ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం బోరిగాంలో విషాదం చోటు చేసుకుంది.
కరెంటు షాక్ తో రైతు మృతి
Published Mon, Nov 7 2016 2:07 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
నేరేడుగొండ: ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం బోరిగాంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శివాజీ(30) అనే యువరైతు వ్యవసాయం పొలం వద్ద కరెంటు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజ్ మార్చుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement