Shivaji
-
శివాజీ తాజా చిత్రం ‘దండోరా’ ప్రారంభం (ఫొటోలు)
-
తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’
శివాజీ, నవదీప్, రాహుల్ రామకృష్ణ, రవికృష్ణ, మనీక చిక్కాల, అనూష తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని లౌక్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ షూటింగ్ పూజా కార్యక్రమం ఫిల్మ్ నగర్లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరై చిత్ర యూనిట్ను ప్రత్యేకంగా అభినందించారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ కొట్టగా.. బేబీ నిర్మాత ఎస్ కే ఎన్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా.. యంగ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో ‘దండోరా’ సినిమాను రూపొందించనున్నారు. మన పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూనే వ్యంగ్యం, చక్కటి హాస్యం, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల కలయికగా ఈ సినిమా తెరకెక్కనుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి మార్క్ కె.రాబిన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ తెలియజేశారు. -
పుష్ప-2 ఎఫెక్ట్.. సైలెంట్గా పోటీ నుంచి తప్పుకున్న రష్మిక!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2 ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఇటీవల చెన్నై, కొచ్చిలో జరిగిన ఈవెంట్లలో మెరిసింది. మరో వారం రోజుల్లో పుష్ప-2 విడుదల కానుండగా మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రష్మిక టాలీవుడ్తో పాటు బాలీవుడ్ వరుస సినిమాలు చేస్తోంది. గతేడాది యానిమల్ మూవీలో మెరిసిన ముద్దుగుమ్మ.. ఛావా అనే చిత్రంలో నటిస్తోంది.బాలీవుడ్ విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా ఛావా మూవీని భారీ బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ముందుగా అనుకున్న ప్రకారం డిసెంబర్ 6న విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఒక్క రోజు ముందే డిసెంబర్ 5న పుష్ప-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న సంగతి తెలిసిందే.పోటీనుంచి తప్పుకున్న ఛావాదీంతో పుష్ప-2తో బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి వస్తోంది. అయితే ఈ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పుష్ప-2తో పోటీపడడం కంటే వాయిదా వేయడమే మేలని భావించారు. అల్లు అర్జున్ మూవీ పుష్ప-2 క్రేజ్ దృష్ట్యా పోటీపడి నిలవడం కష్టమేనని మేకర్స్ భావించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 6న విడుదల చేస్తే బాక్సాఫీస్ వద్ద చావుదెబ్బ ఖాయమని మేకర్స్ జాగ్రత్తపడ్డారు. అందుకే ఛావాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు.ఫిబ్రవరిలోనే ఎందుకంటే?తాజాగా ఛావా మూవీని ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు తెలిపారు. 2025 ఫిబ్రవరి 19 శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శంభాజీ భార్య ఏసుబాయి పాత్రలో రష్మిక నటిస్తోంది. ఇప్పటికే ఛావా టీజర్ రిలీజ్ కాగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.VICKY KAUSHAL - RASHMIKA - AKSHAYE KHANNA: 'CHHAAVA' NEW RELEASE DATE ANNOUNCEMENT... #Chhaava is now set for a theatrical release on 14 Feb 2025... The release date holds special significance since it coincides with Chhatrapati Shivaji Maharaj Jayanti on 19 Feb 2025.Produced… pic.twitter.com/kDMrY7RDqN— taran adarsh (@taran_adarsh) November 27, 2024 -
22 ఏళ్ల తర్వాత రీరిలీజ్ కాబోతున్న దేశ భక్తి సినిమా
కృష్ణవంశీ దర్శకత్వం వహించిన దేశ భక్తి సినిమా ఖడ్గం. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, రవితేజ, శివాజీ రాజా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం 2002లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం థియేటర్స్లో సందడి చేయబోతుంది. అక్టోబర్ 18న ఈ చిత్రం రీరిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ప్రెస్ మీట్ పెట్టి షూటింగ్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. దర్శకులు కృష్ణవంశీ మాట్లాడుతూ, “మాకు ఈ సినిమా తీయడం లో సహాయం చేసిన నిర్మాత మధు మురళి గారికి ధన్యవాదాలు. భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో ఈ సినిమా కి ఆ టైటిల్ పెట్టి సినిమా తీశాం.22 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానున్నందుకు దర్శకులు కృష్ణవంశీ సంతోషంగా ఉన్నారు. ఈ సినిమా కి సహకరించిన నటీనటులందరికీ థాంక్స్.” అని చెప్పారు.హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, “జనరేషన్స్ మారినా పెట్రియేటిక్ ఫిల్మ్స్ అన్నిటిలో ఖడ్గం ఒక గొప్ప చిత్రం. అసలు ఖడ్గం సినిమా లో నిర్మాత మధు మురళి నన్ను వద్దు ఆన్నారు ముందు. కానీ వంశీ ధైర్యం చేసి ఆయన్ని ఒప్పించి నన్ను సినిమాలోకి తీసుకున్నారు. నా లైఫ్ లో ఈ సినిమా మర్చిపోలేను. ఈ సినిమా మళ్ళీ రిలీజ్ అవుతున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది.” అన్నారు. ‘షనల్ స్కూల్ ఆఫ్ డ్రామా లో చదివి ఏడేళ్లు వెయిట్ చేస్తున్న సమయం లో నాకు దొరికిన అవకాశం ఖడ్గం. ఈ సినిమా లో అవకాశం ఇచ్చి నా వనవాసం కి ఎండ్ చెప్పడానికి కారణమైన కృష్ణవంశీ గారికి కృతజ్ఞతలు’ అని షఫి అన్నారు. -
బాస్ మళ్లీ వస్తున్నాడు
మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు బాస్. రజనీకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘శివాజీ: ది బాస్’ ఈ నెల 20న రీ రిలీజ్కి ముస్తాబవుతోంది. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, శ్రియ జంటగా నటించిన చిత్రం ‘శివాజీ: ది బాస్’. ఈ సినిమాలో సుమన్ విలన్ పాత్ర చేశారు. ఎంఎస్ గుహన్, ఎం. శరవణన్ నిర్మించిన ఈ సినిమా 2007లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది.తమిళ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి చిత్రంగా ‘శివాజీ’ నిలిచింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్కు ఇది నూరవ సినిమా కావడం విశేషం. సుమారు 17 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. 4కే వెర్షన్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఎంపిక చేసిన స్క్రీన్స్ లో ‘శివాజీ’ టికెట్ ధర రూ. 99 మాత్రమే ఉండనుంది. -
భారతీయ మేధా శిఖరం!
యాభై ఐదు సంవత్సరాల నాటి మాట. 1969 మేలో పూనా–బొంబాయి మధ్యగల లోనావాలా అనే హిల్ స్టేషన్లో లెస్లీ సాక్నీ ప్రజాస్వామ్య శిక్షణ శిబిరంలో ఓ పది, పధ్నాలుగు రోజులున్నాను. ఎమ్.ఆర్. మసానీ ఆ శిబిరానికి ప్రారంభోపన్యాసం చేశారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్ర ఆచార్యులు ఎస్.పి. అయ్యర్ ప్రిన్సి పాల్గా తరగతులు నిర్వహించారు. నానీ పాల్కీవాలా ఆ సంస్థ అధ్యక్షులు. సోలీ సొరాబ్జీ, రజనీ పటేల్, వి.బి. కార్నిక్, వి.వి. జీన్, అరవింద్ దేశ్పాండే, రాము పండిట్, ఫెడీ మెహతా, ఎస్.వి. రాజు వంటి వారు వివిధ అంశాలపై శిక్షణ గరిపారు.వారిలో ఎ.జి. నూరానీ కూడా ఉన్నారు. ఆయన అప్పటికే ఒక దశాబ్ద కాలంగా వివిధ అంశాలపై పూంఖానుపుంఖాలుగా వివిధ పత్రికలలో వ్యాసాలు రాసేవారు. ఇండి యన్ ఎక్స్ప్రెస్, హిందూ, స్టేట్స్మన్ వంటి స్వదేశీ పత్రికలకే గాక, పాకి స్తాన్లోని ‘డాన్’ పత్రికలో కూడా వారి రచనలు ప్రచురితమవుతుండేవి. ఆ తదుపరి ఫ్రంట్లైన్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వంటి వాటికి కూడా రాసేవారు. జాకీర్ హుస్సేన్, బొంబాయి హైకోర్టులో మొట్టమొదటి భార తీయ వకీలు బద్రుద్దీన్ త్యాబ్జీ జీవిత చరిత్రలను ప్రచురించారు. కశ్మీర్ సమస్య, బాబ్రీ మసీదు, ఆర్టి కల్–370, లద్దాఖ్, కేంద్ర–రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ పాత్ర, పౌరహక్కులు, భగత్ సింగ్పై విచారణ, సావర్కర్, హైదరాబాదు డిమాలిషన్ వంటి భిన్న విభిన్న అంశాలపై రచనలు చేశారు.తదాదిగా బొంబాయిలోగానీ, ఢిల్లీలోగానీ నూరానీని కలుసుకొనే అవకాశం దొరికేది. దక్షిణ బొంబాయిలో వీలు దొరికినప్పుడల్లా ఆయననను కలిసేవాడిని. ఎం.ఆర్. మసానీ అక్కడే బీచ్కాండీలో ఉండేవారు. నూరానీ నేపియన్ సీ అపార్టుమెంట్స్లో ఉండేవారు. అవి రెండూ మహాలక్ష్మి టెంపుల్ దగ్గర నుండేవి. దానితో మసానీ దగ్గరకెళ్లినప్పుడు విధిగా నూరానీని కూడా కలిసేవాడిని. నూరానీ బల్ల కుర్చీమీద కాకుండా, మంచంమీద కూర్చుని రాసేవారు. చుట్టూ అప్పడాలు ఆరబోసినట్లు లెక్కకు మించిన పుస్తకాలు తెరిచి, తిరగేసి ఉండేవి. ఏదైనా అంశంపై చర్చిస్తుండగా, ఎదురుగా ఉన్న పుస్తకాల్లో ఫలానా పుస్తకం తీసి ఫలానా చాప్టర్ చదవమనేవాడు.తాను చెప్పిన దానిని, వివరంగా అర్థం చేసుకోవడానికి ఉదయం చదివిన పత్రికలలో అవసరమయిన అంశాలను కత్తిరించి, అంశాల వారీగా ఫైల్ చేసేవారు. కొన్ని వందలు, వేల ఫైళ్ళు అలా ఉన్నాయి. ఏ అంశంమీద రాసినా, లోతైన పరిశోధన చేసేవారు. వాజ్పేయి–ముషారఫ్ల మధ్య ఆగ్రాలో జరిగిన చర్చలపై రాసే దానికి, పూర్తి సమాచారం రాబట్టడానికై, పనిగట్టుకొని ఇస్లామాబాద్ వెళ్లి పరిశోధన గావించారు. క్రీ.శ. 1775–1947ల మధ్య జరిగిన రాజకీయ ప్రేరిత విచారణలపై సమగ్ర పరిశోధన చేసి గ్రంథస్థం గావించారు. ‘జిన్నా–తిలక్ – కామ్రేడ్స్ ఆఫ్ ఫ్రీడం స్ట్రగుల్’ అనే పుస్తకాన్ని కూడా వెలువరించారు. అయితే ఏది ఎలా ఉన్నా ఎవరిమీదా వ్యక్తిగతంగా విమర్శ చేసేవారు కాదు. ‘రాజాజీ – అంకి తమైన, నిబద్ధతగల హిందువు, మహో న్నతమైన భారతీయుడు, అల్పసంఖ్యాక వర్గాల హక్కులకు అలు పెరుగని రక్షకుడు’ అని కొనియాడారు. షేక్ అబ్దుల్లా, కరుణానిధిల తరఫున సుప్రీంకోర్టు, బొంబాయి హైకోర్టులలో వకీలుగా తన వాదనలను వినిపించారు.నూరానీకి కొన్ని నిర్దిష్టమయిన, చిత్ర–విచిత్రమయిన అభిరుచులు ఉండేవి. ఢిల్లీ వస్తే ఇండియా ఇంటర్నేష నల్ సెంటర్లో 38వ నంబరు గదిలోనే మకాం. ఓల్డ్ ఢిల్లీ, నిజాముద్దీన్, కరోల్ బాగ్, జామా మసీదు వంటి చోటసందులు – గొందులలోని హోటళ్లలో కబాబ్–కుర్మా ఎక్కడ దొరుకు తుందోనని శోధించి, ఆస్వాదించేవారు. గత నెలాఖరులో తన 94వ ఏట కన్నుమూసిన అబ్దుల్ గఫూర్ మజీద్ నూరానీ సేకరించిన వేలాది పుస్తకాలు, పేపర్ క్లిప్పింగ్లు ఏమవుతాయో? ఏదైనా జాతీయ స్థాయిలో నున్న గ్రంథాలయం గానీ, పరిశోధనా సంస్థలు, లేక జాతీయ పత్రికలు భద్రపరిచి, సద్వినియోగం గావించడం అవసరం. అవి భావి తరాలకు ప్రజాసేవా రంగాలలో, పాత్రికేయ రంగంలోకి అడుగు పెట్టే యువతరానికి ఉపయుక్తం కాగలవు. – డా. యలమంచిలి శివాజీ, వ్యాసకర్త రాజ్యసభ మాజీ సభ్యులు, 98663 76735 -
మంచి కంటెంట్ ఉంటే చాలు..ఇండస్ట్రీలో నిలబడొచ్చు: శివాజీ
విశ్వంత్, శిల్ప మంజునాథ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం హైడ్ న్ సిక్. సహస్ర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో బసిరెడ్డి రానా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ మోషన్ పోస్టర్ని సీనియర్ హీరో శివాజీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్ న్ సిక్ చిత్రంతో తెలుగు పరిశ్రమలు మరో ఫెంటాస్టిక్ డైరెక్టర్ పరిచయం అవుతున్నాడని బలంగా నమ్మున్ననని అన్నారు. ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ఈమధ్య ఎక్కువగా వస్తుంది అని, ఇది చాలా మంచి పరిణామం అని పేర్కొన్నారు. ఒకప్పటిలా కాదు ఇప్పుడు అవకాశం అందుకోవడం చాలా సులభతరం అయిందని.. మంచి కంటెంట్ ఉంటే చాలు ఇండస్ట్రీలో నిలబడొచ్చని నటుడు శివాజీ పేర్కొన్నారు. ‘ ఈ చిత్రం నుంచి ఎలాంటి కంటెంట్ వచ్చిన అది కచ్చితంగా బ్లాస్ట్ అయ్యేలా ఉండాలనే ఉద్దేశంతో ప్రతిదీ చక్కగా ప్లాన్ చేస్తున్నాం. కచ్చితంగా ఈ సినిమా అందరిని రంజింప చేస్తుందని ప్రామిస్ చేస్తున్నాను’అని డైరెక్టర్ బసిరెడ్డి రానా అన్నారు. -
ఛత్రపతి శివాజీ శౌర్యానికి మారుపేరని ఎందుకంటారు?
ఛత్రపతి శివాజీ భారతదేశాన్ని మొఘలుల బారి నుండి విముక్తి చేసి, మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. మొఘలులకు వ్యతిరేకంగా యుద్ధానికి దిగిన శివాజీ శౌర్య పరాక్రమాలు చరిత్రలోని బంగారు పుటలలో నిక్షిప్తమయ్యాయి. భారతదేశంలో శివాజీ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేటికీ ఛత్రపతి శివాజీని శౌర్యానికి ప్రతీకగా చెబుతుంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ప్రతియేటా ఫిబ్రవరి 19 న జరుపుకుంటారు. శివాజీ 1630, ఫిబ్రవరి 19న శివనేరి కోటలోని మరాఠా కుటుంబంలో జన్మించాడు. శివాజీ పూర్తి పేరు శివాజీ భోంస్లే. అతని తండ్రి పేరు షాజీ భోంస్లే, తల్లి పేరు జిజియాబాయి. శివాజీ తండ్రి అహ్మద్నగర్ సుల్తానేట్లో పనిచేసేవారు. శివాజీ తల్లికి మతపరమైన గ్రంథాలపై అమితమైన ఆసక్తి ఉండేది. ఇదే శివాజీ జీవితంపై ప్రభావం చూపింది. మహారాజ్ శివాజీ జన్మించిన కాలంలో దేశంలో మొఘలుల దండయాత్ర కొనసాగుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన 15 ఏళ్ల వయసులో మొఘలులపై తన మొదటి దాడిని చేశాడు. హిందూ సామ్రాజ్య స్థాపన కోసమే ఈ దాడి జరిగింది. దీనినే గెరిల్లా వార్ఫేర్ విధానం అంటారు. శివాజీ ఈ కొత్త తరహా యుద్ధానికి ప్రాచుర్యం కల్పించారు. గెరిల్లా వార్ఫేర్ సూత్రం ‘హిట్ అండ్ రన్వే’. శివాజీ బీజాపూర్పై తన గెరిల్లా యుద్ధ నైపుణ్యంతో దాడిచేసి అక్కడి పాలకుడు ఆదిల్షాను ఓడించి, బీజాపూర్ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ 1674లో పశ్చిమ భారతదేశంలో మరాఠా సామ్రాజ్యానికి పునాది వేశాడు. ఈ సమయంలోనే శివాజీ అధికారికంగా మరాఠా సామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషిక్తుడయ్యాడు. ఛత్రపతి శివాజీని ‘మరాఠా గౌరవ్’ అని కూడా పిలిచేవారు. శివాజీ తీవ్ర అనారోగ్యంతో 1680 ఏప్రిల్ 3న కన్నుమూశాడు. అనంతరం ఆయన కుమారుడు శంభాజీ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. -
‘తొలిప్రేమ’లో పవన్ చెల్లెలు.. ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
నటి వాసుకి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. కాని తొలిప్రేమ సినిమాలో పవన్ కల్యాణ్ చెల్లెలు బుజ్జి అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. ఆ సినిమాలో వాసుకి నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. పవన్-వాసుకిల మధ్య వచ్చే సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతలా ప్రేక్షకుల మదిలోకి వెళ్లిపోయిన వాసుకి.. వన్ ఫిల్మ్ వండర్లా ఒక్క సినిమాకే పరిమితమైంది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి.. అటు వెండితెరపై ఇటు వెబ్స్క్రీన్పై సందడి చేస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇటీవల రిలీజై సూపర్ హిట్ అయిన ’#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్ సిరీస్లో మిడిల్ క్లాస్ అమ్మగా అదరగొట్టేసింది. వాసుకి పుట్టి పెరిగిందంతా చెన్నైలోనే. ‘రమణి వర్సెస్ రమణి’, ‘మర్మదేశం’ అనే సీరియల్స్తో చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చింది. ‘తొలిప్రేమ’ సూపర్ హిట్ కావడంతో తర్వాత సినీ అవకాశాలు వెల్లువలా వచ్చాయి. కానీ ఆమె నటనకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. కుటుంబ జీవితంపై దృష్టి పెట్టింది. ‘తొలిప్రేమ’లో పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించి తెలుగు ప్రేక్షకుల ప్రేమాభినాలను చూరగొంది. ఆ సమయంలోనే ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని ప్రేమ వివాహం చేసుకుంది. మళ్లీ రెండు దశాబ్దాల విరామం తర్వాత ’అన్నీ మంచి శకునములే’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతోన్న ’#90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్సిరీస్తో మిడిల్ క్లాస్ అమ్మగా ఆకట్టుకుంటోంది. ఇందులో కనిపించే వస్తువులు, చిన్నచిన్న ఆనందాలు, విషయాలు, పరిస్థితులు.. నైంటీస్ కిడ్స్కి బాగా రిలేట్ అవుతున్నాయి. ఇరవై మూడేళ్ళు సినిమాల్లో నటించనప్పటికీ ఆనంద్ వలన ఏదో ఒక సినిమా గురించి ఇంట్లో చర్చ జరుగుతూనే ఉండేది. అందుకే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాననే ఫీలింగ్ కలగలేదెప్పుడూ! – వాసుకి ఆనంద్ సాయి. View this post on Instagram A post shared by Sai Madhav Battula (@saimadhavbattula) -
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా 'మార్కెట్ మహాలక్ష్మి'
‘కేరింత’ఫేమ్ పార్వతీశం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మార్కెట్ మహాలక్ష్మి’. వియస్ ముఖేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ద్వారా ప్రణీకాన్వికా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ 'టైటిల్ పోస్టర్'ని బిగ్ బాస్ ఫెమ్ హీరో 'శివాజీ' చేతుల మీదగా ఈ రోజు ఆవిష్కరణ జరగగా, ప్రొడ్యూజర్ బెక్కెం వేణుగోపాల్ అతిధి గా వచ్చి టీం ని విష్ చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ‘నేను 27 ఏళ్ళ వయసులో యాక్టింగ్ మొదలు పెడితే దాదాపు 50 యేళ్ళకి నాకు గుర్తింపు వచ్చింది. ఏదో, ఒక రోజు గుర్తింపు అనేది వస్తుంది. కాకపోతే క్యారెక్టర్, హార్డ్ వర్క్, ఓపిక ఇంపార్టెంట్. 'కేరింత' మూవీతో కేరీర్ స్టార్ట్ చేసిన హీరో 'పార్వతీశం' కి తప్పకుండా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు వస్తుంది అని నాకు బలమైన నమ్మకం ఉంది. ప్రొడ్యూసర్ 'అఖిలేష్ కలారు'కి మంచి లాభాలు చేకుర్చాలి. డైరెక్టర్ ' వియస్ ముఖేష్' కథ బాగా తీసి ఉంటారని నమ్ముతున్నాను’అన్నారు. 'మార్కెట్ మహాలక్ష్మి'చూసినప్పుడు నాకు శేఖర్ కమ్ముల గారి సినిమాలు గుర్తొచ్చాయి’అని బెక్కం వేణుగోపాల్ అన్నారు. -
' ఆయన చేసిందేమీ లేదు.. మీరు అనవసరంగా పైకెత్తకండి..'.. అమర్దీప్ కామెంట్స్!
ఉల్టా- పుల్టా అంటూ మొదలైన బిగ్బాస్ సీజన్-7కు ఆదివారం ఎండ్కార్డ్ పడింది. అందరూ అనుకున్నట్లుగానే సింపతీ వర్కవుటై రైతుబిడ్డ విన్నర్గా నిలిచాడు. ఈ సీజన్ రియాలిటీ షో రన్నరప్గా అమర్దీప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే దాదాపు వంద రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ షో గ్రాండ్గా ముగిసింది. ఈ షో అనంతరం బిగ్బాస్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ ఇవ్వడం కామన్. అందరిలాగే రన్నరప్ అమర్దీప్ సైతం ఇంటర్వ్యూకు హాజరైన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో ఇంటిసభ్యుల గురించి అమర్దీప్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమర్దీప్ మాట్లాడుతూ.. 'మొదటి 5 వారాలకే నా ఫర్మామెన్స్కు ఎలిమినేట్ అయిపోతానని డిసైడ్ అయిపోయా. రన్నరప్ అయినప్పటికీ నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. నేను ఎవరినైతే దేవుడిగా భావించానో ఆయనే కోట్ల ప్రజల ముందు ఒక అభిమానిగా నన్ను గుర్తించాడు. నా దృష్టిలో నేను గెలిచాను. శోభాశెట్టి, ప్రియాంక విషయాకొనిస్తే నాకు ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువ కాదు.' అని అన్నారు. ఆ తర్వాత శివాజీ హౌస్లో ఉండగానే ప్రశాంత్ను విన్నర్ను చేసే పోతానని చెప్పారు కదా.. దీనికి మీ సమాధానమేంటి? అని అమర్దీప్ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ' మీరు అలా చెప్పి అనవసరంగా ఆయన్ను పైకి లేపకండి'.. ఆయన గేమ్ ఆడుకుని బయటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ తన గేమ్ తాను ఆడుకున్నాడు. కప్ కొట్టాడు అంతే' అని చెప్పారు. ఆ తర్వాత శివాజీ హౌస్లో లేకపోతే యావర్, ప్రశాంత్ను మీరంతా ఎప్పుడో తొక్కేసేవాళ్లా? అని మరో ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'నీ బలమేంటో తెలుసుకో.. పక్కోన్ని నమ్ముకో.. పక్కన పెట్టుకో.. ముందుకు రా..' అని సమాధానమిచ్చాడు. దీంతో ప్రోమో ముగిసింది. అయితే ఈ షో ముగిసిన తర్వాత అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. -
బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?
మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్-7 ముగియనుంది. చివరి వారంలో హౌస్లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీంతో వంద రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ షో విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో చివరి వారంలో ఫైనలిస్టుల జర్నీ గురించి బిగ్బాస్ ఆడియన్స్కు పరిచయం చేస్తున్నారు. మొత్తంగా ఈ వారాన్ని ఎమోషనల్ ఎపిసోడ్గా మార్చేసిన బిగ్బాస్.. మొదటి రోజు అమర్, అర్జున్ని వీడియోలను చూపించిన ఏడిపించేశారు. రెండో రోజు శివాజీతో స్టార్ట్ చేసి.. చివరీకీ ప్రియాంక ఎమోషనల్ జర్నీతో ముగించాడు బిగ్బాస్. అలా ఫైనలిస్టులైన వారిలో ఇంకా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ జర్నీ మూడో రోజు ఆడియన్స్కు చూపించనున్నారు. తాజాగా ప్రిన్స్ యావర్ జర్నీకి సంబంధించిన ప్రోమో రిలీజైంది. అయితే యావర్ పట్టుదల అద్భుతమని బిగ్బాస్ కొనియాడారు. దీంతో యావర్ ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నాడు. మిడ్ వీక్లో ఎవరు అవుట్? అయితే ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్న సంగతి తెలిసిందే. మరీ వారం మధ్యలో హౌస్ నుంచి ఎవరు బయటికొస్తారు? టాప్-5 లో ఎవరెవరు నిలుస్తారు అనే విషయంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆ ఒక్కరు ఎవరన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికైతే పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్ టాప్-5లో నిలుస్తారని తెలుస్తోంది. మరో వైపు అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్లో ఎవరో ఒకరు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ మిడ్ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
అతన్ని ఆ మాట అనకుండా ఉండాల్సింది: శోభా శెట్టి ఎమోషనల్
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ చివరి ఘట్టానికి చేరుకుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న షో మరో వారంలో ముగియనుంది. ఈ వారంలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండగా.. చివరి వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్లో ఉండనున్నారు. ఇప్పటికే ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో కూడా తెలిసిపోయింది. బిగ్బాస్ హౌస్లో ఉన్న ఏడుగురిలో శోభాశెట్టి బయటకు రానుంది. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో హోస్ట్గా నాగార్జున 14 వారాల్లో మీరు పశ్చాత్తాప పడిన సందర్భం ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. దీనికి హౌస్మేట్స్ అందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. (ఇది చదవండి: నా సామిరంగ.. నిన్ను ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా!) మొదట అంబటి అర్జున్ మాట్లాడారు. కేవలం బలం ఉంటే సరిపోదు.. బలంతో పాటు జనాల ప్రేమ కూడా కావాలనేది ఆ వారంలో తెలిసింది సార్ అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టి మాట్లాడుతూ యావర్ను పిచ్చోడా అని అనేశాను. తాను ఆ మాట అనకుండా ఉండాల్సింది అన్నారు. ఆ తర్వాత యావర్ మాట్లాడుతూ 11 వారంలో ఫౌల్ జరిగింది.. కానీ నేను అది కావాలని చేయలేదు అన్నాడు. ఆ తర్వాత 14 వారంలో నేను వాడిన పదాలు నా వ్యక్తిగత అనుకున్నా.. కానీ అది ఇతరులకు టచ్ అవుతుందనేది మీరు చెప్పాక తెలిసిందని శివాజీ అన్నాడు. నేను అన్నది పొరపాటు అయిండొచ్చు.. నేను అన్న మాటల్లో ఆ పదం అనుకోకుండా దొర్లింది. నా కోసం నేను స్టాండ్ తీసుకున్నప్పుడు ఏది జరగలేదు అన్నారు. అయితే నాగార్జున శివాజీని ఉద్దేశించి బతుకు.. బతికించు అన్న పదం వాడావు.. అది నీ ఫీలాసఫీ అని నాకు అర్ధమైంది అన్నారు. దీంతో ప్రోమో ముగిసింది. మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఎక్కడ తప్పు చేశారో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. (ఇది చదవండి: ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపించి షాకిచ్చిన హీరో.. ఎందుకంటే?) -
హోస్లో పాము, ఊసరవెల్లి లాంటి వాళ్లు ఉన్నారు.. అశ్విని కామెంట్స్ వైరల్!
సెల్ఫ్ గోల్ వేసుకుని బిగ్బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అశ్విని. డబుల్ ఎలిమినేషన్ ఉందని చెప్పినా.. తనకు తానే సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. దీంతో హోస్ నుంచి బయటకి వచ్చేసింది. తాజాగా బిగ్బాస్ ఎగ్జిట్ ఇంటర్వ్యూకు హాజరైన అశ్విని ఇంటి సభ్యుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. హౌస్లో రెండు గ్రూపులు ఉన్నాయి.. నాకు ఎవరితోనూ సెట్ కాలేదు.. దీనికంటే హౌస్ నుంచి వెళ్లిపోవడమే మేలని అనిపించిందని అశ్విని చెప్పుకొచ్చింది. సరైన కారణాలు కనిపించక సెల్ఫ్ నామినేట్ చేసుకున్నా. వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చే సమయానికి అప్పటికే ఉన్నవాళ్లు మమ్మల్ని వాళ్లతో కలుపుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. బిగ్బాస్కు ఎందుకు వచ్చావో తెలియదు. ఏం చేస్తున్నావో తెలియదు.. అశ్విని నీ వల్ల బిగ్బాస్ ఫ్యాన్స్కు ఏం ఉపయోగం అంటూ ఓ అభిమాని చేసిన కామెంట్కు బిగ్బాస్ కంటెస్టెంట్ అశ్విని ఎమోషనల్ అయింది. నేను ఏం చేస్తే వాళ్లకేందుకుండి అంటూ బాధపడింది. ఇలాంటి ప్రశ్నలు అడిగితే వెళ్లిపోతానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. శోభ, ప్రియాంక, అమర్ ఒక గ్రూప్ కాగా.. శివాజీ, ప్రశాంత్, యావర్ ఒక గ్రూప్గా తయ్యారని తెలిపింది. నాతో మాట్లాడేందుకు ఎవరూ ఆసక్తి చూపేవారు కాదని.. ఆ సమయంలో మానసికంగా చాలా వేదన అనుభవించానని వెల్లడించింది. కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. ప్రియాంకను ఊసరవెళ్లితో పోల్చింది అశ్విని. పైకి ఒకలా కనిపిస్తుంది.. కానీ లోపల ఆమె వేరేలా ఉంటుందని చెప్పింది. ప్రశాంత్కు భజన చేశారా? అని ప్రశ్నించగా.. భజనేంటండి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. శివాజీ పాములాంటి వారని తెలిపింది. అందుకే హౌస్లో ఒక పెద్ద పాము ఉందని అనాల్సి వచ్చిందని పేర్కొంది. -
'మీ దోస్తాన్ మళ్లీ స్టార్ట్ చేసిర్రు'.. నా కళ్లు తెరుచుకున్నాయన్న రైతు బిడ్డ!
బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్ సీజన్-7 మరో వారం ముగిసింది. గతవారం ఎవరిని ఎలిమినేట్ చేయని బిగ్బాస్.. ఈ సారి ఏకంగా ఇద్దరిని ఇంటికి పంపించేశాడు. ఇప్పటివరకు హౌస్లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ ముగియడంతో మళ్లీ నామినేషన్స్ పర్వం మొదలైంది. ఇప్పటి నుంచి టాప్-5 లో నిలిచేందుకు టఫ్ ఫైట్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియలో వాదనలు వేరే లెవెల్లో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. ప్రోమో ప్రారంభంలోనే యావర్ను నామినేట్ చేస్తూ శోభాశెట్టి.. గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అంటూ చెప్పింది. దీనికి నువ్వు చూశావా అని యావర్ అడగడంతో.. నేను చూడలేదంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్ను అమర్ నామినేట్ చేశాడు. దీంతో రైతు బిడ్డ ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. దీంతో అమర్.. పోరా కూర్చోపో.. ఎలిమినేట్ చేయను పో అన్నాడు. దీనికి అన్నా నిన్ను నమ్మినందుకు నేను బాధపడతున్నా అంటూ ప్రశాంత్ మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వతా శివాజీని నామినేట్ చేస్తూ మధ్యలో ప్రశాంత్ టాపిక్ తీసుకొచ్చాడు గౌతమ్. నేను ఎప్పుడైనా యావర్, ప్రశాంత్కు సపోర్ట్ చేశానా? అని గౌతమ్ను ప్రశ్నించాడు. ఆ తర్వాత గౌతమ్ను అమర్ నామినేట్ చేశాడు. నాకు సపోర్ట్ చేస్తా అని మోసం చేశావ్ అన్నాడు. మధ్యలో శివాజీ ఎంటరయ్యాడు. వాంటెడ్గా చేస్తుంటే జనాలేమైనా పిచ్చోళ్లా ఇక్కడ ఉంచడానికి అని గౌతమ్ ఫైరయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ను శోభా నామినేట్ చేస్తూ.. నువ్వు చాలా సేఫ్గా ఆడావు.. నీవల్లే అమర్ కెప్టెన్సీ పోయిందంటూ నామినేట్ చేసింది. దీనికి ఆశ్చర్యపోయిన ప్రశాంత్ అన్నా.. నా వల్లే కెప్టెన్సీ పోయిందా? అని అమర్ను అడిగాడు. దీనికి ప్రశాంత్పై ఓ రేంజ్లో ఫైర్ అయింది శోభా. దీనికి మీరు మళ్లీ దోస్తాన్ స్టార్ట్ చేసిర్రు.. నా కళ్లు ఇప్పడే తెరుచుకున్నాయి అన్నాడు ప్రశాంత్. దీనికి శోభా.. అవును బరాబర్ ఆ రోజు సేఫ్ గేమ్ ఆడింది పల్లవి ప్రశాంత్ అంటూ గట్టిగానే వాదించింది. దీంతో ప్రోమో ముగిసింది. ఎవరు, ఎవరినీ నామినేట్ చేశారనేది పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
శివాజీని చేతులెత్తి వేడుకున్న అమర్దీప్.. ఎందుకంటే?
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం సీజన్-7 12వ వారానికి చేరుకుంది. గతవారం ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్బాస్.. ఈ వారంలో ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని హింట్ ఇచ్చాడు. మరీ ఈ వారంలో ఎవరు బయటకు రానున్నారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. అయితే ఈలోగా సేఫ్ అయ్యేందుకు ఉన్న అవకాశాల కోసం కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. తాజా ఎపిసోడ్లో కెప్టెన్ కంటెండర్ పోటీని బిగ్ బాస్ నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరో వారసుడు తెరంగేట్రం.. డైరెక్టర్గా ఎవరంటే?) ప్రోమో చూస్తే అయితే ఈ పోటీలో చివరికీ అమర్, అర్జున్ మాత్రమే ఫైనల్గా కెప్టెన్ పోటీలో నిలిచినట్లు తెలుస్తోంది. గతవారంలో తృటిలో కెప్టెన్సీ కోల్పోయిన అమర్దీప్ బోరున ఏడ్చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే తరహాలో హౌస్లో హంగామా చేశాడు. అమర్, అర్జున్ విషయంలో శివాజీ, శోభాశెట్టి తన అభిప్రాయాలు బిగ్బాస్కు వెల్లడించారు. కెప్టెన్సీ పోటీలో అర్జున్కు వ్యతిరేకంగా శోభాశెట్టి తన నిర్ణయాన్ని వెల్లడించింది. కెప్టెన్ అయ్యేందుకు నీకెంత అర్హత ఉందో.. అమర్కు అంతే ఉందని చెప్పింది. ఆ తర్వాత శివాజీ కెప్టెన్సీ పోటీలో అర్జున్కు మద్దతుగా నిలిచారు. దీంతో అమర్దీప్, శివాజీని బతిమాలాడారు. ప్లీజ్ అన్న.. అర్థం చేసుకో.. ఇప్పుడు అవకాశం వచ్చింది.. పోగోట్టకన్నా.. నీకు దండం పెడతా అంటూ రెండు చేతులతో మొక్కాడు. నువ్వు కెప్టెన్ అవ్వడం కోసం ఏడుస్తున్నావేంట్రా? అని శివాజీ అన్నాడు. నేను కెప్టెన్ అవ్వాలన్నా అంటూ శివాజీని వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు అమర్. కానీ చివరికీ నేను దేనికి పనికిరాను అంటూ అమర్ ఎమోషనలయ్యాడు. ఆ తర్వాత అమర్ ఫోటో మంటల్లో కాలిపోతూ ఉండగా ప్రోమో ముగిసింది. మరీ ఈ వారం కెప్టెన్సీ ఎవరినీ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. (ఇది చదవండి: ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ!) -
'నా లైఫ్లో ఎవ్వరూ ఇలా చేయలే'.. రైతు బిడ్డ ఎమోషనల్!
బిగ్ బాస్ సీజన్-7 పదకొండో వారానికి చేరుకుంది. ఇప్పటికే మొదటి రెండు రోజులు నామినేషన్ల ప్రక్రియతో హౌస్లో ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ వారం ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్లో ఉన్నారు. రైతు బిడ్డ ప్రశాంత్ మాత్రమే నామినేట్ కాలేదు. ఇక నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో బిగ్ బాస్ మరో కొత్త టాస్క్ ఇచ్చారు. కంటెస్టెంట్స్ మధ్య ర్యాంకుల పోటీ తీసుకొచ్చారు. మీలో మీరు కొట్టుకుని చావండి.. నన్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అన్నరీతిలో ర్యాంకింగ్ గొడవ తెచ్చారు. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఆ ర్యాంకింగ్ పోటీ ఏ రేంజ్లో సాగిందో అర్థమవుతోంది. (ఇది చదవండి: ఎయిర్పోర్ట్లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్!) ప్రోమోలో పల్లవి ప్రశాంత్కు నంబర్వన్ ప్లేస్ ఇస్తానని శివాజీ చెప్పారు. దీంతో పల్లవి ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. నా లైఫ్లో ఎవ్వరు చేయలే.. అన్న చేసిండు.. పల్లవి ప్రశాంత్ సీజన్-7 ఫస్ట్ కెప్టెన్.. అంటూ గుండెలపై బాదుకున్నాడు. ఆ తర్వాత రతికా మాట్లాడుతూ.. ఫస్ట్ నాలుగు వారాలు నీ గేమ్ ఏమీ లేదు. నీకు ఒకరు హెల్ప్ చేస్తున్నది కనిపియట్లే. నీకు సొంతంగా ఆడుతున్నవో.. గ్రూపుగా ఆడుతున్నావో కనిపియట్లేదు అని అనడంతో.. అక్కా.. నువ్వు మా అమ్మ, బాపును తిట్టినవ్..గడ్డం గీకెస్తా అన్నావ్ అంటూ ప్రశాంత్ ఎమోషనల్ అయ్యాడు. ఇదేనా ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాద అంటూ యావర్పై అశ్విని మండిపడింది. దీంతో వెంటనే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు.. డోంట్ టీచ్ మీ దట్.. అని యావర్ అన్నాడు. ఆ తర్వాత మొదటి పది ర్యాంకుల్లో నిలిచిన వారికి బిగ్ బాస్ ఊహించని విధంగా షాకిచ్చాడు. ఈ సీజన్ ఉల్టా- పుల్టా అని మనకు తెలిసిందే. దీంతో ఆటలో వీకెస్ట్ అనిపించిన వారికే అంటే.. చివరి ఐదు స్థానాల్లో నిలిచిన వారికే ఎవిక్షన్ పాస్ పొందే అవకాశముందని ప్రకటించాడు. దీంతో ఎవిక్షన్ పాస్ కోసం ఐదుగురు కంటెస్టెంట్స్కు ఓ టాస్క్ ఇచ్చాడు. చివరి ఐదు స్థానాల్లో ఉన్న అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక పోటీపడ్డారు. మరీ ఈ గేమ్లో ఎవరు గెలిచారు? ఎవరినీ ఎవిక్షన్ పాస్ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. (ఇది చదవండి: ఈ చిన్నారులిద్దరూ ఇప్పుడు హీరోహీరోయిన్స్.. గుర్తుపట్టారా?) -
అతను రైతుబిడ్డ.. నేను పాటబిడ్డ.. శివాజీని ఎప్పుడలా చూడలేదు!
బిగ్ బాస్ సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పదకొండో వారానికి చేరుకున్న తెలుగువారి రియాలిటీ షో ఈసారి మరింత సరికొత్తగా ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన భోలె షావలి పదో వారం ఎలిమినేట్ అయ్యారు. హోస్లో ఉన్నది కొద్ది వారాలే అయినా.. తన పంచ్లు, పాటలతో అందరినీ అలరించాడు. అయితే హౌస్లో ఉన్నన్ని రోజులు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్కు సపోర్ట్గా నిలిచాడనే అభిప్రాయాన్ని చాలామంది వ్యక్తం చేశారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన భోలె షావలి తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పల్లవి ప్రశాంత్, శివాజీకి మద్దతుగా ఉన్నారన్న విషయంపై ఆయన ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. అదేంటో చూద్దాం. భోలె షావలి మాట్లాడుతూ..' నేను వైల్ట్ కార్డ్పై హౌస్లోకి వెళ్లా. కానీ నేను ప్రశాంత్ బిగ్ బాస్లోకి వెళ్లకముందే అతని వీడియోను స్టేటస్గా పెట్టుకున్నా. ఇది చూసిన ప్రశాంత్ క్లోజ్ ఫ్రెండ్ గన్ను అనే వ్యక్తి నన్ను అడిగాడు. సార్.. మీరు ఏంటి ఇలా పెట్టారని అడిగాడు. అవును.. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న నాకే ఆలాంటి ఐడియా రాలేదు. అలాంటిది అతను పోరాడుతుంటే ప్రోత్సహించడం నా ధర్మం అని చెప్పా. కట్ చేస్తే ఇద్దరం బిగ్బాస్లో ఉన్నాం. అతను రైతు బిడ్డ.. నేను పాట బిడ్డ అంతే. కానీ మీరు అలా అనుకుంటే నేను ఏం చేయలేను. శివాజీ, నేను ఇండస్ట్రీలో ఉన్నాం. ఆయన పెద్ద నటుడిగా ఉండి.. బిగ్ బాస్కు వెళ్లడమే గొప్ప. అంతే ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ వల్లే నేను అలా మారిపోయా. ఆయనను కంటెస్టెంట్గా ఎప్పుడూ చూడలేదు. శివాజీని ఒక హీరోలాగానే చూశాను. కానీ నేను హీరో అవుతానని మాత్రం ఎప్పుడు అనుకోలేదు.' అని అన్నారు. కాగా.. భోలె షావలి బిగ్బాస్లో తన మాటలు, పాటలతో ప్రేక్షకులను అలరించారు. -
'ఎవ్వరివీ అంత పెద్ద జాతకాలు కావు'.. రారా అంటూ ఊగిపోయిన అమర్!
ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్న మాటను అందరూ పాటిస్తున్నట్లు ఉన్నారు. బిగ్ బాస్ సీజన్-7లో పదకొండో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. మొదటి రోజే బిగ్ బాస్ హౌస్ను గత వారంలో మహారాణుల పాత్ర పోషించిన నలుగురు హీటెక్కించేశారు. ఈసారి నామినేషన్ల పర్వంలో ఎప్పుడు లేనంతగా వాదనలు మొదలయ్యాయి. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ ప్రతి విమర్శలతో హాట్ హాట్గా సాగింది. రతికా, శోభా, ప్రియాంక, అశ్విని ఇలా వీరిలో ఎవరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు రైతుబిడ్డ, అంబటి అర్జున్ మధ్య ఏకంగా చిన్నపాటి వార్ నడిచింది. ప్రస్తుతం పదిమంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్లో ఉండగా.. నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగనుంది. తాజాగా రెండో రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవీ చూస్తే రెండో రోజు హౌస్ మరింత హాట్ హాట్గా సాగినట్లు కనిపిస్తోంది. నామినేషన్ సమయంలో అమర్దీప్, యావర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. యావర్ను నామినేట్ చేస్తూ.. గతం తవ్వుకుంటే ఎవ్వరివీ అంతా పెద్ద జాతకాలు కావు ఇక్కడ అని అమర్ అన్నాడు. వీరిద్దరి మధ్యలో రతికా ఎంటర్ కావడంతో అమర్ మరింత రెచ్చిపోయాడు. స్ప్రైట్ కోసం నామినేషన్ చేశావంటూ యావర్ను అమర్ అనడంతో.. నామినేషన్ కోసం అమర్ చెప్పే పాయింట్ రెండో, మూడో వారానిదా అని యావర్తో రతిక అన్నారు. దీంతో అమర్, యావర్ మధ్య ఫైట్ మొదలైంది. ఆ తర్వాత ఒకరినొకరు మీది మీదికి దూసుకొచ్చారు. రారా..నువ్వు రా.. అంటూ కొట్టుకున్నంత పనిచేశారు. దీంతో ఇద్దరి మధ్యలో శివాజీ ఎంటరై సర్ది చెప్పాలిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అమర్ కావాలి.. అమర్ పోవాలి.. అంటూ గట్టిగా వెటకారంగా స్లోగాన్స్ ఇచ్చాడు అమర్. పాత విషయాన్ని గుర్తు చేసి.. నిజంగా వేయాలంటే.. నిన్ను అప్పుడే నామినేషన్స్లో వేసేసేవాడినని అమర్ అన్నారు. ఆ తర్వాత ఎమోషన్ ఇజ్ ది లూజ్ మోషన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్.. ఆ ఫ్లోను మనం కంట్రోల్ చేయలేం అని గౌతమ్ అనగా.. అది కంట్రోల్ చేసుకోవాలిరా.. మంచిదిరా అని కెప్టెన్ శివాజీ అనడంతో ప్రోమో ముగిసింది. -
Bigg Boss 7 : అమ్మాయిలపై శివాజీ వెకిలి కూతలు.. ఇదేం పద్దతి బాసూ..?
బిగ్బాస్ షోలో కంటెస్టెంట్స్ ఏదైన తప్పు చేసిన.. తప్పుడు మాటలు మాట్లాడినా.. వీకెండ్లో హోస్ట్ నాగార్జున ఫుల్ క్లాస్ తీసుకుంటాడు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఎవరు నోరు జారినా.. సహించడు. అలాంటి నాగ్.. సీజన్ 7లో మాత్రం శివాజీ బూతు పదాలు వాడినా.. అబద్దాలు ఆడినా.. జస్ట్ లైట్ అంటూ పూర్తి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. అతను చేసిన తప్పులను కూడా ధైర్యంగా చెప్పలేక..సున్నితంగా హెచ్చరిస్తున్నారు. అమ్మాయిలపై వెకిలి కూతలు బిగ్బాస్ హౌస్లో గేమ్ ఆడకుండా పదివారాల పాటు నెట్టుకొస్తున్న ఏకైక కంటెస్టెంట్స్ శివాజీ. ఇప్పటి వరకు హౌస్లో శివాజీ పొడిచిందేమి లేదు కానీ.. మాయ మాటలతో కంటెస్టెంట్స్ని బురుడి కొట్టిస్తూ నెట్టుకొస్తున్నాడు. చెప్పేవి శ్రీరంగ నీతులు..చేసేవి దొంగ పనులు అన్నట్లుగా శివాజీ ప్రవర్తన ఉటుంది. ఇతురులకేమో ఇలా మాట్లాడొద్దు.. అలా ఆడొద్దని చెబుతాడు..తన వరకు వస్తే మాత్రం వెంటనే మాట మారుస్తాడు. ఈ వారం నామినేషన్ ప్రక్రియలో రాజమాతలుగా వ్యవహరించిన శోభ, రతిక, ప్రియాంక, అశ్వినిలను ఉద్దేశిస్తూ..బూతులు వ్యాఖ్యలు చేశాడు. తన మాటని వినకపోవడంతో ‘రాజ మాతలు..**** పగుల్తాయ్’ అంటూ అసభ్యకర పదాలు వాడాడు. అందంతా రికార్డు అయింది. దాన్ని శనివారం ఎపిసోడ్లో కూడా మళ్లీ ప్లే చేశారు. శివాజీ కాబట్టే.. అలాంటి బూతులు ఎవరైనా మాట్లాడితే.. నాగార్జున ఒంటికాలుపై లేస్తాడు. అమ్మాయిలను అలా అంటారా అంటూ రెచ్చిపోయి క్లాస్ పీకేవాడు. కానీ అక్కడ ఆ పిచ్చి కూతలు కూసింది శివాజీ కాబట్టి..సున్నితంగా హెచ్చరించి ముంగించేశాడు. ఇక మన నటరత్నం శివాజీ అయితే ఈజీగా మాట మార్చేస్తూ.. ‘నేనేదో సరదాగా అన్నాను బాబుగారు’ అంటూ కమల్ హాసన్ రేంజ్ ఫెర్పార్మెన్స్ ఇచ్చాడు. అది చూసి ఫిదా అయినా నాగ్..‘సరదాగానైనా సరే అలాంటి మాటాల్ని వాడకపోవడం మంచిది’అని సున్నితంగా హెచ్చరించి వదిలేశాడు. అయితే అక్కడే షో చూస్తున్న ఓ ప్రేక్షకుడు మాత్రం శివాజీ సరదాగా ఆ మాటలు అనలేదని, ఇప్పుడేదో వివరణ ఇచ్చుకునేందుకు అలా చెబుతున్నాడని, ఆయన కోపంతోనే అన్నట్లుగా వీడియో చూస్తే అర్థమవుతుందని చెప్పాడు. అతనొక్కడే కాదు.. షో చూస్తున్న ప్రేక్షకులందరికి శివాజీ మాటమార్చారనే విషయం అర్థం అయింది. కానీ నాగార్జున మాత్రం అతన్ని గట్టిగా హెచ్చరించలేకపోయాడు. ఇతరుకు మాస్ వార్నింగ్ ఇచ్చే నాగార్జున.. శివాజీకి మాత్రం ‘క్లాస్’ గా క్లాస్ తీసుకుంటున్నాడు. పోనీ..శివాజీ ఏమన్నా ఈ ఒక్కసారే అలా చేశాడా అంటే అదీ కాదు. గతంలో అనేకసార్లు ఇలాంటి బూతు వ్యాఖ్యలు చేశాడు. లెక్కలేనన్ని అబద్దాలు ఆడారు. గౌతమ్ కృష్ణ అప్పుడప్పుడు అతని నిజస్వరూపాన్ని బయటపెడతున్నాడు. కానీ శివాజీ మాత్రం తన నటనానుభవంతో తోటి కంటెస్టెంట్స్ని బురుడీ కొట్టిస్తున్నాడు. శివాజీ కోసమే ఆ టాస్క్? ఈ వారం కెప్టెన్సీ బరిలో శివాజీ, అర్జున్ ఉన్నారు. ఎలాంటి ఫిజికల్ టాస్క్ పెట్టిన అర్జున్ ఈజీగా గెలుస్తాడు. ఈ విషయం నాగార్జునతో పాటు బిగ్బాస్ నిర్వాహకులకు కూడా తెలుసు. అందుకే శివాజీని కెప్టెన్సీ చేయడం కోసం ఫిజికల్ టాస్క్ పెట్టకుండా హౌస్మేట్స్ నుంచి రహస్య అభిప్రాయ సేకరణ నిర్వహించారు. నిర్వాహకులు ఊహించినట్లే అంతా శివాజీకే ఓటు వేశారు. దీంతో వారనుకున్నట్లుగానే శివాజీని కెప్టెన్ అయ్యాడు. అయితే ఇక్కడ శివాజీ పొడిచిందేమి లేదనే విషయం షో చూస్తున్న ప్రేక్షకులందరికి తెలుస్తుంది. -
బిగ్ బాస్ సెంటిమెంట్ ప్లాన్.. ఆ కంటెస్టెంట్కు శాపమైందా?
బిగ్ బాస్ సీజన్-7 తొమ్మిది వారాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటి వరకు హాట్ హాట్గా సాగిన హౌస్.. ఈ వారం ఫుల్ ఎమోషనల్గా మార్చేశాడు బిగ్ బాస్. పదో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. రెండో రోజు నుంచే కంటెస్టెంట్లకు సర్ప్రైజ్లు ఇచ్చారు. తొలిరోజే శివాజీ కుమారుడు, అర్జున్ భార్య, అశ్విని మదర్ను పంపి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఆ తర్వాత రెండో రోజు గౌతమ్ తల్లి, ప్రియాంక ప్రియుడు శివ కుమార్, భోలే భార్యను హౌస్లో పంపి కంటెస్టెంట్స్ను ఏడిపించేశారు. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అయితే మూడో రోజు కూడా హౌస్లో ఎమోషనల్ సీన్స్ మరింత పీక్స్కు చేరాయి. మూడో రోజు అమర్ భార్య, శోభాశెట్టి తల్లి, యావర్ బ్రదర్ వచ్చి కంటెస్టెంట్స్తో పాటు ఆడియన్స్ను సైతం కంటతడి పెట్టించారు. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, తన బ్రదర్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. మొత్తానికి ఈ వారంలో టాస్కులు, గేమ్స్ లేకుండా పూర్తిగా ఫ్యామిలీ వీక్గా మార్చేశారు బిగ్ బాస్. ఇప్పటివరకు మిగిలింది ఇద్దరు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. హౌస్లో ఉన్న రైతుబిడ్డ, రీ ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. వీరిద్దరికి సంబంధించి శుక్రవారం సర్ప్రైజ్ ఇచ్చే అవకాశముంది. అయితే ఫ్యామిలీ ఎమోషన్ పక్కన పెడితే.. అందరి దృష్టి ఈ వారం ఎలిమినేట్ ఎవ్వరనే దానిపైనే ఉంది. గతవారంలో చివరికీ దాకా వచ్చి రతికా రోజ్ సేఫ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం నామినేషన్స్లో శివాజీ, యావర్, గౌతమ్, రతికా, భోలె మాత్రమే ఉన్నారు. ఇక ఓటింగ్కు ఒక్క రోజు మాత్రమే సమయముంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో శివాజీ, యావర్, గౌతమ్, భోలెకు గ్రాఫ్ పెరగడంతో పాటు ఓటింగ్ శాతం మెరుగయ్యే అవకాశముంది. కానీ గతవారమే తృటిలో ఎలిమినేషన్ తప్పించుకున్న రతికా కుటుంబ సభ్యులు ఇంకా హౌస్లోకి రాలేదు. దీని ప్రభావం రతికా ఎలిమినేషన్పై పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శుక్రవారం రతికా కుటుంబ సభ్యులు హౌస్లోకి వచ్చినా అంతగా వర్కవుట్ కాదు. ఎందుకంటే ఓటింగ్ సమయం రేపటితోనే ముగియనుంది. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్లో లేడు కాబట్టి.. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడొచ్చినా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దీంతో ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ వీక్ రతికాపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమె పేరే ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్తో కంటెస్టెంట్స్ను ఏడిపించిన బిగ్ బాస్.. ఎవరినీ బయటికి పంపిస్తాడో వేచి చూద్దాం. (ఇది చదవండి: తల్లి కాళ్ల మీద పడ్డ శోభ.. ఏడిపించేసిన ప్రిన్స్ యావర్ బ్రదర్స్..) -
హౌస్ ఫుల్ ఎమోషన్.. బిగ్ బాస్లో సీమంతం వేడుకలు!
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మరో వారం మొదలైంది. ఇప్పటికీ తొమ్మిది వారాలు పూర్తి కాగా.. గత వారంలో టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యారు. సోమవారం రాగానే హౌస్లో నామినేషన్ల పర్వం మొదలవుుతంది. నామినేషన్ల మొదటి రోజే కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ సారి కాస్తా ప్రత్యేకంగా మహారాజ్యంలో జరుగుతాయని తెలిపారు. దీంతో నామినేషన్స్ ప్రక్రియ కాస్తా ఆసక్తిని పెంచింది. అలా ఈ వారంలో జరిగిన నామినేషన్స్లో ఏర్పాటు చేసిన రాజ్యంలో శోభ, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా ప్రకటించాడు. శంఖారావం వచ్చిన ప్రతిసారి ఇద్దరు కంటెస్టెంట్లు కత్తులను బయటకు తీసి.. మిగిలిన వారిలో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. ఆ ఇద్దరిలో ఎవరి నామినేషన్ సబబు అనిపిస్తే వారిని రాజమాతలు నేరుగా నామినేట్ చేస్తారు. అయితే ఈ వారంలో భోలె షావళి, శివాజీ, గౌతమ్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్స్లో నిలిచారు. ఇక నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో బిగ్ బాస్ హౌస్ను ఫుల్ ఎమోషనల్గా మార్చేశారు. ఈ వారంలో కంటెస్టెంట్స్కు ఊహించని సర్ప్రైజ్లతో ముందుకొచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోలో శివాజీ కుమారుడిని డాక్టర్గా పంపించి హౌస్లో ఎమోషన్ పండించారు. శివాజీకి సర్ప్రైజ్ తాజాగా రిలీజైన ప్రోమోలో మరో కంటెస్టెంట్ అంబటి అర్జున్కు బిగ్ బాస్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన భార్య సురేఖ హౌస్లోకి తీసుకొచ్చారు. దీంతో తన భార్యను చూసిన అర్జున్ ఫుల్ ఎమోషనలయ్యాడు. భార్య, భర్తల అనుబంధం ఏంటనేది వీళ్లిద్దరి చూస్తే తెలిసిపోతుంది. హౌస్లో అడుగుపెట్టిన అర్జున్ భార్య.. భర్తకు గోరుముద్దలు తినిపించింది. నీ ఎమోషన్స్ను బయటపెట్టు.. నువ్వు సరిగా రియాక్ట్ అవ్వట్లేదంటూ తన భర్తకు సలహాలు కూడా ఇచ్చింది. ఇది చూసిన శివాజీ.. దిస్ ఇజ్ లైఫ్ అంటూ కొటేషన్ ఇచ్చేశాడు. అర్జున్ భార్యకు సీమంతం అయితే ప్రస్తుతం అర్జున్ భార్య గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. హోస్లో అడుగుపెట్టిన ఆమెకు కంటెస్టెంట్స్ అందరూ కలిసి సీమంతం వేడుక నిర్వహించారు. హౌస్మేట్స్ ఎంతో సంతోషంగా ఆమెకు సీమంతం నిర్వహించడంతో అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు. భార్య సీమంతం చూసి చిన్న పిల్లాడిలా ఏడుస్తూ కనిపించారు. ఆ తర్వాత ఆమె హౌస్ నుంచి బయటకెళ్తుండగా ఫుల్ ఎమోషనలయ్యారు. ఈ ప్రోమోలు చూస్తే మొత్తానికి బిగ్ బాస్ హౌస్ను ఫుల్ ఎమోషనల్గా మార్చేశారు. View this post on Instagram A post shared by Nagarjuna Reddy Ambati (@ambati_arjun) -
Bigg Boss 7 : శివాజీ వారిని చెడగొడుతున్నాడు.. మానస్
బిగ్బాస్ సీజన్ 7 ఇప్పుడిప్పుడే కాస్త రసవత్తరంగా మారుతోంది. కంటెస్టెంట్స్ అంతా కాస్త సీరియస్గా గేమ్స్ ఆడుతున్నారు. పోటీలో గెలిచేందుకు వందశాతం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒకే ఒక కంటెస్టెంట్ మాత్రం సీజన్ ప్రారంభం నుంచి గేమ్ ఆడట్లేదు. అతనే శివాజీ. ప్లేయర్గా హౌస్లోకి వెళి కోచ్గా అవతారమెత్తాడు. పోని అలా అయినా న్యాయంగా ఉంటున్నాడా అంటే.. ‘అబ్బే..మనవి మాటలే’ అంటున్నాడు. నీతి ముచ్చట్లు చెప్పడమే కానీ..పాటించడం మన హిస్టరీలోనే లేదంటున్నాడు. ఇతరులకు ఓ న్యాయం తనకో న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. అయితే హౌస్లో అంతా అతని మాయ మాటలకు పడిపోతే.. గౌతమ్ కృష్ణ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా శివాజీ నిజస్వరూపం బయటపెడుతున్నాడు. మరోవైపు అమర్దీప్ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాడు కానీ.. శివాజీ తెలివిగా వ్యవహరిస్తూ..అతన్ని బకరా చేస్తున్నారు. ఈ విషయం షో వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఈజీగా అర్థమవుతుంది. తాజాగా బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ మానస్ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. శివాజీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శివాజీ లాంటి కంటెస్టెంట్ని చూడలేదు: మానస్ బిగ్బాస్ షోలో అమర్దీప్, శివాజీల మధ్య కోల్డ్వార్ జరుగుతోంది. ప్రతిసారి చిన్న చిన్న కారణాలు చెప్పి అమర్దీప్ని నామినేట్ చేస్తున్నాడు శివాజీ. అంతేకాదు తనకు నచ్చినవాళ్లు తప్పు చేస్తే సమర్థిస్తాడు.. అదే అమర్దీప్, గౌతమ్ కృష్ణ చిన్న మిస్టేక్ చేసినా..దాన్ని భూతద్దంలో పెట్టి ప్రచారం చేస్తాడు. పైగా తెలివిగా హౌస్లోని మిగతా కంటెస్టెంట్స్కి కూడా తన అభిప్రాయాన్ని రుద్దే ప్రయత్న చేస్తాడు. తాజగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని మానస్ చెప్పాడు. ‘ప్రతీ సీజన్లో శివాజీ లాంటి విలన్స్ ఉంటారు. కానీ హీరో ఎవరనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. శివాజీ కేవలం ఇద్దరి పట్ల మాత్రమే వ్యక్తిగత ఇష్టం చూపిస్తున్నాడు. మిగిలిన కంటెస్టెంట్ల గేమ్ చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటివరకు నేను రకరకాల మైండ్ సెట్ ఉన్నవాళ్లను చూశాను. కానీ శివాజీ లాంటి కంటెస్టెంట్ను ఇప్పటివరకు చూడలేదు’అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. -
నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే కుదరదు.. కెప్టెన్కు శివాజీ కౌంటర్!
బిగ్ బాస్ సీజన్- 7 తొమ్మిదో వారం మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే నామినేషన్స్లో ఉన్నవాళ్లకి ఎలిమినేషన్ టెన్షన్ మొదలైంది. ఈ వారం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అయితే ప్రస్తుతం హౌస్లో రెండు టీమ్స్ మధ్య ఛాలెంజ్ల పర్వం కొనసాగుతోంది. కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ నడుస్తుండగా ఇరు జట్ల మధ్య వాదనలు హాట్ హాట్గా సాగుతున్నాయి. (ఇది చదవండి: రాహుల్ గురించి రతికనే చెప్పింది.. బిగ్ బాస్ విన్నర్ అతనే గ్యారెంటీ: దామిని) కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం బిగ్బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది. టాస్క్లో భాగంగా గౌతమ్ టీం బిగ్బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చాడు. గౌతమ్ టీం దగ్గర బాల్స్తో.. అవతలి టీం వద్ద ఉన్న బాల్స్ను మార్చుకోవచ్చని ఆఫర్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ టీం సభ్యులు ఎగిరి గంతేశారు. అయితే బిగ్బాస్ నిర్ణయంపై శివాజీ కాస్తా అసహనం ప్రదర్శించారు. గోల్డెన్ బాల్ వాళ్లకే, అన్ని వాళ్లకేనా బిగ్ బాస్ అంటూ తనలో తాను మాట్లాడుకున్నారు. అయితే బాల్స్ మార్చుకునే సమయంలో శివాజీ, కెప్టెన్ గౌతమ్ మధ్య మాటల యుద్ధం తలెత్తింది. మీకు తగినట్లు రూల్స్ మార్చుకుంటే మీరే ఆడుకోండన్న అంటూ గౌతమ్ అనడంతో.. మధ్యలో నేను మాట్లాడతా అన్న కదా అంటూ ప్రియాంక చెప్పింది. ఆ తర్వాత నీకిష్టమొచ్చినట్లు చేయాలంటే ప్రతిసారి చేయం మేము.. ఏం చేయాలో బిగ్ బాస్ చెప్తాడు కదా.. అంతవరకు ఆగలేవా నువ్వు? నీకు అనుకూలంగా ఉన్నప్పుడేమో చాలా సైలెంట్గా ఉంటావ్.. అని శివాజీ ఫైరయ్యాడు. దీంతో నేను ఏం తప్పు చేశానో చెప్పండి అంటూ గౌతమ్ ప్రశ్నిస్తాడు. నీతో నేను మాట్లాడలేనమ్మా.. కావాలనే వాదన పెట్టుకుంటావా? అని శివాజీ అనడంతో.. ఇక్కడ ఎవరికీ అలాంటి అవసరం లేదన్న అని గౌతమ్ అనడంతో అక్కడితో ప్రోమో ముగుస్తుంది. బాల్స్ టాస్క్లో మాత్ర బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టులతో మరింత రసవత్తరంగా మారింది. హౌస్లో ఏం జరగనుందో ఇవాల్టి ఎపిసోడ్ చూస్తేనే క్లారిటీ వస్తుంది. (ఇది చదవండి: సినిమా రిలీజ్.. ఏడుస్తూ వీడియో షేర్ చేసిన హీరోయిన్!) -
శివాజీ మీద పైచేయి సాధించిన అమర్
బిగ్ బాస్ నామినేషన్స్ ఈ వారం చాలా ఫన్నీ రీజన్స్తో ముగిసింది. మంగళవారం జరిగిన నామినేషన్లో యావర్ మాస్టర్ ప్లాన్ వేసి అశ్వినిని నామినేషన్లోకి తీసుకొచ్చాడు. నామినేషన్లో పసలేని కారణాలతో రతికా రోజ్, అశ్వినిలు ఉన్నారని చెప్పవచ్చు. కానీ ఈ వారం నామినేషన్ ప్రక్రియలో శివాజీ మీద అమర్ పైచేయి సాధించాడు. ఆ కథేంటో మంగళవారం జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగిందో Day 58 హైలెట్స్ ఇప్పుడు చూద్దాం. సోమవారం ఎపిసోడ్లో ప్రశాంత్ ,ప్రియాంక,అర్జున్ ,శివాజీ,రతిక, తేజ, భోలె నామినేషన్ ప్రక్రియలో పాల్గొని వారికి నచ్చని ఇద్దరి పేర్లు చెబుతూ ఎలిమినేషన్ లిస్ట్లో చేర్చారు. మంగళవారం ఎపిసోడ్లో మొదట శోభ నామినేషన్ విదానాన్ని ప్రారంభంచింది. శోభ సరైన కారణాలతో రతికా రోజ్ను నామినేట్ చేసినా వాటిని తిప్పకొట్టడంలో రతిక విఫలమైంది. లాజికల్ పాయింట్లు లేకుండా రతిక మాట్లాడిన మాటలు చిరాకు తెప్పించాయి. ఆడియన్స్కు బాగా దొరికి పోతున్నావని ఒకానొక సమయంలో తేజ కలుగచేసుకుని రతికా రోజ్ను హెచ్చరిస్తాడు. అయినా ఆమె వినకుండా మరింత రెచ్చిపోయి పసలేని కారణాలు శోభకు చెప్పి రతిక ప్రేక్షకులకు దొరికిపోయింది. ఆ తర్వాత యావర్ను సరైన కారణంతో శోభ నామినేషన్ చేయడంతో ఆయన ఎటువంటి మాటలు మాట్లడకుండా స్వీకరిస్తాడు. యావర్తో అశ్విని ఫైట్ యావర్ మొదటగా శోభను నామినేషన్లో చేర్చగా వారిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదు. దానికి ప్రధాన కారణం యావర్ చెప్పిన సరైన పాయింట్లకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకుండాపోయింది. ఆ తర్వాత అశ్విని పేరును యావర్ లేవనెత్తుతాడు. ఆటలో కన్ఫ్యూజ్ అవుతున్నావని హౌస్లో ఉండాలంటే ఆట తీరును ఆర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని ఇవేవి నీలో లేవని అశ్వినికి తెలిపి యావర్ నామినేషన్ చేస్తాడు. అందుకు ఉదాహరణగా గతంలో అమర్ను నామినేట్ చేస్తానని చెప్పి ఆ తర్వాత ఫ్లిప్ అయి అర్జున్ను నామినేషన్ చేయడం ఏంటని యావర్ ప్రశ్నించాడు. అలా యావర్ చెప్పిన ఐదు పాయింట్లలో నాలుగు సరైనవే అనేలా ఉన్నాయి. కానీ సందీప్ మాస్టర్కు ఒక టాస్క్లో అశ్విని వాటర్ పోస్తుంది. దానిని యావర్ తప్పుబడుతూ నామినేట్ చేస్తాడు. ఇందులో ఏ మాత్రం పసలేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య నామినేషన్ ప్రక్రియ చాలా ఫన్నీగా జరుగుతుంది. శివాజీ మీద పైచేయి అమర్ చేసిన నామినేషన్లలో ఈ వారం శివాజీపై పైచేయి సాధించాడని చెప్పవచ్చు. శివాజీని ఉద్దేశిస్తూ.. అన్నా మీకు నేను ఎందుకు నచ్చనో అలాగే మీరు కూడా నాకు నచ్చరు అని ఓపెన్గానే చెబుతాడు అమర్. ఆటలో నేను మాత్రమే అరుస్తున్నాని, కేకలు వేస్తున్నానని ప్రతిసారి నన్ను నామినేషన్ చేస్తున్నావ్.. అలాగే నీ పక్కన ఉన్నవారు కూడా నామినేషన్ సమయంలో కేకలు వేస్తున్నారు కదా వారిని ఎందుకు హెచ్చరించరని సరైన పాయింట్ను శివాజీకి అమర్ వేశాడు. అప్పుడు శివాజీ కూడా వాళ్లకు వార్నింగ్ ఇచ్చాను.. చెబుతున్నాను అంటాడు. అలా చెప్పడం కాదన్నా.. నాకు ఎలా చెప్పారో వాళ్లను కూడా నామినేషన్లో నిలబెట్టి చెప్పండి అని అమర్ తెలుపుతాడు. దీంతో ఇబ్బంది పడ్డ శివాజీ ఆన్సర్ చెప్పలేక సైడ్ అయిపోతాడు. అలాగే సందీప్ మాస్టర్ను ఇంటి నుంచి పంపించావ్ అని తేజను నామినేట్ చేస్తాడు శివాజీ.. మరి సందీప్ మాస్టర్ను ఎలిమినేషన్ లిస్ట్లో పెట్టిన యావర్ను మాత్రం ఒక మాట కూడా అనలేకపోయాడు శివాజీ. ఇలా ఈ వారంలో శివాజీ దొరికిపోయాడు. ఈ వారం నామినేషన్లో ఉండేది వీళ్లే 1. అమర్ దీప్ 2. రతికా రోజ్ 3. శోభ శెట్టి 4. ప్రియాంక జైన్ 5. అర్జున్ 6. టేస్టీ తేజ 7. భోలే షావలి 8. ప్రిన్స్ యావర్ -
శివాజీ ఎమోషనల్ వీడియో.. నెటిజన్స్ దారుణ ట్రోల్స్!
తెలుగువారి రియాటిటీ షో బిగ్బాస్ సీజన్-7 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే ఈ షో 54 రోజులు పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతోంది. అయితే అందరూ పెద్దన్నగా అడుగుపెట్టిన శివాజీ అదే పాత్రను హౌస్లో చక్కగా పోషిస్తున్నారు. ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్కు మద్దతుగా నిలుస్తున్నాడని నెటిజన్స్ కూడా చాలాసార్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటికే ఈ షో మొదలై ఏడు వారాలు పూర్తి కాగ.. ఏడుగురు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారంలో మరొక కంటెస్టెంట్ ఇంటిదారి పట్టేందుకు రెడీగా ఉన్నారు. (ఇది చదవండి: టైగర్-3 ట్రైలర్.. ఆ ఒక్క ఫైట్ సీన్కు అన్ని రోజులు పట్టిందా?) శివాజీ చేతికి గాయం అయితే గతంలో శివాజీ చేతికి గాయం కావడంతో చికిత్స అందించారు. కొన్ని రోజుల చికిత్స తర్వాత మళ్లీ హౌస్లో అడుగుపెట్టారు. అయితే ఆ సమయంలో శివాజీ మాట్లాడిన ఓ వీడియోను డిస్నీ ప్లస్ హాట్స్టార్ తన అధికారిక ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో శివాజీ మాట్లాడుతూ ఫుల్ ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో శివాజీ మాట్లాడుతూ.. 'ఎవరు లేకపోతే నేనే ఏడుస్తున్నా. ఎవరైనా ఉంటే నవ్వుతూ లోపల ఏడుస్తున్నా. వాళ్లందరి ముందు నేను ఏడవలేకపోతున్నా. ఎందుకంటే అది నాకు చాలా బరువుగా ఉంది.' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఇదంతా చూసిన నెటిజన్స్ కొందరు ఆయనకు మద్దతుగా కామెంట్స్ పెడితే.. మరికొందరేమో చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఓ నెటిజన్ రాస్తూ.. శివాజీ పెద్ద కన్నింగ్ ఫెలో అంటూ పోస్ట్ చేశారు. నిజంగానే శివాజీ అన్న పెద్ద యాక్టర్ అంటూ కామెంట్ చేశాడు. బయట జరుగుతున్నవి తెలిస్తే శివాజీ అన్న ఏమైపోతాడో అని మరో నెటిజన్ రాసుకొచ్చారు. సింపథీ స్టార్, కన్నింగ్ ఫెలో అని ఒకరంటే.. చాలు చాలు.. ఇక ఓవరాక్షన్ ఆపు అంటూ చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు. కాగా.. ఈ వారంలో హౌస్లో నామినేట్ అయినవారిలో శివాజీ కూడా ఉన్నారు. అయితే తక్కువ ఓట్లు వచ్చిన శోభాశెట్టి, సందీప్ చివరి రెండుస్థానాల్లో నిలిచారు. వీరిద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాల్సిందే. (ఇది చదవండి: ప్రశాంత్, శివాజీ ముందే ప్లాన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్) View this post on Instagram A post shared by Disney+ Hotstar Telugu (@disneyplushstel) -
శివాజీ ఆడట్లేదు.. అతడు క్యారెక్టర్ వదిలేశాడు!: పూజా
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో మొదటి నుంచి మహిళా కంటెస్టెంట్స్ను ఎలిమినేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్.. 2.0లోనూ అదే సాంప్రదాయం కొనసాగించారు. వరుసగా ఏడో వారంలోనూ లేడీ కంటెస్టెంట్ పూజా మూర్తిని ఎలిమినేట్ చేశారు. అయితే హౌస్ నుంచి బయటకొచ్చిన పూజా.. కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె చాలా విషయాలు పంచుకుంది. శివాజీ వల్లే ఆ ఇద్దరు ఆడుతున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. పూజా ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చింది. (ఇది చదవండి: నాలుగు కోట్ల కారు కొన్న స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) 'పల్లవి ప్రశాంత్, యావర్కు శివాజీ సపోర్ట్గా ఉన్నారు. అంటే వాళ్ల గేమ్ వాళ్లు ఆడుతున్నారు. మనం కేవలం కొంతవరకు పుష్ చేయగలం. కానీ శివాజీ మాత్రం కాస్త ఎక్కువే సపోర్ట్ చేస్తున్నారు. వారంతా కలిసి బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. వీళ్లిద్దరికైతే అందరికంటే ఎక్కువ మద్దతు ఇస్తున్నారు. తను ఆడట్లేదు, కానీ ఆడిస్తున్నాడు. ఆడట్లేదని చెప్పి నామినేట్ చేస్తే మాత్రం అసలు ఒప్పుకోడు. ఇక అమర్దీప్ నాకు బయట కూడా బాగా తెలుసు. కానీ హౌస్లోకి వెళ్లాక పూర్తిగా మారిపోయాడు. తన ఒరిజినల్ క్యారెక్టర్ను వదిలేశాడు. నేను అందగాన్ని అంటూ రెచ్చిపోయే అమర్.. అక్కడ పూర్తిగా డీలా పడిపోయాడు. నేను అతనితో కలిసి పనిచేశా. నేను చూసిన అమర్.. లోపల కనిపిస్తున్న అమర్ వేరు. అతను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు' అని తెలిపింది. (ఇది చదవండి: స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!) -
బిగ్బాస్ నుంచి శివాజీ ఔట్.. మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా?
బిగ్బాస్ సీజన్ 7లో వివాదాస్పద కంటెస్టెంట్గా అడుగుపెట్టిన శివాజీ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు అనేకంటే పంపేశారు అని చెప్పడం కరెక్ట్. ఆదివారం ఎపిసోడ్ ముగిసిన తర్వాత చూపించిన ప్రోమోలో ఈ విషయం కనిపిస్తుంది. నయని పావని ఎలిమినేషన్ అయిన తర్వాత సడెన్గా శివాజీ కన్ఫెషన్ రూమ్లో కనిపించాడు. శివాజీ మిమ్మల్ని బయటికి తీసుకువెళ్లడం జరుగుతుందని ఆ సమయంలో బిగ్బాస్ చెప్పాడు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) దీంతో శివాజీ కూడా బయటికి వచ్చి అక్కడే ఉన్న హౌస్మెట్స్తో నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తాడు. దీంతో కంటెస్టెంట్లు అందరూ శివాజీని వెళ్లొద్దని ఆపే ప్రయత్నం చేశారు. కానీ.. అదే సమయంలో డోర్స్ ఓపెన్ అయ్యాయి. ఆ వెంటనే శివాజీ బయటికి వెళ్లిపోయాడు. గేట్స్ క్లోజ్ అయిపోయాయి. దీంతో ఆట నుంచి ఆయన బయటకు వచ్చేసినట్లే శివాజీ మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా ఐదో వారం కెప్టెన్సీ టాస్క్ లో బాగంగా వైర్స్ కింద నుంచి పాకుతూ వెళ్లే గేమ్లో శివాజీ గాయపడ్డాడు . దీని తర్వాత ఆయన పెద్దగా టాస్క్లలో పాల్గొనలేదు. భుజం చెయ్యి నొప్పి భరిస్తూనే హౌస్లో కొనసాగాడు. బిగ్బాస్లో ఎవరికైనా ఇలాంటి చిన్న ఇబ్బందికి గురైతే షో యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. గాయంతో ఇబ్బంది పడుతున్న శివాజీకి వైద్యులు సలహా మేరకే ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చి ఉంటారని తెలుస్తోంది. నేడు ఆయనకు వైద్యుల సమక్షంలో ఆయన చేతికి ఎక్స్రే వంటివి తీసి చికిత్స అందిస్తారని సమాచారం. వీలైతే ఆయన్ను సీక్రెట్ రూమ్లో మరో రెండురోజుల పాటు విశ్రాంతి కల్పించి మళ్లీ హౌస్లోకి తప్పకుండా వస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. గతంలో బిగ్బాస్-3 సీజన్లో కూడా నూతన్ నాయుడు చేతికి గాయం అయితే రెండురోజులు విశ్రాంతి ఇచ్చి మళ్లీ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సో ఈ లెక్కన శివాజీ బిగ్బాస్లోకి మంగళవారం లేదా బుధవారం తప్పకుండా రీ ఎంట్రీ ఇవ్వడం ఖాయం అని తెలుస్తోంది. -
'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్పై శివాజీ ఎమోషనల్!
ఈ ఏడాది బిగ్బాస్ చూస్తున్న వారు ఎప్పుడు కంటెస్టెంట్స్ మధ్య ఏదో గొడవ జరగడం తప్ప ఏముంది అని ఫీలవుతుంటారు. ఎందుకంటే మొదటి వారం నుంచే నామినేషన్స్, ఎలిమినేషన్స్తో హీటెక్కించారు. నాలుగు వారాలుగా హాట్హాట్గా సాగిన బిగ్బాస్.. ఐదో వారంలో మాత్రం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ప్రోమో చూస్తే హౌస్లోని కంటెస్టెంట్స్కి.. తమ కుటుంబ సభ్యుల పట్ల భావోద్వేగాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. (ఇది చదవండి: త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!) తాజాగా ప్రోమో విడుదల కాగా.. అందులోని సీన్స్ ఆడియన్స్ను సైతం కంటతడి పెట్టించేలా ఉన్నాయి. అయితే బిగ్బాస్ కంటెస్టెంట్లకు వారి ఇంటి సభ్యులు పంపించిన ఉత్తరాలు చేతికందించారు. కానీ కెప్టెన్సీ టాస్కులో భాగంగా ఇంట్లో ఉన్నవారంతా జోడీ కట్టిన సంగతి తెలిసిందే కదా! అలా ఈ జోడీలో ఒకరు త్యాగం చేస్తే.. మరొకరికి మాత్రమే ఉత్తరం చదువుకునే అవకాశం ఉంది. అంటే ఎవరో ఒకరు తమ ఉత్తరాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. దీంతో కంటెస్టెంట్ల మధ్య ఫుల్ ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. అయితే ఈ ప్రోమోలో అమర్దీప్ తన భార్యను తలుచుకుని కంటతడిపెట్టాడు. అమర్దీప్ మాట్లాడుతూ.. ఇంతవరకు తేజును బాగా చూసుకున్నానో లేదో కూడా నాకు తెలియదు. ఇక్కడ ఉన్నప్పుడు నాకు కొన్ని విలువలు తెలిసొచ్చాయి. కన్నాను చూడగానే అదే పిలిచినట్లు అనిపించింది. తేజు ఐ యామ్ సో సారీ. నీ విలువ తెలిసింది నాకు అంటూ బోరున ఏడ్చేశారు. ఆట సందీప్ కోసం తన భార్య పంపిన లెటర్ను అమర్ త్యాగం చేశాడని తెలుస్తోంది. (ఇది చదవండి: చిన్నపిల్లాడిలా ఏడ్చిన తేజ, అమ్మ అనారోగ్యంతో ఉందంటూ సందీప్..) ఇక శివాజీ, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మధ్య ఎమోషన్స్తో హౌస్ నిండిపోయింది. శివాజీ మాట్లాడుతూ..'ఎక్కడో ఊరి నుంచి వచ్చావు.. అన్న అంటూ హగ్ చేసుకున్నావ్.. నేను నా లెటర్ను గివ్ అప్ చేస్తున్నా. నా భార్య నన్ను బాగా అర్థం చేసుకుంటది. తనను నేను ఎంత బాగా చూసుకున్నానో నాకు తెలవదు కానీ.. నన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటుంది. నువ్వు నా మాట విను అంటూ' పల్లవి ప్రశాంత్ కోసం తన భార్య పంపిన లెటర్ను శివాజీ త్యాగం చేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ఈ ప్రోమో చూస్తేనే కంటెస్టెంట్స్ మధ్య భావోద్వేగాలు ఆడియన్స్ను సైతం ఫుల్ ఎమోషనల్గా టచ్ చేశాయి. ఇంకా ఈ రోజు ఎపిసోడ్లో ఎవరెవరు లెటర్స్ను త్యాగం చేశారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
ఆ కంటెస్టెంట్స్కు బిగ్ బాస్ బిగ్ షాక్.. అదేంటో తెలుసా?
ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఇక ఐదోవారం మొదలవ్వగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు పవర్ అస్త్రను సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. అయితే ఐదోవారం మొదటి రోజే పవరాస్త్రాలను బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నారు. దీంతో హౌస్లో ఈ వారంలో నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమోలో పవరాస్త్రాలను వెనక్కి తీసుకున్న తర్వాత కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: 'బిగ్బాస్'కే నీతులు చెబుతున్న శివాజీ.. హౌస్లో ఇకపై కష్టమే!) ప్రోమో ప్రారంభంలోనే శుభశ్రీ, గౌతమ్ మధ్య రొమాంటిక్ సీన్స్తో మొదలైంది. నేను మాట్లాడికే ఇష్టం లేదా అంటూ గౌతమ్ను ప్రశ్నిస్తుంది శుభశ్రీ. దీనికి గౌతమ్ లాయల్టీ ఉంది కాబట్టి భరిస్తున్నా అంటాడు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాఫీ కూడా ఇవ్వలేని బతుకా నాది అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్గా మారిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ పవరాస్త్రాలను తిరిగివ్వాలని ఆదేశిస్తాడు. దీంతో ఆట సందీప్, పల్లవి ప్రశాంత్, శోభాశెట్టి తమ పవరాస్త్రాలను బిగ్ బాస్ చెప్పిన విధంగానే ఓ పెట్టెలో భద్రపరుస్తారు. దీంతో ఆ ముగ్గురి పవరాస్త్రాలు పోవడంతో శివాజీ అవహేళనగా మాట్లాడతాడు. శివాజీ హేళన చేయడం శోభాశెట్టికి ఆగ్రహం తెప్పిస్తుంది. కొందరు ఉంటారు.. మనం బాగుపడకపోయినా ఫరవాలేదు.. పక్కవాడు మాత్రం అస్సలు బాగుపడకూడదు అనేవాళ్లు అంటూ శివాజీని ఉద్దేశించి మాట్లాడింది. అయితే ఇప్పటికే శివాజీ తన పవర్ అస్త్రను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో చూస్తే ఇక ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ మొదలవగా.. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్ను కూడా నామినేట్ చేసే అవకాశం వచ్చింది. మరీ ఈ వారంలో ఎవరూ సేఫ్ అవుతారో.. ఎవరెవరు నామినేషన్స్లో నిలుస్తారో వేచి చూడాల్సిందే. -
హౌస్లో అందాల పోటీ.. నాకేం తక్కువా అంటూ అమర్ దీప్ ఫైర్!!
బిగ్ బాస్ సీజన్-7 తెలుగు ఈ ఏడాది ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే మూడు వారాల్లో వరుసగా ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాలుగో వారానికి సంబంధించి ఇప్పటికే ఆరుగురు నామినేషన్స్కు ఎంపికయ్యారు. ఈ వారం నామినేషన్స్లో శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, ప్రియాంక జైన్, రతిక రోజ్, ప్రిన్స్ యావర్ ఉన్నారు. అయితే హౌస్లో కొత్త కొత్త టాస్క్లు ఇస్తూ బిగ్ బాస్ కంటెస్టెంట్లకు పరీక్ష పెడుతున్నారు. తాజాగా ఇవాళ రిలీజైన బిగ్ బాస్ ప్రోమోలో సరికొత్త టాస్క్ను పరిచయం చేశారు. ఈ ప్రోమో చూస్తే హౌస్మేట్స్ మధ్య అందాల పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ విచిత్రమైన గెటప్స్లో కనిపించి సందడి చేశారు. అయితే ఈ పోటీల్లో ఎవరో ఒకరిని విజేతగా ప్రకటించాల్సిన బాధ్యత జడ్జిలుగా వ్యవహరిస్తున్న శివాజీ, ఆట సందీప్, శోభాశెట్టిపైనే ఉంది. అయితే అందాల పోటీల్లో కంటెస్టెంట్స్ అందరూ ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత ఈ పోటీలో విజేతగా శుభ శ్రీ అంటూ జడ్జిలు ప్రకటిస్తుండగా.. అమర్ దీప్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మీ జడ్జ్మెంట్పై నాకు అనుమానం ఉంది. నేను మాట్లాడాక చెప్పండి అన్నాడు. ఎలాంటి ఎంటర్టైన్మెంట్ నేను మీకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించాడు. దీంతో హౌస్ ఒక్కసారిగా హాట్ హాట్గా మారిపోయింది. మీకు ఇష్టమైనవారినే విజేతలుగా నిర్ణయిస్తారా అంటూ ఫైరయ్యాడు. అయితే దీనికి శివాజీ సైతం రిప్లై ఇచ్చాడు. సుబ్బు ఇన్నోవేటివ్గా అనిపించింది చెప్పిన డ్రెస్సెస్ ప్రకారం.. ముందు నువ్వు రూల్ బుక్ చూసి మాట్లాడు అంటూ అమర్దీప్కు కౌంటరిచ్చాడు. అయితే ఇవన్నీ వాడుకోమని చెప్పారు.. కానీ ఇవన్నీ చెప్పలేదు సార్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోమో చూస్తే ఈ రోజు జరగనున్న ఎపిసోడ్లో అందాల పోటీ మరింత ఆసక్తికరంగా ఉండనున్నట్లు కనిపస్తోంది. -
లాయర్లా మాట్లాడకు.. నువ్వెంత.. శివాజీపై శివాలెత్తిన గౌతమ్!
ఈ ఏడాది ఉల్టా పల్టా అనే సరికొత్త కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన బిగ్బాస్ సీజన్-7 అదే రేంజ్లో దూసుకెళ్తున్నాడు. హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య హాట్ హాట్ వాతావరణం నడుస్తోంది. గతవారం సింగర్ దామిని ఎలిమినేట్ అవ్వగా.. ఈ వారంలో నామినేషన్స్లో ఎవరు నిలుస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఇవాళ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో చూస్తే హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచుతోంది. అమర్దీప్ ఫైర్ ఏ టాస్క్ జరిగిన ప్రతి ఒక్కరికీ అదే విధంగా బిహేవియర్ ఉండాలి అని జడ్జిని ప్రశ్నిస్తాడు డాక్టర్ బాబు గౌతమ్. దీనికి శివాజీ ప్రతి ఒక్కరితో నీకు అనవసరం అంటూ కౌంటర్ ఇస్తాడు. కానీ నా ఇంట్లో వాళ్ల గురించి అవసరమే అని గౌతమ్ అడగడంతో.. ఇదే కేవలం గేమ్ మాత్రమే.. ఫ్యామిలీ కాదు అని శివాజీ అంటాడు. ఆ తర్వాత మీరు లాయర్ లాగా వన్సైడ్ మాత్రమే మాట్లాడుతున్నారంటూ గౌతమ్ కౌంటరిస్తాడు. శివాజీ తీరుతో విసుగు చెందిన గౌతమ్ నువ్వెంత? అంటూ శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అయితే ఈ వారంలో నామినేషన్స్ బాధ్యత శోభా శెట్టి, శివాజీ, సందీప్ల మీద పెట్టాడు బిగ్ బాస్. వీరు ముగ్గురు జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించనున్నారు. అయితే కంటెస్టెంట్ తాము ఎవరినీ నామినేట్ చేయాలనుకున్న వారికి సంబంధించి సరైన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఆ ఇద్దరిలో ఎవరినీ నామినేట్ చేయాలో జడ్జిలు నిర్ణయిస్తారు. నువ్వు ఎంత.. శివాజీపై గౌతమ్ ఫైర్ ఈ క్రమంలో మన డాక్టర్ బాబు గౌతమ్.. యావర్. తేజలను నామినేట్ చేసేందుకు కారణాలు చెప్పాడు. ఏ టాస్క్ ఓడిపోయినా కూడా యావర్ ఓవర్గా రియాక్ట్ అవుతుంటాడు అని ఇలా ఏదో కారణం చెప్పబోయాడు గౌతమ్. ఇంటి సభ్యులందరికీ ఇబ్బందిగా ఉందని అంటాడు. అది నీకు సంబంధిచిన సమస్య కాదు అని శివాజీ అంటాడు. ఇది ఫ్యామిలీ అని గౌతమ్ అంటాడు.. ఇది ఫ్యామిలీ కాదు.. ఆట అని శివాజీ సమాధానం ఇస్తాడు. దీంతో హౌస్లో హీట్ ఓ రేంజ్కు దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఆ తర్వాత అమర్ దీప్, ప్రశాంత్ల మధ్య మాటల తూటాలు పేలాయి. నువ్వు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నావంటూ అమర్ దీప్ ప్రశాంత్కు కౌంటరిస్తాడు. నీకు రెండు మొహాలు, రెండు నాలుకలతో మాస్క్ వేసుకుని ఆడుతున్నాడని ప్రశాంత్పై అమర్ దీప్ ఫైర్ కాగా.. దీనికి సైతం వ్యంగంగానే సమాధానమిస్తాడు ప్రశాంత్. ఆ తర్వాత ఏకంగా రేయ్ నువ్వు సెగలుగా నవ్వొద్దంటూ అమర్ దీప్ వార్నింగ్ ఇస్తాడు. అయితే దీనికి నా ఆట నేను ఇలాగే ఆడతా అని పల్లవి ప్రశాంత్ అంటాడు. నువ్వు కూడా రెండు మొహాలు కాదా అమర్దీప్ను అనడంతో వీరిద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. నేను ఇలానే ఉంటా అనే అమర్ దీప్ అంటే.. నేను కూడా ఇంతే అంటూ పల్లవి ప్రశాంత్ అనడంతో ప్రోమో ముగిసింది. రోజు రోజులు హౌస్లో హీట్ పెంచుతోన్న నామినేషన్స్ ప్రక్రియ ఈ వారంలో ఎవరెవరూ నామినేట్ అవుతారో వేచి చూడాల్సిందే. ఈ సీజన్లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ హీట్ పెంచుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా హౌస్ మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తాజాగా రిలీజైన మరో ప్రోమోలో గౌతమ్కృష్ణను పల్లవి ప్రశాంత్ నామినేట్ చేశాడు. కారణాలపై ప్రశాంత్ మాట్లాడుతూ.. 'అమ్మాయి అరిచినప్పుడు నువ్వూ అరువు. మస్తు అనిపిస్తది. కానీ మళ్లీ ఇక్కడకు వచ్చి షర్ట్ తీయడం నాకు నచ్చలేదు.' అని అన్నాడు. ఆ తర్వాత రతిక పొట్టి దుస్తులు వేసుకోవడంపై ప్రశాంత్ మాట్లాడగా గొడవ మరింత ముదిరింది. రతికను ఏదో సరదాగా అన్నానని ప్రశాంత్ చెప్పగా.. మజాక్ చేయడానికి నేనెవర్రాభయ్ నీకు అంటూ రతిక మండిపడింది. మరో వైపు శుభ శ్రీని అమర్దీప్ నామినేట్ చేయగా.. ప్రియాంకతో ఫేవర్గా ఉన్నానంటే అది మా స్ట్రాటజీ. ఆ పాయింట్ నాకు హర్టింగ్గా అనిపించింది. నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని తన కారణం చెప్పాడు. దీనికి శుభశ్ ఆగ్రహంతో అదొక కారణమా? ఛీ అంటూ మండిపడింది. దీంతో విరిద్దరీ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రోమోలు వైరల్గా మారాయి. -
Bigg Boss 7 : చిల్లర మాటలు.. అతి చేష్టలు.. ‘ఛీ’వాజీ
నరంలేని నాలుక ఏమైనా మాట్లాడుతుందనడానికి ప్రత్యక్ష ఉదాహరణ శివాజీ అని చెప్పొచ్చు. ఇన్నాళ్లు బయట నేను తోపు, తురుమ్ ఖాన్ అంటూ గప్పాలు కొట్టుకుంటూ గలీజ్ పురాణాలు చెప్పిన ఈ నటుడు.. ఇప్పుడు బిగ్బాస్ హౌస్లోనూ అలానే వ్యవహరిస్తున్నాడు. అందరికి నీతులు చెబుతూ.. తాను మాత్రం పాటించడం లేదు. పైగా బిగ్బాస్కే బాస్లా వ్యవహరిస్తూ.. తన అతి చేష్టలతో అందరిముందు నవ్వులపాలవుతున్నాడు చివరి అస్త్రంగా బిగ్బాస్ వాస్తవానికి బిగ్బాస్లోకి ఎవరైనా మనీ కోసమే లేదా ఫేమ్ కోసమో వస్తారు. శివాజీ కూడా అందుకోసమే వచ్చాడు. ఆయన ఒక హీరో అనే విషయాన్ని జనాలు మర్చిపోయారు. సినిమా అవకాశాలు ఎప్పుడో రావడం మానేశాయి. దీంతో రాజకీయాల్లోకి వచ్చాడు. అక్కడ తగిన గుర్తింపు రాలేదు. దీంతో చంద్రబాబు మెప్పు పొందేందుకు 2019 ఎన్నికల ముందు గరుడ పురాణమంటూ ఓ కట్టుకథ అల్లాడు. ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని తేలడంతో తెలుగు ప్రజల ముందు నవ్వుల పాలయ్యాడు. ఎన్నికల తర్వాత టీడీపీ కూడా అతన్ని దూరం పెట్టింది. దీంతో బీజేపీలో చేరాడు. ఆ విషయం బహుశా పార్టీ వాళ్లు కూడా మర్చిపోయారేమో. అలా రాజకీయాల్లో రాణించలేక.. ఇటు సినిమా అవకాశాలు కోల్పోయి రెండింటికి చెడ్డ రేవడిలా తయారైంది శివాజీ పరిస్థితి. ఇప్పుడు చివరి అవకాశంగా బిగ్ బాస్ ని ఎంచుకున్నాడు. పైన పటారం..లోన లొటారం తనను జనాలు మర్చిపోయారనే విషయం శివాజీకి తెలుసు. బిగ్బాస్ షోకి వెళ్తే కనీసం కొంతమంది అయినా తనను గుర్తిస్తారని భావించి ఈ షోకి వచ్చాడు. ఈ విషయం బిగ్బాస్ స్టేజీపైనే చెప్పాడు. కానీ హౌస్లో మాత్రం ఏదో టైంపాస్గా వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నాడు. శుక్రవారం ఎపిసోడ్లో తేజతో మాట్లాడుతూ.. ఏదో సరదాగా బిగ్బాస్లోకి వచ్చానని, ఇప్పుడు వెళ్లిపో అంటే వెళ్లిపోతానని చెప్పాడు. వేరే వాళ్ల తరపున బయటకు పోవడానికి కూడా తాను సిద్ధమేనని త్యాగమూర్తి లాంటి కబుర్లు చెప్పాడు. (చదవండి: ప్రియుడి వల్ల ప్రెగ్నెన్సీ.. అమ్మ అబార్షన్ చేయించింది: షకీల) అయితే అంతకు ముందు మాత్రం ‘నేను హౌస్లోనే ఉంటా.. 15 వారాల వరకు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేసుకున్నాను’ అని శివాజీ చెప్పుకొచ్చాడు. గేమ్ విషయంలోనూ శివాజీ అలానే వ్యవహరిస్తున్నాడు. పవరాస్త్ర కోసం శివాజీ, షకీలతో పాటు అమర్దీప్ని పోటీలో నిలిచాడు. బిగ్బాస్ ఆదేశం మేరకు అమర్దీప్ని సందీప్ ఎంచుకున్నాడు. దీంతో శివాజీకి భయం పుట్టుకుంది. షకీలా అయితే గేమ్ ఈజీగా ఆడొచ్చని, అమర్తో కష్టమని భావించాడు. అందుకే బిగ్బాస్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ‘తలుపు తీయరాసామి వెళ్లిపోతా.. నాకొద్దురా ఈ గోల’ అంటూ తన భయాన్ని బాగా కవర్ చేశాడు. ఆ విషయం ముందు తెలియదా? బిగ్బాస్ షో తన స్థాయికి తగ్గది కాదన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు శివాజీ. ప్రతిసారి ‘తొక్కల షో’, ‘పనికిమాలిన ఆటలు’ అంటూ షోని తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. బయట ఉండి ఇలా మాట్లాడితే ఓకే. కానీ షోలోకి వెళ్లి ఆ షోనే తప్పుపట్టడం ఏంటి? ఈ షో ఎలా ఉంటుందో శివాజీకి ముందు తెలియదా? అన్నీ తెలిసి.. అవకాశాలు లేక వచ్చి.. మళ్లీ పైకి ఈ బిల్డప్ మాటలు ఎందుకు? తన భార్య వద్దని ముందే చెప్పినా.. ఈయన టైంపాస్గా ఈ షోకి వచ్చాడట. అది జనాలు నమ్మాలట. హౌస్లో ఉండడం ఇష్టం లేదనే వ్యక్తికి నామినేషన్స్ అంటే ఎందుకంత భయం? ఓటమి భయం బిగ్బాస్ అరిచే పోటీ ఇస్తే.. ఎలాగో గెలవనని ముందే ఫిక్స్ అయ్యాడు. దాన్ని కవర్ చేసేందుకు ఇదేం టాస్క్. నేను అసలు అరవనే అరవను అని అందరికి చెప్పాడు. బిగ్బాస్ పిలవగానే వెళ్లి గట్టిగా అరిచాడు. ఇదే విషయాన్ని అమర్ దీప్, సందీప్ చెప్పుకొని నవ్వుకున్నారు. గేమ్లో ఓడిపోతే.. నేను ముందే చెప్పా కదా.. నేను ఆడనని.. అందుకే ఓడిపోయా? నేను ఫిక్స్ అయితే ఈ గేమ్ ఎంత? అని గప్పాలు కొట్టుకోవడానికి ముందు అలా చెప్పుకొస్తున్నాడు. అయితే ఇలాంటి కవరింగ్ ముచ్చట్లు ఒకసారి చెబితే బాగుంటుంది.. ప్రతిసారి అలానే అంటే అసలు మ్యాటర్ బయటకు తెలిసిపోతుంది. ఇప్పుడు శివాజీ పరిస్థితి అలానే అయింది. చెప్పేది ఒకటి చేసేదొకటి అని హౌస్మేట్సే అనుకుంటున్నారు. 'ఛీ’వాజీ బిగ్బాస్ షో మొదలైన వారం రోజులకే శివాజీ అసలు క్యారెక్టర్ బయటపడింది. మాయమాటలు.. సూక్తులు చెప్తూ పైకి మంచివాడిలా నటించేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ హౌస్మేట్స్ అది ఎప్పుడో ఇది పసిగట్టేశారు. అందుకే ఈ వారం అతన్ని ఎక్కువమంది నామినేట్ చేశారు. ఇక అమర్దీప్ అయితే శివాజీకి ఇచ్చిపడేశాడు. సానుభూతి కోసమే ప్రశాంత్కి సపోర్ట్ చేస్తున్నాడనే విషయాన్ని అందరికి తెలిసేలా చేశాడు. ప్రియాంక జైన్ కూడా శివాజీకి బాగానే గడ్డిపెట్టింది. వేలు ఎత్తి చూపిస్తే.. ‘దించండి సార్.. ఇది మంచి ప్రవర్తన కాదు’ అని సీరియస్ అయింది. ఆట సందీప్, అమర్దీప్ నిన్న కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ నవ్వుకున్నారు. ఒక్క పల్లవి ప్రశాంత్ తప్ప మిగతా వారంతా శివాజీని చాటుగా తిట్టుకుంటునే ఉన్నారు. -
పిచ్చి పిచ్చి నామినేషన్స్ ప్రాసెస్ కాదిక్కడ?.. ఓ రేంజ్లో రతిక ఫైర్!
తెలుగు ప్రేక్షుకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్బాస్. ఈ సీజన్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హోస్లోకి ఎంట్రీ ఇవ్వగా తొలిరోజు నుంచే ఆసక్తి నెలకొంది. అంతే కాకుండా బిగ్బాస్-7 సీజన్ ఈసారి ఉల్టా పల్టాగా ఉంటుందని ప్రకటించిన నాగార్జున ఈ షోపై మరింత హైప్ క్రియేట్ చేశారు. అయితే తొలివారం అంతంత మాత్రంగానే అలరించిన కంటెస్టెంట్స్.. రెండోవారం వచ్చేసరికి విమర్శలతో షోను రసవత్తరంగా మార్చేశారు. దీంతో రెండోవారం నామినేషన్స్ ప్రక్రియ హాట్ హాట్గా మారింది. బిగ్బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ మధ్య రణరంగం మొదలైంది. తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే హౌస్లో పరిస్థితి అర్థమవుతోంది. వాడీవేడీగా నామినేషన్స్ రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ చాలా వాడీవేడీగా కొనసాగుతోంది. శక్తి అస్త్రాను సొంతం చేసుకున్న సందీప్ ఐదు వారాల పాటు సేవ్ అయినట్లు బిగ్బాస్ ప్రకటించాడు. ఈ వారం ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశాన్ని సందీప్ సొంతం చేసుకున్నాడు. ప్రిన్స్ యావర్ను సందీప్ అతడిని నామినేట్ చేశాడు. సందీప్.. ప్రిన్స్ యావర్ను నామినేట్ చేయడంతో మిగిలినవాళ్లు అతన్ని నామినేట్ చేసేందుకు వీల్లేదని బిగ్బాస్ ఆదేశించాడు. పల్లవి ప్రశాంత్పై చర్చ టేస్టీ తేజను శుభశ్రీ, రతికా రోజ్, పల్లవి ప్రశాంత్ నామినేట్ చేయగా.. శివాజీని అమర్దీప్, ప్రియాంకజైన్, షకీలా, శోభాశెట్టి, దామినిలు నామినేట్ చేశారు. నామినేషన్ సమయంలో వారి మధ్య తీవ్ర చర్చ జరిగింది. రైతు బిడ్డ అంటూ సింపథీ కోసం ప్రయత్నస్తున్నాడని పల్లవి ప్రశాంత్ని గౌతమ్ కృష్ణ, దామిని, టేస్టీ తేజ, ప్రియాంక జైన్, షకీలా, అమర్దీప్లు నామినేట్ చేశారు. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్ సమయంలో రైతుబిడ్డ ఇష్యూపై పెద్ద చర్చే నడిచింది. అయితే నామినేషన్స్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో మంగళవారం కూడా కొనసాగనుంది. శివాజీతో గొడవ నామినేషన్స్ ప్రక్రియ చూస్తే గౌతమ్, రతికా రోజ్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. పిచ్చి పిచ్చి నామినేషన్స్ ప్రాసెస్ కాదిక్కడ? అంటూ రతిక ఓ రేంజ్లో ఫైర్ అయింది. మరోవైపు తనను నామినేట్ చేసినందుకు.. శోభాశెట్టిని శివాజీ నామినేట్ చేయడంతో వీరిద్దరి మధ్య వివాదం మొదలైంది. నువ్వు ఆర్టిస్ట్ కాబట్టే ఇంప్రెస్ చేశావు అంటూ శివాజీ ఫైర్ కావడంతో.. ‘అలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను’ అని శోభ కౌంటరిచ్చింది. దీంతో మంగళవారం రిలీజైన ప్రోమో చూస్తే హౌస్లో ఎంత హీట్ ఉందో అర్థమవుతోంది. -
శివాజీ(మూడో స్థానం)
శివాజీ.. చాలా మందికి పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్, కాంట్రవర్సీ మధ్యలో ఉండే టాప్ 5గురు వ్యక్తుల్లో శివాజీ ఒకరు. తనకు అవసరం లేని విషయాల్లో తల దూర్చి.. తన ప్రయాణమెటో తెలియకుండా.. చివరికి విశ్వసనీయత కోల్పోయి.. అందరికీ దూరమయిన శివాజీ.. ఇప్పుడు చివరి అవకాశంగా బిగ్ బాస్ ను ఎంచుకోవడం ఒక వ్యక్తి ఉత్తాన పతనాలకు అతి పెద్ద ఉదాహరణ. బ్యాక్ గ్రౌండ్ 1997లో సినిమాల్లో నటించే అవకాశం వచ్చిన శివాజీది అప్పటి గుంటూరు జిల్లా నరసరావుపేట. జెమినీ టీవీలో వీడియో ఎడిటర్ గా చేరిన శివాజీ ఓ సీరియల్ లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో హీరో ఫ్రెండ్ పాత్రలు చేసే స్థాయికి చేరాడు. అతడు నటించిన తొలి సినిమా సీతారాముల కళ్యాణం చూతము రారండీ. కానీ ఫస్ట్ రిలీజైంది మాత్రం మాస్టర్. మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి, అదిరిందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా, సత్యభామ, మా ఆయన చంటిపిల్లాడు.. సినిమాల్లో హీరోగా నటించాడు. వేగంగా అవకాశాలు దూరం తన స్థాయికి మించిన హీరో పాత్రల్లో ఒదిగిపోలేక, కమెడియన్ పాత్రలు చేయలేక.. మొత్తానికి వెండితెరకు దూరమయ్యాడు. పూలమ్మిన చోటే కట్టెలన్నట్టు.. నితిన్కు జయం, దిల్, సంబరం సినిమాల్లో వాయిస్ ఓవర్ ఇచ్చాడు. 2018లో వచ్చిన గ్యాంగ్స్టర్స్ అనే వెబ్ సిరీస్లో చివరిసారిగా కనిపించాడు. వివాదాలు - విమర్శలు బుల్లితెరపై హోస్ట్గా వ్యవహరించే స్థాయి నుంచి సినిమా హీరోగా మారిన శివాజీ.. తనకు అచ్చి రానీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. చేతులు పూర్తిగా కాలితే కానీ.. అర్థం చేసుకోలేని స్థితిలోకి వెళ్లి తనకు మాలిన పనులు చేసి చరిత్రలో మిగిలిపోయాడు శివాజీ. చంద్రబాబు కోసం తన విశ్వసనీయతను తాకట్టు పెట్టుకుని నవ్వులపాలయి క్రెడిబిలిటీ కోల్పోయాడు. గరుడ పురాణం ఓ కట్టుకథను అత్యంత అందంగా, సినిమా రైటర్లతో స్క్రీన్ప్లే రాయించి గరుడపురాణం పేరుతో ఓ పాయింట్ ప్రజంటేషన్ తయారు చేసి మీడియాలో ఓ అరగంట స్పేస్ కొట్టేసే ప్లాన్ దిగ్విజయంగా అమలు చేశాడు. శివాజీ మాయమాటలు నమ్మిన ఎల్లో మీడియా, టిడిపి నేతలు.. కొన్నాళ్ల పాటు గరుడ పురాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి మొత్తంగా నవ్వులపాలయ్యాయి. రాజకీయ జోస్యం ఓ సారి అమరావతి వెళ్ళిన శివాజీ వైఎస్సార్సిపికి చెందిన 49 మంది ఎమ్మెల్యేలు, 9మంది ఎంపీలు వేరే పార్టీతో టచ్లో ఉన్నారంటూ పొగపెట్టే ప్రయత్నం చేశాడు. వైఎస్సార్సిపి ఓటుకు రూ.50వేలు ఇచ్చినా.. 2019లో టిడిపి గెలుస్తుందంటూ బాకా ఊదే ప్రయత్నం చేశాడు. ఇంత చేసినా ఎన్నికల్లో శివాజీ బలపరిచిన టిడిపి మట్టి కొట్టుకుపోయింది. అనంతర కాలంలో బీజేపీలో చేరి టిడిపి అనుకూల రాజకీయం చేసేందుకు ప్రయత్నించినా.. ప్రజలు నమ్మలేదు. ఇప్పుడు బీజేపీ కూడా ఆయన సేవలు వాడుకుంటున్నట్టు లేదు. నోరుతెరిస్తే అమరావతి, పోలవరం రాష్ట్రం అభివృద్ధి కావాలన్నది అందరి ఆకాంక్షే. దాంట్లో తప్పు లేదు కానీ.. లేని క్రెడిట్ మొత్తం చంద్రబాబుకు చెందాలన్న గరుడ పురాణం శివాజీ తాపత్రయం ఎన్నికల ముందు బెడిసికొట్టింది. పోలవరంను చంద్రబాబు పూర్తి చేశారని, అమరావతిలో ఆకాశహర్మ్యాలను నిర్మించేస్తున్నారని శివాజీ చేసిన తెగ హడావిడి ఇప్పటికీ యూట్యూబ్ లింకుల్లో బాగానే నిక్షిప్తమయి ఉంది. రాజకీయంగా వైసీపీకి నష్టం చేయాలన్న దుర్భుద్ధితో నానా పాట్లు పడ్డ శివాజీని గానీ, ఆయన పురాణాలను గానీ ప్రజలు నమ్మే దుస్థితిలో లేరు. రాని రాజకీయాలను నమ్ముకుని సినిమాలకు వచ్చాడు, కలిసి రాని గరుడ పురాణాలతో ప్రజలకు దూరమయ్యాడు. ఇప్పుడు బుద్ధి మారిందా..? లేక అదే తీరుతో బిగ్ బాస్ నుంచి బయటకు పంపిస్తారా? త్వరలోనే తేలనుంది. -
ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత!
కోలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు ఆర్ఎస్ శివాజీ(66) కన్నుమూశారు. కోలీవుడ్లో హాస్యనటుడు మంచి గుర్తింపుతెచ్చుకున్నారు. అనారోగ్య సమస్యలతో చెన్నైలోని ఓ ఆస్పత్రిసలో చేరిన ఆయన తుదిశ్వాస విడిచారు. హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తమిళంలో వందకుపైగా సినిమాల్లో నటించారు. ఈ విషయం తెలుసుకున్న కోలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. శివాజీ ప్రముఖ నిర్మాత ఎంఆర్ సంతానం కుమారుడు కాగా.. ఆయన సోదరుడు సంతాన భారతి కోలీవుడ్లో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1981లో వచ్చిన ‘పన్నీర్ పుష్పాలు’ సినిమాతో శివాజీ తెరంగేట్రం చేశారు. 'కోలమావు కోకిల', 'సూరరై పొట్రు', 'ధారల ప్రభు' 'గార్గి' లాంటి చిత్రాల్లో కనిపించారు. స్టార్ హీరో కమల్ హాసన్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్తో కలిసి ఎక్కువ చిత్రాల్లో పనిచేసినందుకు కోలీవుడ్లో గుర్తింపు పొందారు. కాగా.. శివాజీ చివరిసారిగా యోగి బాబు నటించిన 'లక్కీ మ్యాన్'లో కనిపించారు. ఈ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలైంది. (ఇది చదవండి: దేవత లాంటి యువతి దెయ్యంగా ఎలా మారింది?.. రిలీజ్ ఎప్పుడంటే? ) కమల్హాసన్తో ప్రత్యేక అనుబంధం కమల్హాసన్తో శివాజీకి చక్కటి అనుబంధమున్నట్లు తెలుస్తోంది. ఆ సాన్నిహిత్యంతోనే కమల్హాసన్ సినిమాల్లోనే ఎక్కువగా నటించారు. కమల్హాసన్ హీరోగా నటించిన విక్రమ్, సత్య, అపూర్వ సగోదరగళ్, మైఖేల్ మదన కామరాజు, గుణ, చాచి 420, అన్బేశివంతో పాటు పలు సినిమాల్లో శివాజీ కమెడియన్గా నటించారు. ఈ సినిమాలన్నీ తెలుగులోనూ అనువాదమై శివాజీకి మంచి పేరుతెచ్చిపెట్టాయి. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో కీలకపాత్ర మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి నటించిన జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు ఆర్ఎస్ శివాజీ. మాలోకం అనే ఓ కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. అంతే కాకుండా తేజ డైరెక్షన్లో వచ్చిన 100 అబద్దాలు సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. వీటితో పాటు తెలుగులో గతేడాది సాయిపల్లవి హీరోయిన్గా తెరకెక్కిన గార్గి సినిమాలో ఆమె తండ్రి పాత్రలో కనిపించిన శివాజీ ప్రశంసలు అందుకున్నారు. సినిమాలతో పాటు కొన్ని టీవీ సీరియల్స్లో శివాజీ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: పవన్ కల్యాణ్ ఓజీపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్..! ) -
రెమ్యునరేషన్ దగ్గర బేరాలు, వాళ్లు అవుట్.. బిగ్బాస్ 7లో హీరో శివాజీ!
ఓటీటీల ప్రభావమో, ఇతర రియాలిటీ షోల ఎఫెక్టో కానీ బిగ్బాస్కు ఆదరణ తగ్గుతూ వస్తోంది. దీంతో ఎలాగైనా మునుపటి క్రేజ్, టీఆర్పీ దక్కించుకోవాలని తాపత్రయపడుతోంది బిగ్బాస్ టీమ్. అందుకే ఈసారి చిత్రవిచిత్ర పనులు చేస్తోంది. మరో రెండు రోజుల్లో బిగ్బాస్ 7 ప్రారంభం కాబోతోంది. సాధారణంగా అయితే ఈపాటికే కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ బయటకు వచ్చేస్తుంది. కానీ ఈసారి మాత్రం బిగ్బాస్ టీమ్ ఎత్తుకుపైఎత్తు వేసింది. చివరి నిమిషంలో కొందరిని రిజెక్ట్ చేసింది, మరికొందరితో రెమ్యునరేషన్ బేరాలు ఆడి వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయేలా చేసింది. దీంతో ఇప్పటిదాకా వైరలవుతూ వచ్చిన లిస్ట్ కాస్త తారుమారు అయ్యేట్లు కనిపిస్తోంది. ఇప్పటికే మొగలి రేకులు సాగర్, అంజలి పవన్ రెమ్యునరేషన్ దగ్గర బెట్టు చేశారని, వీళ్లు డిమాండ్ చేసినంత ఇవ్వకపోవడంతో బిగ్బాస్ ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కొద్దోగొప్పో పేరున్న సెలబ్రిటీలు సైడ్ అయిపోతే బిగ్బాస్కు పెద్ద దెబ్బే.. అందుకని ఒకప్పటి హీరో, ప్రముఖ నటుడు శివాజీని రంగంలోకి దింపుతున్నారట! మొదట ఈయన వచ్చే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని ప్రచారం జరిగింది, కానీ ఇప్పుడు మాత్రం ఆయనకు ఎక్కువ పారితోషికం ఇచ్చైనా సరే హౌస్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి శివాజీ నిజంగానే బిగ్బాస్లో అడుగుపెడతాడా? తన ముక్కుసూటి వైఖరితో లేనిపోని కష్టాలు కొనితెచ్చుకుంటాడా? లేదంటే అందరినీ ఓ ఆటాడిస్తాడా? అనేది చూడాలి! చదవండి: రాఖీ.. బేబి హీరోయిన్కు తమ్ముడు ఏం గిఫ్టిచ్చాడో తెలుసా? -
తమ్ముడు.. అమ్మా నాన్నలను బాగా చూసుకో!
వరంగల్: తల్లిదండ్రులకు భారం అవుతున్నాననే మనస్తాపంతో ఓ యువకుడి ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన బొమ్మ శివాజీ(24) బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి కొంత కాలం ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసి, పోటీ పరీక్షలకు సిద్ధ అవుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల రాసిన పరీక్షల్లో ఉద్యోగం రాకపోవడంతో అమ్మానాన్నలకు భారంగా మారుతున్నానని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి తన సోదరుడికి సెల్ ఫోన్లో అమ్మానాన్నలను బాగా చూసుకో.. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ చేసి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోదరుడు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా స్థానికులు బావి నుండి మృతదేహాన్ని బయటకు తీశారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గట్ల సుధాకర్ తెలిపారు. -
బాలీవుడ్ ని బ్రేక్ చేసిన 2018 మూవీ
-
ఆరె కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా చెట్టిపల్లి శివాజీ
అంబర్పేట (హైదరాబాద్): ఆరె కుల సంఘం రాష్ట్ర నూతన కమిటీ ఎన్నికైంది. సోమవారం అంబర్పేటలోని ఓ ఫంక్షన్హాల్లో జరిగిన కార్యవర్గ సమావేశంలో కమిటీ ఆవిర్భవించింది. అధ్యక్షుడిగా చెట్టిపల్లి శివాజీ, గౌరవ అధ్యక్షుడిగా నాగూర్ల వెంకన్న, స్టీరింగ్ కమిటీ చైర్మన్గా దిగంబర్రావు, క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా రాంబాబు, ఉద్యమ కమిటీ చైర్మన్గా అంజన్రావు, ఆరె కుల రైతు సంఘ అధ్యక్షుడిగా మోర్తాల చందర్రావుతో పాటు వివిధ కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా కమిటీ పలు తీర్మానాలను ఆమోదించింది. ఉప్పల్ బగాయత్లో ఆరె కుల సంఘానికి ఒక ఎకరం స్థలం, రూ.కోటి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు వారు ధన్యవాదాలు తెలిపారు. అలాగే భవన నిర్మాణానికి మరో రూ.4 కోట్ల నిధుల కోసం విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. ఆరె కుల సంఘాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ తీర్మానించారు. సమావేశంలో కుల సంఘం నాయకులు రామ నర్సింహయ్య, కోల కృçష్ణస్వామి, నర్సింగ్రావు, శ్రీనివాస్, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. -
రజనీకాంత్ ‘శివాజీ’ మూవీకీ 14 ఏళ్లు: అప్పటి కలెక్షన్స్ ఎంతంటే..
సూపర్ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తొలిసారిగా వచ్చిన చిత్రం ‘శివాజి’. ఇందులో శ్రియా హిరోయిన్గా నటించింది. అప్పట్లో ఈ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డబ్బింగ్ సినిమా అయినప్పటికి టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతటి భారీ విజయాన్ని అందించిన ఈ చిత్రం విడుదలై నేటికి 14 ఏళ్లు. 2007 జూన్ 15వ తేదీన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలై ఈ చిత్రం బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. డబ్బింగ్ చిత్రమే అయిన తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఇక్కడ పెద్ద చిత్రాలకు పోటీని ఇచ్చింది. ఇక ఇందులో రజనీకాంత్ గుండు బాస్గా ప్రేక్షకులను అలరించిన తీరు ఎప్పటికి గుర్తుండిపోతుంది. ప్రతి ఒక్కరి నోట గుండుబాస్ అనే డైలాగ్ను ఇప్పటికి వినిపిస్తూనే ఉంటుంది. అంతలా గుండుబాస్ పాత్రతో రజనీ ఆకట్టుకున్నారు. ఇక ఆయన సినిమాలకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. అందుకే డబ్బింగ్ సినిమా అయినప్పటికీ ‘శివాజి’ తెలుగులో 15.32 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ స్థాయిలో బిజినెస్ చేసింది. అప్పటి వరకు ఏ డబ్బింగ్ సినిమా కూడా ఈ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేదు. ఫుల్ రన్లో శివాజీ అందరి అంచనాలు అందుకుంటూ 17.73 కోట్ల షేర్ వసూలు చేసింది. అప్పట్లో ఓ డబ్బింగ్ సినిమా ఇంత వసూలు చేయడం అంటే సాధారణ విషయం కాదు. దాదాపు బయ్యర్లకు శివాజి 3 కోట్ల లాభాలు అందించింది. ఇందులో సుమన్ విలనిజం హైలైట్ కాగా మరోవైపు శ్రియా అయాయకత్వపు నటన, అందం, అభినయం ఈ సినిమాకు ప్లస్ అయ్యింది. అంతటి సంచలన విజయం అందించిన శివాజి వసూళ్లు ఇక్కడ ఎలా ఉన్నాయంటే.. నైజాం- 4.25 కోట్లు సీడెడ్- 3.42 కోట్లు ఉత్తరాంధ్ర- 2.65 కోట్లు ఈస్ట్ గోదావరి- 1.55 కోట్లు వెస్ట్ గోదావరి- 1.52 కోట్లు గుంటూరు- 1.90 కోట్లు కృష్ణా-1.60 కోట్లు నెల్లూరు-0.84 కోట్లు ఏపీ+ తెలంగాణ: 17.73 కోట్లు -
‘శివాజీ వెనుక చంద్రబాబు హస్తం’
సాక్షి, అమరావతి: గరుడు పురాణం సృష్టికర్త శివాజీ వెనుక చంద్రబాబు హస్తం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఇద్దరూ కలిసి తమ పార్టీపై, రాష్ట్రంపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన కన్నా.. ఆంధ్రప్రదేశ్లో బీజేపీని అణవేసేందుకు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని కన్నా మండిపడ్డారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని కేంద్రంపై టీడీపీ దుష్ప్రచారం చేస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చేందుకు వీలుకాదని.. హోదాకు సమానమైన ఆర్థిక సాయం కేంద్రం ఇస్తోందని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక ప్యాకేజికి చంద్రబాబు అంగీకరించి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు సన్మానం కూడా చేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో లబ్ధిపొందేదుకే బీజేపీపై ఆరోపణలు చేశారని చెప్పుకొచ్చారు. కర్ణాటకలో తమకు పూర్తి బలం ఉందని, అక్రమ పొత్తుతో అధికారంలోకి వచ్చారు కనుకే కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కుప్పకూలిందని అభిప్రాయపడ్డారు. ఏపీలోనే కాక.. దేశమంతా బీజేపీపైపు చూస్తోందని, యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నారని పేర్కొన్నారు. -
విచారణకు హాజరుకాని శివాజీ
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో నిందితుడిగా ఉన్న సినీ నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీ గురువారం సైబరాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరుకాలేదు. ఈ నెల 1న హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. 11న విచారణకు హజరుకావాలంటూ పోలీసులు శివాజీకి నోటీసులిచ్చారు. దీని ప్రకారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసుల ఎదుట శివాజీ గురువారం విచారణకు హజరుకావాల్సి ఉంది. అయితే తన కుమారుడిని అమెరికాలో చదువులకు పంపడంలో నిమగ్నమై ఉన్నందున విచారణకు హాజరుకాలేకపోతున్నానని శివాజీ పోలీసులకు ఈమెయిల్ పంపారు. దీనికి అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశానని తెలిపారు. అయితే మరోసారి నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలకు ఉపక్రమించాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది. -
శివాజీ పిటిషన్పై విచారణ వచ్చే నెలకు వాయిదా
సాక్షి, హైద్రాబాద్: సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, గరుడ శివాజీ క్వాష్ పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను వచ్చేనెల 21కి వాయిదా వేసింది. రవిప్రకాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్పై కోర్టు తన తీర్పును రిజర్వులో ఉంచిన విషయం తెలిసిందే. కాగా, క్వాష్ పిటిషన్పై ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. -
ఎట్టకేలకు పట్టుబడ్డ శివాజీ
-
ఎట్టకేలకు పట్టుబడ్డ ‘గరుడ’ పక్షి
సాక్షి, హైదరాబాద్: అలందా మీడియా కేసులో నిందితుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీ హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్లే ప్రయత్నంలో సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు బుధవారం చిక్కాడు. గత 2 నెలల నుంచి అనారోగ్య కారణాలరీత్యా పోలీసుల విచారణకు రావడం లేదంటూ సామాజిక మాధ్యమాల్లో వీడియో విడుదల చేసిన శివాజీని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్న శివాజీ అమెరికాకు వెళ్లేందుకు విమాన టికెట్ను బుక్ చేసుకొని బుధవారం తెల్లవారుజామున 6.30 గంటల ప్రాంతంలో శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సమయంలో అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీ దేశం విడిచి వెళ్లే అవకాశముందని లుకౌట్ నోటీసులను సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు జారీ చేయడంతో ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకోగలిగారు. రజనీకాంత్ స్టైల్లో తయారైనా..! అయితే సినిమా ఫక్కీలో తన అసలు వేషధారణకు కాస్త భిన్నంగా.. శివాజీ సినిమాలో రజనీకాంత్ మాదిరిగా రెడీ అయ్యాడు. ఇమిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకుండా ఎత్తుగడ పన్ని నా.. పాస్పోర్టుతో అడ్డంగా దొరికిపోయాడు. ఈ విషయాన్ని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే 160 సీఆర్పీసీ కింద అక్కడే నోటీసులివ్వాలనుకున్నా.. కొన్ని మార్పులు చేయాల్సి ఉండటంతో శివాజీని గచ్చిబౌలిలోని సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసు స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం దాదాపు 45 నిమిషాలపాటు శివాజీని అక్కడే ఉంచిన పోలీసులు మార్పులు చేసిన నోటీసును ఇచ్చి ఈ నెల 11న విచారణకు రావాలని ఆదేశించారు. దీంతో అక్కడి నుంచి శివాజీ వెళ్లిపోయాడు. అయితే సైబరాబాద్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేసినా శివాజీ అమెరికా వెళ్లేందుకు ఎందుకు ప్రయత్నించాడనేది ఇప్పుడూ అనేక అనుమానాలను రెకెత్తిస్తోంది. కాగా టీవీ9 కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో ఎన్సీఎల్టీని అడ్డుపెట్టుకుని ఆ సంస్థ రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ కుట్రలు పన్నారని అలంద మీడియా ఫిర్యాదు చేయడంతో.. సైబరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు కేసు నమోదుచేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రవిప్రకాష్ను పలు పర్యాయాలు విచారించారు. -
శివాజీ పాస్పోర్ట్ సీజ్..
-
శివాజీ పాస్పోర్ట్ సీజ్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటుడు, గరుడ పురాణం శివాజీ దేశం విడిచి వెళ్లకుండా ఆయన పాస్పోర్టును సైబర్ క్రైం పోలీసులు బుధవారం సీజ్ చేశారు. కాగా విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన శివాజీని ఇవాళ ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో లుక్ ఔట్ నోటీసులో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయనను సైబర్ క్రైం పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం శివాజీకి 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి ఈ నెల 11న పూర్తి వివరాలతో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. చదవండి: పోలీసుల అదుపులో సినీనటుడు శివాజీ -
శివాజీని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
పోలీసుల అదుపులో నటుడు శివాజీ
సాక్షి, హైదరాబాద్ : అలంద మీడియా కేసులో సినిమా నటుడు, గరుడ పురాణం శొంఠినేని శివాజీని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకుని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. గత రెండు నెలలుగా అజ్ఞాతంలో ఉన్న శివాజీ విదేశాలకు వెళ్లే క్రమంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. కాగా టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్పై పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. టీవీ9 కొత్త యాజమాన్యానికి ఇబ్బందులు సృష్టించే ఉద్దేశంతో ఎన్సీఎల్టీని అడ్డుపెట్టుకుని ఆ సంస్థ రవిప్రకాశ్, సినీనటుడు శివాజీ కుట్రలు పన్నారు. వీరిద్దరి మధ్య కుదిరింది పాత ఒప్పందం కాదని..ఎన్సీఎల్టీలో కేసు వేయడం కోసం కుట్ర పన్ని..పాత తేదీతో నకిలీ షేర్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తితోపాటు డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడు హరి, ఏబీసీఎల్ ఫైనాన్స్ అధికారి మూర్తి, మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన పలు ఈ-మెయిళ్లను పోలీసులు గుర్తించారు. ఈ- మెయిళ్ల ఆధారాలు దొరకకుండా సర్వర్ల నుంచి రవిప్రకాష్, ఆయన అనుచరులు డిలీట్ చేసినప్పటికీ..సైబర్ క్రైం పోలీసులు అత్యాధునిక పరిజ్ఞానంతో వాటిని వెలికి తీశారు. ఈ కేసుతో సంబంధమున్న శొంఠినేని శివాజీ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో రవిప్రకాశ్తో పాటు శివాజీపై గతంలో పోలీసులు లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో అమెరికా వెళ్లేందుకు శివాజీ ప్రయత్నించడంతో ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీసులు మాట్లాడుతూ...’దేశం పాటి వెళ్లాలని శివాజీ పారిపోయే ప్రయత్నం చేస్తుండగా పట్టుకున్నాం. శివాజీని అరెస్ట్ చేయము. కోర్టు ఆదేశాల మేరకు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశాం. శివాజీని విచారణకు సహకరించాలని కోరాం. నోటీసులు ఆధారంగా ఆయనను విచారణ చేస్తాం.’ అని తెలిపారు. ఇప్పటికే శివాజీపై లుక్ఔట్ నోటీసులు ఉన్నాయి. శివాజీ అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ విమానాశ్రయానికి రాగా...ఇమిగ్రేషన్ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. శివాజీకి మరోసారి నోటీసులు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మరోసారి నటుడు శివాజీకి నోటీసులు జారీ చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఆయనను బుధవారం ఉదయం పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చి...ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని శివాజీకి సూచించారు. నోటీసులు అందుకున్న అనంతరం ఆయన పీఎస్ నుంచి వెళ్లిపోయారు. -
హైకోర్టులో శివాజీ క్వాష్ పిటీషన్ దాఖలు
హైదరాబాద్: సినిమా నటుడు శొంఠినేని శివాజీ హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే. తనపై సైబర్ క్రైమ్ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ ద్వారా విన్నవించారు. పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలని పిటీషన్లో కోరారు. ఈ పిటీషన్ను హైకోర్టు బుధవారం విచారించింది. ప్రస్తుతం ఈ కేసులో రవిప్రకాశ్ పిటిషన్పై తీర్పు రిజర్వ్లో ఉన్న కారణంగా ప్రభుత్వం గడువు కోరింది. ఇప్పటి వరకు శివాజీకి మూడు సార్లు నోటీసులు జారీ చేసినా పోలీసు విచారణకు హాజరు కాలేదని ప్రభుత్వం హైకోర్టుకి తెలిపింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది. టీవీ-9లో అక్రమాలకు పాల్పడినట్లు కొత్త యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్పై పోలీసులు కేసు నమోదు చేసి, నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ కేసుతో సంబంధమున్న శొంఠినేని శివాజీ అప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
రవిప్రకాశ్ కేసులో తొలగని ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: ఫోర్జరీ, నిధుల మళ్లింపు, లోగో విక్రయం తదితర కేసుల్లో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. దర్యాప్తులో సహకరించని టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ వైఖరిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి, న్యాయమూర్తి ఇచ్చే ఆదేశాలకనుగుణంగా ముందుకు సాగేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీవీ9కి సంబంధించి అటు హైదరాబాద్, ఇటు సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో నమోదైన కేసుల ఆధారంగా పలు సాక్ష్యాలు సంపాదించిన పోలీసులు మరిన్ని ఆధారాల సేకరణలో తలమునకలయ్యారు. ఇప్పటికే ఫోర్జరీ కేసులో సంస్థ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు రవిప్రకాశ్ అంగీకరించిన నేపథ్యంలో పోలీసులు మిగిలిన కేసులపై దృష్టి సారించారు. ఈ కేసులో శివాజీ– రవిప్రకాశ్ మధ్య నడిచిన లావాదేవీలు, పాతతేదీలతో నకిలీపత్రాల సృష్టికి సంబంధించి పలు వివరాలను పోలీసులు సంగ్రహించిన విషయం తెలిసిందే. చానల్ నుంచి నిధులను తన సొంత ఖాతాకు బదిలీ చేసిన విషయంలోనూ పోలీసుల వద్ద పక్కా ఆధారాలు ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో బంజారాహిల్స్ పోలీసులు సేకరించిన ఆధారాలు కూడా కేసులో కీలకం కానున్నాయి. దాదాపు రూ.100 కోట్ల విలువ చేసే టీవీ9 లోగోను కేవలం రూ.99 వేలకు విక్రయించడంపైనా పోలీసుల సందేహాలు కొలిక్కి వస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన పత్రాలను ఇప్పటికే స్వా ధీనం చేసుకున్న పోలీసులు వాటి విశ్వసనీయతపై నిగ్గు తేల్చనున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు సినీనటుడు శివాజీ తనకు మంచిమిత్రుడని చెప్పిన రవిప్రకాశ్.. అతన్ని ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు మౌనం వహించడం విశేషం. మరోవైపు సైబరాబాద్ పోలీసులపైనా రవిప్రకాశ్ బెదిరింపులకు దిగడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారంలో రవిప్రకాశ్ విచారణను సాంతం పోలీసులు వీడియోలో చిత్రీకరించారు. రెండు కమిషనరేట్లలో పోలీసులు ఇప్పటిదాకా సేకరించిన ఆధారాలు సరిపోలేదని అనిపిస్తే.. మరోసారి రవిప్రకాశ్ను విచారించే అవకాశాలు ఉన్నాయి. న్యాయస్థానం ఆదేశాలతో ముందుకెళతాం.. రవిప్రకాశ్ కేసు విషయమై ఏసీపీ సీహెచ్వై శ్రీనివాస్ కుమార్ సైబరాబాద్ కమిషనరేట్లో మీడియాతో మాట్లాడారు. ఈ కేసు దర్యాప్తు ఫిర్యాదులోని అం శాల ఆధారంగా జరుగుతోంది. తదుపరి విచారణ చేయాల్సి ఉంది. ఇప్పటివరకూ జరిగిన దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాధారాలను సోమవారం న్యాయస్థానం ముందుంచుతాం. తదుపరి దర్యాప్తు ముందుకుసాగేలా అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థిస్తాం.. అని అన్నారు. లోపల ఒకలా.. బయట మరోలా.. కేసు సాంతం రవిప్రకాశ్ వ్యవహారశైలి వింత గా ఉంటూ వస్తోంది. లోపల విచారణలో ఒకలా.. బయట మీడియాకు మరోలా కనిపిస్తూ.. విచార ణను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారు. లోపల మాత్రం దర్యాప్తునకు సహకరించట్లేదు. కేసు నమోదైనప్పటి నుంచి కోర్టులో పిటిషన్ల విచా రణ జరుగుతున్నపుడు వాటిపై ప్రభావం చూపేలా 9వ తేదీన ఒకసారి, 22న మరోసారి వీడియోలు రిలీజ్ చేశాడు. విచారణకు హాజరైనప్పుడు మాత్రం ఏ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదు. పైగా ప్రశ్నావళి రాసిస్తే.. తాను వాటికి సమాధానాలు రాసిస్తాను అంటూ వెటకారంగా మాట్లాడుతున్నారు. ఓ 10 నిమిషాలు ప్రశ్నలు అడిగాక తల టేబుల్పై పెట్టుకుని పడుకుంటున్నారు. విచారణ కు సంబంధించిన వీడియో రికార్డింగ్ అంతా తనికివ్వాలంటూ పోలీసులను కోరుతున్నారు. 6 నెలల తరువాత అసలు యుద్ధం మొదలుపెడతా అంటూ బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు చెప్పినట్లుగా ఒక్కటి కూడా పాటించకుండా విచారణకు సహకరించడం లేదు. -
‘వామ్మో! రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు’
సాక్షి, హైదరాబాద్: నిధుల మళ్లింపు, ఫోర్జరీకి పాల్పడి అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. వామ్మో రవి ప్రకాశూ నువ్వు మామూలోడివి కాదంటూ ఆయన అక్రమాల పుట్టను భట్టబయలు చేశారు. ‘‘బ్రోకర్ శివాజీని పట్టుకుని పోలీసులు తమ స్టైల్లో ప్రశ్నిస్తే గరుడ పురాణం స్క్రిప్ట్ ఎవరిచ్చారో కక్కేస్తాడు. అది మీడియా ‘నయీం’ పనే అని తేలుతుంది. ఈ నేరాలు విచారించాలంటే స్పెషల్ కోర్టులు కావాలి. 25 ఏళ్ల క్రితం వేయి జీతానికి పనిచేసినోడు వందల కోట్లు ఎలా పోగేశాడో తేల్చాలి. క్రీ.శ.193లో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్ను అతని సైన్యమే హతమార్చి సామ్రాజ్యాన్ని వేలంలో అమ్మేశారట. రవిప్రకాష్ దాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చాడు. టీవీ9 లోగోలను రూ.99 వేలకు తన మోజోటివీకే విక్రయించి కార్పోరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. వామ్మో!రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు’’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. కాగా అంతకుముందు కూడా రవిప్రకాశ్పై విజయసాయి రెడ్డి ట్విట్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ‘‘బాధితులు పెద్ద సంఖ్యలో టీవీ9 కొత్త మేనేజ్మెంటుకు తమ గోడు వెల్లబోసుకుంటున్నారట’’ అంటూ ట్విటర్లో ఆరోపించారు. క్రీ.శ.193లో రోమన్ చక్రవర్తి పెర్టినాక్స్ను అతని సైన్యమే హతమార్చి సామ్రాజ్యాన్ని వేలంలో అమ్మేశారట.రవిప్రకాష్ దాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చాడు.టీవీ9 లోగోలను రూ.99 వేలకు తన మోజోటివీకే విక్రయించి కార్పోరేట్ రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాడు. వామ్మో!రవిప్రకాశూ నువ్వు మామూలోడివి కాదు. — Vijayasai Reddy V (@VSReddy_MP) 18 May 2019 -
రవిప్రకాశ్కు లొంగిపోయే ఆలోచన లేనట్లేనా?
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త వ్యవహారం వెలుగుచూడటం, అవన్నీ రవిప్రకాశ్కు ప్రతికూలంగా ఉండటం చూస్తుంటే.. ఈ కేసులో ఆయన రోజురోజుకూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నాడనే విషయం స్పష్టమవుతోంది. టీవీ9 యాజమాన్య మార్పు వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ఆఫ్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ)లో నటుడు శివాజీ, మాజీ సీఈఓ రవిప్రకాశ్లకు చుక్కెదురైంది. దీంతో జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే అలందా మీడియా ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. దీంతో రవిప్రకాశ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారినట్లు తెలుస్తోంది. చట్టపరంగా అన్ని దారులు మూసుకుపోతున్న క్రమంలో ఇకపై ఆయన ఏం చేస్తారనే అంశం ఇపుడు చర్చనీయాంశమైంది. అలందాకు తొలగుతున్న అడ్డంకులు ఈ వ్యవహారంలో టీవీ9ని కొనుగోలు చేసిన కొత్త కంపెనీ అలందా మీడియా సంస్థకు ఒక్కొక్కటిగా అడ్డంకులు తొలగిపోతున్నాయి. తాజాగా ఎన్సీఎల్టీ తీర్పుతో ఈ ఎపిసోడ్లో శివాజీ పాత్ర ముగిసినట్లేనని టీవీ9 ఉద్యోగులే వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాగైనా టీవీ9 యాజమాన్య బదిలీ జరగకుండా శివాజీని అడ్డంపెట్టుకుని రవిప్రకాశ్ వేసిన ఎత్తుగడ ఎన్సీఎల్టీ వద్ద బోల్తా కొట్టిందంటున్నారు. ఇక ఈ కేసులో పరారీలో ఉన్న శివాజీ దొరకడమే మిగిలింది. మరో నిందితుడు టీవీ9 మాజీ సీఎఫ్వో ఎంవీకేఎన్ మూర్తి విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఆయనను పోలీసులుపలుమార్లు విచారించారు. తాము పిలిచినప్పుడల్లా రావాలని పోలీసులు ఆదేశించారు. ఈయన తెలిపిన ఆధారాలతోనే ఈ–మెయిల్ సంభాషణలను పోలీసులు వెలికి తీయగలిగారని తెలిసింది. కానీ, మూర్తి, శివాజీ, రవిప్రకాశ్, న్యాయవాది శక్తి మధ్య జరిగిన ఈ–మెయిల్స్ వ్యవహారం.. ఎలా లీకైందన్న విషయం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. పోలీసులు మాత్రం తాము విడుదల చేయలేదని చెబుతున్నారు. లాయర్ శక్తి పాత్ర కీలకమే! ఈ కేసులో మరో కీలక నిందితుడు న్యాయవాది శక్తి. పాతతేదీలతో రవిప్రకాశ్పై ఎన్సీఎల్టీలో వేయాల్సి న వ్యాజ్యం డ్రాఫ్ట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించాడని ఆరోపణలున్నాయి. అలందా సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం న్యాయవాది శక్తి కూడా పత్తా లేకుండాపోయారు. ఆయన కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. దీనికితోడు రవిప్రకాశ్ పిటిషన్పై ఎన్సీఎల్టీ స్టే ఇవ్వడం, హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడం వంటి పరిణామాలు చూస్తుంటే అలందా ముందున్న అడ్డంకులు తొలగిపోతున్నట్లు స్పష్టమవుతోంది. లొంగిపోయే ఆలోచన లేనట్లేనా? టీవీ9 మాతృసంస్థ అయిన ఏబీసీఎల్ నుంచి అలందా మీడియాకు యాజమాన్య బదిలీ జరగకుండా రవిప్రకాశ్ చాలా సుదీర్ఘమైన వ్యవహారం నడిపినట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే, రవిప్రకాశ్ ఎన్సీఎల్టీని ఆశ్రయించడం, శివాజీ చేత వ్యాజ్యం వేయడం, టీవీ9 లోగోను మోజో టీవీ చైర్మన్ హరికిషన్కి విక్రయించడం తదితర పరిణామాలన్నీ చూస్తుంటే తమ చేతికి పగ్గాలివ్వకుండా రవిప్రకాశ్ చాలా భారీ స్కెచ్ వేశారని అలందా మీడియా వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలన్నింటికీ సమాధానాలు దొరకాలంటే.. పరారీలో ఉన్న రవిప్రకాశ్ అజ్ఞాతం వీడాలి. కానీ, జరుగుతున్న వ్యవహారాలన్నీ చూస్తుంటే.. ఇప్పట్లో రవిప్రకాశ్ పోలీసులకు లొంగిపోయే ఆలోచనేదీ లేదని సమాచారం. ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించడమే ఇందుకు నిదర్శనమని న్యాయనిపుణులంటున్నారు. -
ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్ గరుడ శివాజీ ఎక్కడ?
సాక్షి, అమరావతి : ఫోర్జరీ పెకాశం, ఆపరేషన్ గరుడ శివాజీలు ఎక్కడున్నా వచ్చేయండి.. మిమ్మల్నేమీ అనరు అంటూ టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, నటుడు శివాజీలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. 'మెరుగైన సమాజం కోసం ఫోర్జరీ ఎలా చేయాలనే సలహాలు మాత్రమే పెకాశం గారిని అడుగుతారట.. శివాజీ కోసం స్టేషన్లో వైట్ బోర్డు, మార్కర్ పెన్ను సిద్ధంగా ఉంది.. ఫోర్జరీ పురాణం చెప్తే చాలట' అంటూ సైరా పంచ్ హ్యాష్ ట్యాగ్తో పోస్ట్ పెట్టారు. తనకు కులం లేదు, మతం లేదంటూనే సొంత సామాజిక వర్గానికే ప్రమోషన్లలో చంద్రబాబు వ్యవహరించిన తీరుపై మరో సైరా పంచ్ వేశారు. #SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/BsBdw98tt0 — Vijayasai Reddy V (@VSReddy_MP) May 15, 2019 తను చేయించిన 4 సర్వేల్లో టీడీపీ గెలుస్తుందని తేలినట్టు చెప్పిన చంద్రబాబు నాయుడు, ఎగ్జిట్ పోల్స్ను మాత్రం నమ్మొద్దనడం వింతగా ఉందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. ఏ సర్వేలను ప్రామాణికంగా తీసుకోవద్దంటే అర్థం చేసుకోవచ్చు కానీ, మీడియా ఇంతగా విస్తరించిన తర్వాత దేన్ని నమ్మొచ్చో దేన్ని పట్టించుకోకూడదో ప్రజలందరికీ తెలుసని ట్విటర్లో మరో పోస్ట్ పెట్టారు. చంద్రబాబు మరో వారం రోజుల్లో మాజీ అయిపోతాడని అర్థం కావడంతో పచ్చ చొక్కాల ఇసుక మాఫియా విజృంభిస్తోందని తెలిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా వాగులు, నదులను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ నరసింహన్ జోక్యం చేసుకుని ప్రతి జిల్లాలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసి మాఫియాను నియత్రించాలని డిమాండ్ చేశారు. పోలవరం పేరును ప్రస్తావించి కాటన్ దొర ఆత్మ క్షోభించేలా చేయొద్దని చంద్రబాబుపై విజయసాయిరెడ్డి నిప్పులు చెరిగారు. ఎక్కడో జన్మించిన ఆ మహనీయుడు ఏ సౌకర్యాలు లేని రోజుల్లో ధవళేశ్వరం బ్యారేజి నిర్మించి చరిత్ర పురుషుడయ్యారని కొనియాడారు. చంద్రబాబు మాత్రం నాలుగేళ్లలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును ఏటీఏమ్లా మార్చుకుని వేల కోట్లు మింగారని ధ్వజమెత్తారు. ఏ సలహా, సహాయం కోసం రామోజీ రావుని కలిశావు చంద్రబాబూ? ప్రజాధనంతో హెలికాప్టర్లో వెళ్లి ఆయనను కలవాల్సినంత ముఖ్యమైన పనేమిటో ప్రజలకు చెప్పే ధైర్యం ఉందా? ఓడిపోయిన తర్వాత ఎక్కడ ఆశ్రయం పొందాలో అడగడానికా? కేసీఆర్తో రాజీ చేయమని ప్రాధేయపడటానికి వెళ్లావా? ఇంత దిగజారిపోయావేంటి బాబూ? అంటూ తూర్పారబట్టారు. చంద్రబాబు కుల మీడియా ఒక మాఫియా రేంజ్లో ఎదిగిన తీరు గమనిస్తే రవిప్రకాశ్ లాంటి వాళ్లు అనేకమంది కనబడతారని మండిపడ్డారు. ప్రజాధనాన్ని దోచిపెట్టడం, బ్లాక్ మెయిల్ చేసుకోమని సమాజం మీదకు వదలడం ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’ ఇన్నాళ్లుగా చేసిన ఘనకార్యమని ధ్వజమెత్తారు. బాబు నీడలో ఈ మాఫియా దేశమంతా విస్తరిస్తోందని పోస్ట్ చేశారు. #SaiRaaPunch #సైరాపంచ్ pic.twitter.com/dvAk3f8ESl — Vijayasai Reddy V (@VSReddy_MP) May 15, 2019 -
ఆయన ఫోన్లో కూడా దొరకట్లేదంటగా?
సాక్షి, హైదరాబాద్ : టీవీ9 రవి ప్రకాశ్, సీనీ నటుడు శివాజీపై వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా పలు విమర్శలు, వ్యంగోక్తులు చేశారు. విజిల్ బ్లోయర్స్ యాక్ట్, పీనల్ కోడ్ సెక్షన్ల గురించి ఉపన్యాసాలు దంచిన గరుడ పురాణం శివాజీ నాలుగు రోజులుగా ఎందుకు పరారీలో ఉన్నారని ప్రశ్నించారు. తన జాతకం తానకే తెలిసిపోవడంతో పరారీలో ఉంటున్నారని విమర్శించారు. ‘ రవి ప్రకాశ్ రక్షిస్తాడనుకుంటే ఆయనే రోడ్డునపడ్డాడు. ఫోన్లో కూడా దొరకట్లేదంటగా’ అంటూ వరుస ట్వీట్లతో శివాజీపై విమర్శనాస్త్రాలు సంధించారు. చదవండి : తెల్లకాగితం మీద అగ్రిమెంట్ రాసుకోవడమేంటో? టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసు వ్యవహారంలో శుక్రవారం విచారణకు హాజరు కావాలని సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ 9 మాజీ ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తి, రవి ప్రకాశ్, శివాజీలకు నోటీసులు అందించారు. వీరిలో ఎంకేవీఎన్ మూర్తి విచారణకు హాజరుకాగా.. రవిప్రకాశ్, శివాజీ డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. -
తెల్లకాగితం మీద అగ్రిమెంట్ రాసుకోవడమేంటో?
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా మరోసారి టీవీ9 రవిప్రకాశ్, టాలీవుడ్ నటుడు శివాజీ విమర్శనాస్త్రాలు సంధించారు. రవిప్రకాశ్ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని కంపెనీస్ లా ట్రిబ్యునల్కు శివాజీ ఫిర్యాదు చేసింది నిజమైతే.. చీటింగ్ కేసుగా పరిగణించి ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ‘ రవి ప్రకాశ్ తనకు టీవీ9 షేర్లు అమ్మి బదిలీ చేయడం లేదని గరుడ పురాణం శొంటినేని శివాజీ కంపెనీస్ లా ట్రిబ్యునల్కు ఫిర్యాదు చేశాడంటున్నారు. ఇది చీటింగ్ కేసు అవుతుంది. ట్రిబ్యునల్ ఆ ఫిర్యాదుపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి. అయినా తెల్ల కాగితం మీద షేర్ల అమ్మకం అగ్రిమెంట్ రాసుకోవడమేంటో?’ అని విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. వాళ్ల కోసం బాబు నానా తంటాలు పడుతున్నారు ప్రజలంతా మనవైపే.. విజయం మనదే అంటూ ఢీలా పడ్డ నేతలను గాలికొట్టి లేపడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నానా తంటాలు పడుతున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. టీడీపీ నేతలకు ధైర్యాన్ని నూరిపోస్తునే మరోవైపు తన కోటరీలో ఉన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను చకచక క్లియర్ చేయించుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఈ నెల 23న( ఎన్నికల ఫలితాలు వెలువడే రోజు) రిటర్న్ టికెట్ బుక్ చేసుకొని..తమ్ముళ్లకు మాత్రం ధైర్యం నూరిపోస్తున్నారని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు. -
పత్తాలేని గరుడ పురాణం శివాజీ
సాక్షి, హైదరాబాద్ : టీవీ 9 వాటాల వ్యవహారంలో సొంత లబ్ధి కోసం నకిలీ పత్రాలు సృష్టించడంతోపాటు కంపెనీ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేశారని నమోదైన కేసులో టీవీ 9 మాజీ ఫైనాన్స్ డైరెక్టర్ ఎంకేవీఎన్ మూర్తిని శనివారం మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు విచారిస్తున్నారు. ఫోర్జరీ, నిధుల మల్లింపు అంశాలపై మూర్తిని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో రవిప్రకాశ్, గరుడ పురాణం నటుడు శివాజీ పోలీసు విచారణకు హాజరుకాలేదు. శుక్రవారం విచారణకు రావాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులు వారిద్దరితోపాటు ఎంకేవీఎన్ మూర్తికి నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. రవిప్రకాశ్, శివాజీ విచారణకు డుమ్మా కొట్టగా.. మూర్తి శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో గచ్చిబౌలిలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, సైబర్ క్రైమ్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఆయన్ను రాత్రి 11 గంటల వరకు విచారించింది. కాగా, రవిప్రకాశ్ వ్యక్తిగత విచారణకు మరో పది రోజుల సమయం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పోలీసులను కోరినట్టు తెలిసింది. పరారీలో ఉన్న శివాజీకి మరోసారి నోటీసు జారీ చేసి విచారణకు హజరుకాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు బంజారాహిల్స్లోని టీవీ 9 కార్యాలయంలో కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ను సైబర్ క్రైమ్ పోలీసులు ప్రశ్నించారు. కంపెనీ సెక్రటరీ సంతకాన్ని రవిప్రకాశ్ ఫోర్జరీ చేశారనే ఆరోపణల నేపథ్యంలో దేవేంద్ర అగర్వాల్ను విచారించారు. కాగా, టీవీ 9 కార్యాలయం వద్ద శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు హైడ్రామా చోటుచేసుకుంది. ఉదయం 8 గంటలకు సీఈవో హోదాలో రవిప్రకాశ్ కార్యాలయానికి వచ్చారు. ఆయన లోనికి వెళుతున్నప్పుడు టీవీ చానళ్ల ప్రతినిధులు కెమెరాల్లో రికార్డు చేయడానికి ప్రయత్నించగా.. అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. తాము రోడ్డు మీద నిలబడి రికార్డు చేస్తున్నామని సాక్షి టీవీ ప్రతినిధులు చెప్పినప్పటికీ, అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారాలు చేయడానికి వీల్లేదంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా, రవిప్రకాశ్ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన చాంబర్లోనే ఉన్నారు. మధ్యాహ్నం సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు టీవీ 9 కార్యాలయానికి రావడంతో రవిప్రకాశ్ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొద్దిసేపటికి అసోసియేట్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీపీఎల్) బోర్డు సభ్యులు అక్కడకు చేరుకుని సమావేశమయ్యారు. అనంతరం అక్కడున్న సెక్యూరిటీని తొలగించి, కొత్తవారిని నియమించారు. రవిప్రకాశ్ మళ్లీ కార్యాలయానికి వస్తే లోనికి అనుమతించొద్దని కొత్త సెక్యూరిటీకి ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో తాను సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా రవిప్రకాశ్ ఓ సహచరుడి ద్వారా లేఖ పంపించారు. -
రవిప్రకాశ్, శివాజీపై ఫోర్జరీ కేసు
సాక్షి,హైదరాబాద్: టీవీ9 వాటాల వ్యవహారంలో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీలపై సైబర్క్రైం పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు. ఇటీవల టీవీ9లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ డైరెక్టర్ పి.కౌశిక్రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్క్రైం పోలీసులు ఐటీ యాక్ట్ 66,72 సెక్షన్లతోపాటు ఐపీసీ 406, 420, 467, 469 ,471, 120(బీ) సెక్షన్లపై కేసు నమోదు చేసి గురువారం విచారణ ప్రారంభించారు. దీంతోపాటుగా నకిలీ పత్రాల సృష్టి, ఫోర్జరీ వ్యవహారంలో రవిప్రకాశ్తో పాటు ఎంకేవీఎన్ మూర్తిపై కూడా ఐటీ యాక్ట్ 66(సీ), 66(డీ), ఐపీసీ 420, 468, 471, 120(బీ) సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేశారు. కోర్టు సెర్చ్వారంట్ ఆధారంగా గురువారం బంజారాహిల్స్లోని టీవీ9 కార్యాలయంతో పాటు రవిప్రకాశ్ నివాసంలోను, హిమాయత్నగర్లోని సినీనటుడు శివాజీ, ఖైరతాబాద్లోని మూర్తి ఇళ్లలోనూ సోదాలు జరిపి పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిపిన సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపామని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. విచారణలో భాగంగా సీఆర్పీసీ 160 సెక్షన్ కింద నోటీసులిచ్చారు. రవిప్రకాశ్ ఇంట్లో లేకపోవడంతో శుక్రవారం తమ ఎదుట హాజరుకావాలని ఇంటి గోడకు నోటీసులు అతికించారు. టీవీ9 కార్యాలయంలో బందోబస్తు బంజారాహిల్స్ టీవీ9 కార్యాలయంలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సైబరాబాద్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఉదయం కార్యాలయంలో రవిప్రకాశ్ కోసం ఆరా తీశారు. ఆయన లేరని చెప్పడంతో వివిధ డాక్యుమెంట్లను అడిగి తెప్పించుకున్నారు. సైబరాబాద్ పోలీసులు టీవీ9 కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నారని ప్రచా రం జరగడంతో పెద్ద సంఖ్యలో జనం ఇక్కడికు వ చ్చారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అలాగే హిమాయత్నగర్ వై జంక్షన్ వద్ద నివాసముంటున్న నటుడు శివాజీ ఇంట్లో ఉదయం 10–11 గంటల మధ్యలో పోలీసులు సోదా లు చేశారు. ఆ సమయంలో హీరో శివాజీ ఇంట్లో లేరు. సోదాల్లో పలు కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కినట్లు తెలిసింది. -
చంద్రబాబుకు విపరీతమైన కులపిచ్చి : పోసాని
-
పోసాని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల వేళ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిష్టత దిగజార్చడానికి చంద్రబాబు నాయుడు కుట్రపన్ని నటుడు శివాజీతో అసత్యాలను ప్రచారం చేయిస్తున్నారని పోసాని కృష్ణమురళి ఆరోపించారు. ‘నిన్న చంద్రబాబును దెయ్యమన్న శివాజీ..నేడు దేవుడు ఎలా అయ్యాడో’ చెప్పాలన్నారు. శివాజీ ఒక మతిస్థిమితం లేని వ్యక్తి అని పోసాని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎలా మాట్లాడుతాడో ఆయనకే తెలియదన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని కుట్రలు అయినా చేస్తారన్నారు. పదవి కోసం ఎన్టీఆర్ను ఎలా వెన్నుపోటు పొడిచారో.. అలాగే కాంగ్రెస్తో కుమ్మకై జగన్పై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపించారని ఆరోపించారు. అధికారం కోసం ఆడవాళ్లను కూడా తిట్టించే గుణం చంద్రబాబు నాయుడుదని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు విపరీతమైన కులపిచ్చి ఉందన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే కమ్మకులానికి ఓటు వేసినట్లేన్నారు. ఈ ఒక్కసారి వైఎస్ జగన్కు ఓటేసి గెలిపించాలంటూ పోసాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు, శివాజీ మాట్లాడిన వీడియోలను ప్రదర్శించారు. అనంతరం పోసాని మాట్లాడుతూ.. కులపిచ్చితో నటుడు శివాజీ, టీవీ9 రవిప్రకాష్, ఏబీఎన్ రాధాకృష్ణతో కలిసి జగన్ను అన్ పాపులర్ చేయడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రతిష్టత దెబ్బతీయడానికి కుట్ర ‘ఒక మనిషి ఎన్ని రకాలుగా ఊసరవెల్లిగా మారుతారో చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఆ మనిషి ఒకప్పటి హీరో శివాజీ. నిన్న ఈ శివాజీ చంద్రబాబు మహాత్ముడని, రాష్టం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని సెలవించారు. ఇదే శివాజీ ఒకప్పుడు ఇంత దరిద్రమైన అవినీతి ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు చూడలేదన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టుకు అయినా 50శాతం కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటివి ఆఫ్ ద రికార్డులో ఇంకా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు దెయ్యం, అవినీతి పరుడు అని అన్న శివాజీకి ఇప్పుడు ఆయన దేవుడు ఎలా అయ్యాడు? కుల పిచ్చితో చంద్రబాబుకు సపోర్టుగా మాట్లాడుతూ.. అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల వేళ వైఎస్ జగన్ ప్రతిష్టత దెబ్బతీయడానికి ఇలాంటి వాళ్లు ప్రయత్నిస్తున్నారు’ అని పోసాని విమర్శించారు. చంద్రబాబు గుణం ఎలాంటిదో అందరికి తెలుసన్నారు. తక్కువ సమయంలో మామకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీని లాక్కున్నాడని విమర్శించారు. ఎన్టీఆర్ హత్యకు చంద్రబాబే కారణమన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో లక్ష్మీపార్వతికి మంచి పేరు వచ్చిందని అందుకే ఆమెపై లైగింక దాడి ఆరోపణలు చేస్తున్నారన్నారు. ‘70 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ గురించి అంత ఘోరంగా రాస్తారా? ఎన్టీఆర్ ఇల్లాలు గురించి ఎవరో ఒకరు అలా మాట్లాడితే తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు ఎలా ఊరుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఎవరినైనా వాడుకొని వదిలేస్తారు. టీడీపీ నుంచి జయపద్ర, రోజాను ఏ విధంగా పార్టీ నుంచి బయటకు పంపారో అందరికి తెలిసిందే. చిరంజీవీ పార్టీ పెట్టుకుంటే ఆయన ఇంటి ఆడపిల్లల గురించి తిట్టించారు. పవన్ కల్యాణ్ ఈ విషయాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఇదీ చంద్రబాబు, జగన్కు ఉన్న తేడా ఇక చంద్రబాబు గురించి చెప్పాలంటే..ఆయనది మొదట కాంగ్రెస్ పార్టీ. ఓడిపోగానే టీడీపీలోకి వచ్చారు. తక్కువ సమయంలో మామకు వెన్నపోటు పొడిచి అధికారం లాక్కున్నారు. చివరకు రామారావు మరణానికి కారణమయ్యారు. జగన్ గురించి చెప్పాలంటే..జగన్ది మొదట కాంగ్రెస్ పార్టీ. వాళ్ల నాన్న చనిపోయినప్పుడు కొంత మంది వైఎస్సార్ అభిమానులు చనిపోయారు. వాళ్లను ఓదార్చడానికి జగన్ వెళ్తానన్నారు. దీంతో సోనియా గాంధికి ఎవరో చాడీలు చెప్పారు. ఓదార్పు యాత్రకు ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆయన బయటకు వచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. వైఎస్సార్ సీపీ పార్టీ జగన్ది. ఎవరికి వెన్నుపోటు పొడిచి లాక్కోలేదు. సమైక్యాంధ్ర కోసం చంద్రబాబు ప్రాణాలు ఇస్తానన్నారు. తర్వాత తెలంగాణ కోసం లెటర్ రాశారు. అదే జగన్ మొదటి నుంచి సమైకాంధ్రనే అన్నారు. హోదా విషయంలో కూడా చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. కానీ జగన్ మొదటి నుంచి హోదా కావాలి అన్నారు. ఇది చంద్రబాబుకు, జగన్కు ఉన్న తేడా. ఇక లోకేష్. . ఇతనికి ఏమి తెలియదు. డబ్బులు, అమ్మాయిలు మందు.. ఇవే తెలుస్తాయి. అతను మూడు శాఖలకు మంత్రి, కానీ అమ్మాయిలతో తిరుగుతున్నాడు. ఒక్కసారి ఇవన్ని ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయండి’ అని పోసాని ప్రజలను కోరారు. -
చంద్రబాబు గుణం ఎలాంటిదో అందరికి తెలుసు
-
శివాజీ ప్యాకేజీ స్టార్ : సురేష్
సాక్షి, విజయవాడ : చంద్రబాబు నాయుడు ఎంగిలి మెతుకులను ఆశపడి సినీ నటుడు శివాజీ టీడీపీకీ అనుకూలంగా మాట్లాడుతున్నారని బాపట్ల పార్లమెంట్ వైఎస్సార్ సీపీ అభ్యర్థి నందిగం సురేష్ ఆరోపించారు. ప్యాకేజీ స్టార్గా మారి చంద్రబాబును ఆకాశానికి ఎత్తుతూ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... హోదారాకుండా చంద్రబాబునాశనం చేశాడని మాట్లాడిన శివాజీ ఇప్పుడు ఎందుకు అనుకూలంగా మట్లాడుతున్నారో చెప్పాలన్నారు. సినిమాలు లేని శివాజీ, చందాలు వసూలు చేసేవాడిలా న్యూస్ ఛానెళ్ల ఆఫీసుల చుట్టు తిరుగుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. శివాజీకి సాయంత్రం ప్యాకేజి ఇస్తే పొద్దున్నే వారి తరపున వకాల్తా పుచ్చుకుని బయల్దేరతారని ఆరోపించారు. వైఎస్. జగన్పై ఎన్ని కుయుక్తులు, కుట్రలు పన్నినా, కులగజ్జి ఎల్లోమీడియాను ప్రజలు నమ్మేపరిస్దితి లేదన్నారు. ఐదేళ్లుగా రాష్ట్ర సంపదను చంద్రబాబు దోచుకుతిన్నారని ఆరోపించారు. రాజధాని భూముల విషయంలో చంద్రబాబు మోసం చేశారని, దినిపై చర్చకు తాను సిద్దమన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికల అవుతాయన్నారు. ప్రజలకు ఇచ్చే తీర్పుతో చంద్రబాబు సింగపూర్ పారిపోయే పరిస్థితి ఉందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘనవిజయం సాధించి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. -
నరేష్, శివాజీరాజా జోరు.. సిని‘మా’ పోరు..
బంజారాహిల్స్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు(2019–2021) ఈ నెల 10న జరగనున్న నేపథ్యంలో ఫిలింనగర్ వేడెక్కింది. ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న సీనియర్ నటుటు నరేశ్ ప్యానల్, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా ప్యానల్ రెండు వారాలుగా ప్రచార జోరు పెంచాయి. తాము గెలిస్తే ఏం చేయబోతున్నామో మేనిఫెస్టోలను కూడా విడుదల చేశాయి. ఎవరికి వారు ఇప్పటికే అగ్రనటీనటులను కలిసి వారి మద్దతు కోరారు. రెండేళ్లకోసారి జరిగే ‘మా’ ఎన్నికల్లో సుమారు 800 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఆదివారం ఉదయం 8 నుం చి మధ్యాహ్నం 2 గంటల వరకు ఫిలిం ఛాంబర్లో పోలింగ్ జరుగుతుంది. నరేష్ ప్యానల్.. అధ్యక్షుడిగా నరేష్, ఉపాధ్యక్షులుగా మాణిక్, హరినాథ్బాబు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా రాజశేఖర్, జనరల్ సెక్రెటరీగా జీవితా రాజశేఖర్, జాయింట్ సెక్రెటరీలుగా శివబాలాజీ, బి.గౌతంరాజు, ట్రెజరర్గా కోట శంకర్రావుతో పాటు ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పసునూరి శ్రీనివాసులు, అలీ, జేఎల్ శ్రీనివాస్, రాజర్షి, జాకీ, కరాటే కల్యాణి, స్వప్నమాధురి, ఎ.లక్ష్మీనారాయణ, శ్రీముఖి, నాగమల్లికార్జునరావు, బాబి, వింజమూరి మధు, సత్యం, అశోక్కుమార్, లక్ష్మీకాంతరావు, మోహన్ మిత్ర, జోగి బ్రదర్స్ కృష్ణంరాజు, కుమార్ పోటీపడుతున్నారు. శివాజీరాజా ప్యానల్.. ఇందులో అధ్యక్షుడిగా శివాజీరాజా, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్లుగా బెనర్జీ, ఎస్వీ కృష్ణారెడ్డి, జనరల్ సెక్రెటరీగా రఘుబాబు, జాయింట్ సెక్రెటరీలుగా బ్రహ్మాజీ, నాగినీడు, కోశాధికారిగా రాజీవ్ కనకాల, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా తనీష్, ఉత్తేజ్, అనితాచౌదరి, బాలాజీ, పృథ్విరాజ్, భూపాల్రాజు, సి.వెంకటగోవిందరావు, డి.రాజారవీంద్ర, డి.రవిప్రకాశ్, ఏడిద శ్రీరామ్, జయలక్ష్మి, వేణు మాధవ్, కొండేటి సురేష్, పి.సాయికుమార్, రాజ్తరుణ్, సమీర్, తనికెళ్ల భరణి తదితరులు పోటీపడుతున్నారు. -
గనుల శాఖలో బయటపడిన ‘కట్టల’ పాము
లాకర్లలో రూ.కోట్ల కట్టలు.. వాటర్ క్యాన్లోనూ లక్షలకు లక్షలు.. కోట్ల విలువైన బంగారు నిధి.. విశాఖ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో భారీ భవంతులు.. పక్క జిల్లాల్లో వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు.. వెరసి రూ.50 కోట్లకుపైగా అక్రమాస్తులు..రోజూ కాలం చెల్లిన పాత బజాజ్ స్కూటర్పై రైల్వేస్టేషన్కు వెళ్లి.. అక్కడి నుంచి రైలులో తను పనిచేసే అనకాపల్లికి వెళ్లే ఓ అధికారి ఇన్ని భారీ ఆస్తులు సంపాదించారంటే ఎవరైనా సరే.. నమ్మరేమో!..కానీ గురువారం ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో బయటపడిన అవినీతి గని.. దీన్ని నమ్మక తప్పదని చెబుతోంది.. ఆ అవినీతి ‘గను’డు.. అనకాపల్లి కేంద్రంగా పని చేస్తున్న గనులు, భూగర్భ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ గుండు శివాజీ.టెక్నికల్ అసిస్టెంట్గా 1993లో ఉద్యోగ జీవితం ప్రారంభించిన ఈయన ఈ పాతికేళ్లలో ఏడీ స్థాయికి ఎదిగిన క్రమంలోనే ఎడాపెడా అక్రమార్జనకు పాల్పడ్డారు. అవనీతి సంపాదనతో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లోనూ భూములు, ఇళ్లు, ఇళ్లస్థలాలు, బంగారు నగలు సమకూర్చుకొని కోట్లకు పడగెత్తారు. ఈయనగారి అక్రమాలపై అందిన ఫిర్యాదులతో ఆరునెలల నుంచే ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. అదను చూసి గురువారం దాడులు చేశారు. బృందాలుగా విడిపోయి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అనకాపల్లిలోని అతని కార్యాలయం, విశాఖ ఎంవీపీ కాలనీలోని నివాసంతోపాటు పీఎంపాలెంలోనే అతని బావమరిది అయిన ఓ కానిస్టేబుల్ ఇంటిలోనూ సోదాలు జరిపారు. విజయగనం జిల్లాలోని అతని స్వగ్రామంతోపాటు పలువురు బంధువుల నివాసాల్లో జరిపిన సోదాల్లో అక్రమా ఆస్తులకు సంబంధించి కళ్లుచెదిరే వివరాలు లభ్యమయ్యాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ రూ.2.50 కోట్లు అని అంచనా వేసినప్పటికీ.. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.50 కోట్ల పైమాటేనని అధికారులే చెబుతున్నారు. లాకర్లు, ఇళ్లలో ఉన్న నగదులో అధిక శాతం 2000, 500 నోట్ల కట్టలే ఉండటం విశేషం. సీతమ్మధార(విశాఖ ఉత్తర): అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అందినకాడికి దోచుకుని కోట్ల రూపాయలు కూడబెట్టిన అవినీతి ఘని ఏసీబీ అధికారులకు చిక్కింది. 25 సంవత్సరాల కిందట సాధారణ టెక్నికల్ అసిస్టెంట్గా ఉద్యోగ జీవితం ప్రారంభించి రూ.50కోట్లకుపైగా కూడబెట్టినట్లు ఆరోపణలు రావడంతో జియాలజీ అండ్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ గుండు శివాజీ, అతని బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేపట్టారు. విజయనగరంం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లిలోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి అక్రమార్జన గుట్టు విప్పారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... గురువారం ఉదయం 6 గంటల నుంచి ఎంవీపీ కాలనీ సెక్టార్ – 3లోని శివాజీ ఇంటిలో సోదాలు చేపట్టారు. అదే సమయంలో అతని సోదరుడు బాలాజీ ఇల్లు, పీఎంపాలెంలోని బావమరిది ఇల్లు, స్వగ్రామం బంటుపల్లిలోని ఇల్లు, అనకాపల్లిలోని కార్యాలయంలో సోదాలు చేపట్టారు. భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించారు. గుర్తించిన ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.2.50కోట్లు ఉంటుందని, బహిరంగ మార్కెట్ ప్రకారం రూ.50కోట్లపైనే ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ అధికారులు గణేష్, రమేష్, గఫూర్, మూర్తి, అప్పారావు, ఉమామహేశ్వరరావు సిబ్బందితో బృందాలుగా ఏర్పాడి సోదాలు నిర్వహించారు. గుర్తించిన ఆస్తులివే ♦ శివాజీ ఇంటిలో 240 గ్రాముల బంగారం, 3.3 కిలోల వెండి, రూ.9.5లక్షలు గుర్తించారు. ♦ శివాజీ భార్య శారదామణి పేరిట ఎంవీపీ సెక్టార్ –6లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలోని లాకర్లో రూ.39.50 లక్షలు నగదు (అన్నీ రూ.2 వేలు, రూ.500ల నోట్లు) గుర్తించారు. ♦ ఎంవీపీ సెక్టార్ – 10లోని ఎస్బీఐ లాకర్ 34.50 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. అందులోనే 1358 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించారు. ♦ కాపులుప్పాడలో 267 గజాల స్థలం. ♦ ఎంవీపీ కాలనీలో మూడు అంతస్తుల భవనం. (దీని విలువ సుమారు రూ.2కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.) ♦ విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో నిర్మాణంలో ఉన్న జీ ప్లస్ వన్ భవనం. ♦ భోగాపురంలోని 25 సెంట్ల వ్యవసాయ భూమి. ♦ స్వగ్రామం బంటుపల్లిలో వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు. ♦ ఇంకా కొన్ని లాకర్లలో నగదు, బంగారం ఉందని, ఫిక్సిడ్ డిపాజిల్లు ఉన్నాయని... అవన్నీ పరిశీలిస్తున్నామని డీఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు. శివాజీని అరెస్ట్ చేసి మూడో పట్టణ పోలీస్ స్టేషన్కు తరలించామని, శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు. స్వగ్రామంలోని ఇంటిలో... డెంకాడ(నెల్లిమర్ల): విశాఖ జిల్లా అనకాపల్లి మైన్స్ ఏడీగా పని చేస్తున్న గుండు శివాజీ ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారన్న అభియోగంపై అవినీతినిరోధక శాఖ అధికారులు ఆయన ఇళ్లపై గురువారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. దీనిలో భాగంగా శివాజీ స్వగ్రామమైన విజయనగరం జిల్లా డెంకాడ మండలంలోని బంటుపల్లి గ్రామంలోని ఆయన స్వగృహంలో ఏసీబీ ఇన్స్పెక్టర్ గఫూర్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఇక్కడ సోదాల్లో వంశపారపర్యంగా వచ్చిన ఆస్తులకు సంబంధించిన భూమి పత్రాలను గుర్తించామని, కొత్తగా ఏమీ ఇక్కడ లభ్యం కాలేదని ఏసీబీ ఇన్స్పెక్టర్ గఫూర్ ‘సాక్షి’కి తెలిపారు. వీటన్నింటినీ నమోదు చేసుకుని, రెవెన్యూ అధికారుల నుంచి కూడా వీటిపై సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు. కానిస్టేబుల్ చంద్రశేఖర్ నివాసంలో... పీఎం పాలెం(భీమిలి): పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు సమీపంలోని ఓ అపార్టుమెంట్లో నివసిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కూరాకుల చంద్రశేఖర్ నివాసంపై ఏసీబీ సీఐ రామారావు సిబ్బందితో దాడులు నిర్వహించారు. అవినీతి ఘని మైన్స్ ఏడీ శివాజీకి చంద్రశేఖర్ స్వయానా బావమరింది. ఇంటిలో క్షుణ్ణంగా పరిశీలించామని, అయితే శివాజీ ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభ్యం కాలేదని సీఐ రామారావు తెలిపారు. ఆరు నెలలుగా నిఘాపెట్టి మైన్స్ ఏడీ శివాజీ అక్రమార్జనపై సమాచారం అందడంతో అవినీతి నిరోధక శాక అధికారులు అతని కార్యాలయం, ఇల్లు, తదితరాలపై గడిచిన ఆరు నెలలుగా నిఘా ఉంచారు. రోజూ ఇంటి నుంచి స్కూటర్పై రైల్వేస్టేషన్కు వెళ్లి... అక్కడ పార్కు చేసి రైలులో అనకాపల్లిలోని కార్యాలయానికి వెళ్తుండేవాడని అధికారులు గుర్తించారు. వాటర్ క్యాన్లో నోట్ల కట్టలు కూలింగ్ వాటర్ క్యాన్లో లక్షలాది రూపాయల నోట్ల కట్టలు దాచిపెట్టి తన పడక గదిలో శివాజీ ఉంచుకున్నాడు. తనిఖీల్లో వాటర్ క్యాన్లో సుమారు రూ.10 లక్షలు ఉన్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు అవాక్కయ్యారు. పేరు : గుండు శివాజీ ఉద్యోగంలో చేరింది : 1993లో టెక్నికల్ అసిస్టెంట్గా చేరిక ప్రస్తుత హోదా : జియాలజీ అండ్ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్గాఅనకాపల్లిలో విధుల నిర్వహణ 25 ఏళ్లలో సంపాదన : బహిరంగ మార్కెట్లో రూ.50కోట్లకుపైనే ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టిన ప్రదేశాలు ♦ అనకాపల్లిలోని మైన్స్ ఏడీ కార్యాలయం ♦ విజయనగరం జిల్లాలోని డెంకాడ మండలం బంటుపల్లి గ్రామంలోని శివాజీ స్వగృహంలో శ్రీకాకుళంలోని బంధువుల ఇంటిలో ♦ విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు పరిశీలన ♦ విశాఖ నగర పరిధి ఎంవీపీ కాలనీలోని సెక్టార్ –3లోని శివాజీ ఇల్లు ♦ ఉషోదయ కూడలిలో ఆయన సోదరుడు బాలాజీ ఇల్లు ♦ పీఎం పాలెం ఆఖరు బస్టాపునకు సమీపంలోని బావమరిది చంద్రశేఖర్ ఇంటిలో -
ఆపరేషన్ గరుడ..శివాజీపై డీజీపీకి ఫిర్యాదు
హైదరాబాద్: సినీ నటుడు శివాజీపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డికి బుర్రగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసుకు సంబంధించి శివాజీని అరెస్ట్ చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని కోరారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే కుట్రతో ఈ దాడి జరిగిందని, సినీ నటుడు శివాజీ ప్రమేయం స్పష్టంగా ఉన్నట్లు అర్ధమవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోనే శివాజీ ఉంటున్నాడు కాబట్టి తెలంగాణ పోలీసులే విచారించాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై డీజీపీ సానుకూలంగా స్పందించారని, ప్రత్యేక బృందంతో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారని బుర్రగడ్డ అనిల్ తెలిపారు. -
శివాజీపై రాజద్రోహం కేసు నమోదు చేయండి
అనంతపురం సెంట్రల్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి ఆపరేషన్ గరుడ పేరుతో ముందే చెప్పిన సినీ నటుడు శివాజీపై రాజద్రోహం కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురం డీఎస్పీ వెంకట్రావ్ను ఆయన చాంబర్లో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు గోవిందరాజులు, దాదాఖలందర్, ఈశ్వరప్ప తదితరులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సినీనటుడు శివాజీ ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో రాష్ట్రంలో ప్రతిపక్ష నేతపై దాడి జరుగుతుందని మీడియా ద్వారా ప్రచారం చేశారన్నారు. తరువాత కొద్దిరోజులకే విశాఖ ఎయిర్పోర్టులో జగన్పై హత్యాయత్నం జరిగిందన్నారు. ప్రతిపక్షనేతపై దాడి జరుగుతుందని శివాజీకి ముందే ఎలా తెలుసునని ప్రశ్నించారు. ఈ హత్యాయత్నం కేసులో శివాజీతో పాటు మరికొంతమంది పెద్ద స్థాయి నాయకుల పాత్ర ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. శివాజీపై రాజద్రోహం కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ప్రాణహాని తలపెట్టి అసత్య ప్రచారమా!
వైఎస్ జగన్పై ఆయన అభిమానే దాడి చేశాడు, ఇది చాలా చిన్న అంశం అంటూ హత్యాప్రయత్నం జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాష్ట్ర ప్రభుత్వానికి వంతపాడటం నుంచి, ఈ ఘటనపై అసత్య ప్రచార మోత మోగుతూనే ఉంది. అది హత్యాప్రయత్నమేననీ, వైఎస్ జగన్ ఆ దుర్మార్గుడిని తెలివిగా గుర్తించి తోసివేయగలిగారుగానీ లేకుంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం జరిగేదని ప్రభుత్వం వారి విచారణ బృందమే వెల్లడించింది. అయితే హత్యాప్రయత్నం చేసిన ఆ శ్రీనివాస్ పాత్రధారే కానీ.. దానికి సూత్రధారులు, వ్యూహకర్తలు ఎవరనే పరిశీలనకు విచారణ బృందం ఇంకా పూనుకోలేదు. ప్రతిపక్ష నేతపై అసత్యప్రచారానికి ఇకనైనా అడ్డుకట్టలు పడాల్సి ఉంది. దేశంలో అత్యవసర పరి స్థితిని ఇందిరాగాంధీ 1975లో ప్రవేశపెట్టిందని తెలియగానే లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ‘వినాశకాలే విపరీత బుద్ధి’ అని స్పందించారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ పాదయాత్రలో వేల కిలోమీటర్లు నడిచి, ప్రత్యక్షంగా యావదాంధ్ర ప్రజానీకాన్ని స్వయంగా కలుసుకుని వారి బాధలు తెలుసుకుంటూ వారికి తగిన భరోసా కల్పిస్తూ, వారి భవిష్యత్తు కోసం నవరత్నాలను అమలు చేయనున్నానని సవివరంగా వేలాదిమంది హాజరవుతున్న వందలాది బహిరంగ సభల్లో ఇత రత్రా సమావేశాల్లో వివరిస్తున్నారు. ఆయన ప్రకటన లతో ప్రజల మనసులు పులకిస్తున్నాయి. మరోవై పున కుట్రలు, కుతంత్రాలు, నయవంచన, దోపిడీ అణచివేతలే ఆయుధాలుగా గల పాలకులకు, ప్రత్యే కించి ఒక ఆధిపత్య కులం పెత్తందార్లకు గుండెల్లో గుబులు పుడుతోంది. తమ పాలనకు వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని స్పష్టంగా వారికి అర్థం అవుతు న్నది. ఈ పరిస్థితిలో దిక్కుతోచక తప్పుమీద తప్పు చేస్తూ తమ నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటు న్నారు. అందులో భాగమే ఈ నెల 25న జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో భద్రతా వలయంలోనే జరిగిన హత్యాప్రయత్నం. ఈ సంద ర్భంగా జయప్రకాష్ నారాయణ్ చేసిన వ్యాఖ్య మళ్లీ గుర్తుకు వస్తే ఆశ్చర్యం కలుగదు. జగన్మోహన్ రెడ్డిపై హత్యాప్రయత్నం జరిగిన నిమిషాల్లోనే ఇంకా ఆ హంతకుడి వివరాలు విజువల్ మీడియాలో పూర్తిగా రాకుండానే ప్రచారార్భాటం కోసం ఈ దాడి జరిగిందని రాష్ట్ర పోలీసు ఉన్నతా ధికారి ప్రకటించారు. పైగా ఆ దాడి చేసిన వ్యక్తి జగ న్కు వీరాభిమానేననడం మరో అసత్యం. తమ హోదాను దిగజార్చి, పదవీ గౌరవాన్ని మర్చి, తన ప్రియతమ నేతకు పాదాభిషేకమో, పాలాభిషేకమో చేస్తున్న అధికార దాహం కల సభాపతులను చూస్తు న్నాం కానీ, ఇలా అభిమానిని అని చెప్పుకుంటూ హత్యాప్రయత్నం చేసేవాళ్లను చూడ్డం ఇదే మొద టిసారి! నిమిషాల్లోనే పోలీసువారు ఈ దాడి గుట్టు మట్లను ఛేదిస్తే ఇక దర్యాప్తు, విచారణ వగైరా దేనికి? ఏదేమైనా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆ పోలీసు ఉన్నతాధికారి ప్రభువును మించిన ప్రభు భక్తిని ప్రశంసించకుండా ఉండలేను. వీరాభిమాని చేసినా లేదా వీరాభిమాని ముసుగును ఆ వ్యక్తి మీద కప్పి, ఓటమి భయంతో వణుకుతున్న నేతలెవరైనా అతనితో చేయించినా.. అంతిమంగా అతడి ప్రాణా నికి తనను పురమాయించిన నేతల నుంచే ముప్పు ఉండవచ్చు. కనుక ప్రభువును మించిన సదరు పోలీసు ఉన్నతాధికారులు అతనికి ప్రాణహాని కలి గించకుండా తగు రక్షణ కల్పించాల్సి ఉంది. పైగా, ఇలాంటి సానుభూతి థియరీలకు గతంలో చంద్రబాబు హయాంలోనే కాలం చెల్లింది. చంద్రబాబుపై నక్సలైట్లు అలిపిరి వద్ద బాంబులతో దాడిచేశారు. అదృష్టవశాత్తూ అంతకు మించి ఏడు కొండల వెంకన్న చౌదరి (ఎంపీ మురళీ మోహన్కు కృతజ్ఞతలతో, క్షమాపణలతో) దయవలన బాబు గారికి ఏ ప్రమాదమూ జరగలేదు. దానితో తన పట్ల ప్రజల్లో సానుభూతి వెల్లువ పొంగి పొరలుతుందని, ఈ సమయంలో ముందస్తు ఎన్నికలకు వెళితే ప్రజలు నీరాజనం పట్టి తనకు తిరిగి భారీ మెజారిటీతో అందలం ఎక్కిస్తారని చంద్రబాబు ఎన్నికల్లో భ్రమ పడ్డారు. ఢిల్లీలో అప్పుడు అధికారంలో ఉన్న వాజ్ పేయిని కూడా ఒప్పించి ముందస్తు ఎన్నికలకు తెర తీశారు. కానీ చంద్రబాబు అంచనాలు తల్లకిందులై 2004 ఎన్నికల్లో తెలుగుదేశం బొక్కబోర్లాపడింది. పాపం.. ఈయనతో ముడివేసుకున్న ప్రధాని వాజ్ పేయి ప్రభుత్వానికి కూడా కాలం చెల్లిపోయింది. కాబట్టి ఇలాంటి కాకమ్మ కథలను తెలివిమీరిన నేటి ఓటర్లు నమ్మరు కాక నమ్మరు. ఇక బాబుగారి అనుచర బృందం ఇంకో అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి తనపై తానే దాడి చేయించుకున్నాడని గొంతులు చించుకుని దుష్ప్ర చారం చేస్తున్నారు. బాబుగారు రాష్ట్రంలో తన ప్రభు త్వాన్ని అస్థిరపరిచి రాష్ట్రపతి పాలన ప్రవేశ పెట్టా లన్న కుట్ర జరుగుతున్నదనీ జనాన్ని భయభ్రాంతు లను చేస్తున్నారు. చంద్రబాబుని చూస్తుంటే జాలే స్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రాగ లమని ఆయన, టీడీపీ కలిసి దింపుడు కళ్లెం ఆశ పెట్టుకుని ఉండవచ్చు. కానీ ఆ పార్టీకి రానున్న ఎన్ని కలే చివరి ఎన్నికలు కావాలని జనం ఎప్పుడో నిర్ణ యించుకున్నారు. అయినా ప్రజానీకం అప్రమ త్తంగా ఉండాలి. సాక్షాత్తు ముఖ్యమంత్రే ప్రార్థనా స్థలాలపై దాడులు, అల్లకల్లోలం, రాష్ట్రంలో అశాంతి పరిస్థితులు వస్తాయని బహిరంగంగా చెబుతున్నా రంటే తమ ప్రభుత్వ రక్షణకు చంద్రన్న పథకాలేవో సిద్ధం చేస్తున్నారన్నమాట! అయితే బాబుగారి సంక్షేమ పథకాల మాదిరే ఈ కుట్ర పథకాలూ నీరుగారిపోయేవే! సందట్లో సడేమియా అన్నట్లుగా కొన్ని బినామీ మీడియా సంస్థలు కూడా బాబుగారి ఈ ప్రయ త్నాలకు, వారి కుతంత్రాలకు తగురీతిలో మసాలా దట్టించి మరీ వడ్డిస్తున్నాయి. ఇంకా హత్యాప్ర యత్నం చేసిన వ్యక్తి వివరాలేమీ రాకముందే హోటల్ సర్వర్ శ్రీనివాస్ ఫోర్కుతో జగన్పై దాడి చేశాడని ఒక చానల్ ప్రచారం చేసింది. హత్యా ప్రయత్నం లేదూ.. పాడూ లేదూ.. 0.5 సెంటీమీటర్ల గాయమే నని నోటికొచ్చినట్లు కట్టుకథలు అల్లిన నేతలకు చెంపపెట్టన్నట్లుగా ప్రభుత్వం వారి విచారణ బృందమే.. అది హత్యా ప్రయత్నమేననీ, వైఎస్ జగన్ ఆ దుర్మార్గుడిని గుర్తించి తోసివేయగలిగారు గానీ లేకుంటే అత్యంత పదునైన కత్తివేటు అయన మెడపై పడి ఉంటే ప్రాణాలకే ప్రమాదం జరిగేదని వెల్లడించింది. అయితే హత్యా ప్రయత్నం చేసిన ఆ శ్రీనివాస్ పాత్రధారే కానీ దానికి సూత్రధారులు, వ్యూహకర్తలు ఎవరు అనే పరిశీలనకు విచారణ బృందం ఇంకా పూనుకోలేదు. టీడీపీవారు తల్చు కుని ఉంటే వైఎస్ జగన్ని ఎప్పుడో కైమా చేసి ఉండే వారని టీడీపీ నేతలు బాహాటంగా ప్రకటించి తమ వాక్శూరత్వాన్ని నిరూపించుకున్నారు. కానీ రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దురాశను, దురాగతా లను ఓట్ల ఆయుధంతో ప్రజలు కైమా చేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది. తాజాగా మరో పల్లవి ఆలాపన జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అస్థిరత సృష్టించేందుకు ఒక పథకం ప్రకారం ఇలాంటి కుట్రలు పన్నుతున్నారట. నిజానికి అసలు కుట్రదారు మోదీ అయితే జగన్ ఆయన జోలికి వెళ్లడం లేదట. అయినా నాలుగేళ్లకు పైగా మోదీతో అంటకాగి సహజీవనం చేసింది చంద్రబాబే. ఆ మోదీని సంతృప్తి పర్చడానికి 2017లో వైఎస్ జగన్ని ప్రత్యేక హోదా ఉద్యమంలో పాల్గొనకుండా విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించింది కూడా చంద్ర బాబే. మోదీ దోస్తానాతో దోచుకోవలసినంత దోచు కుని దాచుకోవలసినంత దాచుకున్నాం. ఇక ఈ కంచి గరుడ సేవ దేనికి అని మోదీతో విడాకుల ప్రహసనం మొదలెట్టింది కూడా చంద్రబాబే. ఇకపోతే, శివాజీ అని ఒక సినిమా నటుడు న్నాడు. ఆయన 2017లో ఆపరేషన్ గరుడ పేరుతో ఒక అత్యంత తీవ్రమైన రహస్యాన్ని బయటపెట్టాడు. ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డికి కూడా తెలీకుండా ఆయనను వాడుకుని ఆంధ్రప్రదేశ్ను ధ్వంసం చేసేం దుకు ఆపరేషన్ గరుడ పేరుతో కేంద్రం కుట్ర పన్నిం దట. సాక్షాత్తూ చంద్రబాబే ఢిల్లీలో పత్రికాగోష్టి పెట్టి ‘శివాజీ గతంలో చెబితే తేలిగ్గా కొట్టిపడేశాను. ఇప్పుడు శివాజీ పరిశోధన నిజమని తేలుతోంది’ అని చెప్పారు. నిజానికి ఆ శివాజీనే పోలీసు రక్షణతో ఢిల్లీకి తనతోపాటు తీసుకెళ్లి ఆ పత్రికా గోష్టిలో అతడితోనే చెప్పించి ఉంటే మరింత సాధికారత వచ్చేది కదా. చివరగా.. చంద్రబాబుని వ్యక్తిగత ద్వేషంతో విమర్శించడం నా ఉద్దేశం కాదు. ఇప్పటికైనా ఆయన కాస్త ఆత్మవిమర్శ చేసుకుని మన జాషువా మహాకవి అన్నట్లు ఒక మంచి మనిషిగా మారే కృషి చేస్తే, ఆయనకు ఆంధ్రప్రదేశ్కూ ఉపయోగం. జాషువా ‘పిరదౌశి’ అనే ఒక ఖండకావ్యం రచించారు. అరబ్బు దేశంలో పిరదౌసి అనే గొప్ప కవి ఉండేవారట. ఆ దేశ ప్రభువు పిరదౌసి కవిని పిలి పించి నాపై గొప్పగా ఒక కావ్యం రాస్తే నీకు పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానని వాగ్దానం చేశాడట. పిరదౌసి ఆశపడి ఆయన్ని కీర్తిస్తూ గొప్ప కావ్యం రాశాడట. అక్కర తీరిన ఆ ప్రభువు పద్యానికి ఒక బంగారు నాణెం ఇస్తానన్న వాగ్దానం తుంగలో తొక్కి వెండినాణేలను తన భటులతో ఆ కవి ఇంటికి పంపా డట. పిరదౌసి వాటిని తిరస్కరించగా ప్రభువు ఆగ్రహోదగ్రుడై పిర దౌసిని తీసుకొచ్చి కారాగారంలో నిర్బంధించమని భటులను ఆదేశించాడట. రాజధాని ప్రాంతానికి భూములిచ్చిన అమాయక రైతు, కూలీలు, నిరుద్యోగ భృతికి భ్రమపడ్డ నిరుద్యోగులు, మోసపోయిన డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, గత ఎన్నికల్లో చంద్రబాబు మాటలు నమ్మి అవన్నీ నేతిబీరలో నెయ్యి చందంగా ఆలస్యంగా గ్రహిం చారు. కానీ పిరదౌసి ప్రభువు కాపట్యాన్ని ముందు గానే గ్రహించి తన ఒక్కగానొక్క కూతురిని తీసుకుని ఆ ప్రాంతం వదలి వెళ్లిపోతూ తనగోడుపై ఒక పద్యం రాశాడట. ‘‘అల్లా తోడని పల్కి నా పసిడి కావ్య ద్రవ్యంబు వెండితొ చెల్లింపగ దొర కన్న టక్కరివి నీచే పూజితుండైనచో అల్లాకున్ సుఖమే...? మహమ్మదు నృపాలా! సత్య వాక్యం బెవం డుల్లంఘింపబోడొ వాడెపో నరుడు, ధన్యుండిద్ధ రామండలిన్.’ ఎవరైతే తానిచ్చిన మాటకు కట్టుబడతాడో వాడే మనిషి, ధన్యుడు అని గ్రహించి చంద్రబాబు కనీసం జాషువా గారి ‘నరుడి’ వలె వ్యవహరించే ప్రయత్నం చేయాలని నా సలహా. వ్యాసకర్త: డాక్టర్ ఏపీ విఠల్, మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ : 98480 69720 -
సినిమాలు లేని హీరో గరుడ అంటూ..
రాజమండ్రి: వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై హత్యాయత్నం ఘటనలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించిన తీరు సరిగా లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విలేకరులతో సోము వీర్రాజు మాట్లాడుతూ..సినిమాలు లేని హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ అల్లకల్లోలం చేస్తున్నాడని విమర్శించారు. ఆపరేషన్ గరుడ అంటూ చంద్రబాబు ప్రభుత్వం మతితప్పి మాట్లాడుతోందని దుయ్యబట్టారు. శివాజీ చెబుతున్నట్లు ఆపరేషన్ గరుడ నిజమే అయితే ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఎందుకు శివాజీని పిలిపించి వివరాలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్పై దాడి చంద్రబాబు స్క్రిప్ట్లో భాగమేనని ఆరోపణలు చేశారు. శివాజీ లాంటి జీరోను ఉపయోగించుకుని చంద్రబాబు పరిపాలించే హక్కు కోల్పోయారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్పై దాడి రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతుందని వ్యాఖ్యానించారు. -
‘హీరో శివాజీకి ముందే ఎలా తెలుసు?’
సాక్షి, అమరావతి: తెలంగాణ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే టీడీపీ పార్టీ నోటీసుల డ్రామా ఆడుతోందని ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. సోమవారం మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. ఐదు వందలతో పోయే కేసును పట్టుకొని ఎదో జరిగిపోయినట్లు టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని, ఇటువంటి ప్రచారం వలన ఎటువంటి సానుభూతి రాదని పేర్కొన్నారు. ఇదివరకు నోటీసులు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అందుకున్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అదే నోటీసులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి వస్తే మాత్రం కోర్టులపై గౌరవం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడేవారని ఎద్దేవ చేశారు. చంద్రబాబుకు కోర్టు నుంచి నోటీసులు వస్తే ప్రధాని నరేంద్ర మోదీ చేయించారనడం హాస్యాస్పదమన్నారు. స్టేలు తెచ్చుకోవడం కొత్తేంకాదు హీరో శివాజీతో డ్రామా ఆడించింది టీడీపీ నాయకులేనని, ఈ డ్రామాలు ప్రజలకు తెలియదనుకోవడం వారి మూర్ఖత్వమని మండిపడ్డారు. అరెస్టు వారెంట్ విషయం వారం రోజుల ముందు శివాజీకి ఎలా తెలసని ప్రశ్నించారు. టీడీపీ ప్రజల చెవుల్లో పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలను నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని వివరించారు. కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకోవడం చంద్రబాబుకు కొత్తేం కాదని విష్ణుకుమార్ రాజు ఎద్దేవ చేశారు. -
వైఎస్ జగన్పై ఎవరు కుట్ర పన్నారో చెప్పాలి
-
వైఎస్ జగన్పై దాడికి ఎవరు కుట్ర పన్నారు?
సాక్షి, విజయవాడ : ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఎవరు కుట్ర పన్నారో చెప్పాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నటుడు శివాజి టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అని మండిపడ్డారు. గుంటూరులో తమ అధినేతపై రెక్కి జరిగిందన్న ఈ పెయిడ్ ఆర్టిస్ట్.. మళ్లీ దాడి జరగబోతుందని తెలిపాడని, ఈ పెయిడ్ ఆర్టిస్ట్ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు. 2010 ఉపఎన్నికల్లో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు నాందేడ్ ప్రాంతంలో పర్యటించారని, అప్పుడు చేసిన ధర్నాపై కేసు నమోదు అయిందన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్, టీడీపీ ఆడిన మహా డ్రామాపై.. మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారన్నారు. ఇది కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసని, బెయిల్ తీసుకుంటే ఇది కేసే కాదన్నారు. కానీ ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఎదో జరిగినట్లు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. గరుడ ఆపరేషన్ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారో ఈ పెయిడ్ ఆర్టిస్ట్ చెప్పాలన్నారు. ప్రతిసారి రాష్ట్రంపై కుట్ర జరుగుతుందని చెబుతుంటే నిఘా వర్గాలు ఏమి చేస్తున్నాయని సుధాకర్ బాబు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ఓ రాజకీయ వెన్నుపోటు దారుడని విమర్శించారు. జాతీయ మీడియా సర్వేలో 43 శాతం మంది వైఎస్ జగనే సీఎం అని చెబుతుంటే దానిని నుంచి ప్రజలను దృష్టిని మళ్ళించడానికే ఈ పెయిడ్ అర్టిస్టు హడావుడని తెలిపారు. ఐటీని చంద్రబాబే అభివృద్ధి చేశారని చెబుతున్న ఈ పెయిడ్ ఆర్టిస్ట్.. ఈ విషయం హైదరాబాద్లో చెబితే అసలు విషయం తెలుస్తుందన్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఎందుకు ప్రతినెల అమెరికా వెళ్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ఓ కులగజ్జి అని, ఇలా ప్రవర్తిస్తేనే సొంత ఊరునుంచి తరిమికొట్టారని మండిపడ్డారు. -
నటుడు శివాజీది తప్పుడు ప్రచారం
విజయవాడ: బీజేపీ నాయకత్వంపై సినీ నటుడు శివాజీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి కోట సాయి కృష్ణ ఆరోపించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ, కాంగ్రెస్ పొత్తుపై ప్రజల దృష్టిని మరల్చేందుకే శివాజీతో చంద్రబాబు ఆపరేషన్ గరుడ అంటూ మాట్లాడిస్తున్నారని విమర్శించారు. మతి భ్రమించిన శివాజీ, బాబు డైరెక్షన్లో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐదు నెలల క్రితం శివాజీ ఇదే ఆపరేషన్ గరుడ గురించి మాట్లాడారు..అందులో ఏ ఒక్కటైనా నిజమైందా అని సూటిగా ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడ అనేది బీజేపీపై తప్పుడు ప్రచారం చేసేందుకు ఎత్తుకున్న విషయమని, అది ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా తయారు చేసిందని ఆరోపించారు. టీడీపీ కాంగ్రెస్ పొత్తు అపవిత్రమైంది..కాంగ్రెస్తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో సోనియాను దెయ్యం అన్న చంద్రబాబు ఇప్పుడు అదే సోనియా గాంధీతో ఎలా పొత్తు పెట్టుకుంటారని సూటిగా అడిగారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించిదన్న చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ధ్వజమెత్తారు. -
సిని‘మా’.. వివాదం
-
చలసాని, శివాజీని నడిపిస్తోంది చంద్రబాబే!
సాక్షి, విజయనగరం : ప్రత్యేక హోదా విషయంలో చలసాని శ్రీనివాస్, నటుడు శివాజీలను నడిపిస్తోంది చంద్రబాబేనని, ఆయన తెరవెనుక ఉండి వారితో మాట్లాడిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే ప్రధాన అడ్డంకి అని, భోగాపురం ఎయిర్పోర్ట్ను ఆయనే అడ్డుకుంటున్నారని విమర్శించారు. గతంలో అర్ధరాత్రి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రాభివృద్ధిని పక్కనపెట్టి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని దోచుకుంటున్నారని అన్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాకు గిరిజన యూనివర్సిటీ, జాతీయ రహదారి, డిఫెన్స్ ప్రాజెక్టులను కేటాయించామని తెలిపారు. -
నాకెప్పుడు ప్రజల మధ్యనే ఉండటం ఇష్టం
-
అదంతా ప్లాఫ్ హీరో ఊహాజనిత కథ
సాక్షి, అమరావతి: ఆపరేషన్ గరుడ, ద్రవిడ అవాస్తవాలు..అదంతా ఒక ఫ్లాప్ హీరో ఊహాజనిత కథలని బీజేపీ అధికార ప్రతినిథి సుధీశ్ రాంబొట్ల వ్యాఖ్యానించారు. కారెం శివాజీ మాదిరిగా హీరో శివాజీకి కూడా ఏదో పదవి వచ్చేవరకూ ఇలాగే చేస్తుంటాడని విమర్శించారు. బీజేపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు రాయలసీమ బిడ్డే అయితే సీమలో ఎందుకు అభివృద్ధి జరగలేదని ప్రశ్నించారు. బీజేపీని తిడతారనుకుని టీడీపీ నేతలే పవన్ మీటింగ్కు జనాన్ని తరలించారని, కానీ అక్కడ సీన్ రివర్స్ అయిందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు ఇటీవల కుట్ర అనే పదాన్ని ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు. విజయసాయి రెడ్డి పార్లమెంటరీ సభ్యుడు.. పీఎంవోలో తిరిగితే తప్పేంటని ప్రశ్నించారు. బీజేపీ పవన్తో ఆడిస్తుంది.. జగన్తో కుమ్మక్కైంది అనే అవాస్తవాలు టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి పొడిగించలేదని స్పష్టం చేశారు. కేవలం ఆ రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు విడుదల మాత్రమే చేశారని వివరించారు. అదికూడా నీతి ఆయోగ్ ప్రతిపాదనలతోనే ఇచ్చారని తెలిపారు. నీతి ఆయోగ్ కమిటీలో చాలా మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. చంద్రబాబును కూడా ఉండాలని కోరినా తిరస్కరించారని వెల్లడించారు. అన్ని రాష్ట్రాల ప్రతిపాదనలను తీసుకున్నాం కానీ అప్పుడు చంద్రబాబు ఏపీకి ఏం కావాలో కోరుకోలేదని తెలిపారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీకి ఎక్కువ ఇచ్చామన్నారు. కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నిధులు ఎక్కువ ఇస్తున్నామనేది అవాస్తవమని చెప్పారు. ఇందిరాగాంధీని ఎదుర్కొన్నది చంద్రబాబు కాదు.. బీజేపీ అని టీడీపీ నేతలు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ అడిగితే ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వలేదనేది అవాస్తవమని.. పట్టిసీమ ప్రాజెక్టు మంచిదే, కానీ అవినీతి జరిగిందనేది వాస్తవమని పేర్కొన్నారు. -
ఆర్పీ ఇన్ఫో సిస్టమ్స్ డైరెక్టర్ను ప్రశ్నించిన సీబీఐ
న్యూఢిల్లీ: బ్యాంకుల కన్సార్షియంను దాదాపు రూ. 515 కోట్ల మేర మోసగించారన్న కేసుకు సంబంధించి కంప్యూటర్స్ తయారీ సంస్థ ఆర్పీ ఇన్ఫో సిస్టమ్స్ డైరెక్టర్ శివాజీ పంజాను సీబీఐ ప్రశ్నించింది. ఈ స్కామ్ విషయంలో కంపెనీకి చెందిన ఇతర అధికారులపై కూడా కేసులు నమోదు చేసిన సీబీఐ, ఆర్పీ ఇన్ఫోసిస్టమ్స్ కార్యాలయంతో పాటు నిందితుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించింది. గతంలో కూడా కంపెనీపై ఈ తరహా ఆరోపణలు వచ్చాయి. 2015లో ఐడీబీఐ బ్యాంకును రూ. 180 కోట్లు మోసగించిన ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసింది. చిరాగ్ బ్రాండ్ కింద కంప్యూటర్స్ తయారు చేసే ఆర్పీ ఇన్ఫోసిస్టమ్స్.. నకిలీ పత్రాలు సృష్టించి 2012 నుంచి ఎస్బీఐ, అలహాబాద్ బ్యాంక్ తదితర బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాలు పొందిందన్న ఆరోపణలతో తాజా కేసు నమోదైంది. ఈ రుణాలన్నీ మొండిబాకీలుగా మారినట్లు అధికారవర్గాలు తెలిపాయి. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రూ. 12,700 కోట్ల స్కాముపై విచారణ చేస్తున్న సీబీఐ తాజాగా బ్యాంకు ఉద్యోగి ఎస్కే చాంద్ను ప్రశ్నిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆయన ట్రెజరీ విభాగం జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. -
శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలి: బీజేపీ
విజయవాడ: కమెడియన్ శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలంటూ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో విష్ణువర్దన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. సినీ నటుడు శివాజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రచారం కోసమే శివాజీ బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది తమ స్వార్థం కోసం దేశాన్ని విడగొట్టాలని మాట్లాడుతున్నారని..అలాగే కొంతమంది ఎంపీలు ఢిల్లీలో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పారు. టీడీపీ నాయకులకు ఇచ్చిన నిధులపై అనుమానం ఉంటే సమాధానం చెబుతామని తెలిపారు. కొంతమంది మేధావులు హైదరాబాద్లో ఉండి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేపు రాయలసీమ బీజేపీ ముఖ్య నాయకులంతా కర్నూలులో సమావేశమవుతున్నామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి సంబంధించి రేపు డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు. -
అభిషేక్తో ఢీ
‘బ్యాచిలర్స్, మిస్సమ్మ, అమ్మాయి బాగుంది, అదిరిందయ్యా చంద్రం’ వంటి పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు శివాజీ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా ఒకప్పుడు వరుస చిత్రాలు చేసిన ఆయన 2014లో వచ్చిన ‘బూచమ్మ బూచోడు’ తర్వాత వెండితెరకు దూరమై, రాజకీయాల వైపు అడుగులు వేశారు. అయితే శివాజీ తాజాగా బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ప్రతినాయక ఛాయలున్న పాత్రలో కావడం విశేషం. అభిషేక్ బచ్చన్ హీరోగా ప్రియాంక చోప్రా, దీపికా పదుకోన్ హీరోయిన్లుగా నూతన దర్శకుడు ఆసిఫ్ ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ముంబైలో వాస్తవంగా జరిగిన గ్యాంగ్ వార్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో నెగటివ్ టచ్ ఉన్న పోలీస్ అధికారి పాత్రలో శివాజీ కనిపించబోతున్నారు. ఏప్రిల్లో ఈ సినిమా సెట్స్పైకి వెళ్లనుంది. శివాజీ తెలుగు తెరపై కనిపించడంలో లేటైనా లేటెస్ట్గా బాలీవుడ్లో అడుగుపెడుతుండటం విశేషమే. చిత్రబృందం ఇప్పటికే శివాజీతో కథా చర్చలు జరిపారు. జస్ట్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.