావాల్సిన దాదాపు రూ.450.80 కోట్ల కోసం రైతన్నలు ఎదురు చూస్తూనే ఉన్నారు. వ్యవసాయ అధికారులు జిల్లాలోని పంట నష్టాల లెక్కలను తేల్చి పంపటం మినహా రైతాంగానికి ఈ రెండేళ్లలో ఒక్క పైసా కూడా చేరలేదు. కరువు చూసి కేంద్ర కరువు బృందమే కరిగింది: ఈ రెండేళ్లలో మూడు, నాలుగు సార్లు జిల్లాకు వచ్చిన కేంద్ర కరువు బృందమే కరిగిపోయింది. జిల్లా కేంద్రం ఒంగోలులో జిల్లా అధికారులు చూపిన ఫొటో ఎగ్జిబిషన్ చూసిన కేంద్ర బృందంలోని అధికారులు ఇంతటి పరిస్థితుల ఉన్నాయా అంటూ నివ్వెరబోయారు. తీరా క్షేత్ర స్థాయిలోకి వెళ్లిన అధికారుల బృందం ఒకటి, రెండు ప్రాంతాలు చూసి చలించిపోయి ఇక జిల్లా మొత్తం చూడాల్సిన అవసరం లేదని అంతటా ఇలానే ఉంటుందని అర్థమైందని తెలుసుకున్న బృందం సభ్యులు కేంద్రానికి నివేదిక ఇస్తామని జిల్లా అధికారులకు చెప్పిమరీ వెనుతిరిగి వెళ్లిపోయారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం కేంద్రం నుంచి కరువు నిధులు రాబట్టుకోవటంలో పూర్తిగా విఫలమైంది. దీంతో కరువు వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ రాక అల్లాడిపోతున్నారు. 2015 సంవత్సరంలో జిల్లాలోని 56 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. ఆ సంవత్సరం పంట నష్టం దాదాపు రూ.100 కోట్లకు పైగా జరిగింది. కానీ రైతాంగానికి ఇచ్చింది మాత్రం రూ.33.97 కోట్లు. 2016లో కూడా 56 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. అప్పట్లో దాదాపు రూ.150 కోట్లకు పైగా జిల్లా రైతాంగం నష్టపోయారు. కానీ ప్రభుత్వం నష్ట పరిహారం ఇచ్చింది మాత్రం రూ.72.58 కోట్లు. 2017లో ఖరీఫ్లో 88,425 హెక్టార్లలో రైతులు పంట నష్టపోయారు. అధికారులు అరకొరగా నష్టాన్ని అంచనా వేసి ప్రతిపాదనలు పంపారు. కానీ పరిహారం కింద రూ.74.24 కోట్లు మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. ఇకపోతే 2017 రబీలో కూడా చీరాల మినహా జిల్లాలోని 55 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. నష్టం కింద దాదాపు రూ.130 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. 2018లో జిల్లాలో అధికారులు 56 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. తద్వారా ఖరీఫ్ పంట నష్టం రూ.140 కోట్లు జరిగిందని అధికారులు నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఖరీఫ్లో 1.25 లక్షల హెక్టార్లలో పంటను నష్టపోయినట్లు కూడా అధికారులు లెక్కలు తేల్చారు. అందుకుగాను దాదాపు 1.54 లక్షల మంది రైతులు ఒక్క ఖరీఫ్ సీజన్లో నష్ట పోయారంటే జిల్లాలో కరువు పరిస్థితి ఏవిధంగా ఉందో అట్టే అర్థమవుతోంది. జిల్లాలో మినుము, కంది, పత్తి, ఆముదం, సజ్జ, జొన్న, అలసంద, పెసర, నువ్వు పంటలు నష్టపోయినట్లు తేల్చారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో మొత్తం 2.27 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉండగా 2 లక్షల హెక్టార్లలోనే రైతాంగం పంటలను సాగు చేశారు. అందులో 1.25 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయినట్లు లెక్కలు తేల్చారు. అంటే 75 వేల హెక్టార్లలో పంటలు పండినట్లు అధికారులే నిర్ధారించారు. 2018 (2018–19 వ్యవసాయ సీజన్) రబీలో 40 మండలాలను అధికారులు కరువు మండలాలుగా ప్రకటించారు. పంటల నష్టం దాదాపు రూ.106.56 కోట్లు నష్టం వాటిల్లిందని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. రబీలో 1,30,446 మంది రైతులు 1,12,803 హెక్టార్లలో పంటలు నష్టపోయారు. అయితే జిల్లా రైతాంగం మాత్రం జిల్లాలోని మిగతా 16 మండలాలను కూడా కరువు మండలాలుగా ప్రకటించాలని అధికారులను వేడుకున్నారు. దాంతో అధికారులు ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక పంపారు. కానీ ఇప్పటి వరకూ మిగతా మండలాలను కరువు కింద ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు జిల్లా అధికారులకు రాలేదు. -
రైతు దంపతులను మింగిన సాగు రుణాలు
అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని చాలవేముల గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, రాజ్యలక్ష్మి దంపతులకు ఐదుగురు సంతానం. వీరు తమకున్న ఐదెకరాల పొలంలో వ్యవసాయం చేసి జీవనం సాగించేవారు. వర్షాభావం వల్ల తరచూ వ్యవసాయంలో నష్టాలొచ్చాయి. దీంతో తన కుటుంబాన్ని పోషించుకోవడానికి గ్రామ సమీపంలోని కొండలపై ఉన్న గాలిమరల వద్ద కాపలాదారునిగా పనిచేస్తూ ఉండేవాడు. అయితే పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చేదెలా? వర్షాలు రాకపోవడం వల్ల తన కుటుంబాన్ని ఎలా పోషించాలి? ఈ దిగులుతో సుబ్బారెడ్డి 2015 డిసెంబర్ 29న గుండెపోటుతో మృతి చెందాడు. ఇంటి పెద్దదిక్కు మరణించడంతో కుంగిపోయిన అతని భార్య రాజ్యలక్ష్మి భర్త చనిపోయిన తెల్లారే 30వ తేదీన ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వ్యవసాయం కోసం చేసిన అప్పుల బాధతో తల్లడిల్లిన తల్లిదండ్రులు చనిపోవడంతో వారి నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు అనాథలయ్యారు. దీంతో సుబ్బారెడ్డి అన్న శివారెడ్డి ఆ పిల్లల బాధ్యత తీసుకున్నారు. ఆర్డీటీ స్వచ్ఛంద సంస్థ నలుగురు పిల్లలకు ఉచిత విద్యనందిస్తోంది. గాయత్రి 10వ తరగతి, స్రవంతి 8వ తరగతి, శ్రావణి 3వ తరగతి, తేజశ్విని, ప్రణయ్కుమార్రెడ్డి 1వ తరగతి చదువుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయమూ అందలేదు. తమ మనవరాళ్లు, మనుమడిని ప్రభుత్వం పెద్దమనసుతో ఆదుకోవాలని సుబ్బారెడ్డి తల్లి చిన్న కుళ్లాయమ్మ వేడుకుంటున్నది. ‘ఇప్పటి వరకు ఆపద్బంధు కింద రూ.50 వేలు మాత్రమే వచ్చాయి. పిల్లల భవిష్యత్తు అంతుపట్టడం లేదు. ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలి’ అని ఆమె కోరారు. – కాకనూరు హరినాథరెడ్డి, సాక్షి, పుట్లూరు -
ఎండిన పంట ఆగిన గుండె
సాక్షి,వర్ధన్నపేట: పండిన పంట ఎండిపోవడంతో రైతు గుండె ఆగిపోయింది. నీటి కోసం బోర్లు వేస్తే కన్నీరే మిగిలింది. చేసిన అప్పుల భారం పెరగడంతో ఆయువు తీసుకున్న ఘటన వర్ధన్నపేటలో శనివారం జరిగింది. వర్ధన్నపేట మునిసిపాలిటీ పరిధిలోని డీసీ తండా శివారు గుబ్బెటి తండాకు చెందిన ఆంగోతు మొగిళి(50) తనకున్న రెండెకరాల వ్యవసాయ భూమిలో గతంలో ఉన్న బోరుబావి ఎండిపోయింది. నీటి వసతి లేక పోవడంతో మూడు బోరు బావులు తవ్వినా నీరు రాలేదు. దీంతో పాటు రాయపర్తి మండలం తిర్మాలాయపెల్లికి చెందిన వశపాక నర్స ఎల్లయ్యకు చెందిన 30 గుంటల భూమి కౌలుకు తీసుకుని వ్యసాయం చేస్తున్నాడు. ఈ రబీలో బోరులో నీరు ఎక్కువగా రాదని గ్రహించి తన భూమిలోని 30 గుంటల్లో వరి నాటు వేశాడు. వేసవి రాక ముందే నీరు పోసే బోరు ఎండి పోవడంతో వరి పంట ఎండి పోతుంది. దీంతో అప్పులు ఎలా తీర్చాలని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మొగిళికి భార్య కౌసల్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
రుణపాశం.. మరణ శాసనం
బ్రహ్మ తలరాత రాస్తే... అప్పుల బాధతో ఓ రైతు తన మృత్యురాతను తానే రాసుకున్నాడు. తాను వెళ్లిపోతే.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబీకులు అంత్యక్రియలకు ఎక్కడ ఇబ్బంది పడతారోనని... ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 2018 ఆగస్టు 10న కంబదూరు మండలం రాంపురం గ్రామంలోచోటు చేసుకున్న ఈ ఘటన యావత్ రాష్ట్రాన్ని కంటతడి పెట్టించింది. పంటలు పండక....ప్రభుత్వం ఆదుకోక...అప్పుల బాధతో బలవన్మరణం చెందుతున్న రైతులదీనస్థితిని ప్రపంచానికి చాటింది. కానీ అధికారంలో ఉన్న టీడీపీ ప్రజాప్రతినిధుల మనసు కరగలేదు. బాధిత కుటుంబానికి కనీసం పరిహారం కూడా ఇవ్వలేదు. ఇప్పుడా కుటుంబం బతికేందుకు నానా తంటాలు పడుతోంది. అనంతపురం, కంబదూరు : కంబదూరు మండలం రాంపురం గ్రామానికి చెందిన రైతు హరిజన మల్లన్నకు 115–2లో 1.34 ఎకరాలు, 115–1లో 3.17 ఎకరాలు, 114–2లో 2.62 ఎకరాలు మొత్తం 7.13 ఎకరాలు పొలం ఉంది. ఈయనకు భార్య మారెక్క, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమారుడు మాధవయ్య గ్రామంలోనే ఉంటూ తండ్రికి వ్యవసాయంలో తోడుగా ఉండేవాడు. చిన్న కుమారుడు అనిల్ తన భార్య పద్మ, మూడేళ్ల కుమార్తెతో పొట్టకూటి కోసం బెంగళూరుకు వలస వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నాడు. మల్లన్న పొలంలో దాదాపు ఐదు బోర్లు వేయించాడు. వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండటంతో గత మూడేళ్లుగా పొలంలో వేసిన బోర్లన్నీ ఎండిపోయాయి. తిరిగి ఆశ చావక మళ్లీ పంటలను సాగు చేయాలన్న ఉద్దేశంతో మల్లప్ప అరకొరగా వచ్చే నీటితో 2016లో రూ.50 వేలకు పైగా ఖర్చు చేసి టమాట, వేరుశనగ సాగు చేశాడు. అప్పట్లో రూ.10 వేలు చేతికందింది. తిరిగి 2017లో, 2018లో మరోసారి టమాట, వేరుశనగ సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఆశించినస్థాయిలో దిగుబడులు రాకపోవడంతో మల్లప్ప పంటల సాగు కోసం చేసిన అప్పులను ఎలా తీర్చాలోనని అంతర్మథనంలో పడ్డాడు. 2018 ఆగస్టు 9న ఏం జరిగిందంటే... సాగు చేసిన టమాటకు గిట్టుబాటు ధర రాలేదు. బ్యాంకులో రుణం, బయట ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తులతో తీసుకున్న అప్పులు అధికమై ఒత్తిళ్లు పెరిగాయి. పంటకు గిట్టుబాటుధర లేక, ప్రభుత్వం సాయం అందక చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియని పరిస్థితుల్లో మల్లన్న ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను మరణించిన తర్వాత కుటుంబ సభ్యులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో 2018 ఆగస్టు 9న కళ్యాణదుర్గానికి వెళ్లి తన ఫొటోకు జనన, మరణ తేదీలను రాయించుకున్నాడు. అంత్యక్రియలకు అవసరమైన సరుకులు తెచ్చుకున్నాడు. దీంతో పాటు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుస్తుల వద్ద తీసుకున్న అప్పుల వివరాలను తన తండ్రి లేట్ చిన్న మారెప్ప సమాధి వద్ద ఉంచి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తడిసి మోపెడైన అప్పుల భారం వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న మల్లన్న కుటుంబాన్ని అప్పుల భారం వెంటాడింది. సదరు పొలంపై నూతిమడుగు ఆంధ్ర ప్రగతి గ్రామీణబ్యాంకు పరిధిలో అకౌంట్ నం.19090000708 రుణం అకౌంట్ నంబర్ 91012068606లలో సుమారు రూ.1.12 లక్షల పంట రుణం తీసుకున్నాడు. కాగా ప్రభుత్వం నుంచి రుణమాఫీకి రూ.52,696 మాత్రమే మాఫీ అవుతుందని, అందులో మూడు విడతలకు గాను మొత్తం రూ.13,174 మాఫీ అయ్యిందని మల్లన్న కుమారుడు మాధవయ్య చెప్పాడు. పంటల సాగు కోసం బ్యాంకులలో తీసుకున్న పంట రుణాల కోసం గ్రామంలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుస్తులతో మరో సుమారు రూ.1.73 లక్షలు అప్పులు చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో పాటు గ్రామంలో మారెక్క ఇందిరా డ్వాక్రా సంఘంలో ఉంది. సంఘం సభ్యురాలిగా రూ.13 వేలు అప్పు తీసుకుంది. టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణమాఫీ చేస్తామని చెప్పింది కానీ ఆమె అప్పు అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం ఆమె షుగర్ వ్యాధి గ్రస్తురాలు. భర్త మల్లన్న చనిపోయిన నాటి నుంచి మానసిక ఆందోళనలో ఉంది. పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం అప్పుల భారంతో ఆత్మహత్య చేసుకున్న మల్లన్న కుటుంబాన్ని టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం చంద్రబాబు మాటలు నీటి మూటలయ్యాయి. కుటుంబ పెద్ద దిక్కు తనువు చాలించి ఏడు నెలలైనా పట్టించుకున్న పాపాన పోలేదని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హేళనగా మాట్లాడుతున్నారు మా తండ్రి మల్లన్న మాకున్న పొలంలో బోర్లు వేసి, పంటల సాగు కోసమే అప్పులు చేశాడు. మా తండ్రి ఆత్మహత్య చేసుకున్న అనంతరం మా ఇంటి వద్దకు రెవెన్యూ అధికారులు వచ్చారు. కొందరైతే 70 ఏళ్లకు పైగా వయస్సు ఉంది. ఎలా వ్యవసాయం చేసి ఉంటాడంటూ...ఎందుకు ఇంత అప్పులు చేశారంటూ హేళనగా మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి రాలేదు కానీ హేళనగా మాట్లాడటం మాకు మరింత బాధను కలిగిస్తోంది.– మాధవయ్య, మల్లన్న పెద్ద కుమారుడు, రాంపురం -
కంటతడి పెట్టిన రేణూదేశాయ్
ఆలూరు/పెద్దకడబూరు: అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అన్నదాతల ఉసురు తప్పకుండా తగులుతుందని సామాజిక వేత్త, సినీనటి రేణు దేశాయ్ అన్నారు. రాష్ట్రంలో ‘కరువు నేపథ్యంలో రైతుల కష్టాలు.. ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిస్థితుల’పై అధ్యయనం చేయడంలో భాగంగా ఆమె సోమవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుంబళబీడు, మండల కేంద్రమైన పెద్దకడబూరులో పర్యటించారు. తంబళబీడు గ్రామంలో గత ఏడాది ఆగస్టు 25న అప్పుల బాధ తాళలేక రైతు దంపతులు నెరణికి బోయరామయ్య, వండ్రమ్మ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా..వారి కుటుంబ సభ్యులను రేణుదేశాయ్ పరామర్శించారు. అలాగే పెద్దకడబూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు పెద్దరంగన్న కుటుంబ సభ్యులతోనూ ఆమె మాట్లాడారు. వారు చెప్పింది విని ఆమె కంట తడిపెట్టారు. ఆయా గ్రామాల్లో రచ్చబండపై రైతులతో ‘సాక్షి టీవీ’ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు. తుంబళబీడు గ్రామస్తులు మాట్లాడుతూ పక్కా గృహాలు లేవని, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, రోడ్లు బాగోలేవని, పంటలకు జింకల బెడద అధికంగా ఉందని, పంటలు పండక బ్యాంకుల్లో తెచ్చుకున్న రుణాలను చెల్లించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దకడబూరులో రైతులు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కరువే దిక్కయ్యిందని, పంటలు పండడం లేదని, ఒకవేళ పండినా గిట్టుబాటు ధరలు లేవని వాపోయారు. పత్తి క్వింటాల్ రూ.3,500, మిరప క్వింటాల్ రూ.6 వేలకు మించి పలకడం లేదన్నారు. కాగా తాను ప్రజాప్రతినిధిని కానని, ప్రభుత్వ అధికారిణిని కాదని, అయినప్పటికీ ప్రభుత్వం, కలెక్టర్ దృష్టికి రైతుల సమస్యలు తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రేణుదేశాయ్ చెప్పారు. -
చావు ఇంట బేరసారాలకు దిగిన అధికారులు
-
కౌలు రైతు కన్నీటి యాత్ర
గుంటూరు, యడ్లపాడు: కొన్ని బంధాలు అంత త్వరగా తెగి పోవు.. కొందరు వ్యక్తుల్ని అంత త్వరగా మర్చిపోలేం. గుండెగూటిలో ఆ వ్యక్తి చేసిన త్యాగం చెదరని జ్ఞాపకమై జీవితాంతం మిగిలిపోతుంది. కనుపాపకు రెప్పలా.. తమ బతుకులకు దిక్సూచిలా నిలిచిన ఆ వ్యక్తి కానరాని లోకాలకు వెళ్లిపోతే, కన్నీళ్లు సైతం ఇంకిపోయి నిస్సహాయులుగా మిగిలిన కొన్ని కుటుంబాల వ్యథ ఇది... కుటుంబాలకు అండగా... యడ్లపాడు మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు పిట్టల కోటేశ్వరరావు కొండవీడు ఉత్సవాల రెండో రోజున తన పంట పొలంలో పోలీసులు, టీడీపీ నేతల దాడిలో మృతి చెందాడు. కోటేశ్వరరావు మృతి కుటుంబ సభ్యుల్నే కాదు గ్రామస్తులను సైతం కలచి వేసింది. స్వయం కృషితో, ఆత్మస్థైర్యంతో అంచెలంచెలుగా ఎదిగిన కోటేశ్వరరావు ఎనిమిది కుటుంబాలకు పెద్ద దిక్కుగా వ్యవహరించేవాడు. దశాబ్దన్నర కిందటే తల్లిదండ్రులు లింగయ్య, సీతమ్మ కాలం చేశారు. తల్లిదండ్రుల నుంచి పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోవడంతో కోటయ్య రెక్కల కష్టాన్ని నమ్ముకున్నాడు. తన అక్క, నలుగురు చెల్లెళ్లు, కూతురు, కుమారుడి వివాహాలను చేశాడు. తన కుటుంబంతోపాటు అక్క, చెల్లెళ్ల కుటుంబాలకు అండగా ఉన్నాడు. 14 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని రకరకాల పంటలను సాగు చేశాడు. రెక్కల కష్టం ఫలించి ఫలసాయం చేతికందే వేళ కానరాని లోకాలకు వెళ్లిపోయాడు. మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నేతలు రజని, రాజశేఖర్ బాధితులకు నాయకుల పరామర్శ కోటేశ్వరరావు మృతదేహాన్ని మంగళవారం చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి ప్రాంగణం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, కొత్తపాలెంలో గ్రామస్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఆసుపత్రికి చేరుకున్న వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్ కుటుంబ సభ్యులకు బాసటగా నిలిచారు. మృతుని కుటుంబానికి అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిష్పక్షపాత విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. మృతుని కుటుంబానికి పరిహారంగా రూ.25 లక్షలు చెల్లించాలన్నారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. సీపీఐ గుంటూరు జిల్లా పశ్చిమ కార్యదర్శి గద్దె చలమయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు పీ నరసింహారావు, సీపీఎం నాయకులు బొల్లు శంకరరావు, పోపూరి సుబ్బారావు, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ అన్నం శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి తాటిపర్తి జయరామిరెడ్డి, పొత్తూరి బ్రహ్మానందం, జనసేన, వివిధ ప్రజాసంఘాల నాయకులు ఆసుపత్రికి చేరుకుని ప్రభుత్వ, పోలీసులు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రభుత్వ హత్యగానే భావించాల్సి ఉంటుందని ఆరోపించారు. నిజానిజాలు నిగ్గు తేలేవరకు ఎలాంటి పోరాటానికైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. సాయంత్రం కోటేశ్వరరావు మృత దేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి బంధులకు అప్పగించారు. అనంతరం గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. విడదల రజనిఆర్థిక సహాయం అందజేత మృతుడు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త విడదల రజని రూ.లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. -
శవ రాజకీయం
గుంటూరు: ఇంటి పెద్ద మృతి చెంది కొండంత దుఃఖంలో కూరుకుపోయిన కౌలు రైతు కుటుంబ సభ్యులను ఓదార్చాల్సిన పాలకులు, టీడీపీ నాయకులు, పోలీసులు మానవత్వం మరచి ప్రవర్తించారు. సీఎం సభ నేపథ్యంలో పోలీసులదౌర్జన్యం కారణంగా రైతు మృతిచెందిన ఘటనను పక్కదారి పట్టించేందుకు సరికొత్త పన్నాగాలు పన్నుతున్నారు. విషాదం నెలకొన్న కౌలు రైతు ఇంట శవ రాజకీయాలు చేస్తున్నారు. రూ.3 లక్షలు తీసుకుని వదిలేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు అప్పుల బాధతోనే కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడంటూ అసత్య ప్రచారం సాగిస్తున్నారు. పోలీసులు కొట్టినందునే కౌలు రైతు కోటేశ్వరరావు చనిపోయాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తుండగా రూరల్ ఎస్పీ మాత్రం ఖండించారు. ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతును తమ సిబ్బందే ఆస్పత్రికి తరలిస్తున్నారంటూ కౌలు రైతును పోలీసులు భుజాలపై తీసుకెళ్తున్నట్లు ఉన్న వీడియోను విడుదల చేశారు. అయితే ఘటన జరిగిన అనంతర పరిణామాలు మాత్రం పోలీసులనే దోషులుగా చూపుతున్నాయి. సీఎం సభా ప్రాంగణం వద్ద జిల్లా వైద్యాధికారి, హెలీప్యాడ్ వద్ద అంబులెన్సులు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉండగా పోలీసులు ఎందుకు తరలించాల్సి వచ్చింది? సీఎం చంద్రబాబు సైతం పోలీసుల వల్లనో, మరే కారణంగానో అవమానంగా భావించి కౌలు రైతు చనిపోయాడంటూ ఎందుకు ప్రసంగించారు? పోలీసుల తప్పు లేనప్పుడు రాజీపడాలంటూ ఉన్నతాధికారులు ఎందుకు ఒత్తిడి తెస్తున్నారు? బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నేత విడదల రజనిని పోలీసులు ఎందుకు అడ్డుకున్నారు? కోటేశ్వరరావుకు తోడుగా వెళ్లిన పున్నారావు పోలీసు వాహనంలో ఎందుకు ఉన్నాడు? అతని సెల్ఫోన్ను ఓ సీఐ తన వద్ద ఎందుకు ఉంచుకున్నాడు? పోస్టుమార్టం వద్ద టీడీపీ నాయకులు ఎందుకు హల్చల్ చేశారు? అన్న ప్రశ్నలకు జవాబిచ్చేదెవరు? -
చేనుకి పోయిన మనిషి చితికిపోతే ఎలా?
చేనుకి పోయిన మనిషి ఇంటికి ఏ రూపంలో తిరిగొస్తాడో తెలియదు. రైతు తనని తాను చంపుకోవాల్సిన పరిస్థితులు కొన్నయితే విధాన నిర్ణేతల తప్పిదాలు మరికొన్ని. ఈ కోవలోదే చంద్రబాబు 2014 ఎన్నికలకు ముందు ఇచ్చిన విద్యుత్ సరఫరా హామీ... గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మందాడి గ్రామానికి చెందిన యువ కౌలు రైతు వంకద్వత్ అంజి నాయక్ మిర్చి పంట పండిస్తుంటాడు. వాన మొఖం చాటేసింది. మబ్బులు కిందికి దిగిరానంటున్నాయి. బోరు బావులే దిక్కయ్యాయి. వీటికి ఎప్పుడు కరెంటు వస్తుందో ఎప్పుడు పోతుందో సర్కారు వారి దయ. దీంతో అంజి నాయక్ ఇటీవల ఓరోజు అర్ధరాత్రి దాటింతర్వాత చేనుకి నీళ్లు కట్టుకుందామని వెళ్లాడు. వెళ్లినవాడు పొద్దు బారెడెక్కినా ఇంటికి రాలేదు. ఏమైందో తెలియక తల్లడిల్లిన ఇల్లాలు చేనుకి పోయి చూసేసరికి గుండె గుభిల్లుమంది. విద్యుద్ఘాతం అంజిని పొట్టన పెట్టుకుంది. ఇలాంటివి ఎన్నో... కర్నూలు జిల్లా సంజామల మండలం మిక్కినేని గ్రామంలో ఒకేరోజు ముగ్గురు రైతులు మబ్బుల్లో పొలానికి పోయి మళ్లీ తిరిగి రాలేదు. ఆ చీకట్లో తెగిపడిన కరెంటు తీగె వారి ప్రాణాలను మిగేసింది. రైతు వ్యథాభరిత చిత్రానికి ఇవన్నీ రుజువులు.వేళకాని వేళల్లో ఇచ్చే కరెంటు కోసం వెళ్లి రైతులు చచ్చిపోతున్నారు. గత నాలుగేళ్లుగా ఇదే తీరు. ఈ దశలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతన్నలకు ఓ హామీ ఇచ్చారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే నవరత్నాలలో భాగంగా పగటిపూట నిరంతరాయంగా హెచ్చుతగ్గులు లేని నాణ్యమైన కరెంటును 9 గంటల పాటు సరఫరా చేస్తానని భరోసా ఇచ్చారు. ఆయన మాటను అన్నదాతలు విశ్వసించారు. ఎందుకో తెలుసా.. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజే ఉచిత విద్యుత్ సరఫరా ఫైల్పై సంతకం చేసిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిది. పాత బకాయిలు రద్దు చేసిన పెద్దమనసు ఆయనది. ఆవేళ ఉమ్మడి రాష్ట్రంలో 23 లక్షల బోర్లకు ఉచిత విద్యుత్ను సరఫరా చేసి మాట నిలుపుకున్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో ఆయా రైతులకు భూమి ఎంత, ఎటువంటి పంట, పంప్సెట్ సామర్థ్యం ఎంత, పేదరైతా? పెద్ద రైతా అనేది చూడలేదు. కస్టమర్ సర్వీస్ చార్జీలనూ నయాపైసా వసూలు చేయలేదు. రాష్ట్ర ఖజానాకు అది భారమవుతుందేమో అని యోచించలేదు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ఉచిత విద్యుత్ సరఫరా చేసిన మహానేత వైఎస్సార్. అటువంటి ఆయన కడుపున పుట్టిన జగన్ మాట తప్పడన్న ధీమా రైతన్నది. అందుకే పాదయాత్రలో అంతలా ఆదరించారు. అక్కున చేర్చుకున్నారు. జగన్ హామీతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 16 లక్షల పంపుసెట్లకు ఉచిత విద్యుత్ వస్తుంది. 17 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. లక్షలాది ఎకరాలకు నీళ్లు అందుతాయి. వీళ్లందరికీ 9 గంటల పాటు పగటిపూట ఉచిత విద్యుత్ సరఫరా అవుతుంది. ఆక్వా రైతులకు యూనిట్కు రూపాయిన్నరకే విద్యుత్ వస్తుంది. – ఎ.అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
వ్యవసాయం గట్టెక్కించేనా?
అప్పులకు తాళలేక అన్నదాతల వరుస ఆత్మహత్యలు, పెట్టుబడికి తగిన రాబడి రాకపోవడం, పంట ఉత్పత్తుల ధరల పతనం లాంటి కారణాలతో దేశ రైతాంగం కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కొంటోంది. ఏడాదిన్నర వ్యవధిలో దేశవ్యాప్తంగా రైతులు 18 సార్లు రోడ్డెక్కి ఆందోళనలకు దిగారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 184 రైతు సంఘాలు దేశవ్యాప్త నిరసనలకు దిగడంతో రైతన్నల ఆగ్రహజ్వాలలు ఢిల్లీ పీఠాన్ని తాకాయి. ఇటీవల హిందీ బెల్ట్లోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ పరాజయానికి అన్నదాతల ఆగ్రహమే కారణమని నిర్ణయానికొచ్చిన కేంద్ర ప్రభుత్వం వారిని మచ్చిక చేసుకోవడానికి రకరకాల పథకాలపై అధ్యయనం చేసి, చివరికు తెలంగాణ,ఒడిశా రాష్ట్రాలు అమలు చేస్తున్న పెట్టుబడి సాయమే మంచిదన్న నిర్ణయానికొచ్చింది. కేంద్ర బడ్జెట్లో రైతులపై వరాల జల్లులు కురిపిస్తూ ఏడాదికి రూ. 6 వేల పెట్టుబడి సాయాన్ని ప్రకటించింది. కానీ దీని వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఎంత అన్నది ప్రశ్నార్థకమే. – సాక్షి, హైదరాబాద్ వ్యవసాయ సంక్షోభం ఎలా ఉందంటే.. - మన దేశంలో మొత్తం 26 కోట్ల 30 లక్షల మంది రైతులు ఉండగా, 2016–17 నాబార్డ్ ఆర్థిక సర్వే ప్రకారం ఒక్కో రైతు కుటుంబంపై రూ.1.04 లక్షల అప్పు భారం ఉంది. - దేశం మొత్తం మీద 52శాతం మంది రైతులు అప్పుల్లో కూరుకుపోయినట్లు నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీసు (ఎన్ఎస్ఎస్ఒ) వెల్లడించింది. - రైతు అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. ఏపీలో 92.9శాతం మంది రైతులు రుణగ్రస్థులు కాగా, తరువాతి స్థానాల్లో తెలంగాణ (89.1%), తమిళనాడు (82.5%) ఉన్నాయి. - ప్రభుత్వ పథకాలపై 64 శాతం మంది రైతులు అసంతృప్తితో ఉన్నట్టు సీఎస్డీఎస్ అధ్యయనంలో తేలింది. - సాగు కమతాల విస్తీర్ణం బాగా తగ్గిపోవడం, ఎకరా, రెండు ఎకరాలు ఉన్న చిన్న రైతుల సంఖ్య పెరగడంతో వారు బేరమాడేశక్తిని కోల్పోతున్నారు. దీంతో దళారులు చెప్పే «ధరకే పంటని అమ్ముకుంటున్నారు. - పంటల ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకపోవడంతో రైతులకు ఆశించిన ధర దక్కడం లేదు. - గోదాములు, శీతల గిడ్డంగుల కొరతతో పంట ఉత్పత్తులు తొందరగా చెడిపోవడం కూడా రైతులకు నష్టం కలిగిస్తోంది. - డీజిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా రూపాయి విలువ పతనంతో ఎరువుల ధరలు ఎగబాకడంతో పెట్టుబడి వ్యయం అధికమవుతోంది. - ప్రత్యామ్నాయ మార్గాలుంటే వ్యవసాయ రంగాన్ని వదులుకోవాలని సుమారు 40 శాతం రైతులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణంలో 40 శాతం వాటా.. ద్రవ్యోల్బణానికి, వ్యవసాయాదాయానికి మధ్య మౌలికంగా కొంత వైరుధ్యం ఉంది. ద్రవ్యోల్బణాన్ని నిర్ణయించే వినిమయ ధరల సూచి (సీపిఐ)లో 40% వరకు ఆహార పదార్థాలే ఉంటాయి. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం దేశ ద్రవ్యవిధానంలో కీలకమైన అంశం. ద్రవ్యోల్బణం తగ్గడం వ్యవసాయ ఉత్పత్తుల ధరలను దెబ్బతీసింది. ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి వ్యవసాయాదాయాన్ని నియంత్రించడం మంచిది కాదు. విధాన నిర్ణేతలు ఎదుర్కొంటున్న అతిపెద్ద రాజకీయ–ఆర్థిక సమస్య ఇది. సాయం కంటితుడుపేనా? 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన ఎన్డీయే ప్రభుత్వం ఎన్నికల వేళ పెట్టుబడి సాయం రూపంలో తాయిలాలు ప్రకటించింది. భారత్లో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారి సంఖ్య 50 శాతానికి పైనే అయినా, ఆ రంగం నుంచి వస్తున్న స్థూల జాతీయోత్పత్తి అంతకంతకు తగ్గిపోయి 17–18 శాతానికి చేరుకుంది. సాధారణ ద్రవ్యోల్బణం కంటే ఆహార ద్రవ్యోల్బణం దారుణంగా పడిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి సాయం చేయడం కంటి తుడుపు చర్యేనన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. పండిన పంటకి గిట్టుబాటు ధర కల్పిం చడం, వ్యయ భారాన్ని తగ్గించడం, పంట నిల్వ వసతుల్ని మెరుగుపరచడం లాంటి వాటిపై దృష్టి సారించాలి. రాష్ట్రాల వారీగా అక్కడున్న ఖర్చుల ఆధారంగా పెట్టుబడి వ్యయాన్ని నిర్ణయించాలని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
రైతు ఆత్మహత్యల్లేని రోజులు రావాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో రైతు ఆత్మహత్యల్లేని రోజులు రావాలని, ఇందుకోసం పాలకులు సరైన విధానాలను రూపొందించాలని ఏఐసీసీ కిసాన్ సెల్ చైర్మన్ నానాపటోలే అన్నారు. రైతులకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా ఒక్క హామీనీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి అధ్యక్షతన మంగళవారం గాంధీభవన్లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల కిసాన్ కాంగ్రెస్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నానా పటోలే మాట్లాడుతూ దేశంలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రైతు రుణమాఫీ హామీ నెరవేర్చే వరకు పాలకులను నిద్రపోనివ్వద్దని పిలుపునిచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకతీతంగా రైతాంగం రోడ్ల మీదకు వచ్చి పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ ప్రభుత్వం అదానీ, అంబానీల కోసమే పనిచేస్తోందని, కార్పొరేట్ కంపెనీల కోసమే ఫసల్ బీమా పథకాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. రైతాంగాన్ని కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. వైఎస్ హయాంలో 15 రోజులకోసారి సమీక్ష ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ తాను చూసిన ముఖ్యమంత్రుల్లో రైతుల సమస్యలపై 15 రోజులకోసారి సమీక్ష నిర్వహించింది వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రమేనని చెప్పారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విదేశాల్లో తిరిగే మోదీ, సచివాలయానికి రాని కేసీఆర్ల పాలనలో రైతులు నానాకష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రులు జీవన్రెడ్డి, షబ్బీర్ అలీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, సీనియర్ నేత వి. హనుమంతరావు తదితరులు సదస్సులో రైతులనుద్దేశించి ప్రసంగించారు. సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రతినిధులు, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యేలు శ్రీధర్బాబు, గండ్ర వెంకటరమణారెడ్డి, సుధీర్రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, కిసాన్ కాంగ్రెస్ నేతలు అన్వేశ్రెడ్డి, కె.వి.రామారావు, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పంట పరిహారం అందిన దాఖలాల్లేవు: భట్టి విక్రమార్క కిసాన్ కాంగ్రెస్ సదస్సులో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ తమ హయాంలోనే వ్యవసాయం పండుగలా మారిందని అటు మోదీ, ఇటు కేసీఆర్ ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందన్నారు. స్వాతంత్య్రం వచ్చే నాటికి ఆహారధాన్యాలను దిగుమతి చేసుకునే స్థాయిలో ఉన్న దేశాన్ని ఆహార ధాన్యాలను ఎగుమతిచేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీ తీసుకు వచ్చిందని, గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన కృషి వల్లే రైతులు, రైతు కూలీలు ఈ మాత్రమైనా బతకగలుగుతున్నారని అన్నారు. -
కాటేసిన కరెంటు తీగ
పశ్చిమగోదావరి, కామవరపుకోట (చింతలపూడి): కరెంట్ తీగలకు మరో రైతు బలయ్యాడు. పశువులకు మేత వేసి పాలు తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తిని విద్యుత్ తీగ మృత్యురూపంలో కబళించింది. కామవరపుకోట మండలం అంకాలంపాడు గ్రామానికి చెం దిన దొప్పసాని నాగేశ్వరరావు (42) అనే రైతు తన ఎకరాన్నర ఆయిల్పామ్ తోటలో గేదెలకు దాణా పెట్టి పాలు తీసుకురావడానికి బుధవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లాడు. తోట సమీపంలో అతడిపై 11 కేవీ విద్యుత్ కండక్టర్ వైరు తెగి పడటంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. శరీరం కాలిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. సమీప పొలంలో ఉన్న నాగేశ్వరరావు అన్న పగిడియ్య తమ్ముడి కేకలు విని వచ్చేసరికి ప్రమాదం జరిగిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతునికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. నాగేశ్వరరావు మృతితో వా రంతా అనాథలయ్యా రు. నాగేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావడంతో పార్టీ నాయకులు పలువురు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మృతుని భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తడికలపూడి ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు. వైఎస్సార్ సీపీ నాయకుల పరామర్శ సంఘటనా స్థలానికి చేరుకున్న వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని కుటుంబసభ్యులకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందించారు. పార్టీలో నిబద్ధత గల కార్యకర్తగా నాగేశ్వరరావు పనిచేశాడన్నారు. మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతోనే.. నాగేశ్వరరావు మృతదేహాన్ని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘంటా మురళీరామకృష్ణ సందర్శించి నివాళులర్పించారు. మృతుని ఇద్దరు పిల్లలను ప్రభుత్వమే చదివించి, భార్యకు అంగన్వాడీ టీచర్ పోస్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల ఏటా రైతులు విద్యుత్ ప్రమాదాల్లో మృతి చెందుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు. శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ కండక్టర్ తీగలను వెంటనే తొలగించి కొత్తవి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
మార్కెట్లో చలితో రైతు మృతి
కేసముద్రం: మార్కెట్ యార్డులో చలికి తట్టుకోలేక ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్లో శనివారం చోటుచేసుకుంది. గూడూరు మండలం నాయక్పల్లికి చెందిన నల్లపురి సత్తయ్య (65) పది బస్తాల ధాన్యాన్ని అమ్మేందుకు గురువారం ఉదయం మార్కెట్కు తీసుకొచ్చారు. హరికృష్ణ కంపెనీకి చెందిన వ్యాపారి టెండర్ వేసి రూ.1849లకు కొనుగోలు చేశాడు. రాత్రి సమయంలో కాంటాలు కావడం.. సదరు వ్యాపారి డబ్బులు మరుసటి రోజు ఇస్తామని చెప్పాడు. ఇంతలో ఇంటికి వెళ్లి వద్దామన్నా వాహనాలు లేకపోవడంతో ఓపెన్ షెడ్డులో నిద్రించాడు. చలికి తట్టుకోలేని సత్తయ్య తెల్లవారుజామున అస్వస్థతకు గురై మూత్ర విసర్జన చేసి వస్తుండగా కింద పడిపోయాడు. వెంటనే ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు మార్కెట్ కార్యాలయం ఎదుట మృతదేహంతో ఆందోళన చేపట్టారు. వ్యాపారి, అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతు మృతి చెందాడని ఆరోపించారు. జాయింట్ కలెక్టర్ డేవిడ్, డీఎంవో సురేఖ, ఆర్డీఓ కొమురయ్య, ఎస్ఐ సతీష్, మార్కెట్ కార్యదర్శి మల్లేశం ఆందోళనకారులకు సర్ది చెప్పారు. తక్షణ సాయంగా మార్కెట్ నుంచి రూ.10వేలు, వ్యాపారి రూ.10 వేలను అందజేశారు. మార్కెట్ నుంచి రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా అందించనున్నట్లు డీఎంవో సురేఖ తెలిపారు. -
కరెంట్ షాక్తో రైతు మృతి
బిచ్కుంద(జుక్కల్): మండలంలోని గుండెనెమ్లి గ్రామంలో శుక్రవారం రైతు గైని విఠల్(40) బోరు మరమ్మతులు చేస్తుండగా పైపులు హైటెన్షన్ వైర్లకు తగిలాయి. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నలుగురికి గాయాలయ్యాయి. బోరు మోటారు కాలిపోవడంతో మరమ్మతుల కోసం రైతు విఠల్, మెకానిక్ హన్మండ్లు, ముగ్గురు కూలీలు అంజయ్య, బాలబోయి, గంగబోయి కలిసి సబ్ మర్సిబుల్ మోటారు పైపులు చైన్ బ్లాక్ సహాయంతో పైకి లేపుతుండగా పైన ఉన్న 11 కేవీ హైటెన్షన్ కరెంట్ వైర్లకు పైపులు తగలడంతో కరెంటు ప్రవేశించి రైతు విఠల్ అక్కడిక్కడే మృతి చెందాడు. గంగబోయి పరిస్ధితి విషమంగా ఉంది. మిగతా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరికి చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. కరెంటు షాక్తో మృతి చెందడంపై భార్య, కుటుంబ సభ్యుల రోదనలు అందరిని కలచి వేసింది. ఘటన స్థలానికి ఎస్ఐ నరేందర్ చేరుకొని ఘటన వివరాలు తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిలో... టీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీలకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఇచ్చిన లబ్ధిదారుల్లో గైని విఠల్ ఒకరు. మూడెకరాల్లో భార్య, భర్త ఇద్దరు కష్టపడి పంటలు పండించుకొని జీవనం సాగిస్తున్నాడు. కొడుకు, కూతురు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వం మూడు సంవత్సరాల క్రితం భూమిని విఠల్కు పంపిణీ చేసింది. ప్రభుత్వం రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జాకోరా శివారులో మరో రైతు.. వర్ని(బాన్సువాడ): మండలంలోని జాకోరా శివారులో పంట పొలం వద్ద నాయిని వెంకట్(45) అనే రైతు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వెంకట్ సోదరుని ఇంట్లో శుభకార్యం ఉండడంతో మధ్యాహ్నం వేళ పొలం వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన వెంకట్ సాయంత్రం వరకు రాలేదు. ఫోన్ చేసిన లిఫ్ట్ చేయనందున కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లారు. బోరు సమీపంలో పడిపోయి మృతి చెంది ఉన్నాడు. దీంతో గ్రామ పెద్దలకు, పోలీసులకు సమాచారమందించారు. బోరు మోటారు స్టాట్ కానందున, వైర్లు సరిచేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఉంటుందని భావిస్తున్నారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. -
క్షామ నామ సంవత్సరం
వాని ఱెక్కల కష్టంబు లేనినాడు,సస్యరమ పండి పులకింప సంశయించు వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు భోజనము బెట్టు, వాడికి భుక్తిలేదు! – గుర్రం జాషువా సాక్షి, అమరావతి: 2018... రాష్ట్రంలో అన్నదాతల పాలిట క్షామ నామ సంవత్సరం. వ్యవసాయ రంగంలో ఈ ఏడాదంతా తిరోగమనమే తప్ప పురోగమనం జాడ లేదు. అన్నదాతకు అశ్రువులే మిగిలాయి. ప్రభుత్వ తప్పుడు విధానాలు, అతివృష్టి, అనావృష్టి, ప్రకృతి విపత్తులు, పెరిగిపోయిన పెట్టుబడులు, దక్కని గిట్టుబాటు ధరలు, పెట్రేగిపోతున్న దళారీ వ్యవస్థ, వారికే వత్తాసు పలికే అధికార వర్గం... వెరసి రైతన్నలు దారుణంగా మోసపోయారు. అన్నదాతల ఆత్మహత్యలతోనే 2018 మొదలైంది. రెయిన్ గన్లతో పంటలను కాపాడే, కరువులను జయించే, సముద్రాలను నియంత్రించగలిగే చంద్రబాబు పాలనలో రైతుల బలవన్మరణాల పరంపరకు అడ్డుకట్ట పడడం లేదు. మట్టి నుంచి మాణిక్యాలను పండించే రైతు నోట్లో ఈ ఏడాదీ మట్టే పడింది. 2018లో పండించిన ఆహార, ఉద్యాన పంటలకు కనీస మద్దతు ధరలు దక్కలేదు. ప్రధాన పంటలైన వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శనగ, వేరుశనగ, పత్తి, చెరకు, పొగాకు.. దేనికీ ధర లేకుండా పోయింది. ఉద్యాన పంటలైన టమోటా మొదలు మామిడికి కూడా గిట్టుబాటు ధరలు రాలేదు. రాష్ట్రంలో అత్యధికంగా పండించే వరికి క్వింటాల్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.1,750 కాగా, రైతుకు దక్కింది రూ.1100 నుంచి రూ.1350 మాత్రమే కావడం గమనార్హం. ఇక మిగిలిన పంటల పరిస్థితి చెప్పనక్కర్లేదు. లక్షలాది క్వింటాళ్ల శనగలు కొనేవారు లేక గిడ్డంగుల్లో పేరుకుపోయాయి. తెల్లజొన్నలు కొనే దిక్కులేకుండా పోయింది. రాయలసీమలో వేరుశనగ సాగుచేసిన రైతులు కరువు వల్ల పంటను కోల్పోయి రూ.4,650 కోట్లు నష్టపోయారు. కరవును జయించిందెక్కడ? జూన్ నుంచి మొదలై సెప్టెంబర్తో ముగిసిన ఖరీఫ్ సీజన్లో 18 శాతం, రబీలో ఇప్పటిదాకా 58 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఖరీఫ్లో సాగు విస్తీర్ణం 4 లక్షల హెక్టార్లు తగ్గింది. రబీలో సాగు విస్తీర్ణం 10 లక్షల హెక్టార్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో 670 మండలాలు ఉండగా, ఇందులో 480 మండలాలు కరువు కోరల్లో చిక్కుకున్నాయి. ప్రభుత్వం కేవలం 347 మండలాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించి చేతులు దులుపుకుంది. వరుణుడి కరుణ లేక, పంటలు పండక, సొంత ఊళ్లలో బతికే దారి కనిపించక రైతులు, వ్యవసాయ కూలీలు వలసబాట పడుతున్నారు. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు తరలి పోతున్నారు. పశువులను పోషించలేక కబేళాలకు తరలిస్తున్నారు. అయినా కరువును జయించామని, 2018 ఖరీఫ్లో రెయిన్గన్లతో 25,795 హెక్టార్లలో పంటలను కాపాడామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుండడం గమనార్హం. నకిలీ విత్తనాలు.. చుట్టుముట్టిన తెగుళ్లు వ్యవసాయ శాఖ వైఫల్యాలు రైతుల పాలిట శాపంగా మారాయి. నకిలీ విత్తనాలు, పురుగు మందులు, చుట్టుముట్టిన తెగుళ్లు, అధికారుల నిర్లక్ష్యం, ధాన్యం సేకరణలో వైఫల్యంతో రైతులు ఈసారి తీవ్రంగా నష్టపోయారు. మెగాసీడ్ పార్క్ అంటూ ప్రభుత్వం హడావిడి చేసినా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ధరల స్థిరీకరణ నిధి ఉంటే.. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించినట్టుగా రూ.5,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఉంటే రైతులకు ఈ ఏడాది కొంతలో కొంతైనా ఊరట లభించేది. మొక్కజొన్న, జొన్న రైతులకు, చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడికి, ఆగస్టులో వచ్చిన అకాల వర్షాలకు నష్టపోయిన వరికి ప్రభుత్వం ఇస్తామన్న సాయం ఇంతవరకూ అందలేదు. రైతులు ఈ ఏడాది పంటల సాగు కోసం రూ.19,000 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు అంచనా. కరువు, తుపాన్ల వల్ల ఈ పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. ఆగని ఆత్మహత్యలు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన గణాంకాల ప్రకారం గత ఐదేళ్లలో సగటున ఏడాదికి 79 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వాస్తవానికి ఈ సంఖ్య ఎన్నో రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటికి 163 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రుణమాఫీ జరగక, బ్యాంకుల నుంచి రుణాలు అందక, వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చిక్కుకోవడంతోపాటు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ఊసే లేకుండా పోయింది. ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువ మంది చిన్న, సన్నకారు, కౌలు రైతులే. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అల్లంవారిపాలెం గ్రామానికి చెందిన కొండవీటి బ్రహ్మయ్య అనే రైతు తాను ఎలా నష్టపోయిందీ సవివరంగా ముఖ్యమంత్రికి లేఖ రాసి, కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పురుగుమందు తాగి తనువు చాలించడం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించింది. రాష్ట్రంలో సహకార రంగంలోని చక్కెర ఫ్యాక్టరీలు, పాల డెయిరీలు వరుసగా మూతపడుతున్నాయి. బకాయిల కోసం రైతులు పోరుబాట పట్టినా ప్రభుత్వం చలించడం లేదు. యూనివర్సిటీలలోని పరిశోధనా ఫలితాలు క్షేత్రస్థాయికి చేరడం లేదు. తెగుళ్లు చుట్టుముట్టినా శాస్త్రవేత్తల బృందాలు పొలాలకు వెళ్లడం లేదు. మొక్కజొన్నకు కత్తెర తెగులు ఆశించడంతో రైతులు రాత్రికి రాత్రి పంటను ధ్వంసం చేశారు. శోకం మిగిల్చిన తుపాన్లు రాష్ట్ర రైతాంగం ఈ ఏడాది మూడు తుపాన్లు– తిత్లీ, గజ, పెథాయ్.. రెండుసార్లు అకాల వర్షాలను చవిచూసింది. ఉత్తరాంధ్రను తిత్లీ, పెథాయ్ వణికిస్తే.. కోస్తాను గజ, పెథాయ్ తుపాన్లు గడగడలాడించాయి. మే, ఆగస్టులలో కురిసిన అకాల వర్షాలు ఉద్యాన పంటల్ని దెబ్బతీశాయి. ఖరీఫ్కు ముందు కురిసిన వర్షాలు ఆ తర్వాత ముఖం చాటేయడంతో పంటలు ఎండిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటల్ని రైతులు పొలాల్లోనే వదిలేశారు. అపరాలు చేతికి అందకుండానే పోయాయి. గోదావరి, కృష్ణా డెల్టాలో వరిని తుపాన్లు నష్టపరిచాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో పంటల్ని తిత్లీ తుపాను తీవ్రంగా ముంచేసింది. జీడి పంట, జీడి పరిశ్రమ కోలుకోలేని విధంగా నష్టపోయాయి. ఆదుకోని రుణమాఫీ తాము అధికారంలోకి రాగానే వ్యవసాయ రుణాలన్నీ బేషరతుగా మాఫీ చేస్తామని చంద్రబాబు గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. బాబు అధికారంలోకి వచ్చే నాటికి రైతుల రుణాలు రూ.87,612 కోట్లు ఉండగా, చంద్రబాబు రుణమాఫీ కోసం కేవలం రూ.24,500 కోట్లు ఇస్తామంటున్నారు. అంటే ఆ సొమ్ము రుణాలపై వడ్డీలకు కూడా సరిపోదు. ఈ ఏడాది ఇవ్వాల్సిన మూడో విడత డబ్బులు ఇంకా రైతులకు అందలేదు. సర్కారు విధానాల వల్ల బ్యాంకుల నుంచి రైతులకు అప్పులు పుట్టడం లేదు. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాలంటూ రైతులకు బ్యాంకులు నోటీసులు జారీ చేస్తున్నాయి. సంఘటితమవుతున్న రైతులు వాతావరణ మార్పులతో రైతులు ఈ ఏడాది 27 శాతం ఆదాయం కోల్పోనున్నట్టు ఆర్థిక సర్వే చెబుతోంది. ఉత్పత్తి వ్యయంపై 50 శాతాన్ని కలిపి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర ఇవ్వలేదు. శాశ్వత రుణ విముక్తి లేదు. పెట్టుబడి సాయం లేదు. బీమా సొమ్ము చేతికి రాలేదు. ప్రకృతి కనికరించలేదు. ఇటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా పెల్లుబికినట్టే రాష్ట్రంలోనూ రైతులు సంఘటితం అయ్యే ప్రయత్నం ఈ ఏడాది జరిగింది. రాజధాని ప్రాంత రైతులకు న్యాయం కోసం ధర్నాలు చేశారు. తుందుర్రు ఆక్వా పార్క్కు వ్యతిరేకంగా ఉద్యమించారు. ప్రభుత్వ భూ సమీకరణ విధానాన్ని వ్యతిరేకించారు. గిట్టుబాటు ధరలు ఇచ్చే వరకు విశ్రమించబోమని తేల్చిచెప్పారు. అంతా బాగుందట! సంక్షోభంలో చిక్కుకుని రైతన్నలు అష్టకష్టాలు పడుతుండగా, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవసాయ రంగంపై శ్వేతపత్రం విడుదల చేస్తూ వ్యవసాయ రంగంలో ప్రగతి అద్భుతంగా ఉందని సెలవిచ్చారు. అధిక ఆదాయం కోసమే వలసలు వెళుతున్నారని అనడం కొసమెరుపు. మరి అంతా బాగుంటే ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేసిన రోజే కర్నూలు జిల్లాలో ఓ యువరైతు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నట్టు. -
బలహీనతతోనే రైతుల ఆత్మహత్యలు
సాక్షి, అమరావతి: బలహీనతతోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ కంటే తెలంగాణలో ఆత్మహత్యలు ఎక్కువని, అక్కడ 4,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే, మన రాష్ట్రంలో 400 మందే ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. మహారాష్ట్రలో 5,000 మంది, కర్ణాటకలో 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. చంద్రబాబు బుధవారం వ్యవసాయం, అనుబంధ రంగాలపై నాలుగో శ్వేతపత్రాన్ని ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో విడుదల చేశారు. రైతుల ఆత్మహత్యలను తగ్గించగలిగాం.. దేశంలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువుగా నమోదవుతున్నా, మన రాష్ట్రంలో అనూహ్యంగా రైతుల ఆత్మహత్యలు తగ్గించగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో వలసలు లేవని, ఎక్కువ డబ్బుల కోసమే ఇతర ప్రాంతాలకు పనికి వెళుతున్నారని తెలిపారు. రాయలసీమ వాళ్లకి బెంగుళూరు వెళ్లడం అలవాటని, ఎక్కువ డబ్బుల కోసం వెళుతున్నారని, ఇక్కడ ఏమీ లేకకాదని స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో నీళ్లున్నా ఇతర ప్రాంతాలకు వెళతారని చెప్పారు. మూడో కూటమికి అవకాశం లేదు ‘‘కేసీఆర్, జగన్ కలిసి రాష్ట్రాన్ని అస్థిర పరచాలని కుట్ర చేస్తున్నారు. దేశంలో రెండే కూటములున్నాయి. మూడో కూటమికి ఎట్టిపరిస్థితుల్లోనూ అవకాశం లేదు. కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీ లేకుండా స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు ఒక్క ప్రభుత్వం కూడా అధికారంలోకి రాలేదు. ఇప్పుడేదో విశ్వామిత్ర సృష్టి చేస్తామంటే ఎలా చేస్తారు? మూడో కూటమిని అధికారంలోకి తీసుకురావాలనుకోవడం జరగని పని. తెలంగాణ సీఎం కేసీఆర్ నిన్నటిదాకా మూడో కూటమి అంటూ అందరి దగ్గరకు వెళ్లి, ఇవాళ ప్రధానమంత్రిని కలుస్తున్నారంటే అర్థం ఏమిటి’’ అని సీఎం ప్రశ్నించారు. వచ్చే నెలాఖరుకు రుణమాఫీ పూర్తిచేస్తాం.. ‘‘రాబోయే బీజేపీయేతర ప్రభుత్వంలో రైతులకు రుణమాఫీ దేశవ్యాప్తంగా అమలు చేయడంపై ఆలోచిస్తాం. రుణ మాఫీకి సహకరించాలని కేంద్రాన్ని కోరినా ఒప్పుకోలేదు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏపీలో ఒకేసారి రూ.1.50 లక్షలు ఒకే విడతలో రుణమాఫీ చేశాం’ అని సీఎం పేర్కొన్నారు. -
పెథాయ్ మిగిల్చిన నష్టంతో.. పొలంలోనే కుప్పకూలి
మెళియాపుట్టి/తెనాలి రూరల్/పెదవేగి రూరల్ : అన్నదాత గుండె పగిలింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే తుపాను ప్రభావంతో పాడవుతోందనే ఆవేదన అతని మనసును తొలిచేసింది. ఇంటికి చేరాల్సిన పంట నీటి మునిగితే అన్న ఆలోచనే తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. పంట గింజలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఉన్న ఫళంగా పొలంలోనే కుప్పకూలిపోయి మరణించాడు. పెథాయ్ రూపంలో వచ్చిన తుపాను శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇదే తరహాలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ఓ రైతు కూడా ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో మరో రైతు తీవ్ర మనస్తాపానికి గురై నిద్రలోనే గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన రైతు గొట్టిపల్లి చిన్నయ్య (69)కి నాలుగెకరాలు పొలంలో వరిసాగు చేశాడు. కోతలు పూర్తవడంతో కుప్పలు వేశాడు. అయితే పెథాయ్ తుపానుతో సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షానికి పొలంలో నీరు చేరింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన చిన్నయ్య వరికుప్పల చుట్టూ చేరిన నీటిని మళ్లించేందుకు మంగళవారం పొలానికి వెళ్లాడు. అధికంగా నీరుచేరి ఉండడంతో నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఇది గమనించి వెళ్లి చూసేలోపే చిన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతినికి భార్య శాంతమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పంటను కాపానుకోవడానికి వెళ్లిన ఇంటిపెద్ద శవమై రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. నీటమునిగిన పంటను చూసి.. ఇక గుంటూరు జిల్లా తెనాలి ఐతీనగర్కు చెందిన రైతు కనపర్తి సుందరరావు (58) కూడా ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. కౌలుకు తీసుకున్న ఐదెకరాల్లో వేసిన వరిపంట కోతకు వచ్చింది. రెండ్రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో పెథాయ్ సుందరరావు గుండెల్లో తుపాను రేపింది. పంటను తీవ్రంగా దెబ్బతీసింది. చేనును చూసుకునేందుకు మంగళవారం వెళ్లిన అతను వాలిపోయిన పంటను చూసి తీవ్ర ఆందోళనకు గురై ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణం విడిచాడు. మృతునికి భార్యా, ఇద్దరు కుమారులు. కొట్టుకుపోయిన పంట గురించి కలత చెంది.. మరో ఘటనలో.. ఆరుగాలం పడ్డ కష్టం తుపానుకు కొట్టుకుపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామానికి చెందిన రైతు రాజులపాటి మల్లిఖార్జునరావు (39) కూడా రోజంతా తీవ్రంగా కలత చెంది చివరికి రాత్రి నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఈయన ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. ఇప్పటివరకు రూ.రెండుల లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. పైరు ఏపుగా పెరిగింది. మంచి దిగుబడితో కష్టాలు తీరుతాయనుకుంటున్న సమయంలో పెథాయ్ తుపాను విరుచుకుపడడంతో పంట మొత్తం పాడైంది. దీంతో సాగుకు చేసిన అప్పులు తీర్చేదెలా అంటూ సోమవారం ఉదయం నుంచి మల్లికార్జునరావు తీవ్రంగా మథనపడుతున్నాడని అతని భార్య శివదుర్గ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిద్రలోనే గుండెనొప్పి వచ్చిందని.. ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కన్నీటిపర్యంతమైంది. -
అన్నదాత గుండె పగిలింది
మెళియాపుట్టి/తెనాలి రూరల్/పెదవేగి రూరల్ : అన్నదాత గుండె పగిలింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే తుపాను ప్రభావంతో పాడవుతోందనే ఆవేదన అతని మనసును తొలిచేసింది. ఇంటికి చేరాల్సిన పంట నీటి మునిగితే అన్న ఆలోచనే తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. పంట గింజలను కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అంతలోనే ఉన్న ఫళంగా పొలంలోనే కుప్పకూలిపోయి మరణించాడు. పెథాయ్ రూపంలో వచ్చిన తుపాను శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలోని ఆ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇదే తరహాలో గుంటూరు జిల్లా తెనాలి పట్టణానికి చెందిన ఓ రైతు కూడా ప్రాణాలు కోల్పోగా.. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో మరో రైతు తీవ్ర మనస్తాపానికి గురై నిద్రలోనే గుండెపోటుతో మరణించాడు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామానికి చెందిన రైతు గొట్టిపల్లి చిన్నయ్య (69)కి నాలుగెకరాలు పొలంలో వరిసాగు చేశాడు. కోతలు పూర్తవడంతో కుప్పలు వేశాడు. అయితే పెథాయ్ తుపానుతో సోమ, మంగళవారాల్లో కురిసిన వర్షానికి పొలంలో నీరు చేరింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన చిన్నయ్య వరికుప్పల చుట్టూ చేరిన నీటిని మళ్లించేందుకు మంగళవారం పొలానికి వెళ్లాడు. అధికంగా నీరుచేరి ఉండడంతో నీటిని మళ్లించే ప్రయత్నం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోయాడు. స్థానికులు ఇది గమనించి వెళ్లి చూసేలోపే చిన్నయ్య ప్రాణాలు కోల్పోయాడు. కాగా, మృతినికి భార్య శాంతమ్మ, ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పంటను కాపానుకోవడానికి వెళ్లిన ఇంటిపెద్ద శవమై రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. నీటమునిగిన పంటను చూసి.. ఇక గుంటూరు జిల్లా తెనాలి ఐతీనగర్కు చెందిన రైతు కనపర్తి సుందరరావు (58) కూడా ఇదే తరహాలో ప్రాణాలు కోల్పోయాడు. కౌలుకు తీసుకున్న ఐదెకరాల్లో వేసిన వరిపంట కోతకు వచ్చింది. రెండ్రోజుల్లో కోతకు సిద్ధమవుతున్న తరుణంలో పెథాయ్ సుందరరావు గుండెల్లో తుపాను రేపింది. పంటను తీవ్రంగా దెబ్బతీసింది. చేనును చూసుకునేందుకు మంగళవారం వెళ్లిన అతను వాలిపోయిన పంటను చూసి తీవ్ర ఆందోళనకు గురై ఒక్కసారిగా అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి రైతులు అతని కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణం విడిచాడు. మృతునికి భార్యా, ఇద్దరు కుమారులు. కొట్టుకుపోయిన పంట గురించి కలత చెంది.. మరో ఘటనలో.. ఆరుగాలం పడ్డ కష్టం తుపానుకు కొట్టుకుపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి గ్రామానికి చెందిన రైతు రాజులపాటి మల్లిఖార్జునరావు (39) కూడా రోజంతా తీవ్రంగా కలత చెంది చివరికి రాత్రి నిద్రలోనే గుండెపోటుతో తుదిశ్వాస విడిచాడు. ఈయన ఐదెకరాల్లో మొక్కజొన్న వేశాడు. ఇప్పటివరకు రూ.రెండుల లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. పైరు ఏపుగా పెరిగింది. మంచి దిగుబడితో కష్టాలు తీరుతాయనుకుంటున్న సమయంలో పెథాయ్ తుపాను విరుచుకుపడడంతో పంట మొత్తం పాడైంది. దీంతో సాగుకు చేసిన అప్పులు తీర్చేదెలా అంటూ సోమవారం ఉదయం నుంచి మల్లికార్జునరావు తీవ్రంగా మథనపడుతున్నాడని అతని భార్య శివదుర్గ తెలిపింది. మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో నిద్రలోనే గుండెనొప్పి వచ్చిందని.. ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారని కన్నీటిపర్యంతమైంది. -
పంటపొలంలోనే తనువు చాలించాడు
సాక్షి, శ్రీకాకుళం : పెథాయ్ తుపాను సృష్టించిన అలజడి ఓ రైతు కుటుంబంలో విషాదం నింపింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీట మునగడం తట్టుకోలేక కుప్పకూలిన రైతు.. ఆ పంటపొలంలోనే తనువు చాలించాడు. ఈ హృదయవిదారక ఘటన శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి మండలం కొసమాల గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.... గత మూడు రోజులుగా కోస్తా తీరాన్ని హడలెత్తించిన పెథాయ్ తుపాను కారణంగా జిల్లాలో తీవ్రంగా పంట నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. వర్షం కారణంగా ధాన్యం నీట మునగడంతో పలువురు రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నేపథ్యంలో గొట్టిపల్లి చిన్నవాడు(70) అనే రైతు ధాన్యం తడిసిపోతుందన్న ఆవేదనతో మంగళవారం పొలంలో ఉన్న నీటిని దిగువకు వదిలేందుకు సమాయత్తమయ్యాడు. పార పట్టుకుని పొలంలో బట్టీ వేస్తుండగానే గుండె పోటు రావడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. కాగా మృతునికి భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
అంజినరెడ్డి కుటుంబాన్ని ఆదుకోని ప్రభుత్వం
వ్యవసాయాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోయినా ప్రభుత్వం ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోలేదు. అనంతపురం జిల్లా రొద్దం మండలం రాచూరు గ్రామానికి చెందిన కురుబ నారాయణప్ప కుమారుడు అంజినరెడ్డి(38)అనే రైతు అప్పులు తీర్చే దారి లేక ఈ ఏడాది జూన్ 26న తన ఇంటిలోని పైకప్పుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి పేరున 4 ఎకరాల భూమి ఉంది. వర్షాభావం వల్ల నాలుగేళ్లుగా పంటలు సరిగ్గా పండలేదు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు రూ. 9 లక్షలకు పైగా ఉన్నాయి. కోగిర కెనరా బ్యాంకులో మృతుడి పేరు మీద రూ. 1.40 లక్షలు, తండ్రి పేరున రూ. 2 లక్షలు, మృతుడి భార్య పేరున రూ. 1.40 లక్షల అప్పుంది. వడ్డీ వ్యాపారుల దగ్గర రూ. 5 లక్షలు అప్పు చేశారు. రైతుల రుణాలు మాఫీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వీరి రుణాలు మాత్రం మాఫీ కాలేదు. వ్యవసాయ బోరులో భూగర్భ జలాలు అడుగంటడంతో వేరుశనగ, మల్బరీ పంటల దిగుబడి దెబ్బతిన్నది. అప్పులు ఎలా తీర్చాలని అంజినరెడ్డి భార్య అశ్విని, తండ్రి నారాయణప్పతో చెప్పి ప్రతి రోజూ మథనపడేవారు. ఈ నేపథ్యంలో గాలివాన బీభత్సానికి పట్టుపురుగులు పెంచే రేషం షెడ్డు కూలిపోయింది. రూ. 4 లక్షలు నష్టపోవడంతోపాటు షెడ్డు కూలిన సంఘటనలో మృతుడి కాలు విరిగింది. పంటలు సరిగ్గా లేకపోయినా ఆర్థికంగా చేదోడుగా ఉన్న పట్టుపురుగుల పెంపకంతో ఇల్లు గడిచేది. అయితే, షెడ్డు కూలిపోవడంతో అదీ లేకుండా పోయింది. ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయిన అంజినరెడ్డి అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి వృద్ధ తల్లిదండ్రులు, భార్య, ఆడపిల్ల ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు ఆత్మహత్య చేసుకోవడంతో ఆడ పిల్లను ఎలా పోషించుకోవాలో తెలియక మృతుడి భార్య దిక్కుతోచని పరిస్థితిల్లో ఉన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్ వచ్చి గ్రామంలో విచారణ కూడా చేసుకు వెళ్లారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఈ కుటుంబానికి ఎటువంటి పరిహారం అందలేదు. – కె.ఎల్. నాగరాజు, సాక్షి,రొద్దం, అనంతపురం జిల్లా -
కాటేసిన కరెంటు
శ్రీకాకుళం, గార: అన్నదాతను విద్యుత్ తీగ కాటేసింది. చెరుకు పొలంలో గడ్డి మందు పిచికారీ చేస్తుండగా.. తెగిపడిఉన్న విద్యుత్ తీగ తగలడంతో షాక్కు గురై రైతు చనిపోగా... మరో నలుగురు ప్రమాదం నుంచి బయట పడ్డారు. ఈ సంఘటన గార మండలం శాలిహుండం గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. కిర్రు రామారావు అలియాస్ రమేష్ (36) చనిపోగా.. మృతుడి భార్య ధనలక్ష్మి, బొంతల పద్మ, కిర్రు జగ్గారావు, చింతల బాలరాజులకు షాక్ తగలడంతో గాయాలపాలయ్యారు. ఘటనకు సంబంధించి స్థానికులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరుకు తోటలో గడ్డి ఎక్కువగా ఉండడంతో నివారణ కోసం మందు పిచికారీ చేసేందుకు శాలిహుండం గ్రామానికి చెందిన కిర్రు రమేష్ తన భార్య ధనలక్ష్మిని తీసుకొని గురువారం ఉదయం పొలానికి వెళ్లారు. అయితే అప్పటికే పొలంలో పైనుంచి ఉన్న విద్యుత్ లైన్తీగ ఒకటి తెగిపడి ఉంది. దీన్ని రమేష్ గమనించకుడా.. గడ్డి నివారణ మందును పిచికారీ చేసుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఇంతలో తీగ భూజానికి తగలడంతో షాక్కు గురయ్యాడు. దీంతో పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న అతని భార్య ధనలక్ష్మి పరుగున వస్తుండగా ఆమెకు కూడా తీగ తగలడంతో షాక్కు గురైంది. ఆమె కూడా కేకలు వేయడంతో సమీపంలో పొలం పనులు చేస్తున్న బొంతల పద్మ పరిగెత్తుకుంటూ వచ్చే క్రమంలో విద్యుత్తీగ తగలడంతో ఆమె కూడా షాక్కు గురైంది. వీరిని రక్షించేందుకు వచ్చిన కిర్రు జగ్గారావు, చింతల బాలరాజులు కూడా తీగను తాకడంతో షాక్కుగురయ్యారు. అయితే స్థానికంగా ఉన్న మరికొందరు విద్యుత్ శాఖ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే సరఫరాను నిలిపివేశారు. తీవ్రంగా గాయపడిన రైతు రమేష్, అతని భార్య ధనలక్ష్మిలను 108 వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో రమేష్ మృతి చెందాడు. ధనలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం రిమ్స్లో వైద్య సేవలందిస్తున్నారు. గాయాలపాలైన పద్మ గారలో వైద్య పొందుతుంది. స్వల్పంగా గాయపడిన కిర్రు జగ్గారావు, చింతల బాలరాజు స్థానికంగానే చికిత్స పొందారు. మృతి చెందిన రమేష్కు కుమారుడు వినయ్, కూతురు శైలు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అందరితోకలివిడిగా ఉండే రమేష్ చనిపోవడం, భార్య ధనలక్ష్మి తీవ్రంగా గాయపడడంతో శాలిహుండం గ్రా మంలో విషాదఛాయలు అలముకున్నాయి. రిమ్స్లో వైద్యం పొందుతున్న ధనలక్ష్మిని ఎంపీపీ ప్రతినిధి గుం డ భాస్కరరావు, మాజీ సర్పంచ్ కొంక్యాన ఆదినారా యణ, వైఎస్సార్సీపీ మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు చింతల గడ్డెయ్య పరామర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని ఎస్సై బలివాడ గణేష్ తెలిపారు. -
బల్గెరలో రైతు దారుణ హత్య
గట్టు(గద్వాల) : వ్యవసాయ పొలం వద్ద నిద్రించేందుకు రాత్రి వెళ్లిన రైతు, తెల్లారేసరికి శవమై కనిపించాడు. మంగళవారం జరిగిన ఈ సంఘటనతో బల్గెర గ్రామం ఉలిక్కిపడింది. గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం... మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు సమీప బంధువు బల్గెర గ్రామానికి చెందిన గీరప్పగాళ్ల యల్లప్ప(52)కు గ్రామ సమీపంలో 5ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రెండు ఆవులు, రెండు ఎద్దులు ఉన్నాయి. పొలంలోనే గుడిసె వేసుకుని చాలాకాలంగా ఒక్కరే రాత్రి అక్కడే నిద్రిస్తున్నాడు. సోమవారం కూడా రాత్రి ఇంట్లో భోజనం ముగించుకుని వ్యవసాయ పొలానికి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం ఉదయం మృతుని సోదరుడు తిమ్మప్ప తన పత్తి పొలంలొ మొగ్గలను తుంచేందుకు వెళ్తున్న క్రమంలో దారి మధ్యలోనే యల్లప్ప పడి ఉండడాన్ని గమనించాడు. వెంటనే కుటుంబ సభ్యులకు తెలిపాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఎస్ఐ విజయ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుని కాళ్లను కర్రలతో కొట్టి చంపినట్లుగా పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. కాళ్లు విరిగినట్లు గుర్తించారు. మోచేతికి రక్తగాయం కూడా ఉంది. ఘటనా స్థలంలో రక్తపు మరకలు ఉన్నాయి. పోలీస్ జాగిలాలతో పరిశీలించిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతునికి భార్య శంకరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు తిమ్మప్ప హైదరాబాద్లోని ఓయూలో పీజీ చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం కౌలు విషయంలో మూడు నెలల క్రితం పక్కపొలం రైతులు ముగ్గురితో వివాదం జరిగిందని, దీన్ని మనసులో పెట్టుకుని నర్సిములు, స్వాములు, సవారి హత్యకు పాల్పడ్డారని యల్లప్ప కొడుకు బసప్ప అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసు జాగిలాలతో అన్వేషణ గద్వాల నుంచి రప్పించిన పోలీసు జాగిలాలు ఘటనా స్థలంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న పత్తి పొలాల్లో తిరిగాయి. క్లూస్ టీం ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు గద్వాల సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
విద్యుదాఘాతానికి రైతు బలి
బలికొడవలూరు: విద్యుదాఘాతానికి గురై రైతు మృతిచెందిన ఘటన మండలంలోని ఆలూరుపాడు మజరారెడ్డిపాళెంలో బుధవారం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కొల్లు గోపాల్ (58) తన సొంత పొలంలో గడ్డి కోసేందుకు బుధవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో వెళ్లాడు. గడ్డి కోస్తుండగా పొలంలోని విద్యుత్ మోటార్కు నేలపై నుంచి వెళ్లిన విద్యుత్ తీగ దట్టంగా పెరిగిన పచ్చికలో కనిపించలేదు. ఈ క్రమంలో తీగను పట్టుకోవడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఆయనతోపాటే వచ్చిన గ్రామానికి చెందిన మరో రైతు గడ్డి కోసుకుని తిరిగి వస్తుండగా గోపాల్ విగతజీవిగా పడి ఉండటాన్ని గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు ఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. మృతుడికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. గంట ముందే ఇంటి నుంచి గడ్డి కోసం వెళ్లిన భర్త కళ్ల ముందే విగతజీవిగా మారడాన్ని జీర్ణించుకోలేకపోయిన మృతుడి భార్య రాజమ్మ లబోదిబోమని ఏడుస్తుండటం అందర్నీ కలచివేసింది. మృతుడి కుమారుడు వెంకటేశ్వర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై శ్రీనాథ్ తెలిపారు. -
నేలతల్లి ఒడిలోనే..
ఆత్మకూరు రూరల్: పగలనక రేయనక శ్రమజల్లులు కురిపించి.. కండలు కరిగించి, బతుకు పంటలు పండించి.. కాలమంతా కాడిపైనే గడిపిన ఓ మట్టి మనిషి ఆ నేలతల్లి ఒడిలోనే ఐక్యమయ్యాడు. ఆకుపచ్చని పొలంలో కాడిని ముద్దాడుతూనే కాలం తీరిపోయాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామంలో బుధవారం సాయంత్రం పెద్ద హుసేన్(70) అనే రైతు తన పొలంలో సేద్యం చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. హృదయ విదారకరమైన ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. హుసేన్ గ్రామానికి సమీపంలోని పొలంలో మొక్కజొన్న సాగు చేశాడు. బుధవారం తన భార్య రహమత్బీతో కలసి పొలానికి వెళ్లారు. అక్కడ మొక్క జొన్న చేలో ఎద్దులతో అంతర్గత సేద్యానికి ఉపక్రమించారు. ఇంకో రెండు మొలకలు తిరిగితే పని పూర్తవుతుందనుకుంటుండగా ఎద్దులను అదిలిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. తన కళ్లముందే భర్త కుప్పకూలడంతో రహమత్బీ సాయం కోసం పెద్దగా కేకలు వేస్తూ గుండెలవిసేలా రోదించింది. పక్క పొలాల్లోని వారు పరుగున అక్కడికొచ్చి చూసేలోపే ప్రాణం విడిచాడు. ఎప్పుడూ పొలం పని తప్ప ఇతర విషయాలేవీ పట్టించుకోని రైతు హుసేన్ హఠాన్మరణం గ్రామంలో విషాదం నింపింది. ఈయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు -
నాన్నా.. ఒకసారి చూడవా!
గట్టు (గద్వాల): నాన్నా.. ఒకసారి చూడవా.. మాతో మాట్లాడు నాన్న అంటూ ఆ చిన్నారులు తండ్రి మృతదేహం దగ్గర రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ఆలనా.. పాలనా చూసే కన్నతండ్రి శాశ్వతంగా తమ నుంచి దూరమయ్యాడని తెలిసిన పెద్దమ్మాయి రోదనలు అందరినీ కలచివేశాయి.. అసలేం జరిగింది.. నాన్న అలా ఎందుకు పడుకున్నాడు. నాన్న చుట్టూ జనం చేరి ఎందుకు రోదిస్తున్నారో తెలియక మిగతా చిన్నారులు బిక్కమొహం వేసుకుని అదే పనిగా దిగాలు కూర్చున్న వారిని చూసిన గ్రామస్తులు అయ్యో పాపం అంటూ కన్నీరు పెట్టుకున్నారు. ఈ హృదయ విదారక సంఘటన మండలంలోని రాయాపురంలో గురువారం చోటుచేసుకుంది. పత్తికి నీరు పారించేందుకు.. మండలంలోని గ్రామానికి చెందిన బందెయ్యల మహదేవప్ప(33) గురువారం ఉదయం ఎద్దుల బండిని కట్టుకుని గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలానికి వెళ్లాడు. చుట్టుపక్కల ఉన్న 21 మంది రైతులంతా కలిసి పల్లెయ్యల రాయన్న పొలంలో 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకున్నారు. మోటార్లపై లోడ్ పడుతున్న కారణంగా రైతులు రెండు గ్రూపులుగా ఏర్పడి ఒకరోజు 10 మంది రైతులు, మరో రోజు మిగతా రైతులు వారి బోర్లకు విద్యుత్ సరఫరా చేసుకుంటూ పంటలను పండించుకుంటున్నారు. మహదేవప్పకు రెండెకరాల పొలం ఉంది. ఇందులో ఎకరా విస్తీర్ణంలో సీడ్ పత్తి సాగుచేయగా.. మిగతా పొలంలో వరి నాటు వేసుకునేందుకు గాను వరి నారు పోశాడు. ఈ క్రమంలో పత్తి పొలానికి నీరు పారించుకునేందుకు ఉదయమే పొలానికి వెళ్లాడు. విద్యుత్ లైన్ మర్చాల్సి ఉండగా.. సమీపంలో రైతులు ఎవరూ లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఏబీ స్విచ్ను ఆఫ్ చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై పక్కనే ఉన్న ఎర్త్ వైరుపై పడ్డాడు. అటుగా వెళ్తున్న రైతులు గమనించి బందెయ్యల మహదేవమ్మను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అప్పటికే విద్యుదాఘాతంతో మృతిచెందాడు. సమాచారం అందుకున్న మహదేవయ్య భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని బోరున విలపించారు. భార్య, కూతుళ్లు రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. మహదేవయ్యకు భార్య నర్సమ్మతోపాటు ముగ్గురు కుమార్తెలు అనిత, సంజన, దేవసేన, కుమారుడు శివాజీ ఉన్నారు. కేసు నమోదు.. గట్టు నుంచి రాయాపురం వరకు ఉన్న పాతకాలం నాటి విద్యుత్ హైటెన్షన్ వైర్లు తరచూ ప్రమాదాలకు కారణమవుతున్నాయని రాయాపురం గ్రామస్తులు ఆరోపించారు. వీటిని మార్చమని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు అనేక పర్యాయాలు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ట్రాన్స్ఫార్మర్లపై అధిక లోడు పడి అమాయక రైతులు బలై పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సహకార సంఘం అధ్యక్షుడు రాముడు సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎస్ఐ విజయ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆస్పత్రికి తరలించారు. మహదేవయ్య భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పెళ్లింట విషాదం
మల్దకల్ : కొద్ది సేపట్లోనే కూతురు వివాహం జరుగుతుందనగా.. వధువు తండ్రి గుండెపోటుతో మృతిచెందిన విషాద సంఘటన మల్దకల్ మండలం మద్దెలబండలో చోటు చేసుకుంది. గ్రామస్తు ల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన అడివెన్న(40) తన రెండెకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. గురువారం తన కుమార్తె చిట్టి వివాహం జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంక కొద్ది క్షణాల్లో పెళ్లి జరుగనుండగా గుండెపోటుకు గురై కుప్పకూలాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మార్గమద్యలోనే మృతి చెందాడు. ఈ సంఘటనతో పెళ్లికి వచ్చిన వారంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కూతురు వివాహం కళ్లారా చూడలేకపోయాడంటూ అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. మృతునికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. విషయం తెలుసుకున్న వివిధ పార్టీల నాయకులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
విద్యుదాఘాతంతో రైతు దుర్మరణం
ఇందుకూరుపేట: విద్యుదాఘాతానికి గురై మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఓ రైతు మంగళవారం మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దండు కోటేశ్వరరావు (45) తన పొలంలో కూరగాయలు సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పొలానికి విద్యుత్ సరఫరా చేసే వైర్లు సక్రమంగా లేకపోవడంతో మంగళవారం అతను సమీప రైతుల సాయంతో మరమ్మతులకు పూనుకున్నాడు. సరఫరాను నిలిపివేసి పనులు చేస్తుండగా గాలి వీస్తోందని కండెక్టర్ వైర్లు ఒకదానికి ఒకటి తగలకుంగా కర్రలు, వైర్లు సాయంతో వాటిని వేరుగా ఉంచే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ విషయం తెలియని విద్యుత్ శాఖ సిబ్బంది సరఫరా ఇచ్చేశారు. దీంతో షాక్ గురైన కోటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడికి భార్యాపిల్లలు ఉన్నారు. మరమ్మతులు సరైన సమయానికి చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చిది కాదని స్థానిక రైతులు విద్యుత్శాఖ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదుచేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం నెల్లూరుకు తరలించారు. -
కాపాడబోయి కాటికి చేరాడు..
సాక్షి, నిజామాబాద్/నిజాంసాగర్(జుక్కల్) : అడవి పందుల బెడద నుంచి నారుమడి రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ కంచెకు అంటుకుని కౌలు రైతు ప్రాణాలు గాలిలో కలిశాయి. కరెంట్ కంచెకు తగిలి కొట్టుమిట్టాడుతున్న పాడి గేదెను కాపాడే ప్రయత్నంలో గైనికాడి గోవింద్రావ్(45) అనే కౌలు రైతు శనివారం ఉదయం మృతి చెందాడు. పిట్లం మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన గైనికాడి గోవింద్రావ్, నిజాంసాగర్ మండలం మంగ్లూర్ గ్రామ శివారులో వ్యవసాయ భూములను కౌలుకు తీసుకున్నాడు. భూమి దుక్కి కోసం ట్రాక్టర్పై వెళ్లాడు. తన భూమి పక్కనే ఉన్న నారుమడిలో మేత కోసం వెళ్లిన పాడిగేదె కంచెకు ఏర్పాటు చేసిన కరెంట్ అంటుకుంది. దీనిని గమనించిన గోవింద్రావ్ పాడిగేదెను కాపాడేందుకు కరెంట్ వైరును తొలగించే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తు కరెంట్ తీగ చేతి వేళ్లకు అంటుకోవడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పంట పొలాలవైపు వెళ్లిన గ్రామస్తులు కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఎస్ఐ ఉపేందర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని పంచనామా చేశారు.మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. -
పొలం నుంచి ఇంటికి వస్తూ..
నాగిరెడ్డిపేట నిజామాబాద్: పొలానికని వెళ్లిన ఓ రైతు అర్ధరాత్రివేళ తన బైక్పై ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఘటన శుక్రవారం వేకువజామున నాగిరెడ్డిపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలం లోని గోపాల్పేటకు చెందిన చాకలి దుర్గయ్య (48) అనే రైతు తన బైక్పై గురువారంరాత్రి పొ లానికి వెళ్లాడు. అర్ధరాత్రి దాటాక పొలం నుంచి ఇంటికి బయల్దేరాడు. గోపాల్పేట సమీపంలోని వాగులమోరి వంతెన దాటుతుండగా ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. బోల్తాపడిన దుర్గయ్య ముఖానికి బలమైన గాయాలు తగిలాయి. దీంతో అక్కడిక్క డే ప్రాణాలు వదిలాడు. దుర్గయ్యకు భార్య లక్ష్మి, ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కుమారుడు దుర్గప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహానికి ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం చేయించినట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి.. దుర్గయ్య పొలం నుంచి వస్తుండగా మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరాల్సి ఉండగా అర కిలోమీటర్ దూరంలోనే విధి వక్రించి గుర్తుతెలియని వాహన రూపంలో దుర్గయ్యను మృత్యువు కబలించింది. తన తండ్రి అర్ధరాత్రయినా ఇంటికి రాక పెద్దకొడుకు తండ్రిని వెతుక్కుంటూ అర్ధరాత్రివేళ పొలానికి వెళ్లాడు. అక్కడ తండ్రి జాడ కనిపించక తిరిగి వస్తుండగా బైకును చూశాడు. గమనించి గ్రామపెద్దల ద్వారా పోలీసులను వాకబు చేశాడు. రోడ్డుపై పడిపోయిన వ్యక్తిని తామే ఆస్పత్రికి చేర్చామని పోలీసులు చెప్పారు. దీంతో ప్రమాదానికి గురైంది తనతండ్రేనని గుర్తించిన దుర్గప్రసాద్ బోరున విలపించాడు. పొలంలో నీరుపెట్టి ఇంటికి తిరిగి వస్తాడనుకున్న దుర్గయ్య మధ్యలో తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం శోకసంధ్రంలో మునిగిపోయింది. -
విద్యుత్ షాక్తో రైతు మృతి
ఇబ్రహీంపట్నం రూరల్: విద్యుత్ షాక్కు గురై రైతు మృతి చెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కప్పపహాడ్ గ్రామంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలో నివాసం ఉంటున్న దేవరకొండ మైసయ్య, యాదమ్మ దంపతులు వ్యవసాయం చేసుకుని జీవిస్తుంటారు. మైసయ్య శనివారం సాయంత్రం తన వ్యవసాయ పొలంలో పుంటికూర మడికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో భార్య యాదమ్మ, కుమారులతో కలసి వెతికినా జాడ తెలియరాలేదు. ఫోన్ రింగ్ అవుతున్నా తీయడం లేదని గమనించిన మైసయ్య కుమారుడు రాత్రి సమయంలో బావి వద్దకు వెళ్లి చూశాడు. అయినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆదివారం యాదమ్మ పొలం వద్దకు వెళ్లి చూసేసరికి మైసయ్య శవమై కనిపించాడు. అడవి పందులు పంటను పాడు చేస్తున్నాయని విద్యుత్ షాక్ పెట్టడంతో అవే తీగలు మైసయ్యకు తాకి మరణించినట్లు గుర్తించారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. మైసయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కరెంట్ షాక్తో రైతుకు గాయాలు
అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని రేగొండ పరిధిలోని నర్సింహతండాకు చెందిన మాలోతు తావు శుక్రవారం కరెంట్ షాక్కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల ప్రకారం..తండాకు చెందిన మాలోతు తావు తన వ్యవసాయ బావి వద్ద కరెంట్ సరఫరాలో అంతరాయం కలగడంతో ట్రాన్స్ఫార్మర్ ఎక్కి కర్రతో తీగలను కదిలించాడు. ఆ సమయంలో కరెంట్ షాక్కు గురవడంతో తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108లో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఎవుసం యమపాశమై..
అల్గునూర్(మానకొండూర్) : భూమిని నమ్ముకున్న ఆ రైతుకు వ్యవసాయం కలిసిరాలేదు. దీంతో పగబట్టిన ప్ర కృతికి ప్రాణాలు ఫణంగా పెట్టాడు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో దిక్కుతోచక పురుగుల మందు తాగి తనువు చాలించాడు. ఈ ఘటన తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో బుధవారం జరిగింది. ఆధ్యాంతం విషాదం... గ్రామానికి చెందిన పాగాల మల్లారెడ్డి(58)కి భార్య అం జవ్వ, కుమారుడు కొండాల్రెడ్డి, కుమార్తె కోమల ఉన్నా రు. తనకు సాగుభూమి లేకున్నా 20 ఏళ్లుగా పలువురి భూములు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐదేళ్లక్రితం సిద్దిపేటకు చెందిన వ్యక్తితో కూతు రు వివాహం జరిపించాడు. పెళ్లయిన తర్వాత భర్త పెట్టే వేధింపులు భరించలేక ఏడాదికే కోమల ఆత్మహత్య చేసుకుంది. దీంతో మల్లారెడ్డి కుంగిపోయాడు. 20 ఎకరాలు కౌలుకు... క్రమంగా కోలుకున్న ఆయన ఏడాది తర్వాత మళ్లీ నాగ లి పట్టాడు. గ్రామానికి చెందిన పిన్నింటి నర్సింహారెడ్డికి చెందిన 20 ఎకరాల భూమి ఏడాదికి రూ.1.50 లక్షల చొప్పున కౌలుకు తీసుకున్నాడు. కొడుకు కొండాల్రెడ్డి సహాయంతో సాగుచేస్తున్నాడు. మొదటి రెండేళ్లు అడపాదడపా కురిసిన వర్షాలకు దిగుబడి తక్కువగానే వచ్చి ంది. అయినా ఈ ఏడాదైనా కలిసిరాకుండా పోతుందా అన్న నమ్మకంతో రెండేళ్లుగా వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, కూరగాయల పంటలు సాగుచేశాడు. ఇందు కు ఏడాదికి రూ.3 లక్షల చొప్పున గడిచిన రెండేళ్లలో రూ.6 లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. పెరిగిన అప్పులు.. గతంలోనూ రూ.2 లక్షల అప్పులు ఉన్నాయి. వరుస కరువొచ్చినా.. భూ యజమానికి రూ.1.50 లక్షలు కౌలు డబ్బులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితమే ఈ ఏడాది కౌలు డబ్బులు రూ.లక్ష చెల్లించాడు. మరో రూ.50 వేలు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు చేసిన అప్పులు వడ్డీతో సహా రూ.10లక్షలకు చేరడంతో మల్లారెడ్డి మనస్తాపం చెందాడు. పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి.. బుధవారం ఉదయం పొలం వద్దకు వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి 7:30 గంటలకు వెళ్లాడు. 9 గంటలకు పొలంలో పడిపోయి ఉన్న మల్లారెడ్డిని రైతు మధుకర్ చూశాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అ ందించాడు. వారు కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు గా విలపించారు. ఎస్సై నరేశ్రెడ్డి ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతదేహంతో రాస్తారోకో మల్లారెడ్డి మృతదేహంతో తిమ్మాపూర్ మండలం అల్గునూర్ చౌరస్తాలో 45నిమిషాలపాటు గ్రామస్తులు, అఖిల పక్షం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మల్లారెడ్డికి 3 ఎకరాల భూమి, 10లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఎల్కపల్లి సంపత్, సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జి కేదారి, మొగిలిపాలెం ఉపసర్పంచ్ మోరపల్లి రమణారెడ్డి డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎల్ఎండీ ఎస్ఐ నరేశ్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వారితో మాట్లాడినా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో కరీంనగర్ నుంచి స్పెషల్ఫోర్స్ను పిలిపించారు. కరీంనగర్ వన్టౌన్ సీఐ శ్రీనివాసరావు, తిమ్మాపూర్ సీఐ కరుణాకర్ శవాన్ని ఆంబులెన్స్లో గ్రామానికి తరలించి, నాయకులను ఎల్ఎండీ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. రహదా రిని దిగ్భందించి, ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపిస్తూ రాస్తారోకోలో పాల్గొన్న వారిపై తిమ్మాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
‘పరిటాల సునీతానే.. ఆయన చావుకు కారణం’
ఆత్మకూరు : ‘మంత్రి పరిటాల సునీత అధికార దాహానికి అంతు లేకుండా పోతోంది. భూ దాహంతో రైతుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు. రైతు కేశవ్నాయక్ చావుకు మంత్రి సునీతే కారణం’ అంటూ వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్రెడ్డి విమర్శించారు. కేశవనాయక్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రకాష్రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు మంగళవారం ముట్టడించారు. కార్యక్రమానికి సీపీఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్, సీపీఐ నాయకులు మద్ధతు పలికారు. మండలాలు పంచుకుని.. రాప్తాడు నియోజకవర్గంలోని ఒక్కొ మండలానికి ఇన్చార్జ్గా తన బంధువులను నియమించి మంత్రి సునీత పెత్తందారి పాలన సాగిస్తున్నారని ప్రకాష్రెడ్డి విమర్శించారు. నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా అధికారులు ముందుగా మంత్రి గడప తొక్కాల్సి వస్తోందన్నారు. ఇన్పుట్ సబ్సిడీని మంత్రి సోదరుడు బాలాజీ చెప్పిన వారికే స్థానిక వ్యవసాయాధికారి పంపిణీ చేశారని గుర్తు చేశారు. ఎంపీడీవో ఆదినారాయణ పచ్చ చొక్కా వేసుకున్న అధికార పార్టీ కార్యకర్తలా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు. సర్పంచ్లను కీలుబొమ్మలను చేసి ఆడిస్తున్నారన్నారు. టీడీపీలో చేరకపోతే చెక్ పవర్ రద్దు చేస్తామంటూ సాక్షాత్తూ ఓ అధికారి చెప్పడం సిగ్టుచేటన్నారు. అన్యాయాలపై పోలీసులు సైతం కళ్లు మూసుకున్నారన్నారు. అన్యాయాలపై ప్రజలు తిరగబడితే మంత్రి సునీతనే కాదు ఎవరూ కాపాడలేరంటూ బాలాజీకి హితవు పలికారు. నాలుగేళ్ల పాలనలో అక్రమాల పుట్ట నాలుగేళ్ల పాలనలో నియోజకవర్గంలో మంత్రి సునీత అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. వైఎస్సార్ సీపీ సర్పంచ్లుగా ఉన్న గ్రామాల్లో అభివృద్ధి పనులు అడ్డుకున్నారన్నారు. వై.కొత్తపల్లిలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను డి.నారాయణస్వామి చేస్తున్నాడని గుర్తు చేశారు. ఓ ప్రభుత్వ ఇంజినీర్ ఈ పనులు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కుర్లపల్లి వద్ద దళితులకు ఇచ్చిన భూమిని మంత్రి బంధువు లాగేసుకుని కంకర మిషన్ వేసి, సిద్ధరాంపురం వద్ద అనధికారికంగా గుట్టలను ఆన్లైన్లో వారి పేరుపై చేసుకున్నారన్నారు. పుట్టపర్తి వద్ద బైపాస్ నిర్మాణానికి ఎకరాకు రూ.23 లక్షలు ఇస్తుండగా ఆత్మకూరు వద్ద మాత్రం ఎకరాకు రూ.5 లక్షల ఇచ్చి అన్నదాతల పొట్టగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా తాము చేస్తున్నది అక్రమమని అధికారులు గుర్తించి, ప్రజలకు న్యాయం చేకూర్చకపోతే మండలంలో ఏ ఒక్క ప్రభుత్వాధికారిని తిరగబోనివ్వమని హెచ్చరించారు. రూ. 20 లక్షలు పరిహారం ఇవ్వండి ఆత్మహత్య చేసుకున్న రైతు కేశవనాయక్ కుటుంబానికి రూ. 20 లక్షల పరిహారంతో పాటు ఐదు ఎకరాల పొలాన్ని ఇవ్వాలని ప్రకాష్రెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ఆందోళన విషయం ముందుగానే తెలుసుకున్న తహసీల్దార్ మంగళవారం విధులకు రాలేదు. దీంతో ఆర్డీవో మలోలాతో ప్రకాష్రెడ్డి, సీపీఎం నేతలు నేరుగా ఫోన్లో మాట్లాడారు. అక్రమంగా భూమిని మరొకరి పేరుపై చేసిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డిమాండ్పై విచారణ జరిపి తహసీల్దార్పై చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీనివ్వడంతో ఆందోళనను విరమించారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబులేసు, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు రాజారాం, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ముమ్మాటికీ ఇది హత్యే అధికారుల చేతిలో రూ. వెయ్యి పెడితే రాత్రికి రాత్రి ఒకరి పేరుమీద ఉన్న పొలాన్ని మరొకరి పేరు మీద మార్చేస్తున్నారు. ఇలా చేసే కేశవ్నాయక్ ప్రాణాన్ని బలిగొన్నారు. ఆయన భార్యబిడ్డల్ని రోడ్డన పడేశారు. ఇది ముమ్మాటికీ అధికారులు, రాజకీయ నాయకులు కలిసి చేసిన హత్యే. ఆత్మహత్యతో ఈ అన్యాయం వెలుగు చూసింది. ఇలాంటి అన్యాయాలు ప్రతి గ్రామంలోనూ జరుగుతున్నాయి. బాధిత రైతులందరూ ఆత్మహత్య చేసుకుంటూ పోతే శవాల గుట్టలు తేలుతాయి. ప్రభుత్వ కార్యాలయాలు టీడీపీ నాయకుల జాగీరు కాదు. నియంతృత్వ పాలన రాప్తాడు నియోజకవర్గంలో నియంతృత్వ పాలన సాగుతోంది, ఇంకా ఈ ప్రాంత ప్రజలకు స్వాతంత్య్రం రాలేదు. రామగిరి మండలంలో ఏవైనా కార్యక్రమాలకు వెళ్తే మంత్రి పరిటాల సునీత.. టీడీపీ గుండాలతో దాడులను ప్రోత్సహిస్తారు. అంటే మంత్రి సొంత మండలానికి వెళ్లాలంటే వీసాలు, పాస్పోర్టులు లాంటివి తీసుకెళ్లాలా? వీరి అక్రమాలు ఎంత ఘోరంగా ఉన్నాయంటే ఇటీవల కనగానపల్లిలో ఓ రెవెన్యూ అధికారిని చెప్పుతో కొట్టారంటే ఇంత కన్నా అన్యాయం ఏముంటుంది? వైఎస్సార్ సీపీలో చేరిన ఎంపీపీని బెదిరించి, బలవంతంగా టీడీపీని వీడకుండా చేశారు. ప్రజలు ఐక్యమత్యంతో ఈ రాక్షస పాలనకు చరమగీతం పాడాలి. -
ప్రాణం తీసిన పూడిక బావి
భీమదేవరపల్లి(హుస్నాబాద్) : ఎండిపోతున్న మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు తాపత్రయపడిన యువరైతు తన వ్యవసాయ బావి పూడికతీసేందుకు ఉపక్రమించాడు. దురదృష్టావశాత్తు వ్యవసాయ బావిలోనుంచి క్రేన్ సాయంతో పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు బావిలో పడి భీమదేవరపల్లి మండలం గట్లనర్సింగపూర్కు గ్రామానికి చెందిన బొల్లంపల్లి రాకేష్(30) అనే యువ రైతు దుర్మరణం పాలయ్యాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గట్లనర్సింగపూర్కు చెందిన బొల్లంపల్లి యోహోన్, కొంరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కలదు. పెద్ద కుమారుడైన రాకేష్ డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయ పనుల్లో తండ్రికి సాయం చేస్తున్నాడు. వీరికున్న ఎకరం వ్యవసాయ భూమిలో వర్షకాలంలో పత్తి పంట సాగు చేస్తే దిగుబడి రాలేదు. దీంతో యాసంగిలో మొక్కజొన్న పంటను సాగు చేశారు. మొక్కజొన్న పంట చేతికొచ్చె సమయంలోనే వ్యవసాయ బావిలో నీటి మట్టం తగ్గిపోవడంతో పంట వల్లుమోహం పట్టింది. దీంతో పంటను రక్షించుకునేందుకు గత రెండు రోజుల క్రితమే క్రేన్ సాయంతో తండ్రి యోహోన్, కుమారుడు రాకేష్తో పాటుగా కూలీలతో వ్యవసాయ బావిలో పూటీకతీత పనులు చేపట్టారు. కాగా బుధవారం బావిలోని విద్యుత్ మోటర్ పనిచేయకపోవడంతో మోటర్ను పైకి తీసేందుకు రాకేష్ బావిలోకి దిగాడు. క్రేన్ వైర్ మోటర్కు అమర్చి మోటర్పై రాకేష్ కూర్చుండి పైకి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారడంతో రాకేష్ బావిలో పడగా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇంటికి పెద్ద దిక్కుగా మారిన రాకేష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు రోదించిన తీరు పలువురిని కంట తడిపెట్టించింది. మృతదేహాన్ని సర్పంచ్ సల్పాల రాధికతిరుపతితో పాటు పలువురు సందర్శించి నివాలులర్పించారు. కాగా రాకేష్ కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చెప్యాల ప్రకాశ్, అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు బొల్లంపల్లి షడ్రక్ ప్రభుత్వాన్ని కోరారు. -
ఆగిన అన్నదాత గుండె
ఇందల్వాయి: అప్పుచేసి పెట్టుబడి పెట్టి నాలుగు నెలలుగా రేయింబవళ్లు కష్టపడుతూ కంటికిరెప్పలా కాపాడుకుంటున్న వరిపంట చివరి దశలో నీరందకపోవడంతో ఆ రైతు ఆవేదన చెందాడు.. పది రోజులుగా నిద్రాహారాలు మాని పొలంవద్దనే ఉంటూ బొట్టుబొట్టును పంటకు మళ్లిస్తున్న రైతు పంట పండుతుందో లేదో.. అప్పులు తీరుతాయో లేదో అని తీవ్ర ఆవేదన చెందాడు.. చివరికి తన పొలం వద్దే గుండె ఆగి తనువు చాలించాడు. ఇందల్వాయి మండలం లోలం గ్రామానికి చెందిన జల్లా పెద్దగంగారం తనకున్న ఎకరంనర పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులకు వెళ్తూ తన ఇద్దరు భార్యలు, ఒక దత్తత పుత్రుడితో జీవనం సాగించేవాడు. గతం లో కుటుంబ పోషణ నిమిత్తం గల్ఫ్కు వెళ్లిన గం గారాం అక్కడ సరైన ఉపాధి దొరకక స్వగ్రామానికి తిరిగి వచ్చి ఇక్కడే ఉంటున్నాడని గ్రామస్తు లు తెలిపారు. ఈ క్రమంలో మూడేళ్లుగా సరైన వర్షాలు లేక, పంటలు చేతికి రాక రూ. 3 లక్షలదాకా అప్పు చేశాడు. ఈసారి రబీలో 25 వేలు అప్పు చేసి ఎకరంనర పొలం సాగు చేశాడు గం గారాం. తనకున్న బోరుబావి నుంచి మొదట్లో నీరు బాగా అందినా గత 15 రోజుల నుంచి పంటకు సరిగా నీరు అందకపోవడంతో మోటారును ఇంకా లోతులోకి దించేందుకు మరో 5 వేలు అప్పు చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అయినా నీరు సరిపడా రాకపోవడంతో వారం రోజులనుంచి తీవ్ర ఆందోళనలో గంగారాం ఉన్నాడని అన్నం కూడా సరిగా తినక రేయింబవళ్లు పొలం వద్దనే ఉంటూ పొలానికి నీరు పెడుతున్నాడని అన్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి పొలం వద్దకు వెళ్లిన గంగారాం ఉదయం ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా మంచంపైనే విగతజీవిగా పడి ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం ఎండిపోతుందన్న మానసిక వేదనతో గుండెపోటుకు గురై చనిపోయాడని భావిస్తున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు. అనం తరం ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలానికి చేరుకు ని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
హిందూపురం వ్యవసాయ మార్కెట్యార్డ్లో రైతు మృతి
-
ప్రాణాలు పోతున్నయ్..
నిర్మల్: సోన్ మండలకేంద్రానికి చెందిన దార్లె చిన్నలింగన్న.. తనకున్న అర ఎకరంలో వ్యవసాయం చేసుకుంటూ.. కూలీ పనులు చేస్తూ.. భార్య శకుంతల, కూతుళ్లు గంగామణి, గోదావరి, కుమారులు రవి, గంగాధర్లను పోషించేవాడు. తన రెక్కల కష్టంతో పెద్ద పిల్లల పెళ్లిళ్లూ చేశాడు. ఉన్నదాంట్లో హాయిగా బతుకుతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా దుఃఖసాగరంలో మునిగింది. ఇందుకు కారణం.. 2012 ఫిబ్రవరి 3న సోన్ బస్టాండ్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమా దం. ఆరోజు గుర్తు తెలియని లారీ ఢీకొట్టడంతో చిన్నలింగన్న అక్కడికక్కడే మృతి చెందాడు. అంతే.. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వారి కుటుంబం కష్టాల్లో పడింది. భార్య శకుంతల కాయకష్టంతో మిగిలిన పిల్లల పెళ్లిళ్లు చేయాల్సి వచ్చింది. అందుకు చేసిన అప్పులు తీర్చేం దుకు చేతకాకున్నా కూలీ పనులు చేసింది. ‘ఆరోజు ఆ ప్రమాదం జరగకపోతే తమ కుటుంబానికి ఈ కష్టాలే ఉండేవి కావు..’ అని శకుంతల ఇప్పటికీ కన్నీళ్లు పెట్టుకుం టోంది. ఇదే గ్రామానికి చెందిన సోండి సత్తయ్య కుటుంబానిదీ ఇదే కన్నీటిగాథ. 2014 సెప్టెంబర్ 24న పగటిపూట చేన్లకు సైకిల్పై వెళ్తుండగా.. మార్గమధ్యలో జాతీయ రహదారి దాటుతుండగా.. గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీ కొట్టింది. సత్తయ్య అక్కడికక్కడే కన్నుమూశాడు. ఆ ప్రమాదం ఆయన కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఇలా.. అభంశుభం ఎరుగని అన్నదాతల ప్రాణాలు అర్ధంతరంగా.. అన్యాయంగా.. గాలిలో కలిసిపోవడానికి కారణం ఆ గ్రామానికి అండర్ బ్రిడ్జి లేకపోవడమే. తమ ఊరి మీదుగా జాతీయ రహదారి వెళ్తున్నందుకు సంతోష పడాలో.. తమ ఊరోళ్ల ప్రాణాలు పోతున్నందుకు ఏడ్వాలో.. తెలియని పరిస్థితి. ఇది ఈ ఒక్క గ్రామానిదే కాదు. జిల్లాలో చాలాచోట్ల హైవేరోడ్డు ప్రాణాంతకంగా మారింది. రోడ్డెక్కాలంటే భయం.. జిల్లాకు ప్రవేశద్వారంగా ఉన్న సోన్ గ్రామం నుంచే గోదావరిని దాటుతూ దేశంలోనే అతిపెద్ద జాతీయ రహదారి 44 నిర్మల్ జిల్లాలోకి ప్రవేశిస్తోంది. సోన్ నుంచి మామడ మండలం తాండ్ర గ్రామం వరకు దాదాపు 35కిలో మీటర్ల పొడవు దీని ప్రయాణం సాగుతోంది. ఉత్తర–దక్షిణ భారతాన్ని కలిపే ప్రధాన మార్గమైన ఈ రోడ్డుపై నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలాంటి రోడ్డుపైకి వెళ్లాలంటేనే పలు గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. ఎక్కడ.. ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని.. ప్రతీ క్షణం బిక్కుబిక్కుమంటున్నారు. ఓవైపు ఊరు.. మరోవైపు చేను ప్రధానంగా సోన్ మండలకేంద్రవాసులు ఈ రోడ్డుతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ నిర్మించాల్సి ఉన్నా.. అప్పట్లో పట్టించుకోలేదు. పాలకులు, అధికారులూ దృష్టిపెట్టలేదు. అదే.. ఇప్పుడు ఈ గ్రామస్తులకు శాపంగా మారింది. ఈ రోడ్డుకు ఓవైపు గ్రామం ఉండగా, మరోవైపు పంటపొలాలున్నాయి. గ్రామస్తులు పంటపొలాలకు వెళ్లాలంటే కచ్చితంగా హైవేను దాటాల్సిందే. గోదావరి నదిపై బ్రిడ్జి దాటాగానే వచ్చే సోన్ ఎక్స్రోడ్డు వద్ద వాహనాల వేగమూ ఎక్కువగానే ఉంటుంది. ఈక్రమంలో అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని అన్నదాతలు రోడ్డు దాటుతున్నారు. ఈ క్రమంలోనే ఒక్కోసారి ప్రాణాలు పోతున్నాయి. ఆందోళనలు చేసినా.. జాతీయ రహదారి వెడల్పు పనులు జరుగుతున్న సమయంలోనే గ్రామస్తులు ఆందోళనలు నిర్వహిం చారు. తమకు అండర్ పాసింగ్కు అవకాశం కల్పిం చాలని కోరారు. అయినా అధికారులు పట్టించుకోలే దు. చివరకు గ్రామస్తులు అప్పటి అధికారి కాళ్లు పట్టుకున్నా ఫలితం లేకపోయింది. తమ పంటపొలాలకు రాత్రిపూట రోడ్డు దాటి వెళ్లాలంటేనే భయంగా ఉందని అప్పట్లోనే గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 200నుంచి 300 ఎకరాల సాగు భూ ములు రోడ్డు ఆవల ఉన్నాయి. అండర్పాసింగ్ లేకపోవడంతో వీరి పరిస్థితి ఇబ్బందిగా మారింది. సోన్లో దాదాపు 500కు పైగా కుటుంబాలున్నాయి. ఇంత పెద్ద గ్రామమైనా ఇక్కడ అండర్ బ్రిడ్జి నిర్మించకపోవడంపై గ్రామస్తులు ఆందోళనలూ వ్యక్తంచేశారు. ప్రాణాలుపోయినా.. జాతీయరహదారి నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఒక్క సోన్ గ్రామం నుంచే పదిమంది వరకు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయాలపాలయ్యారు. ఇటీవలే ఓ స్కూల్బస్సు నిజామాబాద్ జిల్లా నుంచి సోన్ గ్రామం వైపు వస్తుండగా ఇక్కడి మూలమలుపు వద్ద వేరే వాహనాన్ని ఢీకొట్టింది. అదృష్టవశాత్తు ఎవరికీ పెద్దగా గాయాలు కాలేదు. ఇలా ఎన్నో ప్రమాదాలు ఇక్కడ సాధారణంగా జరిగిపోతున్నాయి. చనిపోయిన వాళ్లలో అన్నదాతలే ఎక్కువగా ఉంటున్నారు. గతంలో అధికారుల తీరుకు నిరసనగా గ్రామస్తులు ధర్నా చేశారు. అప్పుడు ఎన్హెచ్ఏఐ పీడీ అహ్మద్ అలీ వచ్చి, అండర్పాసింగ్ నిర్మాణంపై ఉన్నతాధికారులకు నివేదిస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు రూ.11.60కోట్లు మంజూరైనా ఇప్పటివరకు అండర్ బ్రిడ్జి నిర్మాణం మాత్రం చేపట్టడం లేదు. సోన్తో పాటు మాదాపూర్ ఐబీ, కడ్తాల్ క్రాస్రోడ్డు తదితర చోట్ల హైవే ప్రమాదకరంగా మారింది. త్వరగా నిర్మించాలి జిల్లా మీదుగా వెళ్తున్న జాతీయ రహదారి ప్రమాదకరంగా మారింది. మా సోన్ గ్రామం వద్ద తప్పనిసరిగా అండర్ పాసింగ్ కోసం బ్రిడ్జి నిర్మించాల్సి ఉంది. ఇది లేకపోవడంతోనే మాఊరి రైతులు ప్రాణాలు కోల్పోయారు. బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరైనట్లు తెలిసింది. త్వరితగతిన పనులు ప్రారంభించాలని సదరు అధికారులను కోరుతున్నాం.– కృష్ణప్రసాద్రెడ్డి, సర్పంచ్, సోన్ -
రైతు మృతి.. మార్కెట్ యార్డులో ఉద్రిక్తత
సాక్షి, వరంగల్: వరంగల్లోని ఎనమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులో విషాదం చోటు చేసుకుంది. పత్తిని అమ్మేందుకు మార్కెట్కు వచ్చిన రైతును లారీ ఢీకొట్టింది. దీంతో రైతు మృతిచెందాడు. పాలకుర్తికి చెందిన బానోతు రవి అనే రైతు పత్తిని విక్రయించేందుకు నిన్న సాయంత్రం మార్కెట్కు వచ్చాడు. ఈ క్రమంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న రైతు కాళ్లపై నుంచి మిర్చి లారీ దూసుకెళ్లింది. తోటి రైతులు అతడిని హుటాహుటిన ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రవి మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైతు మృతి చెందడంతో మార్కెట్, ఎంజీఎం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
వృద్ధ రైతును తొక్కి చంపిన ఏనుగు
కోయంబత్తూరు: ఓ వృద్ధ రైతు(80)ను ఏనుగు తొక్కి చంపిన సంఘటన కోయంబత్తూరు నగర శివారులో సోమవారం ఉదయం జరిగింది. పొలానికి బయల్దేరేముందు కాలువ వద్ద స్నానానికి వెళ్తుండగా ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఓ భారీ ఏనుగు అతడిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. సమాచారమందుకున్న అటవీ శాఖ సిబ్బంది, పోలీసులు ఆ ఏనుగును వెంబడించి ఎట్టకేలకు ఆ వృద్ధ రైతు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, తగు చర్యలు తీసుకుని ఏనుగుల నుంచి తమను కాపాడాలని స్థానికులు అటవీ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ట్రాన్స్ఫార్మర్పైనే ప్రాణాలు విడిచిన రైతు
సాక్షి, సిద్ధిపేట : జిల్లాలోని కోహెడ మండలం వరికోలులో సోమవారం విషాదం చోటు చేసుకుంది. వరి పంట ఎండిపోతోందని ఆందోళన చెందిన రైతు వీరారెడ్డి ట్రాన్స్ఫార్మర్ మరమ్మత్తుకు పూనుకున్నాడు. ఫ్యూజు వేసే పనిలో నిమగ్నమై ఉండగా విద్యుత్ షాక్కు గురై అక్కడే ప్రాణాలు విడిచాడు. లైన్ క్లియరెన్స్ తీసుకున్నాకే తాము మరమ్మత్తు మొదలుపెట్టామని, ఈ లోగానే కరెంట్ సరఫరా అయిందని, ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్తులు ఆందోళనకు దిగారు. -
కబళించిన కరెంట్ తీగలు..
హత్నూర (సంగారెడ్డి): ట్రాన్స్ఫార్మర్ పాడైపోయి వారం రోజులు గడిచినా మరమ్మతులు చేయకపోవడంతో రైతులే ఆ పని చేసేందుకు వెళ్లగా విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అలాగే మోదక్ జిల్లాలో బోరు మోటార్ ఆన్ చేస్తుండగా షాక్తో మరో రైతు మరణించాడు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చీక్మద్దూర్ గ్రామ రైతులు మల్లు రవీందర్రెడ్డి (35), మల్లు మరవెల్లి శ్రీశైలం (37) పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ పాడైపోయి వారం రోజులైంది. వ్యవసాయ బోర్లు నడవకపోవడంతో అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. గురువారం వీరద్దరూ ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి లైన్మన్ గంగ రాములుకు ఫోన్చేసి లైన్ క్లియర్ చేసి విద్యుత్ బంద్ చేయాలని కోరారు. అనంతరం ట్రాన్స్ఫార్మర్పైకి ఎక్కి ఎక్స్ ఫీజ్ వైరును బిగిస్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం కావడంతో వైర్లపై ఉన్న ఇద్దరు రైతులు విద్యుత్ షాక్కు గురై పిట్టల్లా నేలరాలిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు సంఘటనా స్థలానికి చేరుకుని భోరున విలపించారు. లైన్మన్ గంగరాములు, విద్యుత్ ఏఈ రాములు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆందోళనకు దిగారు. విద్యుత్ అధికారులు వచ్చే వరకు మృతదేహాలను తరలించేది లేదని భీష్మించారు. విషయం తెలుసుకున్న ఎస్సై రాజేష్నాయక్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. వారికి నచ్చజెప్పినా వినిపించుకోకపోవడంతో గ్రామ పెద్దలను పోలీస్స్టేషన్కు పిలిపించి విద్యుత్ అధికారులతో ఫోన్లో చర్చలు జరిపారు. బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ. 4 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల భార్యల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్నాయక్ తెలిపారు. మృతుడు మరవెల్లి శ్రీశైలానికి భార్య అనసూయ, పిల్లలు వినయ్, కుమార్, లక్ష్మి, ఉన్నారు. మరో మృతుడు మల్లు రవీందర్రెడ్డికి భార్య మాధురి, కొడుకు అరుణ్రెడ్డి, కూతురు అనూష ఉన్నారు. ఒకే రోజు ఇద్దరు రైతులు మృత్యువాత పడడంతో చీక్మద్దూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పొలంలో విద్యుదాఘాతంతో.. శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో గురువారం రైతు నిరుడి లక్ష్మయ్య (36) విద్యుదాఘాతంతో మరణించాడు. లక్ష్మయ్య తన పొలం వద్ద ఉన్న బోరుబావి మోటారు అన్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పైకి తేలి ఉన్న సర్వీసు వైరుకు కరెంటు సరఫరా కావడం..అది గమనించకుండా లక్ష్మయ్య దాన్ని తాకడంతో విద్యుదాఘాతం సంభవించింది.