current shock
-
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం పెగడపల్లిలో విషాదం
-
తల్లి, కుమారుడిని బలితీసుకున్న ఎర్త్ వైర్!
సామర్లకోట : విద్యుదాఘాతంలో 24 గంటల వ్యవధిలో తల్లీకుమారుడు మృతి చెందడంతో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురంలో విషాదం నెలకొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వీర్రాఘవపురానికి చెందిన చిట్టుమాని పద్మ(43) ఇంటికి సంబంధించి ఎర్త్ వైర్ను కొళాయి పక్కన గల చెట్టుకు చుట్టేశారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఇంటి ఎర్త్వైర్ తెగిపోవడంతో అలా చేయాల్సి వచ్చిoది. అయితే శనివారం పద్మ కొళాయి దగ్గర దుస్తులు ఉతికి గోడపై వాటిని ఆరబెడుతూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయింది. అయితే బంధువులు, స్థానికులు గుండెపోటుతో మృతి చెందిందని భావించారు. కాగా, ఆదివారం ఉదయం మృతురాలి కుమారుడు చిట్టుమాని విశ్వేస్(23) టిఫిన్ చేశాక ఖాళీ ప్లేట్ను కొళాయి పక్కన పెట్టి చేతులు శుభ్రం చేసుకొంటున్న సమయంలో విద్యుత్ షాక్కు గురయ్యాడు. స్థానికులు అతనిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విద్యుదాఘాతం కారణంగా తల్లీకొడుకులు మృతి చెందారని స్థానికులు నిర్ధారణకొచి్చ.. విషయాన్ని విద్యుత్ అధికారులకు తెలియజేశారు. వెంటనే ట్రాన్స్కో సిబ్బంది అక్కడకు చేరుకుని వైర్లను తొలగించారు. -
కడపలో విషాదం.. స్కూలు పిల్లలకు కరెంట్ షాక్
సాక్షి,కడపజిల్లా: కడప నగరంలో బుధవారం(ఆగస్టు21) మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. తెగిపడి రోడ్డుపై పడ్డ కరెంటు తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి గాయాలయ్యాయి.తన్వీర్(11), ఆదాం(10)లు సైకిల్పై స్కూల్కు వెళ్తుండగా నగరంలోని అగాడీ వీధిలో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి చిన్నారులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి విద్యుత్శాఖ అధికారుల నిర్లకక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. -
క్రికెట్ మైదానంలో విషాదం.. విద్యుదాఘాతానికి గురై బాలుడి మృతి
దేశ రాజధాని ఢిల్లీలో విద్యుదాఘాతానికి గురై 13 ఏళ్ల బాలుడి మృతి చెందాడు. రన్హోలా ప్రాంతంలోని కోట్లా విహార్ ఫేజ్-2లో క్రికెట్ ఆడుతున్న బాలుడు కరెంటు సరఫరా అవుతున్న ఇనుప స్తంభాన్ని తాకి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. #WATCH | Delhi: Visuals from a Cricket ground in outer Delhi's Ranhola area where a 13-year-old boy died due to electrocution yesterday. https://t.co/fl8WsQ0Eom pic.twitter.com/sKWiCfiMWH— ANI (@ANI) August 11, 2024బాలుడికి కరెంట్ షాక్ తగిలిందన్న విషయం తెలిసిన చుట్టుపక్కల వాళ్లు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాలుడు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలిసిన బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.విద్యుదాఘాతానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. సకాలంలో తమ కుమారుడిని రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదని వాపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్న సమయంలో చోటు చేసుకుంది. -
విద్యుత్ షాక్తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనం
కనిగిరి రూరల్: కరెంట్ షాక్తో ముగ్గురు స్నేహితులు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటన మంగళవారం ప్రకాశం జిల్లా కనిగిరి మండలం పునుగోడు వద్ద జరిగింది. వివరాలు.. కనిగిరిలోని దేవాంగనగర్కు చెందిన వీరమాస గౌతమ్కుమార్(16), ఇందిరాకాలనీకి చెందిన దేశబోయి నజీర్(16), కామినేని బాలాజీ (16) పదో తరగతి వరకు కలిసి చదువుకున్నారు.గౌతమ్, నజీర్ పట్టణంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతుండగా.. బాలాజీ చదువు ఆపేశాడు. వీరు ముగ్గురూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పునుగోడు చెరువులో సరదాగా ఈత కొట్టేందుకు స్కూటీపై బయల్దేరారు. పునుగోడులోని ఎస్టీ కాలనీ సమీపంలో విద్యుత్ తీగ(11 కేవీ) తెగి కిందకు వేలాడుతోంది. వీరు ముగ్గురూ స్కూటీపై వెళ్తూ ఆ విద్యుత్ తీగకు తగిలారు. దీంతో ఒక్కసారిగా షాక్ కొట్టి ముగ్గురూ కిందపడిపోగా.. స్కూటీ నుంచి మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే ఈ విషయాన్ని విద్యుత్, పోలీస్ అధికారులకు తెలియజేశారు. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పటికీ.. ముగ్గురూ కాలిపోయి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ రత్నాకరం రామరాజు, సీఐ, ఎస్సై, విద్యుత్, రెవెన్యూ అధికారులు పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.మృత్యువులోనూ వీరి స్నేహం విడిపోలేదంటూ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ బిడ్డల ప్రాణాలు తీసిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈ ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవి, వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ నారాయణ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందించి ఆదుకుంటామని మంత్రి చెప్పారు. మా సిబ్బంది నిర్లక్ష్యం లేదు ఈ ఘటనలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యమేమీ లేదని విద్యుత్ శాఖ డీఈఈ స్పష్టం చేశారు. ఈదురు గాలులకు విద్యుత్ తీగ తెగిందన్నారు. అయితే నేలపై పడకుండా చిల్లచెట్లపై ఉండటంతో పునుగోడు ఫీడర్ ట్రిప్ కాలేదని చెప్పారు. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోలేదన్నారు. అప్పుడే అటుగా వెళ్తున్న విద్యార్థులు విద్యుత్ తీగకు తగలడంతో షాక్కు గురై మృతి చెందారని విద్యుత్ శాఖ డీఈఈ, ఏడీఈలు ఒక ప్రకటనలో వెల్లడించారు. -
విషాదం.. రోడ్డుపై వరద, కరెంట్ షాక్కు గురై యువకుడి మృతి
న్యూఢిల్లీ: దేశ రాజధాని విషాదం చోటుచేసుకుంది. యూపీఎస్సీ పరీక్షలకు సన్నధమవుతున్న ఓ విద్యార్ధి విద్యుత్ షాక్కు గురై ప్రాణాలు విడిచాడు. మృతుడిని నీలేష్ రాజ్గా గుర్తించారు. పటేల్ నగర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.వివరాలు.. నీలేష్ రాజ్ అనే యువకుడు పటేల్ నగర్ హాస్టల్లో ఉంటూ సివిల్స్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలవడంతో అటువైపు వెళ్తున్న నీలేష్ విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. రోడ్డు పక్కనున్న ఇనుప గేటు గుండా కరెంట్ పాస్ అవ్వడంతో విద్యుదాఘాతానికి గురైనట్లు తెలిపారు. నీలేష్ను వెంటనే ఆర్ఎంఎల్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. గేట్కు కరెంట్ ఎలా పాస్ అయ్యిందో తెలుసుకునేందనే విషయంపై దర్యాప్తు చేపట్టారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ అమాయక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని స్థానికులు మండిపడుతున్నారు. -
Hyderabad: సనత్నగర్లో తీవ్ర విషాదం
హైదరాబాద్: నగరంలోని సనత్నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సనత్నగర్లోని జెక్ కాలనీలో ఉన్న ఆకృతి రెసిడెన్సీలో విద్యుత్ షాక్తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరు విద్యుత్ షాక్గురై మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది. వీరంతా బాత్రూమ్లో విగత జీవులై పడి ఉండటాన్ని గుర్తించారు. -
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి
కొత్తగూడ: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మండలంలోని ఎదుళ్లపల్లిలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జినుకల రాజు(24) నాటు వేయడానికి తన పొలం సిద్ధం చేశాడు. ఈ క్రమంలో నీరు పారించడానికి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లాడు.రాత్రి అయినా ఇంటికి రాకపోవడం.. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కుటుంబీకులకు అనుమానం వచ్చింది. దీంతో పొలం వద్దకు వెళ్లి చూడగా మోటార్ వద్ద షాక్ తగిలి మృతి చెంది ఉన్నాడు. దీంతో తల్లిదండ్రులు సింహద్రి, నాగమల్లు గుండెలవిసేలా రోదించారు. -
రేణుకస్వామి కేసులో ఏ1గా పవిత్ర!
బెంగళూరు: కన్నడ నటి పవిత్ర గౌడను ఆన్లైన్లో వేధించాడన్న పట్టారాని కోపంతో రేణుకస్వామి అనే చిరుద్యోగిని నటుడు దర్శన్ తూగుదీప, అతని అనుచరులు హతమార్చారన్న కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దర్శన్ సన్నిహిత నటి పవిత్ర గౌడను ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా పేర్కొంటూ పోలీసులు గురువారం బెంగళూరులో 24వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట రిమాండ్ రిపోర్ట్ను సమర్పించారు. స్వామికి కరెంట్ షాక్ ఇచ్చి హింసించామని ఇప్పటికే అరెస్టయిన ఒక నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. ఈ వివరాలను రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు ప్రస్తావించారు. హత్య తర్వాత అరెస్ట్, కేసు నుంచి తప్పించుకునేందుకు, మృతదేహాన్ని మాయం చేసి ఆధారాలను ధ్వంసంచేసేందుకు దర్శన్ భారీగా ఖర్చుచేశారని, అందుకోసం స్నేహితుడు మోహన్ రాజ్ నుంచి రూ.40 లక్షల అప్పు తీసుకున్నారని పోలీసులు వెల్లడించారు. షాక్ ఇచ్చేందుకు వాడిన ఎలక్ట్రిక్ షాక్ టార్చ్ను, ఆ రూ.40 లక్షల నగదును పోలీసులు ఇప్పటికే స్వా«దీనం చేసుకున్నారు. దర్శన్, మరో ముగ్గురిని పోలీస్ కస్టడీకి, పవిత్ర గౌడను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని కోర్టును పోలీసులు కోరారు. ఘటనాస్థలిలో చెప్పులతో కొట్టిన పవిత్ర చిత్రదుర్గ ప్రాంతంలో రేణుకస్వామిని కిడ్నాప్చేసి 200 కి.మీ.ల దూరంలోని బెంగళూరుకు తీసుకొచ్చి షెడ్లో కట్టేసి కొట్టేటపుడు నటి పవిత్ర గౌడ అక్కడే ఉన్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆమె కూడా రేణుకస్వామిని తన చెప్పులతో కొట్టారని పోలీసులు పేర్కొన్నారు. అసభ్య సందేశాలు పంపిన స్వామికి బుద్ది చెప్పాలని అక్కడే ఉన్న దర్శన్ను పవిత్ర ఉసిగొలి్పందని ఆయా వర్గాలు వెల్లడించాయి. రేణుకస్వామి పోస్ట్మార్టమ్లో కొత్త విషయాలు వెల్లడయ్యాయి. సున్నిత అవయవాలపై దాడితో వృషణాలు చితికిపోయాయని, ఒక చెవి కనిపించలేదని నివేదిక పేర్కొంది. రేణుకస్వామి గతంలో ఇన్స్టా్రగామ్లో పోస్ట్ చేసి డిలీట్చేసిన మెసేజ్లను వెలికి తీసివ్వాలని దాని మాతృ సంస్థ ‘మెటా’ను పోలీసులు కోరారు. -
విషాదం.. కరెంట్ షాక్తో 14 మంది చిన్నారులకు గాయాలు
జైపూర్: మహాశివరాత్రి రోజు విషాదం చోటుచేసుకుంది. రాజస్థాన్లోని కోటాలో శివరాత్రి పర్వదినాన ఏర్పాటు చేసిన వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి 14 మంది చిన్నారులు గాయపడ్డారు. బాధితులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హీరాలాల్ నగర్ తెలిపారు. విద్యుదాఘాతానికి గురైన చిన్నారులు వాళ్ల కుటుంబీకులు ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ ఘటనపై మంత్రి మాట్లాడుతూ.. చాలా బాధాకరమైన సంఘటనగా పేర్కొన్నారు. చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారని, వారిలో ఒకరికి 100శాతం శరీరంపై కాలిన గాయాలు ఉన్నట్లు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందంతో చిన్నారులకు చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. కరెంట్ షాక్కు గల కారణాలపై దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. అయితే విద్యుత్ షాక్కు హైటెన్షన్ ఓవర్ హెడ్ విద్యుత్ లైన్ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితుల్లో ఇద్దరు పిల్లలకు 50 నుంచి 100 శాతం కాలిన గాయాలు, మిగిలిన వారు 50 శాతం కంటే తక్కువ కాలిన గాయాలు తగిలినట్లు పేర్కొన్నారు. -
TS: కరెంట్ షాక్తో కానిస్టేబుల్ మృతి.. సీఎం రేవంత్ విచారం
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: భూపాలపల్లి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ పోలీసు శాఖకు చెందిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఏ. ప్రవీణ్ కరెంట్ షాక్తో మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వివరాల ప్రకారం.. భూపాలపల్లి జిల్లాలో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రవీణ్ కూంబింగ్ డ్యూటీలో ఉన్నాడు. నస్తుర్పల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తలు సంచరిస్తున్నారనే సమాచారంతో రావడంతో గాలించేందుకు టీమ్ అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. దీంతో, ప్రవీణ్ అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, స్థానికులు వన్యప్రాణులను వేటాడేందుకు, వాటి నుంచి రక్షణ కోసం అక్కడ కరెంట్ తీగలను ఏర్పాటు చేసినట్టు సమాచారం. అది గమనించకుండా ఈ తీగలను తాకి ప్రవీణ్ మృతిచెందాడు. ఇక, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
ఓబులవారిపల్లె : మండలంలోని కొర్లకుంట చెరువు సమీపంలో విద్యుత్ షాక్తో తుపాకుల సుబ్రమణ్యం (35) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు రైల్వేకోడూరు మండలం, బొజ్జవారిపల్లి పంచాయతీ, బంగ్లామిట్ట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం శుక్రవారం రాత్రి తన బావమరిది ఎం.శివతో కలిసి కొర్లకుంట చెరువు వద్దకు చేపల వేటకు వెళ్లాడు. దారిలో గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ తీగలు తీయడంతో తీగలు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. గాయపడిన సుబ్రమణ్యంను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య ఉంది. రైల్వేకోడూరు పరిసర ప్రాంతాలలో సుబ్రమణ్యం ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేసేవాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. కన్న తల్లిని హతమార్చిన కూతురు వాల్మీకిపురం : కుటుంబ కలహాల నేపథ్యంలో కన్న తల్లిని హతమార్చిన సంఘటన వాల్మీకిపురం పట్టణం కొత్త ఇందిరమ్మ కాలనీలో చోటు చేసుకొంది. ఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు.. అనంతపురం జిల్లా కనేకల్లు మండలం హనకనహళ్ నివాసి యర్రక్క (43) స్థానికంగా నివాసం ఉంటూ కూలిపనులు చేసుకునేది. కుటుంబ కలహాలతో ఆదివారం కూతురు నందిని, అల్లుడు శివరాంలు ఐరన్ రాడ్, కట్టెలతో కొట్టి యర్రక్కను హత్య చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్ఐ నాగేశ్వర రావు సంఘటనా స్థలానికి చేరుకొని, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రుణం చెల్లించలేదని ఆత్మహత్యాయత్నం మదనపల్లె : తాను ఇప్పించిన రుణం చెల్లించకపోవడంతో పాటు, తనపై దాడి చేయడంతో మనస్థాపం చెంది, వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మదనపల్లె లో జరిగింది. పట్టణంలోని ఎగువ కురవంకకు చెందిన తిరుపాల్ నాయక్ భార్య తిరుపాలమ్మ (42), స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉంటోంది. అదే ప్రాంతంలో నివాసం ఉన్న స్వరూపారాణి పట్టణంలో హోటల్ నిర్వహిస్తోంది. దీంతో వ్యాపార అవసరాల కోసం తిరుపాలమ్మను నగదు రుణంగా కావాలని కోరింది. ఆమె సుమారు పది లక్షల రూపాయల వరకు స్వరూప రాణికి స్వయం సహాయక సంఘాల నుంచి రుణం తీసుకుని అప్పుగా ఇచ్చింది. అయితే స్వరూపారాణి తీసుకున్న అప్పు సక్రమంగా చెల్లించకపోవడంతో, తిరుపాలమ్మ ఆమెను అప్పు చెల్లించాల్సిందిగా నిలదీసింది. స్వరూప రాణి అప్పు చెల్లించకపోగా దాడికి పాల్పడింది. దీంతో మనస్థాపం చెందిన తిరుపాలమ్మ ఇంటి వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వన్ టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
'సలార్' రిలీజ్: ప్రభాస్ వీరాభిమాని మృతితో..
శ్రీసత్యసాయి, సాక్షి: సలార్ సినిమా రిలీజ్ నేపథ్యంలో అభిమానులు పండుగు చేసుకుంటుండగా.. ఊహించని విషాదం చోటుచేసుకుంది. ధర్మవరంలో థియేటర్ వద్ద ప్రమాదవశాత్తూ ఓ వీరాభిమాని మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. పట్టణ కేంద్రంలోని రంగా సినిమా థియేటర్లో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా బాలరాజు(27) థియేటర్ ఆవరణలో సలార్ మూవీ బ్యానర్ కడుతున్నాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు ఫ్లెక్సీ రాడ్ పైనున్న హై వోల్టేజ్ తీగలకు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే దగ్గరలోని హాస్పిల్కి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు బంధువులు, ప్రభాస్ ఫ్యాన్స్ థియేటర్ వద్ద న్యాయం చేయాలంటూ, మృతిచెందిన బాలరాజు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళన చేపట్టారు. ఇవి కూడా చదవండి: కామారెడ్డిలో దారుణం: క్షణికావేశంలో కొడుకును పొడిచి, ఆపై తండ్రి కూడా.. -
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
అయిజ: ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మప్ప, గోవిందమ్మ దంపతులు పట్టణంలోని రజక వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. వారు ఇళ్లు నిర్మించుకుంటున్నారు. పెద్ద కుమారుడు యుగేంధర్ (32) ఆదివారం నిర్మాణ దశలో ఉన్న గోడలకు నీళ్లు చల్లేందుకు వెళ్లాడు. అక్కడ వి ద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నీటి సంపులో పడి చిన్నారి.. జడ్చర్ల: ఇంటి ఆవరణలోని నీటి సంపులో చిన్నారి పడి మృతి చెందిన ఘటన ఆదివారం స్థానిక కావేరమ్మపేటలో చోటు చేసుకుంది. కావేరమ్మపేటకు చెందిన గండు వినోద్, పుష్పమాల కూతురు రియాన్సిక(2) ఆడుకుంటూ వెళ్లి నీటి సంపులో పడింది. కొద్దిసేపటి తర్వాత తమ కూతురు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు నీటి సంపులోకి తొంగి చూడగా చిన్నారి కనిపించడంతో బయటకు తీసి చూడ గా అప్పటికే మృతి చెందింది. ఒక్కగానొక్క కూతురు మృత్యువాత పడడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. చికిత్స పొందుతూ వ్యక్తి.. అచ్చంపేట రూరల్: అమ్రాబాద్ మండలం ఈదులబావికి చెందిన మోటమోని రాజు (55) చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. ఎస్ఐ గోవర్ధన్ వివరాల మేరకు.. ఈనెల 10న అచ్చంపేటలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలో ప్రమాదవశాత్తు బైక్పై నుంచి కిందపడ్డాడు. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలు కావడంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుమారుడు వినోద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ నాగర్కర్నూల్ క్రైం: ఆర్టీసీ బస్సులో మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారుగొలుసు చోరీకి పాల్పడిన ఘటన జిల్లా కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా.. బిజినేపల్లి మండలం పోలేపల్లికి చెందిన అలివేలమ్మ ఆర్టీసీ బస్సులో నాగర్కర్నూల్కు వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఆమె మెడలో నుంచి 3తులాల బంగారు గొలుసును లాక్కెల్లారు. అలివేలమ్మ జిల్లా కేంద్రానికి చేరుకున్న తర్వాత గొలుసును చూసుకోగా లేకపోవడంతో పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు. కారు డ్రైవర్పై కేసు నమోదు వెల్దండ: వెల్దండ మండలం కొట్రగేట్ వద్ద శని వారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతికి కారణమైన కారు డ్రైవర్ రుక్మాకర్రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్కు చెందిన కొరివి రాకేష్ బైక్పై వస్తుండగా.. కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో రాకేష్ మృతి చెందాడు. మృతుడి తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించాడని యువకుడిపై దాడి మహమ్మదాబాద్: యువతితో అసభ్యకరంగా ప్రవర్తించాడన్న నెపంతో యువకుడిని చితకబాధిన వారిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే మండలంలోని కప్లాపూర్ చెందిన మీర్జాపురం శేఖర్ కుటుంబీకులు అందరూ మహారాష్ట్రలో పూణెలో నివాసం ఉంటున్నారు. శేఖర్ గ్రామంలో ఇల్లు కట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలంగా దయాదులతో ఇంటి స్థలం విషయంలో అప్పుడప్పుడు గొడవలు అవుతున్నాయి. ఇదే క్రమంలో పథకం ప్రకారం యువతిపై అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ తిరుపతయ్య, ఆయన కుమారులు మురళీ, గణేష్, అంజిలయ్య, కృష్ణ, విగ్నేష్ కలిసి శేఖర్ను చితకబాదారు. దీంతో బాధితుడి తండ్రి హనుమంతు ఫిర్యాదు మేరకు ఆదివారం ఐదుగురిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. బావపై బామ్మర్దుల దాడి ఉండవెల్లి: సొంత బావను బామ్మర్దులు దాడి చేసిన ఘటనలో ఆదివారం ముగ్గురిపై కేసు నమోదైంది. హెడ్ కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బొంకూరుకు చెందిన బోయ తిరుమలేష్, స్రవంతి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇటీవల వారిద్దరికి మనస్పార్థాలు రావడంతో స్రవంతి పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో పెద్దమనుషుల వదద పంచాయితీ చేశారు. కాగా తిరుమలేష్ పొలానికి వెళ్లే క్రమంలో స్రవంతి తమ్ముడు నరేష్ దూషించి తిరుమలేష్పై దాడి చేశాడు. తిరుమలేష్ విషయం తండ్రి పెద్ద అయ్యన్నకు చెప్పగా, వారిద్దరు కలిసి పోలీస్స్టేషన్ వెళ్తుండగా బామ్మర్దులు దేవేందర్, నరేష్, అత్త గోపాలమ్మ వారిపై దాడి చేశారు. కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. -
కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన కారు.. ఒక వ్యక్తి మరణం
అడ్డాకుల: కర్నూల్ జిల్లాకు చెందిన రామయ్య(80) తన సోదరుడు, మరో డ్రైవర్తో కలిసి కారులో హైదరాబాద్ వెళ్తున్నారు. శాఖాపూర్ దాటిన తర్వాత పాత రోడ్డు సమీపంలో కారుకు అడ్డుగా కుక్క వచ్చింది. దీంతో దాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ కారును పక్కకు తిప్పగా.. కారు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది. అందులోని రామయ్య తీవ్రంగా గాయపడ్డాడు. మిగిలిన ఇద్దరు స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయట పడ్డారు. రామయ్యను ఎల్అండ్టీ అంబులెన్స్లో జిల్లా ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందారని అక్కడి వైద్యులు చెప్పినట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ మాధవరెడ్డి తెలియజేశారు. విద్యుదాఘాతంతో రైతు.. మహబూబ్నగర్ రూరల్: మండల పరిధిలోని మనికొండలో పెండెం చంద్రశేఖర్(49) విద్యుదాఘాతంతో మృతిచెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు ఆదివారం ఉదయం తన ఇంట్లో స్విచ్ బోర్డు వద్ద ఆన్ఆఫ్ చేస్తుండగా.. విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందినట్లు సర్పంచ్ గంగాపురి తెలియజేశారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, భార్య ఉన్నారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకొని పేద కుటుంబానికి అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మద్యం దుకాణం సీజ్ మహబూబ్నగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని న్యూబాలాజీ మద్యం దుకాణాన్ని ఆదివారం రాత్రి ఎన్నికల వ్యయ పరిశీలకుడు, ఐఆర్ఎస్ అధికారి కుందన్యాదవ్ తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎక్కువ మొత్తంలో మద్యం విక్రయించినట్లు గుర్తించారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎకై ్సజ్ ఈఎస్ సైదులు, సీఐ వీరారెడ్డి, ఎస్ఐ శ్రీనివాస్ మద్యం దుకాణంలో స్టాక్ పరిశీలించి సీజ్ చేశారు. సదరు దుకాణాదారుడి లైసెన్స్ రద్దు చేశారు. దుకాణంలో రూ.8లక్షల విలువగల స్టాక్ ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా రెండు రోజుల కిందట జహంగీర్ అనే వ్యక్తి రూ.2లక్షల విలువగల మద్యాన్ని ఆటోలో తరలిస్తుండగా, పట్టుకుని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. భారీగా మద్యం పట్టివేత చిన్నంబావి: వనపర్తి జిల్లా చిన్నంబావి మండలంలోని దగడపల్లిలో రూ.4లక్షల విలువగల 47 కాటన్ల మద్యాన్ని పట్టుకున్నట్లు ఎస్ఐ ఓబుల్రెడ్డి తెలిపారు. దగడపల్లికి చెందిన వెంకట్రావు ఇంట్లో 29 కాటన్లు, కుమ్మరి రమేష్ ఇంట్లో 3 కాటన్లు, కుమ్మరి శంకరయ్య ఇంట్లో 17 కాటన్ల మద్యం నిల్వ చేయగా, స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈ తనిఖీల్లో ఎకై ్సజ్ సీఐ కళ్యాణ్, స్పెషల్ పార్టీ పోలీస్ రవినాయక్, వీపనగండ్ల ఎస్ఐ రవికుమార్ పాల్గొన్నారు. -
షాక్కు గురై ముగ్గురికి గాయాలు.. కారణం ఇదే.!
గోపాల్పేట: దేవుడి మొక్కు తీర్చుకునేందుకు వచ్చి ప్రమాదవశాత్తు కరెంటు షాక్కు గురై ముగ్గురు గాయాలపాలైన ఘటన ఏదుల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్కర్నూల్ జిల్లా పెద్దదగడకు చెందిన ఓ కుటుంబం ఏదుల సమీపంలోని కథాల్సాయన్న దేవుడికి తమకు మొక్కుకున్నారు. గురువారం కుటుంబ సభ్యులు పెద్దదగడ నుంచి ఏదుల కథాల్సాయన్న గుడి వద్దకు డీసీఎంలో సుమారు 15మంది వచ్చారు. డీసీఎంలో వచ్చిన వారు కొంత దూరంలోనే దిగారు. వృద్ధులు గుడి దగ్గరకు వెళ్లి అక్కడ దిగేందుకు డీసీఎంలోనే కూర్చున్నారు. గుడి సమీపంలోకి వెళ్లిన తర్వాత డ్రైవర్ డీసీఎంను నిలిపేందుకు వెళ్తుండగా, 11 కేవీ వైర్లు కిందకు వేలాడుతూ ఉండటంతో డీసీఎంకు తగిలాయి. అలాగే ముందుకు వెళ్లడంతో కరెంటు పోల్ విరిగిపోయి వైర్లు తెగి నేలకు తగిలాయి. దీంతో డీసీఎం అంతా షాక్ రావడంతో అందులో ఉన్న వృద్ధులు ఈశ్వరమ్మ, వెంకటమ్మ, చంద్రమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ తప్పించుకున్నాడు. వెంటనే కరెంట్ బంద్ చేయించి వారిని వనపర్తి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైర్లు వేలాడటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇది చదవండి: బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ఈ ఘటన లో...! -
అడవి పందుల కోసమని ఏర్పాటు చేస్తే.. చివరికి ఇలా..!
మహబూబ్నగర్: అడవి పందుల బారినుంచి పంటను కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ వైరు తగిలి షాక్తో ఇద్దరు రైతులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ విషాదకర సంఘటన గురువారం రాత్రి వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని రుక్కన్నపల్లి శివారులో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రుక్కన్నపల్లితండాకు చెందిన రాములునాయక్(37) రుక్కన్నపల్లి, కోతులకుంట తండాల శివారులో ఐదున్నర ఎకరాల్లో వరిపంట సాగు చేశాడు. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. ఈ క్రమంలో అడవి పందులు పంటను నాశనం చేస్తుండటంతో కొన్నిరోజుల నుంచి చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేసి రాములు అత్తగారి ఇంటి నుంచి కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. గురువారం రాత్రి అతనికి తోడుగా సోళీపురం గ్రామానికి చెందిన జాలికాడి నర్సింహులు(45)ను పిలుచుకున్నాడు. ఇద్దరూ కలిసి పొలం దగ్గరకు వెళ్లారు. ఇదే సమయంలో ప్రతిరోజు మాదిరిగానే రాములునాయక్ భార్య శారద ఇంటి దగ్గర కరెంట్ ఆన్ చేయడానికి తన భర్తను అడిగేందుకు ఫోన్లో చేసింది. అయితే అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో ప్రతిరోజు లాగే గురువారం సైతం కరెంట్ ఆన్ చేసింది. ఈ విషయం తెలియని రాములునాయక్, జాలికాడి నర్సింహులు ఇద్దరూ వరి చేను దగ్గరకు వెళ్లగా.. కరెంట్ తీగలు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందారు. తర్వాత అటుగా వెళ్లిన ఇతర పొలాల రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో ఇరు కుటుంబాల సభ్యులతోపాటు రెండు గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. అర గంట ముందు వరకు కళ్ల మందు ఉన్న వ్యక్తులు అంతలోనే విగతజీవులుగా మారడంతో బోరుమని విలపించారు. రాములు నాయక్కు భార్యతోపాటు ముగ్గురు ఆడపిల్లలు ఉండగా.. నర్సింహకు భార్య బొజ్జమ్మతోపాటు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
'కుమురంభీం వర్ధంతి' వేడుకలో.. ఒక్కసారిగా విషాదం!
సాక్షి, ఆదిలాబాద్: గోండు వీరుడు కుమురంభీం వర్ధంతి కార్యక్రమం నిర్మల్ జిల్లాలో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... కడెం మండలం చిన్నబెల్లాల్ గ్రామపంచాయతీ పరిధిలోని గొండుగూడలో ఆదివారం భీం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. జెండా గద్దె వద్ద భీం చిత్రపటాన్ని పెట్టి జెండా ఎగురవేసేందుకు ఇనుప పైపు అమరుస్తుండగా అది సమీపంలోని 11 కేవీ విద్యుత్ తీగకు తగిలింది. విద్యుత్ సరఫరా కావడంతో పైపును పట్టుకున్న మోహన్, భీంరావు, వెంకట్రావు షాక్కు గురయ్యారు. అప్రమత్తమైన స్థానికులు బాధితులను విద్యుత్ సరఫరా నిలిపివేయించి ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా పెంద్రం మోహన్(25) మార్గమధ్యలో మరణించాడు. ఆత్రం భీంరావు(26) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మరో బాధితుడు వెడ్మ వెంకట్రావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆత్రం భీంరావుకు భార్య గంగామణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెంద్రం మోహన్ బీటెక్ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడు. ఇద్దరు యువకుల మృతితో చిన్నబెల్లాల్ గ్రామంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు. బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్ది భుక్యా జాన్సన్నాయక్ ఆసుపత్రిలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇవి చదవండి: ప్రాణం తీసిన పబ్జీ గేమ్.. ఏకంగా సెల్ టవర్ ఎక్కి.. పైనుంచి.. -
డ్రైవర్ను సస్పెన్షన్ చేసిన ఆర్టీసీ అధికారులు.. దీనితో డ్రైవర్ తీవ్రనిర్ణయం..
గోపాల్పేట: ఉరేసుకుని ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తిలో చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేశ్వర్లు వివరాల మేరకు.. తాడిపర్తికి చెందిన చంద్రశేఖర్గౌడ్ (52) కొన్నేళ్లుగా ఆర్టీసీ డ్రైవర్గా పని చేస్తుండేవాడు. నాలుగు నెలల కిందట ఆర్టీసీ అధికారులు చంద్రశేఖర్గౌడ్ను సస్పెన్షన్ చేశారు. అప్పటి నుంచి తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులకు తోడు కుటుంబ సభ్యులు అతడిపై కోపంతో ఇటీవల హైదరాబాద్కు వెళ్లారు. గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com విద్యుదాఘాతంతో ‘భగీరథ’ లైన్మేన్ మృతి గోపాల్పేట: విద్యుదాఘాతంతో మిషన్ భగీరథ పథకం లైన్మేన్ మృతి చెందిన ఘటన గోపాల్పేట మండలం తాడిపర్తిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. తాడిపర్తిలో మిషన్ భగీరథ ప్రధాన పైప్లైన్ లీకేజీ అయింది. పైప్లైన్కు మరమ్మతు చేసేందుకుగాను కాశీంనగర్కు చెందిన వాటర్మేన్ సతీష్ (45) వెల్డింగ్ మిషన్కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చే క్రమంలో ప్రమాదవశాత్తు షాక్కు గురయ్యాడు. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. పోక్సో కేసులో 20ఏళ్ల జైలుశిక్ష చిన్నచింతకుంట: పోక్సో కేసులో నిందితుడికి మహబూబ్నగర్ ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి శుక్రవారం 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. చిన్నచింతకుంట మండలం లాల్కోటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పోగుల రాజుపై 2018లో పోక్సో కేసు నమోదైంది. కోర్టులో వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడికి 20ఏళ్ల జైలుశిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని ఎస్ఐ శేఖర్ తెలిపారు. -
చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ తెరిస్తే.. షాక్తో చిన్నారి మృతి
నందిపేట్ (ఆర్మూర్): తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ మాల్కు వెళ్లిన చిన్నారి.. చాక్లెట్ కోసమని ఫ్రిడ్జ్ని తెరిచే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో జరిగింది. నవీపేట మండల కేంద్రానికి చెందిన గూడూర్ రాజశేఖర్ భార్య, కూతురు రిషిత (4)తో కలిసి నందిపేటలో ఉండే అత్తగారింటికి ఆదివారం వచ్చాడు. సోమవారం ఉదయం వారు తిరిగి స్వగ్రామానికి వెళ్తూ.. నందిపేటలోని ఎన్ మార్ట్ షాపింగ్ మాల్లోకి సరుకులు కొనేందుకు వెళ్లారు. రాజశేఖర్ వస్తువులు తీసుకుంటుండగా పక్కనే ఐస్క్రీంలు ఉన్న ఫ్రిడ్జ్ని తెరిచేందుకు రిషిత ప్రయత్నించింది. ఫ్రిడ్జ్కి కరెంట్ సరఫరా కావడంతో చిన్నారి విద్యుదాఘాతానికి గురైంది. ఫ్రిడ్జికి అలాగే అంటుకుని కొన్ని సెకన్లపాటు వేలాడింది. గమనించిన తండ్రి పాపను తీసుకుని స్థానిక ఆస్పత్రికి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే పాప మృతి చెందింది. చిన్నారి మృతదేహంతో రాస్తారోకో..: షాపింగ్మాల్ యజమానుల నిర్లక్ష్యం వల్లే రిషిత మృతి చెందిందని బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహంతో మాల్ ఎదురుగా రోడ్డుపై నాలుగు గంటలపాటు రాస్తారోకో చేశారు. వీరికి స్థానికులు మద్దతు తెలుపడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాహుల్, తహసీల్దార్ ఆనంద్కుమార్ బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని, మాల్ యజమానులపై కేసులు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. -
ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతులు చేస్తూ.. కరెంట్ షాక్తో విద్యుత్ ఆపరేటర్ మృతి
సాక్షి, సూర్యాపేట, నడిగూడెం: ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై విద్యుత్ ఆపరేటర్ మృతిచెందాడు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం తెల్లబల్లి గ్రామ పరిధిలో గురువారం జరిగిన ఈ సంఘటనపై గ్రామస్తులు తెలిపిన వివరాలివి. తెల్లబల్లి గ్రామానికి చెందిన నెమ్మాది సుధాకర్ (40) మునగాల మండలం రేపాల విద్యుత్ సబ్స్టేషన్లో ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. సుధాకర్ గురువారం విధులకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. తెల్లబల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు రత్నవరం రహదారిలోని ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదని అతన్ని తీసుకెళ్లారు. ఆ ట్రాన్స్ఫార్మర్ మునగాల మండలం ఆకుపాముల విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఉందనుకొని అక్కడి నుంచి సుధాకర్ ఎల్సీ తీసుకున్నాడు. కానీ ఆ ట్రాన్స్ఫార్మర్ నడిగూడెం విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో ఉంది. ఈ విషయం తెలియకపోవడంతో సుధాకర్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
గణేష్ నిమజ్జనం ఊరేగింపులో విషాదం
సాక్షి, పల్నాడు జిల్లా: నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా గణపతి నవరాత్రి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆలయాల్లో, వీధుల్లో, వ్యాపార సముదాయాల్లో, అపార్ట్మెంట్లలో వివిధ రూపాల్లో వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు నిర్వహిస్తున్నారు. మండపాల్లో గణనాధుడిని నిత్య అలంకరణలు చేస్తూ ఉదయం, సాయంత్రం పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే కొన్ని చోట్ల నిమజ్జనం మహోత్సవంలో పలు అపశ్రుతి, అనుకోని సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా గణేష్ నిమజ్జనం ఊరేగింపులో కరెంట్ షాక్ తగిలి 13 ఏళ్ల బాలుడు మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన నరసరావుపేటలో చోటుచేసుకుంది. సోమవారం వినాయకుడి ఊరేగింపు చూసేందుకు 13 ఏళ్ల బాలుడు వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు కరెట్ షాక్ తగిలి బాలుడు కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పిల్లాడిని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. చదవండి: తిరుమల: ముగింపు దశకు బ్రహ్మోత్సవాలు.. వేడుకగా చక్రస్నానం -
కరిరాజుకు కరెంట్ కాటు
కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీని నుంచి మేతకోసం అడవిని దాటి పంట పొలాల్లోకి వచ్చే ఏనుగులకు కరెంట్ పెద్ద శత్రువులా మారింది. ఇప్పటి వరకు కరెంట్ షాక్లతో 14 ఏనుగులు మృతిచెందగా.. తాజాగా బైరెడ్డిపల్లె మండలం నల్లగుట్లపల్లె వద్ద మరో ఆడ ఏనుగు కరెంటుకు బలైంది. వంటిపై దురద తీర్చుకోవడానికి కరెంటు స్థంభాలను రుద్దడం, తొండంతో విరగ్గొడుతుండడంతో తీగలు పైన పడుతున్నాయి. మరికొన్ని చోట్ల రైతుల పొలాల వద్ద తక్కువ ఎత్తులోని 12కేవీ కరెంటు వైర్లు తగిలి మృతిచెందుతున్నాయి. చిత్తూరు: కౌండిన్య అభయారణ్యంలో కరెంటుకు ఏనుగులు బలి అవుతున్నాయి. ఇప్పటి పలు ఘటనల్లో 20 ఏనుగులు మృతిచెందగా, ఇందులో 15 ఏనుగులు కరెంట్ తీగలు తగిలి చనిపోవడం బాధాకరం. అభయారణ్యంలో మొత్తం వందకుపైగా ఏనుగులున్నాయి. ఇవి గుంపులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ముసలిమొడుగు, జగమర్ల, మొగిలిఘాట్, నెల్లిపట్ల, వెంగంవారిపల్లి, తోటకనుమ ప్రాంతాల్లో గుంపులుగా తిరుగుతున్నాయి. మదపుటేనుగులు ఒంటరిగానే సంచరిస్తున్నాయి. కౌండిన్య అభయారణ్యం నుంచి ఏనుగులు బయటికి రాకుండా అటవీశాఖ నిర్మించిన ఎలిఫెంట్ ట్రెంచీలు, సోలార్ఫెన్సింగ్ పెద్దగా ఫలితాలను ఇవ్వడం లేదు. తెలివైన జంతువుగా పేరున్న గజరాజులు ట్రెంచీలను పూడ్చి, బండలను వాటిల్లోకి దొర్లించి, సోలార్ ఫెన్సింగ్ను విరగ్గొట్టి అడవి నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఏనుగుల సమస్యకు శాశ్వతచర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో కౌండిన్యాలో ఏనుగుల జాడ కనుమరుగైయ్యే అకాకాశం ఉంది. బలమైన ఫెన్సింగ్ నిర్మాణంతోనే కట్టడి కౌండిన్యా అడవిలో 66 కిలోమీటర్ల మేర సోలార్ ఫెన్సింగ్ను గతంలో నిర్మించారు. ఇందులో కొన్ని చోట్ల సోలార్ ఫెన్సింగ్కు అమర్చిన డీసీ బ్యాటరీలు పనిచేయక విద్యుత్ ప్రసరించడం లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్లో మరీ తేలిగ్గా ఉన్న పైపులున్నచోట వీటిని ఏనుగులు తొక్కి నాశనం చేస్తున్నాయి. సోలార్ ఫెన్సింగ్తోబాటు కౌండిన్య అటవీప్రాంతంలో 12 చోట్ల 74 కిలోమీటర్లమేర ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచెస్ పనులను గతంలో చేపట్టారు. అయితే ట్రెంచికి మధ్యలో రాతి బండల కారణంగా అక్కడక్కడ గ్యాప్లున్నాయి. ట్రెంచి వెడల్పు మూడు మీటర్లుగానే ఉంది. ఏనుగులు కొన్ని చోట్ల గుంతలు ఉన్న గుట్టల గుండా, లేదా గుంతల్లోకి మట్టిని నింపి వెలుపలికి వస్తున్నాయి. కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఏనుగులు అడవిలోంచి బయటకు రాకుండా పాత రైలు పట్టాలకు ఫెన్సింగ్ను ఏర్పాటు చేసినట్టు ఇక్కడా చేపట్టాలి. స్థానిక అడవిలో కొంతమేర ఇప్పటికే నిర్మించిన కర్ణాటక టైప్ వేలాడే ఫెన్సింగ్నైనా పూర్తిస్థాయిలో చేపట్టాలి. అడవికి ఆనుకుని ఉన్న బఫర్జోన్లో ముళ్లుకలిగిన కలిమిచెట్లు, గారచెట్లు, నిమ్మచెట్టు లాంటివి పెంచితే ముళ్లకు బయపడి ఏనుగులు రాకుండా ఉంటాయని రైతులు సూచిస్తున్నారు. అయితే కౌండిన్య అభయారణ్యం మూడు రాష్ట్రాల పరిధిల్లో ఉండడంతో మూడు రాష్ట్రాలు కలసి ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటు చేస్తేనే సమస్యకు శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది. సీఎం దృష్టికి తీసుకెళ్లా.. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో ఏనుగుల సమస్య ఉంది. గతంలో నిర్మించిన సోలార్ ఫెన్సింగ్ నాఽశిరకంగా ఉండడంతోనే ఏనుగులు సులభంగా అడవిలోంచి బయటకు వచ్చేస్తున్నాయి. ఇందుకోసం పటిష్టమైన సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. సీఎం ఈ సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. – వెంకటేగౌడ, ఎమ్మెల్యే, పలమనేరు కొత్త ఫెన్సింగ్కు ప్రతిపాదనలు పంపాం పాత, కొత్త సోలార్ ఫెన్సింగ్ల మధ్య నున్న గ్యాప్లతో పాటు పాత సోలార్ దెబ్బతిన్న చోట్ల మరమత్తులకు ఇప్పటికే రూ.28 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ప్రభుత్వం నుంచి నిధులందితే ఫెన్సింగ్ పనులు ప్రారంభిస్తాం. అడవిలోంచి బయటకొచ్చిన ఏనుగులు ఇలా కరెంట్షాక్లకు గురై మృతి చెందుతుండడం మా శాఖకు చాలా బాధగా ఉంది. – శివన్న, ఎఫ్ఆర్వో, పలమనేరు -
వీడియో: కూకట్పల్లిలో విషాదం.. కరెంట్ షాక్తో మహిళ మృతి
-
HYD: స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్తో మహిళ మృతి
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్పల్లిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బోర్ స్విచ్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్తో వివాహిత గంగా భవాని(33) అక్కడికక్కడే మృతి చెందింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. అల్విన్ కాలనీ పైప్ లైన్ రోడ్డులో ఉన్న ప్రేమ్ సరోవర్ అపార్ట్ మెంట్లో గంగాభవాని(33) పని మనిషిగా పనిచేస్తోంది. అయితే, గంగా భవాని అపార్ట్మెంట్లో బోర్వెల్ ఆన్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్ షాక్తో మృతిచెందింది. కరెంట్ షాక్ తగిలిన వెంటనే ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. కొద్ది నిమిషాల తర్వాత ఆమె నేలపై పడి ఉండటాన్ని గమనించిన అపార్ట్మెంట్ వాసులు ఆమెను ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. కాగా, ప్రేమ్ సరోవర్ అపార్ట్మెంట్లోనే ఆమె భర్త వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుమారు 11 సంవత్సరాల వయస్సు గల ఒక అమ్మాయి మరియు 9 సంవత్సరాల వయస్సు గల అబ్బాయి ఉన్నారు. వీరు ఏపీవాసులుగా తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది కూడా చదవండి: ఎన్టీపీసీలో ఘోర ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి -
కాటేసిన కరెంట్ తీగ!
సంగారెడ్డి: పంట చూసేందుకు వెళ్లిన కౌలు రైతు విద్యుత్ షాక్ గురై మృతిచెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని పెద్దగొట్టిముక్లలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి పెంటయ్య (35) తనకున్న 2 ఎకరాలతోపాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. కౌలు భూమి చుట్టూ ఫెన్సింగ్ వైరు ఏర్పాటైంది. కరెంట్ స్తంభం నుంచి వైరు తెగిపడి ఫెన్సింగ్పై పడింది. పంట పరిశీలనకు ఒక వైపు నుంచి వెళ్లి మరో వైపు నుంచి తిరిగొస్తుండగా ఫెన్సింగ్ వైర్ తగిలి షాక్తో అక్కడికక్కడ మరణించాడు. అతడికి భార్య నాగమణి, ఇద్దరు పిల్లలున్నారు. నాగమణి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వ్యవసాయ పొలాల వద్ద వెళాడుతున్న విద్యుత్ వైర్లు సరిచేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు ఆందోళన నిర్వహించారు. సంఘటనా స్థలం వద్దకొచ్చిన లైన్మెన్, ఇద్దరు సిబ్బందిని గేరావ్ చేశారు. ఉన్నతాధికారులు పరిహారం ప్రకటించేంతవరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించడానికి వీల్లేదని భీష్మించారు. పోలీసులు జోక్యం చేసుకొని నచ్చజెప్పి శాంతింపజేశారు. -
ఉజ్జయినీ మహంకాళీ బోనాల ఉత్సవాల్లో అపశ్రుతి
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరలో అపశ్రుతి నెలకొంది. లష్కర్ బోనాల ఉత్సావాల్లో భాగంగా పలహార బండ్ల ఊరేగింపులో విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని కార్వాన్ ప్రాంతానికి చెందిన ఆకాష్గా(23) గుర్తించారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆకాష్.. ఆదివారం రాత్రి విద్యుత్ స్తంభాన్ని ముట్టుకోవడంతో షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ మార్చురీ తరలించారు. కాగా నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా కరెంట్ పోల్కు పవర్ రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు చారిత్రక సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగింది. సీఎం కేసీఆర్ దంపతులతో పాటు వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక, తొట్టెలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమం జరిగింది. రంగంలో మాతంగి స్వర్ణలత భవిష్కవాణి వినిపించారు. ఈ ఏడాది అగ్ని ప్రమదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని స్వర్ణలత చెప్పారు. కాస్తా ఆలస్యమైనా మంచి వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయందోళన చెందవద్దని అన్నారు. చదవండి: ఈటల, అర్వింద్కు భద్రత పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం -
విధి ఆడిన వింత నాటకం.. పెళ్లింట పెను విషాదం
సాక్షి, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో పెళ్లింట విషాదం నెలకొంది. రేపు పెళ్లిచేసుకోబోతున్న వరుడు.. విధి ఆడిన వింత నాటకంలో తనువు చాలించాడు. దీంతో, పెళ్ళిసందడితో ఉండాల్సిన ఇళ్ళు శోకసంద్రంగా మారింది. కరెంట్ షాక్ రూపంలో వరుడిని మృత్యువు వెంటాండింది. వివరాల ప్రకారం.. మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెంతండాకు చెందిన భూక్య బాలాజీ కాంతి దంపుతుల ఏకైక కుమారుడు భూక్య యాకుబ్. కాగా, యాకుబ్కు గార్ల మండలం పిక్లీతండాకు చెందిన అమ్మాయితో శుక్రవారం అర్ధరాత్రి వివాహం జరగాల్సి ఉంది. పెళ్ళి ఏర్పాట్లలో నిమగ్నమైన యాకుబ్, ఇంట్లో నీళ్ళ కోసం బోరు(మోటార్) ఆన్ చేసే క్రమంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయారు. అయితే, మరికొద్ది గంటల్లో పెళ్ళి పీటలు ఎక్కాల్సిన వరుడు పాడెక్కడంతో పెళ్లింట విషాదం అలముకుంది. పెళ్ళికొడుకు మృతితో కన్నవారితోపాటు బంధుమిత్రులు బోరున విలపించారు. ఎదిగిన కొడుకు ఓ ఇంటివాడు అవుతున్న తరుణంలో కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఇక, యాకుబ్ రైల్వేలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడు. ఇది కూడా చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో రేణుకకు బెయిల్ -
విద్యుత్ షాక్ తో భార్య భర్తల మృతి
-
అన్నమయ్య జిల్లా: గృహ ప్రవేశం జరుగుతున్న ఇంట విషాదం
సాక్షి, అన్నమయ్య: జిల్లాలోని పెద్దతిప్ప సముద్రం మండంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గృహప్రవేశం కార్యక్రమంలో ఇంటికి వచ్చిన బంధువులపై కరెంట్ తీగలు తెగిపడటంతో నలుగురు మృతిచెందారు. దీంతో, వేడుక జరుగుతున్న ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాల ప్రకారం.. పెద్దతిప్పసముద్రం మండలంలోని కానుగమాకులపల్లెలో గృహప్రవేశం జరిగిన ఇంట విషాదం నెలకొంది. ఓ ఇళ్లు గృహప్రవేశానికి వేసిన షామియాన గాలికి కరెంట్ తీగలపై పడింది. దీంతో, ఒక్కసారిగా కరెంట్ తీగలు తెగి.. అక్కడున్న వారిపై పడటంతో కరెంట్ షాక్ తగిలింది. ఈ ప్రమాద ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. మరికొందరు గాయపడటంతో వారిని వెంటనే బి.కొత్తకోట మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. కాగా, వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వేడుక జరుగుతున్న ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నారు. మృతుల వివరాలు ఇవే.. 1. లక్ష్మమ్మ 75, 2.ప్రశాంత్ 26, 3. లక్ష్మన్న 53, 4. శాంతమ్మ 48. -
Hyderabad: సంప్ రాసిన మృత్యు శాసనం.. ముగ్గురు యువకుల మృతి
బంజారాహిల్స్: నీళ్లు తోడేందుకు బకెట్ను సంప్లోకి వదిలిన ఓ యువకుడు కరెంట్ షాక్తో మృతి చెందగా.. కాపాడటానికి వెళ్లిన మరో ఇద్దరు కూడా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే అసువులు బాసిన విషాద ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. టోలిచౌకి సమీపంలోని పారామౌంట్ కాలనీలో నివసించే మహ్మద్ రిజ్వాన్ (18), మహ్మద్ రజాక్ (16) అన్నదమ్ములు. రిజ్వాన్ ఇంటర్ చదువుతుండగా రజాక్ ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాశాడు. బుధవారం అర్ధరాత్రి తమ ఇంటిపై వాటర్ ట్యాంకర్లో నీళ్లు అయిపోవడంతో నీరు తోడేందుకు రజాక్ సంప్లోకి బకెట్ ముంచాడు. అప్పటికే నీళ్లు పైకి ఎక్కించేందుకు కరెంటు మోటార్ ఆన్ చేసి ఉండటంతో రజాక్ విద్యుత్ షాక్కు గురై సంప్లో పడిపోయాడు. వెంటనే అతని సోదరుడు మహ్మద్ రజాక్ కూడా నీళ్లు తోడేందుకు సంప్లో బకెట్ వేయగానే షాక్కు గురయ్యాడు. పది నిమిషాలు గడిచినా రజాక్, రిజ్వాన్ రాకపోయేసరికి స్నేహితుడు సయ్యద్ అనసుద్దీన్ హుస్సేన్ (20) సంపు వద్దకు వచ్చి చూడగా ఇద్దరూ విగతజీవులుగా కనిపించారు. ఆందోళన చెందిన అనస్ వారిని పైకి తీసేందుకు యత్నిస్తుండగా అతను కూడా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ముగ్గురూ సంప్లోనే మృత్యువాత పడ్డారు. సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటన పారామౌంట్ కాలనీలో స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అన్నదమ్ములు ఇద్దరూ కొద్ది రోజుల క్రితమే ఇంటర్, 10వ తరగతి పరీక్షలు రాసి ఉన్నత చదువుల కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇద్దరు కుమారులు మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. గురువారం తెల్లవారుజామున మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
Hyderabad: రోడ్డు ప్రమాదంలో ఒకరు.. కరెంట్ షాక్తో మరొకరు!
సాక్షి, హైదరాబాద్: ఇంటి మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మహిళ మృతి చెందిన ఘటన నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులవివరాల ప్రకారం.. నేరేడ్మెట్ చంద్రబాబునగర్లో నివాసముండే ఏ.మణ్యం ఇంట్లో మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కోడలు వరలక్ష్మీ(21) కరెంట్ షాక్కు గురైంది. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నేరేడ్మెట్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం చెందిన ఘటన మల్కాజిగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓల్డ్ మీర్జాలగూడకు చెందిన సాయితేజ యాదవ్(23) ఓయూలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి స్నేహితుడి బైక్(కేటీఎం డ్యూక్) తీసుకొని బంధువుల ఇంట్లో జరుగుతున్న ఫంక్షన్కు వెళ్లాడు. తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా సాయిరాం థియేటర్ దాటిన తర్వాత బైక్కు కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి ఫుట్పాత్ను ఢీకొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సాయితేజ తల్లి ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మార్నింగ్ వాక్లో విషాదం.. విద్యుత్ షాక్తో అక్కడికక్కడే వ్యక్తి మృతి
సాక్షి, హైదరాబాద్: వర్షాల దెబ్బకు తెగిపడ్డ ఓ విద్యుత్ వైరుపై కాలుపై అడుగువేయడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషాద ఘటన సికింద్రాబాద్లోని పద్మారావునగర్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పార్శిగుట్టలో నివాసం ఉండే ఏ. ప్రవీణ్ ముదిరాజ్ అనే వ్యక్తికి ప్రతి రోజూలానే ఈరోజు(శుక్రవారం) ఉదయం కూడా సికింద్రాబాద్ పద్మారావునగర్లోని పార్క్లో వాకింగ్కు వెళ్లాడు. నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా ఓ విద్యుత్ వైర్ తెగి నేలపై పడింది. అయితే అది గమనించని ప్రవీణ్.. దానిపై అడుగువేయడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పార్క్కు వచ్చిన కొందరు దీన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిలకలగూడ పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. -
కంచె.. ప్రాణాలు తీసింది
చిన్నగూడూరు: కోతులు, అడవి పందుల నుంచి పంటకు రక్షణగా పెట్టిన విద్యుత్ వైర్ల కంచె తండ్రీకొడుకుల ప్రాణం తీసింది. ఈ ఘటన మంగళవారం మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం దుమ్లాతండాలో చోటు చేసుకుంది. తండాకు చెందిన ఆంగోత్ సీవీనాయక్(60), అమ్మీ దంపతుల కుమారుడు కిరణ్(30) మొక్క జొన్న పంట వేశారు. పంట కంకి పోయడంతో కోతులు, అడవి పందులు వచ్చి పంటను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో చేను చుట్టూ విద్యుత్ వైర్ అమర్చారు. సాయంత్రం విద్యుత్ ఆన్చేసి, ఉదయాన్నే తీసివేసేవారు. కానీ మంగళవారం ఆఫ్ చేయడం మర్చిపోయారు. పంటకు నీరు కడుతుండగా కిరణ్ కాలుజారి విద్యుత్ సరఫరా అవుతున్న వైర్లకు తగిలి షాక్కు గురయ్యాడు. పక్కనే ఉన్న తండ్రి నాయక్ కుమారుడిని కాపాడేందుకు పట్టుకున్నాడు. గమనించిన తల్లి అమ్మీ కేకలకు పక్కనే ఉన్న రైతులు వచ్చి వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కానీ అప్పటికే ఇద్దరూ మరణించారు. కళ్లముందే భర్త, కొడుకు షాక్తో విలవిల్లాడుతూ మరణించడంతో గుండలవిసేలా రోదించింది. చిన్నగూడూరు ఎస్సై రవికుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ట్రాన్స్ఫార్మర్కు మరమ్మతు చేస్తూ విద్యుత్ షాక్తో రైతు మృతి
గజ్వేల్రూరల్: ట్రాన్స్ఫార్మర్పై మరమ్మతులు చేస్తుండగా, ఓ యువరైతు విద్యుత్ సరఫరా జరిగి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కుంట రాజు(32)కు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పాడైంది. దానికి మరమ్మతు చేయించి బిగించేందుకు రైతులు సబ్స్టేషన్ నుంచి ఎల్సీ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ట్రాన్స్ఫార్మర్పైకి ఎక్కి రాజు మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్కు గురై మృతి చెందాడు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే రాజు మృతి చెందాడని ఆరోపిస్తూ న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించేదిలేదని బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు అక్కడికి చేరుకొని ప్రమాదఘటనపై విచారణ చేపట్టి మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాగా రాజును ట్రాన్స్ఫార్మర్ పైకి ఎవరు ఎక్కమన్నారు? ఎల్సీ తీసుకున్న తర్వాత మరమ్మతు పనులు పూర్తికాకముందే ఎలా విద్యుత్ సరఫరా చేశారనే విషయాలు తెలియాల్సి ఉంది. -
తండ్రి, కుమార్తెను బలిగొన్న వాటర్ హీటర్
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న కూతురు, మనవళ్లకు అన్నీ తానై చూసుకుంటున్నాడు ఆ పెద్దాయన. విధి చిన్నచూపు చూడటంతో విద్యుదాఘాతానికి గురై తండ్రి, ఆయనను కాపాడే ప్రయత్నంలో కుమార్తె మృత్యువాత పడ్డారు. పదేళ్లు వయసు నిండని ఇద్దరు బిడ్డలను అనాథల్ని చేసి వెళ్లిపోయారు. ఈ హృదయ విదారక ఘటన సత్యనారాయణపురంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. రామకోటి మైదానం పాపిట్లవారివీధిలో నివాసం ఉంటున్న ఇప్పిలి సింహాచలం (60) పెయింటింగ్ పనులు చేసుకుంటూ భార్య వరాలమ్మతో కలసి పాత రేకుల షెడ్డులో నివాసం ఉంటున్నారు. అతని కుమార్తె పసుపులేటి మంగమ్మ (32) భర్తతో విభేదాల కారణంగా 6, 9 ఏళ్ల కుమారులతో కలసి పుట్టింట్లోనే ఉంటుంది. వారు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో 1, 3వ తరగతి చదువుతున్నారు. సింహాచలానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో కొంతకాలంగా పనికి వెళ్లకుండా ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్య వరాలమ్మ, కూతురు మంగమ్మ ఇళ్లలో పనులు, సాయంత్రం సమయంలో ఫుడ్కోర్డులో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటల సమయంలో మంగమ్మ తన ఇద్దరు పిల్లలకు స్నానం చేయించి ఇంటి సమీపంలోని ట్యూషన్కు పంపించింది. సింహాచలం కూడా స్నానం చేసే నిమిత్తం వేడినీళ్లు కాచుకోవడానికి ప్లాస్టిక్ బకెట్లో వాటర్ హీటర్ పెట్టి స్విచ్ వేశాడు. ఆ సమయంలో విద్యుత్షాక్ తగిలి కిందపడిపోయాడు. కాపాడే ప్రయత్నంలో కూతురు మంగమ్మ తండ్రిని పట్టుకోవడంతో ఆమెకు విద్యుత్ షాక్ తగిలి ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వారిని కాపాడే క్రమంలో పక్క పోర్షన్లో ఉండే అక్కవరపు సీత(54)కు విద్యుత్ షాక్ తగిలి తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. భర్త, కూతురు మృతి చెందటంతో ఆమె ఇద్దరు పిల్లలను చూసుకుని తల్లి వరాలమ్మ కుమిలిపోవడం స్థానికుల కలచివేసింది. సత్యనారాయణపురం సీఐ వెంకటనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నాన్నతో నడచి వెళ్లి.. శవమై ఇంటికి
ఖానాపూర్: అప్పటివరకు ఆ చిన్నారి.. అక్క తమ్ముడితోపాటు స్థానిక పిల్లలతో సరదాగా ఆడుకుంది. అప్పుడే ఇంటికి వచ్చిన తండ్రికి ఇంట్లో నీళ్లు లేవని.. నల్లా రావడం లేదని ఇల్లాలు చెప్పింది. వెంటనే తండ్రి బోరు మోటార్ ఆన్ చేయడానికి బయల్దేరాడు. చిన్న కూతురు తానూ వస్తానని మారాం చేసింది. కాదనలేక.. చిన్నారిని వెంట తీసుకుని వెళ్లాడు. తండ్రి మోటార్ ఆన్ చేస్తుండగా, చిన్నారి అక్కడే ఉన్న విద్యుత్ తీగకు తగిలి షాక్కు గురైంది. తండ్రి కళ్లముందే గిలగిలా కొట్టు కుంటూ కూతురు చనిపోయిన ఈ విషాద ఘటన నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం కొలాంగూడ పంచాయతీ పరిధిలోని దేవునిగూడెంలో శనివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మాడావి నాశిక్–విజయలక్ష్మి దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. నాశిక్ ఉదయం కూలి పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. స్నానం చేయడానికి నీళ్లు లేకపోవడంతో డైరెక్ట్ పంపింగ్ ద్వారా నీరు సరఫరా చేసే మోటార్ ఆన్ చేయడానికి వెళ్తుండగా చిన్న కూతురు మాలశ్రీ(5) తానూ వస్తానని మారాం చేసింది. కాదనలేక ఆమెను తీసుకుని వెళ్లాడు. అయితే అప్పటికే చీకటి పడడంతో కూతురును పక్కన నిలిపి నాశిక్ మోటార్ ఆన్ చేస్తుండగా, మాలశ్రీ సమీపంలో విద్యుత్ తీగకు తగిలింది. షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందింది. కళ్ల ముందే కూతురు ప్రాణాలు పోతున్నా నాశిక్ ఏమీ చేయలేకపోయాడు. స్థానికులు వచ్చే సరికి బాలిక చనిపోయింది. కూతురును పట్టుకుని తండ్రి రోదించిన తీరు అందరినీ కలచివేసింది. -
విద్యుత్ షాక్ మరణాలను ఆపే సెన్సార్
మామునూరు: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఈఈఈ తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పంట పొలాల్లో విద్యుత్ ప్రమాదాలను గుర్తించే సెన్సార్ను కనుగొని నూతన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. విద్యుదాఘాతంతో పంటపొలాలు, వ్యవసాయ బావుల వద్ద రైతుల మరణాలను ఆపేందుకు సెన్సార్ను ఆవిష్కరించారు. ప్రివెన్షన్ ఆఫ్ ఎలెక్ట్రోడ్యూషన్ ఫర్ సేఫ్టీ ఆఫ్ ప్రెమెక్స్ అనే ప్రాజెక్ట్ను ఆధ్యాపకులు డాక్టర్ సదానందం, టి.వేణుగోపాల్ పర్యవేక్షణలో విద్యార్థులు ఎం.శృతి, పి.మేఘన, ఎండి సమీర్, ఎస్.అనురాగ్, జి.మధుకర్ రూపొందించారు. సహజంగా వ్యవసాయ బావులు, పంట పొలాల వద్ద విద్యుత్ వైర్లు తెగిపడడంతో విద్యుదాఘాతానికి గురై రైతులు ప్రాణాలను పోగొట్టుకుంటుంటారు. విద్యుదాఘాతం సంభవించే అవకాశం ఉందని రైతును అలర్ట్ చేసే యంత్ర పరికరాలు అందుబాటులో లేవు. దీంతో విద్యార్థులు తమ పరిశోధన ద్వారా ప్రమాద సమయంలో అలర్ట్ చేసే సెన్సార్ పరికరాన్ని కనుగొన్నారు. శుక్రవారం సాయంత్రం కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యంత్ర పని విధానాన్ని విద్యార్థులు వెల్లడించారు. ’’ప్రాసెసర్ ద్వారా సెన్సార్ స్విచ్ పరికరాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తారు. దీంతో తెగిపడిన విద్యుత్ వైర్ల వద్దకు రైతు వస్తుంటే సెన్సార్ స్విచ్ ఒత్తిడితో ఈ యంత్రంలో అమర్చిన కెమెరా ఫొటోలు తీసి వాటిని దానంతట అదే మెమరీ కార్డులో రికార్డు చేస్తుంది. తద్వారా రైతును అప్రమత్తత చేయడమే కాకుండా బజర్ సౌండ్ ఇస్తుంది’’అని వివరించారు. ఒకవేళ రైతు ముందుకు వస్తే విద్యుత్ సరఫరా నేరుగా నిలిపివేయబడుతుందని చెప్పారు. పేటెంట్ హక్కు కోసం దరఖాస్తు చేసినట్లు విద్యార్థులు తెలిపారు. -
ఛార్జింగ్లో ఉన్న మొబైల్ తీస్తుండగా షాక్ తగిలి చిన్నారి మృతి
సాక్షి, గద్వాల్: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్లో ఉన్న మొబైల్ ఫోన్ తీస్తుండగా షాక్ తగిలి నిహారిక అనే చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. అయిజ మండలం ఈడిగొనిపల్లి గ్రామంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కాగా పదేళ్ల నిహారిక 4వ తరగతి చదువుతుంది. కూతురు అకస్మిక మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ పరికరాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. సెల్ఫోన్లు, ఈ-వాహనాలు పేలుతున్న ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. కొన్ని సంఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో చార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడవద్దని, పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: మల్లారెడ్డి ఆదాయాలపై ఐటీ విచారణ: 13 మంది హాజరు.. మరో 10 మందికి నోటీసులు -
మూడు రోజుల్లో లండన్కు అంతలోనే మృత్యుఒడికి
నల్లగొండ క్రైం: విద్యుదాఘాతం ఓ విద్యార్థిని బలి గొంది. నల్లగొండ జిల్లాలోని నల్లగొండ మండలం మేళ్లదుప్పలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చింతల వెంకటేశంగౌడ్ కు మారుడు మురళీ గౌడ్(24) లండన్లో ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే మురళీ స్వగ్రామానికి వచ్చాడు. కుమారుడికి ఉద్యోగం రాగానే వివాహం చేయా లని నిర్ణయించిన తల్లిదండ్రులు, అందుకోసం ఇంటి పైభాగంలో నిర్మాణ పనులు చేయిస్తున్నారు. పనుల్లో భాగంగా మురళి శనివారం ఉదయం ఇంటిపైన ఉన్న ఇనుప చువ్వల ను కిందికి విసురుతుండగా పక్కనుంచే వెళ్తున్న 11కేవీ విద్యు త్ వైరుకు ఒక ఇనుప చువ్వ తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. ఇది గమనించిన తండ్రి వైరును పక్కకు తొలగించి మురళిని జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మూడు రోజుల్లో లండన్కు.. వెంకటేశం కుమారుడు మురళి చిన్నప్పటి నుంచి చదువులో ముందుండేవాడు. తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ కుమారుడిని చదివించారు. లండన్లో ఎంఎస్ కోర్సు పూర్తికావడంతో కొద్ది రోజులు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. మరో మూడు రోజుల్లో లండన్కు తిరిగి వెళ్లాల్సి ఉండగా ఈ విషాదకర ఘటన చోటు చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి పరామర్శించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఫోన్లో మురళి కుటుంబ సభ్యులతో మాట్లాడి సంతాపం తెలిపారు. -
సోదరులిద్దరికీ ఒకేసారి వివాహం.. పెళ్లైన ఆరు నెలలకే మృత్యుఒడికి
సాక్షి, హుజూర్నగర్ (నల్గొండ): వివాహమైన ఆరుమాసాలకే ఓ యువకుడిని విద్యుత్ రూపంలో మృత్యువు కబళించింది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో చోటు చేసుకున్న ఈ విషాదకర ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చింత్రియాల గ్రామానికి చెందిన పేరుపంగు వెంకయ్య ఏసమ్మ దంపతులకు కిరణ్ (25),రవీంద్రబాబు సంతానం. సోదరులిద్దరికీ గత మే నెలలో ఒకేసారి వివాహాలు జరిగాయి. వీరు పులిచింతల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ (కృష్ణానది)లో చేపలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. సోదరులిద్దరూ శుక్రవారం ఉదయం చేపలు పట్టేందుకు పడవలో కృష్ణానదిలోకి వెళ్లారు. రవీంద్ర బాబు పడవ నడుపుతుండగా కిరణ్ చేపల వల విసిరాడు. వల ప్రమాదవశాత్తు నది ఒడ్డుకు సమీపంలో ఉన్న 11కేవీ విద్యుత్ వైరుకు తగిలింది. దీంతో కిరణ్ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందగా రవీంద్ర బాబుకు గాయాలయ్యాయి. అయితే, ప్రమాదంలో రవీంద్రబాబు నదిలో పడిపోవడంతో ఈదుకుంటూ బయటికి వచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కిరణ్ మృతదేహాన్ని బయటికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్నగర్ ఆస్పత్రికి తరలించారు. కాగా, వివాహమైన ఆరు మాసాలకే కిరణ్ మృతిచెందడంతో అతడి భార్య సుభాషిణి, తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మృతుడి సోదరుడు రవీంద్ర బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. గుండాల మండలంలో ఒకరు.. గుండాల : చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతిచెందాడు. గుండాల మండలం పెద్దపడిశాల గ్రామ ంలో శుక్రవారం జరిగిన ఈ ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రావుల మల్లేష్(36) గొర్రెలను కాస్తు, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మల్లేష్ గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి వస్తకొండురు గ్రామ చెరువులో కరెంట్ వైర్లతో చేపలు పట్టేందుకు వెళ్లాడు. కాగా, మల్లేష్ చెరువు ఒడ్డున ఉన్న బండపై నిలబడి కరెంట్ వైరు విసిరే క్రమంలో ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయాడు. అయితే, అతడి చేతిలో ఉన్న వైరు కూడా నీటిలో పడడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఒడ్డున్న మిగతా ఇద్దరు గమనించి వెంటనే విద్యుత్ ప్రసరణ నిలిపివేసి మల్లేష్ను జనగామ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
కరెంటుతో జాగ్రత్త!.. ప్రాణాలు కోల్పోతున్న రైతులు, కూలీలు
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా నాలుగేళ్లలో 41,914 విద్యుత్ ప్రమాదాలు సంభవించగా.. మహారాష్ట్ర 10,698, ఉత్తరప్రదేశ్ 9,970, గుజరాత్ 3,767 ప్రమాదాలతో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మన రాష్ట్రంలో అదే నాలుగేళ్లలో 2,922 ప్రమాదాలు జరిగాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో విద్యుత్ ప్రమాదాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ వీటిని సైతం నివారించాలంటే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా విద్యుత్ షాక్కు గరవుతున్నారు. కొన్ని జాగ్రతలు పాటిస్తే పెనుప్రమాదం నుంచి బయటపడవచ్చని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ జాగ్రత్తలు పాటించండి వ్యవసాయ పంపుసెట్లకు మోటార్ స్టార్టర్లు, స్విచ్లు ఉన్న ఇనుప బోర్డులకు విధిగా ఎర్తింగ్ చేయించాలి. తడి చేతులతో, నీటిలో నిలబడి విద్యుత్ మోటార్లను, స్విచ్లను, పరికరాలను తాకకూడదు. ట్రాన్స్ఫార్మర్లను మరమ్మతు చేయడానికి విద్యుత్ అర్హత గల ఎలక్ట్రీషియన్ను పిలిపించాలి. పొలాల్లో తెగిపడిన, జారిపడి తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లకు దూరంగా ఉండి.. 1912 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సంబంధిత విద్యుత్ సిబ్బందికి గానీ, గ్రామ సచివాలయాల్లో ఉన్న ఎనర్జీ సహాయకులకు గానీ ఫిర్యాదు చేయాలి. పంటను జంతువుల బారినుంచి రక్షించేందుకు పెట్టే ఫెన్సింగులకు విద్యుత్ సరఫరా చేయకూడదు. పాడైన విద్యుత్ వైర్లను ఇన్సులేషన్ టేపుతో చుట్టాలి. వాహనాలపై విద్యుత్ తీగలు తగిలితే బయట పడేందుకు హాపింగ్ (గెంతుట, దుముకుట) విధానం అనుసరించాలి. అంతేతప్ప ఒక కాలు వాహనంలోనూ, మరో కాలు నేలపైనా ఉంచకూడదు. వర్షం వచ్చిన సమయంలో విద్యుత్ స్తంభాలను తాకరాదు. నీటిలో పడిన విద్యుత్ వైర్ల జోలికి వెళ్లకూడదు. స్తంభం, ట్రాన్స్ఫార్మర్ దగ్గర మూత్ర విసర్జన చేయకూడదు. విద్యుత్ స్తంభం నుంచి వ్యవసాయ మోటారుకు మధ్య ఎక్కువ దూరం ఉండకుండా చూసుకోవాలి. ఎక్కువ దూరం ఉంటే గాలులు వీచినప్పుడు వాటి మధ్య ఉండే సర్వీస్ వైరు వదులై మోటారుపై ప్రభావం చూపుతుంది. విద్యుత్ స్తంభం నుంచి మోటారుకు కరెంటు నేరుగా సరఫరా కాకుండా మధ్యలో ఫ్యూజ్ బ్యాక్, స్టార్టర్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. మోటార్ వద్ద ఫ్యూజ్లు, ఇండికేటర్ బల్బులు, స్టార్టర్ను చెక్కపై బిగించుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇనుప డబ్బాపై బిగించకూడదు. భవనాలు, బహిరంగ ప్రదేశాల్లో విద్యుత్ ప్రమాదాలకు అవకాశం ఉన్నట్టు గుర్తిస్తే 1912 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఇదీ చదవండి: ప్రమాదాల వేళ గోల్డెన్ అవర్లో స్పందించండి.. పోలీసుల సూచనలివీ -
విద్యుదాఘాతంతో రైతు మృతి
నల్లగొండ క్రైం: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. నల్లగొండ జిల్లా కొండారం గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండారం గ్రామానికి చెందిన చెనగోని దశరథ (44) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. దశరథ గురు వారం సాయంత్రం ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫ్యూజు వేసేందుకు ఫోన్లో సబ్స్టేషన్ ఆపరేటర్ వద్ద ఎల్సీ తీసుకున్నాడు. అనంతరం ట్రాన్స్ ఫార్మర్ ఎక్కి ఫ్యూజు వేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావ డంతో విద్యుదాఘాతానికి గుర య్యాడు. ట్రాన్స్ఫార్మర్పైనే దశ రథ మృతిచెందాడు. సమీపంలోని రైతులు ఇది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యుత్ అధి కారులు వచ్చే వరకు మృతదేహాన్ని కిందకి దించమని కుటుంబ సభ్యు లు భీష్మించారు. అయితే రాత్రి వరకు ఘటనాస్థలానికి అధికారు లు ఎవరూ చేరుకోలేదు. మృతుడికి భార్య నాగలక్ష్మితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
విద్యార్థులకు కరెంట్ షాక్ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
కాట్రేనికోన/సాక్షి, అమరావతి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం దొంతుకుర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై యడ్ల నవీన్ (7) అనే మూడో తరగతి విద్యార్థి మృత్యువాత పడ్డాడు. ఈ ప్రమాదంలో మరో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. వీరిలో చిట్టిమేను వివేక్ (3వ తరగతి), తిరుపతి ఘన సతీష్కుమార్ (4వ తరగతి)లను అత్యవసర వైద్యం నిమిత్తం అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన మరో ఇద్దరు 3వ తరగతి విద్యార్థులు మొల్లేటి నిఖిల్, బొంతు మహీధరరెడ్డిలకు దొంతుకుర్రులోనే ప్రాథమిక వైద్యం అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. పాఠశాల ప్రాంగణంలో నిర్మిస్తున్న సచివాలయ భవనం శ్లాబ్ కోసం ఇనుప ఊచలను కట్ చేసేందుకు కటింగ్ మెషీన్ తీసుకొచ్చారు. దాని తీగ ఊచలకు తగలడం.. అదే సమయంలో విద్యార్థులు తాగునీటి కోసం ఆ ఇనుప ఊచలపై నుంచి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఇక సతీష్కుమార్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. చికిత్స పొందుతున్న విద్యార్థులను ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్కుమార్, జిల్లా ఏఎస్పీ కె.లతామాధురి పరామర్శించి, పరిస్థితిని సమీక్షించారు. మృతిచెందిన విద్యార్థి నవీన్ కుటుంబీకులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. బాధితులకు అండగా ఉండండి : సీఎం విద్యార్థులకు కరెంట్ షాక్ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి శుక్రవారం ఆయన రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.లక్ష పరిహారం ఇవ్వడంతో పాటు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సూచించారు. -
‘పుట్టిన రోజే ఇలా చేశావేమయ్యా’
సాక్షి, అనంతపురం(కూడేరు): విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ తీగలు యమపాశాల్లా తెగిపడుతున్నాయి. వీటి బారిన పడి ఇప్పటికే చాలా మంది మృతి చెందారు. పలువురు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అయినా విద్యుత్ శాఖ అధికారుల్లో మార్పు రాలేదు. అదే నిర్లక్ష్యం... అదే ఉదాసీనత. తాజాగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి కూడేరులో ఓ యువరైతు కరెంటు తీగకు బలయ్యాడు. తండ్రికి చేదోడుగా.. కూడేరు మండలం గొటుకూరుకు చెందిన బోయ నల్లప్ప, ఓబుళమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో మొదటి కుమారుడు కేశవయ్య గ్రామంలోనే ఉంటూ తండ్రితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్నాడు. రెండో కుమారుడు కరుణాకర్ (22) బీటెక్ ద్వితీయ సంవత్సరంతో చదువు మానేసి తండ్రికి చేదోడుగా వ్యవసాయ పనులు చేపట్టాడు. పుట్టిన రోజే మృత్యు గీతిక ఈ నెల 4న తన పుట్టిన రోజు కావడంతో వేకువజామునే కరుణాకర్ నిద్రలేచాడు. ‘అమ్మా! ఈ రోజు నా పుట్టిన రోజు. ఏదైనా స్పెషల్ చేసిపెట్టు’ అంటూ తల్లిని అడిగిన కరుణాకర్.. అనంతరం పంటకు నీరు పెట్టి వస్తానంటూ తండ్రితో చెప్పి ద్విచక్ర వాహనంపై పొలానికి బయలుదేరాడు. అప్పటికే ఆ మార్గంలో 11కేవీ విద్యుత్ తీగ తెగి పడి ఉంది. ఈ విషయాన్ని గమనించిన మరో రైతు ప్రతాపరెడ్డి.. వెంటనే ఫోన్ ద్వారా విద్యుత్ శాఖ అధికారులను అప్రమత్తం చేశాడు. అనంతరం అటుగా ఎవరైనా వచ్చి ప్రమాదం బారిన పడుతారని భావించిన ఆయన కాసేపు అక్కడే నిలబడ్డాడు. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తున్న కరుణాకర్ను చూసి కేకలు వేసి అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించాడు. అప్పటికే సమయం మించి పోయింది. రోడ్డుకు అడ్డుగా వేలాడుతున్న విద్యుత్ తీగ నేరుగా కరుణాకర్ను తాకడంతో అతను కుప్పకూలాడు. ఉపశమన చర్యలు చేపట్టే లోపు మృతి చెందాడు. త్వరగా వస్తానంటివి కదయ్యా.. ‘పుట్టిన రోజును స్నేహితుల మధ్య జరుపుకోవాలని సరదా పడితివి. ఏదైనా స్పెషల్ చేసి పెట్టు, త్వరగా వస్తానంటవి. ఇంతలోనే ఎంత పనైంది దేవుడా!’ అంటూ కరుణాకర్ మృతదేహంపై పడి తల్లి ఓబుళమ్మ, తండ్రి నల్లప్ప బోరున విలపించారు. ‘పుట్టిన రోజే ఇలా చేశావేమయ్యా’ అంటూ గుండెలవిసేలా రోదించారు. మృతదేహంతో రాస్తారోకో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే కరుణాకర్ మృతి చెందాడంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కరుణాకర్ మృతదేహాన్ని జాతీయ రహదారిపైకి చేర్చి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహన రాకపోకలు స్తంభించాయి. విషయం తెలుసుకున్న సీఐ శేఖర్, ఎస్ఐ సత్యనారాయణ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. విద్యుత్ శాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ప్రాణాలు పోయేవి కావని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేకూరేవరకూ ఆందోళన విరమించబోమని భీష్మించారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులతో పోలీసు అధికారులు ఫోన్లో మాట్లాడారు. విద్యుత్ శాఖ ఏఈ సెలవులో ఉన్నారని తెలియడంతో ఆందోళనకారులతో చర్చించి న్యాయం చేకూరుస్తామంటూ భరోసానిచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. ఆర్థిక సాయం అందజేస్తాం కరుణాకర్ మృతిపై విద్యుత్ శాఖ ఏఈ రాజేష్ మాట్లాడుతూ.. జరిగిన ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. మృతుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో కౌలురైతు... ఉరవకొండ: విద్యుత్ షాక్కు గురై ఓ కౌలురైతు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... ఉరవకొండ మండలం నింబగల్లుకు చెందిన నరసింహులు, భీమక్క దంపతుల కుమారుడు మారుతి (21) వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నాడు. గ్రామానికి చెందిన మరో రైతు వద్ద ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని తన తండ్రితో కలసి మిర్చి పంట సాగు చేపట్టాడు. మంగళవారం ఉదయం పంటకు నీరు పెట్టేందుకు వెళ్లిన మారుతి... స్టార్టర్ బాక్స్ వద్ద స్విచ్ ఆన్ చేస్తుండగా విద్యుత్షాక్కు గురై కుప్పకూలాడు. గమనించిన చుట్టుపక్కల పొలాల్లోని రైతులు వెంటనే మారుతిని 108 అంబులెన్స్ ద్వారా ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ఉరవకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
లేవరా.. ఒక్కసారి నన్ను చూడరా!
కేసముద్రం: ‘లేవరా.. ఒక్కసారి నన్ను చూడరా. బాయి కాడికి పోదాం’అంటూ ఓ తండ్రి కుమారుడి మృతదేహాన్ని హత్తుకుంటూ గుండెలవిసేలా రోదించాడు. కోతుల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు తన వరి పొలం చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ అభంశుభం తెలియని బాలుడిని బలితీసుకుంది. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మర్రితండాలో సోమవారం చోటుచేసుకుంది. మర్రితండాకు చెందిన వాంకుడోతు నీల, బాసు దంపతులకు ఇద్దరు కుమారులు అశోక్, జీవన్(14) ఉన్నారు. చిన్నకుమారుడు జీవన్ చదువు మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. తోటిమిత్రులతో కలిసి జీవన్ మేకలను మేపేందుకు ఊరి చివరకు వెళ్లాడు. ఇదే గ్రామ శివారు చెరువు ముందు తండాకు చెందిన వాంకుడోతు బిచ్చు అనే రైతు, తన వరి పొలం చుట్టూ విద్యుత్ తీగను ఏర్పాటు చేశాడు. పొలం వైపుగా మేకలు వెళ్లకుండా చూసేందుకని అటుగా వెళ్లిన జీవన్ కాలుకు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తాకడంతో షాక్కు గురై వెంటనే కుప్పకూలిపోయాడు. గమనించిన మిత్రులు వాంకుడోతు గణేశ్, నవీన్, సూర్య అతన్ని బయటకు తీసేందుకు యత్నించగా, వారికి స్వల్పంగా విద్యుత్ షాక్ కొట్టడంతో భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. ఇంతలో జీవన్ పంటపొలంలోనే మృతి చెందాడు. విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపడంతో బోరున విలపిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ పంట యజమాని బిచ్చు ఇంటి ముందు జీవన్ మృతదేహాన్ని ఉంచి కుటుంబసభ్యులు, తండావాసులు ఆందోళన చేశారు. పోలీసులు వచ్చి బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ‘కరెంటుతీగ పెట్టి మా బిడ్డను కడుపున పెట్టుకున్నారు సార్.. మాకు న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు పోలీసుల కాళ్లపై పడి వేడుకున్నారు. చివరకు కుటుంబసభ్యులను, తండావాసులకు సర్దిచెప్పి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. కంటతడి పెట్టించిన తల్లిదండ్రుల రోదన అప్పటి వరకు ఇంట్లో సరదాగా గడిపిన జీవన్ గంటల వ్యవధిలోనే శవమై కనిపించడంతో తల్లిదండ్రులైన నీలా, బాసు రోదించిన తీరు అందర్నీ కంటతడి పెట్టించింది. బిడ్డా ఒక్కసారి లేవరా అంటూ ఆ తల్లి రోదించిన తీరు హృదయాలను బరువెక్కించింది. ’ -
కరెంటు కంచె ముగ్గురిని కాటేసింది..
మామడ/నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): పొలాలకు అమర్చిన విద్యుత్ తీగలే వారిపాలిట మృత్యుపాశమయ్యాయి. పశువులు మేపేందుకు అడవికి వెళ్లిన ఓ పశువుల కాపరి, పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఇద్దరు రైతు పంటలకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలకు తగిలి మృతిచెందారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ విషాద ఘటనలు నిర్మల్, కామారెడ్డి జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. మృతుల్లో ఇద్దరు ఒకే గ్రామానికి చెందినవారు కావడం గమనార్హం. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి చెందిన పశువుల కాపరి మద్దిపడగ మల్లయ్య(64) రోజు మాదిరిగానే సోమవారం ఉదయం తనకున్న గొర్రెలను మేత కోసం అటవీప్రాంతానికి తీసుకువెళ్లాడు. రాత్రి అయినా మల్లయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా గ్రామానికి చెందిన పారెడి చంద్రమౌళి పొలం వద్ద విగత జీవిగా కనిపించాడు. సమీపంలో విద్యుత్ కంచె ఉండడంతో కరెంటుషాక్తో మృతిచెందినట్లు గుర్తించి పోలీసులకు, విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పొన్కల్ గ్రామానికే చెందిన ద్యాగల బొర్రన్న(55) కూడా మంగళవారం మరోచోట విద్యుత్ కంచెకు తగిలి మృతి చెందాడు. బొర్రన్న ఉదయం తన పొలం వద్దకు వెళ్లాడు. పొరుగు రైతుకు చెందిన పొలం వద్ద పశువుల కోసం గడ్డి కోస్తుండగా కానక విద్యుత్ కంచెకు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఒక్కరోజు వ్యవధిలో ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు విద్యుత్ కంచెకు బలవడంతో పొన్కల్లో విషాదం నెలకొంది. నిజాంసాగర్లో శవమై...: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూర్కి చెందిన రైతు కుమ్మరి నల్ల పోశెట్టి(43) సోమవారం వేకువజామున పొలానికి వెళ్లాడు. దారిలో స్థానిక ఎంపీటీసీ మోతె శ్రీనివాస్కు చెందిన పొలానికి ఉన్న విద్యుత్ కంచె ప్రమాదవశాత్తు తగలడంతో పోశెట్టి మృత్యువాతపడ్డాడు. అయితే ఆయన మంగళవారం గ్రామశివారులోని నిజాంసాగర్ బ్యాక్వాటర్లో శవమై తేలడంపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎంపీటీసీ కుటుంబసభ్యులే పోశెట్టి మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి సమీపంలోని బ్యాక్వాటర్లో పడేశారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోశెట్టి మృతికి కారణమైనవారు తమకు లొంగిపోయారని, మృతుడి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
కరెంటు బిల్లు రూ.3వేల కోట్లు.. షాక్తో ఆసుపత్రిపాలు
భోపాల్: విద్యుత్తు వైర్లు తగలకుండానే ఓ వ్యక్తికి షాక్ తగిలింది. అది ఎలాగనుకుంటున్నారా? తన ఇంటి కరెంట్ బిల్లు చూసి షాక్తో ఆసుపత్రి పాలయ్యాడు. ఇంతకి అతని బిల్లు ఎంతనుకుంటున్నారా? రూ.3,419 కోట్లు. ఈ సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. గ్వాలియర్లోని శివ విహార్ కాలనీకి చెందిన ప్రియాంక గుప్తా ఇంటి విద్యుత్తు బిల్లు రూ.3,419 కోట్లు వచ్చినట్లు తెలుసుకుని షాకయ్యారు. ఆమె మామ ఏకంగా మూర్చపోయి ఆసుపత్రిలో చేరాడు. అయితే.. ఇది మానవ తప్పిదం వల్ల జరిగిందని విద్యుత్తు సంస్థ తెలిపింది. సవరించిన బిల్లు రూ.1,300గా ఇవ్వటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు గుప్తా కుటుంబ సభ్యులు. గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్తు బిల్లు కోట్లలో రావటం చూసి షాక్కి గురైన తన తండ్రి ఆసుపత్రిపాలయ్యాడని గుప్తా భర్త సంజీవ్ కంకానే పేర్కొన్నారు. జులై 20న తమకు ఇంటి విద్యుత్తు బిల్లు వచ్చిందన్నారు. భారీ మొత్తంలో ఉండటంతో మధ్యప్రదేశ్ క్షేత్ర విద్యుత్తు వితరన్ కంపెనీ(ఎంపీఎంకేవీవీసీ) పోర్టల్లో తనిఖీ చేయగా.. సవరించినట్లు కనిపించిందని తెలిపారు. విద్యుత్తు బిల్లు భారీగా వచ్చేలా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎంపీఎంకేవీవీసీ జెనరల్ మేనేజర్ నితిన్ మంగ్లిక్. ‘యూనిట్స్ స్థానంలో వినియోగదారుడి నంబర్ ఎంటర్ చేయటం వల్ల ఇలా జరిగింది. అందుకే భారీగా బిల్లు వచ్చింది. సవరించిన బిల్లు రూ.1,300 సంబంధిత వినియోగదారుడికి ఇచ్చాం.’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఇదీ లక్కంటే.. అప్పులపాలై ఇల్లు అమ్మకానికి పెట్టగా రూ.కోటి లాటరీ -
ఉడేగోళంలో విషాదం... అన్నదమ్ములని బలిగిన్న కరెంట్
కణేకల్లు: ఇద్దరు అన్నదమ్ములను కరెంట్ బలిగొంది. ఈ ఘటనతో కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామం విషాదంలో మునిగిపోయింది. మాజీ సర్పంచ్ కురుబ యల్లప్ప (లేట్)ది రైతు కుటుంబం. ఈయనకు ఐదుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయమే వీరికి ప్రధాన జీవనాధారం. హెచ్చెల్సీకి నీరు విడుదల చేయడంతో బోర్లున్న రైతులు ముందుగానే వరినారు పోసుకోవడం ఆనవాయితీ. యల్లప్ప కుమారులు రమేష్ (34), దేవేంద్ర (28), వన్నూరుస్వామి తమ పొలంలో మూడ్రోజుల కిందట వరి నారు పోశారు. ఆదివారం నారు మడికి నీరు పెట్టి పొలంలో చిన్నాచితక పనులు చేసుకొద్దామని ఈ ముగ్గురూ పొలానికి వెళ్లారు. రమేష్ స్టార్టర్ ఆన్ చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్షాక్కు గురై కుప్పకూలిపోయాడు. అన్నను లేపేందుకు వెళ్లిన దేవేంద్ర కూడా షాక్కు గురయ్యాడు. వీరిని కాపాడేందుకు వెళ్లిన వన్నూరుస్వామి షాక్ కొట్టగానే ఎగిరి పడ్డాడు. వెంటనే పక్కపొలం రైతులు, స్థానికులకు, కుటుంబ సభ్యులకు సమాచారమందించాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన చేరుకుని వారిని కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే రమేష్, దేవేంద్ర మృతి చెందారు. వీరిని కాపాడే క్రమంలో గాయపడ్డ మరో సోదరుడు వన్నూరుస్వామి బళ్లారిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో రమేష్కు భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు, దేవేంద్రకు భార్య కస్తూరి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. విద్యుత్ షాక్తో ఇద్దరు అన్నదమ్ములు మృత్యువాత పడటంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దేవుడా ఎంత పనిచేశావయ్యా.. పొలానికి వెళ్లి తొందరగా వస్తామని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతిరా.. మీరు లేని జీవితం ఎలా గడపాలి.. పిల్లలకు ఏమని సమాధానం చెప్పాలి’ అంటూ మృతుడు రమేష్ భార్య జ్యోతి, దేవేంద్ర భార్య కస్తూరి గుండెలవిసేలా రోదించారు. ‘అక్కా... అని ప్రేమగా పలకరించే చిన్నోడి (దేవేంద్ర)ని తీసుకెళ్లి ఎందుకింత అన్యాయం చేశావు దేవుడా’ అంటూ విలపించిన అక్క జయమ్మను ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. ఆ దేవుడు నన్నైనా తీసుకుపోయి ఉంటే బాగుండేదంటూ కన్నీరు మున్నీరయ్యారు. ‘దేవురే ఒబ్బరల్లా... ఇబ్బుర్ని (దేవుడా ఒకరిని కాదు ఇద్దరిని) ఎంగే తకొండు హోగిదియప్పా(ఎలా తీసుకెళ్లావు?)’ అంటూ అక్కాచెల్లెళ్లు విలపించడం అందర్నీ కలచి వేసింది. (చదవండి: పార్థుడి పనైపోయిందా!.. చంద్రబాబు 'బాది'పోయాడా?) -
విషాదం: కుటుంబాన్ని కాటేసిన కరెంటు.. వైరు అంచు విద్యుత్ ఫ్యూజ్కు తాకడంతో..
కామారెడ్డి: వెలుగులు నింపే విద్యుత్ ఓ కుటుంబంలో చీకటి నింపింది. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. రెండేళ్ల బాబు అనాథయ్యాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ విషాద ఘటన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన ఎండీ అహ్మద్ (40) ఆటో నడుపుకొంటూ జీవిస్తున్నాడు. అతడికి భార్య పర్వీన్ బేగం (32), కూతురు మాహీన్ (6), కుమారులు అద్నాన్ (3), ఫైజాన్ (2) ఉన్నారు. ఫైజాన్ సమీపంలో ఉండే అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. బట్టలు ఆరేయడానికి వారు నివసించే రేకుల ఇంటి ముందు గోడకు రెండువైపులా మేకులు కొట్టి వైరుకట్టారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో పర్వీన్ బేగం దుప్పటిని వైరుపై ఆరేస్తుండగా బరువు కారణంగా వైరు కిందకు జారింది. వైరు అంచుకు కొద్దిదూరంలోనే విద్యుత్ ఫ్యూజ్ ఉంది. దానికి వైరు తాకడంతో విద్యుత్ సరఫరా అయ్యింది. దీంతో పర్వీన్ బేగం విద్యుదాఘాతానికి గురైంది. ఆమె అరుపు విని ఇంట్లో ఉన్న అహ్మద్, పిల్లలు బయటకు పరుగెత్తుకొచ్చారు. ఆమెను కాపాడబోయే ప్రయత్నంలో ఒకరి వెంట మరొకరు విద్యుదాఘాతానికి గురై నలుగురూ మృతిచెందారు. చుట్టుపక్కలవారు గమనించి విద్యుత్శాఖ అధికారులు, పోలీసులకు సమాచారమిచ్చారు. 3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశా రని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. ఆయన ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబొద్దీన్తో కలిసి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం కేసీఆర్ ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారని గోవర్ధన్ తెలిపారు. -
మహబూబాబాద్: మైక్ సెట్ రిపేర్ చేస్తుండగా షాక్.. ముగ్గురి మృతి
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని డోర్నకల్ మండలం అందనాలపాడులో విషాదం చోటు చేసుకుంది. గత రాత్రి కురిసిన గాలివానకు గ్రామంలోని రామాలయం గుడిపై ఉన్న మైక్ సెట్ దెబ్బతింది. దెబ్బతిన్న మైక్ సెట్ సరి చేస్తుండగా.. కరెంట్ షాక్తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్ని సుబ్బారావు, మస్తాన్ రావు, వెంకయ్యలుగా నిర్ధారించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. -
కబళించిన కంచె..
వేంసూరు: తొలకరి జల్లులు కురవడంతో ఆనందంగా వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం చౌడవరానికి చెందిన ఉట్ల శ్రీనివాసరావు (38) తన పొలంలోని మోటార్ను పరిశీలించేందుకు గురువారం ఉదయం వెళ్లాడు. ఈ క్రమంలో పొలానికి రక్షణగా ఉన్న ఇనుప కంచె దాటుతుండగా.. కంచెలోని తీగ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న హైటెన్షన్ స్తంభం సపోర్ట్ వైర్ను తాకింది. సపోర్ట్ వైర్లో విద్యుత్ సరఫరా అవుతుండటంతో శ్రీనివాసరావు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఎస్ఐ సురేష్ తదితరులు పరిశీలించారు. -
సాహసం చేసి ప్రాణం కాపాడాడు.. అడి కార్ అందుకున్నాడు
ఆపదలో ఉన్న మనిషిని ఆదుకోవడం గొప్ప విషయం. అలాంటిది తన ప్రాణం పోతుందని తెలిసి కూడా కాపాడాలనుకోవడం సాహసమే కదా!. అలాంటి సాహస వీరుడికి ఘనంగా సన్మానం చేశారు. ఖరీదైన అడి కార్తో సత్కారం అందుకున్నాడు. కానీ, అంతకన్నా విలువైందే తనకు దక్కిందని అంటున్నాడు 20 ఏళ్ల ఆ కుర్రాడు. ఇంతకీ ఆ కుర్రాడికి దక్కిన విలువైన వస్తువు ఏంటో తెలుసా?.. ఒక ప్రాణం కాపాడాననే ఆత్మసంతృప్తి. యస్.. చికాగోకు చెందిన 20 ఏళ్ల టోనీ పెర్రీ తన ప్రాణాన్ని రిస్క్ చేసి ఓ వ్యక్తిని కాపాడాడు. అందుకే అతన్ని మెచ్చుకుంటోంది సోషల్ మీడియా. ఉమ్మి కారణంగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరు తన్నుకుంటూ ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్స్ మీద పడిపోయారు. దాడికి దిగిన వ్యక్తి వెంటనే తప్పించుకోగా.. మరోవ్యక్తి మాత్రం ఎలక్ట్రిక్ ట్రాక్స్ మీద పడిపోవడంతో షాక్ కొట్టింది. 600 వోల్ట్స్ కరెంట్తో విలవిలలాడిపోయాడు అతను. ప్లాట్ఫామ్ మీద ఉన్నవాళ్లంతా భయంతో అలా చూస్తూ ఉండిపోయారు. ఈ లోపు అక్కడే ఉన్న టోనీ పట్టాల మీదకు దూకి అతి జాగ్రత్త మీద ఆ వ్యక్తి పక్కకు జరిపాడు. ఆ సమయంలో అంతా టోనీని హెచ్చరిస్తున్నా.. పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఒకవేళ అదే ప్లేసులో నేనుంటే?.. జనాలు నా గురించి ఏమనుకుంటారు? నన్ను రక్షిస్తారా? అలాగే వదిలేస్తారా? అనే ఆలోచన నన్ను భయపెట్టింది. అందుకే ముందు వెళ్లాను. ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా హీరో అంటున్నారు. కానీ, నిజాయితీ అనిపిస్తోంది. టోనీని స్థానికంగా అంతా కలిసి ఘనంగా సన్మానించారు. స్థానికంగా ఉన్న ఓ వ్యాపారవేత్త ఆడి ఏ6 కార్ను టోనీకి సర్ప్రైజ్గిఫ్ట్గా ఇచ్చాడు. ఈ కారు ప్రారంభ ధరే మన కరెన్సీలో రూ.60 లక్షలకు పైనే ఉంది. -
కస్టడీలో వ్యక్తికి పోలీసుల కరెంట్ షాక్
బదౌన్: పశువుల దొంగతనం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు 20 ఏళ్ల యువకుడిని కరెంట్ షాక్తో చిత్రహింసలకు గురిచేశారు. బాధితుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఘటనకు సంబంధించి ఐదుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. రెహాన్ అనే రోజుకూలీ ఈ నెల 2వ తేదీన సాయంత్రం ఇంటికి వెళ్తుండగా బదౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశువుల దొంగల ముఠాకు సహకరిస్తున్నాడంటూ అతడిని చిత్రహింసలు పెట్టారు. కరెంట్ షాక్కు గురి చేయడంతోపాటు లాఠీతో తీవ్రంగా కొట్టడంతో నడవలేని, కనీసం మాట్లాడలేని పరిస్థితికి చేరుకున్నాడని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అతడిని విడిపించేందుకు రూ.5 వేలు లంచం ఇవ్వాల్సి వచ్చిందన్నారు. తీవ్రంగా గాయపడిన అతడికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. -
ఉత్తర ప్రదేశ్లో దారుణం.. కస్టడీలో ఉన్న వ్యక్తిని చితకబాదిన పోలీసులు
లక్నో: పశువులను దొంగిలించిన కేసులో ఓ యువకుడిని పోలీసులు చితకబాదారు. నేరం ఒప్పుకోవాలంటూ యువకుడిని దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. దీంతో నొప్పులు తాళలేక ఆసుపత్రి పాలయ్యాడు. ఈ అమానుష ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. పశువులను దొంగిలించాడనే కోసులో బడాయున్ పోలీసులు రెహాన్ అనే 20 ఏళ్ల యువకుడిని అరెస్టు చేశారు. దినసరి కూలీ అయిన రెహాన్ను మే 2న పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో స్టేషన్ అధికారి, మిగతా పోలీసులు అతన్ని వేధింపులకు గురిచేశారు. కస్టడీలో లాఠీలతో కొట్టడం, కరెంట్ షాక్ ఇవ్వడం వంటి చర్యలకు పాల్పడ్డారు. పోలీసులు దెబ్బలతో ఒళ్లంతా పుండు అయిపోయింది. అంతటితో ఆగకుండాప్రేవేటు భాగాల్లో గాయాలయ్యేలా కొట్టారు. అయితే ఇదంతా బాధితుడిని చూడటానికి అతని బంధువులు వచ్చినప్పుడు వెలుగులోనికి వచ్చింది. అయితే రెహాన్ను విడిచిపెట్టాలంటే పోలీసులు రూ.5 వేలు డిమాండ్ చేశారని, డబ్బులు ఇస్తేనే స్టేషన్ బెయిల్ ఇస్తామన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేగాక రూ. 100 ఇచ్చి చికిత్స చేసుకోవాలని చెప్పి అవమానపరిచారని పేర్కొన్నారు. చేసేదేం లేక అడిగినంత డబ్బులు ఇచ్చి తమ కొడుకుని ఇంటికి తీసుకొచ్చామని రెహాన్ తల్లిదండ్రులు వాపోయారు. రెహాన్ను తీవ్రంగా గాయపరిచారని, నడవలేక, మాట్లాడలేకపోతున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంతరం ఈ దారుణం గురించి బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యా దు చేశారు. దీంతో ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న అధికారులు స్టేషన్ ఇంచార్జితో సహా అయిదుగురు పోలీసులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు నలుగురిని సస్పెండ్ చేశారు. కాగా రెహాన్ ప్రస్తుతం బులంద్షహర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చదవండి: నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: క్షమాపణలు కోరిన నూపుర్ శర్మ -
చెల్లిని చూసేందుకు వెళ్లి... అంతలోనే...
చీపురుపల్లి: పట్టణంలోని మెయిన్రోడ్లో గల నటరాజ్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి ఎ.రామస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు స్కూటీపై వెళ్తున్న రామస్వామికి చీపురుపల్లిలో ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తగలడంతో డివైడర్ను ఢీకొట్టి ట్రాక్టర్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిపల్లి రోడ్, నమ్మక్కల్కు చెందిన రామస్వామి విజయనగరంలో స్థిరపడి బాలాజీ మార్కెట్లో 404వ నంబర్ దుకాణంలో వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాడు. వ్యాపార విస్తరణలో భాగంగా రాజాం వైపు అరువులు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో విజయనగరంలో మంగళవారం మార్కెట్ సెలవు కావడంతో రాజాం పరిసర ప్రాంతాల్లో బకాయిల వసూలు కోసం ఉదయం 6 గంటలకే స్కూటీపై విజయనగరం నుంచి బయిలుదేరాడు. ఇంతలో చీపురుపల్లి వచ్చేసరికి రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటరమణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సన్యాశినాయుడు చెప్పారు. విద్యుత్ షాక్తో టిప్పర్ డ్రైవర్.. చీపురుపల్లి రూరల్: కుటుంబపోషణ కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాడోల్ జిల్లా బుదవా మండలం జరియా గ్రామం నుంచి వచ్చిన టిప్పర్ డ్రైవర్ ఓంప్రకాశ్ చీపురుపల్లి పట్టణంలో విద్యుత్ షాక్తో మంగళవారం మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి హెచ్సీ రమణమూర్తి అందించిన వివరాలిలా ఉన్నాయి. పట్టణ సమీపంలో రెడ్డిపేట వద్ద జరుగుతున్న తోటపల్లి కాలువ పనులకు డ్రైవర్ ఓంప్రకాశ్ టిప్పర్తో రాతిబుగ్గిని తీసుకువెళ్లాడు. రాతిబుగ్గిని అన్లోడ్ చేసిన అనంతరం పూర్తిగా అన్లోడ్ అయ్యిందో లేదో చూసేందుకు వెనుక వైపు ఉన్న డోర్ను పట్టుకున్నాడు. అప్పటికే టిప్పర్ వెనుక భాగాన విద్యుత్వైరు తగిలి ఉండడంతో పట్టుకున్న వెంటనే విద్యుత్షాక్ తగిలి కిందపడిపోయాడు. విషయాన్ని గమనించిన స్థానికులు ద్విచక్రవాహనంపై చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లగా వైద్యసిబ్బంది పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆటోనుంచి జారిపడి ఒకరు.. పాలకొండ రూరల్: మండలంలోని తలవరం–అట్టలి రహదారి మధ్య మంగళవా ఆటోలో నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. అవలంగి గ్రామానికి చెందిన నగరపు కృష్ణంనాయుడు (55) పాలకొండలో ఉన్న చెల్లిని చూసేందుకు పయనమై నవగాం కూడలిలో ఆటో ఎక్కి పాలకొండ వస్తున్నాడు. అట్టలి సమీపంలోని ఆర్సీఎం డొమినిక్ పాఠశాల వద్దకు చేరుకుంటున్న సమయంలో ఆటో అదుపు తప్పడంతో కృష్ణంనాయుడు ఆటోలో నుంచి జారి కిందపడగా తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కు సమాచారం మివ్వగా వాహనం సంఘటనా స్థలానికి చేరుకునే సరికే మృతిచెందాడు. ఆయనకు భార్య గోవిందమ్మ ఉంది. రైతు కూలీగా జీవనం గడుపుతున్నట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. పిల్లలు లేకపోవడం, భర్త మరణించడంతో గోవిందమ్మ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటనపై ఎస్సై సీహెచ్ ప్రసాద్ కేసు నమోదు చేశారు. పట్టణంలోని మెయిన్రోడ్లో గల నటరాజ్ జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో విజయనగరం పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి ఎ.రామస్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 7.30 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు స్కూటీపై వెళ్తున్న రామస్వామికి చీపురుపల్లిలో ప్రధాన రహదారిపై ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు తగలడంతో డివైడర్ను ఢీకొట్టి ట్రాక్టర్ కింద పడిపోయి అక్కడికక్కడే మృతిచెందాడు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిపల్లి రోడ్, నమ్మక్కల్కు చెందిన రామస్వామి విజయనగరంలో స్థిరపడి బాలాజీ మార్కెట్లో 404వ నంబర్ దుకాణంలో వస్త్ర వ్యాపారం సాగిస్తున్నాడు. వ్యాపార విస్తరణలో భాగంగా రాజాం వైపు అరువులు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో విజయనగరంలో మంగళవారం మార్కెట్ సెలవు కావడంతో రాజాం పరిసర ప్రాంతాల్లో బకాయిల వసూలు కోసం ఉదయం 6 గంటలకే స్కూటీపై విజయనగరం నుంచి బయిలుదేరాడు. ఇంతలో చీపురుపల్లి వచ్చేసరికి రోడ్డు ప్రమాదంలో మృత్యువు కబళించింది. ట్రాక్టర్ డ్రైవర్ వెంకటరమణను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై సన్యాశినాయుడు చెప్పారు. (చదవండి: 186 దేశాలు పర్యటించిన తెలుగు ట్రావెలర్) -
రథాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతం
నాంపల్లి: నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో శ్రీసీతారామచంద్ర స్వామి రథం తరలింపులో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వామివారి రథాన్ని ఆలయం నుంచి మరో చోటుకు తరలిస్తుండగా విద్యుత్ తీగలకు తగలడంతో షాక్ తగిలి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కేతేపల్లి గ్రామంలోని గుట్టపై ఉన్న శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ ఉత్సవాలు ఏప్రిల్ 10న ముగిశాయి. అయితే రథం ఆలయ ఆవరణలోనే ఉండిపోయింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు రథం తడుస్తుండడంతో దానిని తయారు చేయించిన దాత దయానందరెడ్డి రథాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించేందుకు శనివా రం సాయంత్రం గ్రామానికి చెందిన పలువురిని గుట్టపైకి తీసుకెళ్లారు. అందులో 8 మంది తాళ్ల సహాయంతో.. మరో నలుగురు దానిని పట్టు కుని లాగుతుండగా ఇనుముతో చేసి న రథం కరెంటు తీగలకు తగలడంతో దానిని పట్టుకుని లాగుతున్న రాజబోయిన యాదయ్య(45), పొగాకు మోహనయ్య(36) దాసరి ఆంజనేయులు (26) విద్యు దాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. రాజబో యిన వెంకటయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిం చారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. చదవండి: ‘ఏ తప్పూ చేయలేదు.. నా చావును కోరుకుంటున్నారు కదా.. మీ కోరిక తీరుస్తా’ -
సరదాగా ఈతకు వెళ్ళిన నలుగురు చిన్నారులు విద్యుత్ షాక్తో మృతి
-
సరదాగా ఈతకు వెళ్లి కుటుంబంలో విషాదం నింపారు
సాక్షి, కర్నూల్: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. సెలవు రోజుల్లో సరదాగా ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు విద్యుత్ షాక్తో మృతి చెందడంతో అక్కడ విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. కృష్ణగిరి మండలం ఆలంకొండ గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు శుక్రవారం ఉదయం ఈతకు వెళ్లారు. వారు ఈత కొడుతుండగా.. ప్రమాదవశాత్తు కరెంట్ తీగలు తెగిపోయి నీటిలో పడటంతో నలుగురు చిన్నారులు అక్కడిక్కడే మృత్యువాతపడ్డారు. చిన్నారుల మృతితో వారి తల్లిదండ్రులు బోరునవిలపిస్తున్నారు. వారి మృతితో ఆలంకొండ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: కారులో డ్రైవర్ మృతదేహం.. అసలేం జరిగిందో చెప్పిన ఎమ్మెల్సీ అనంతబాబు -
విధి మిగిల్చిన విషాదం
సజావుగా సాగిపోతున్న ఆ కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. విద్యుదాఘాతం రూపంలో భార్యాభర్తలను కబళించింది. తల్లిదండ్రులను దూరం చేయడంతో నాలుగేళ్ల చిన్నారి ఆనాథగా మిగిలిపోయింది. మంగళవారం ఉదయం స్థానిక విద్యుత్శాఖ క్వార్టర్లలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టించింది. అరకులోయ రూరల్: మండలంలోని కంఠభంసుగుడ గ్రామానికి చెందిన గొల్లోరి డొంబుదొర (36), పార్వతి (33) దంపతులు స్థానిక విద్యుత్ శాఖ క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. వీరికి నాలుగేళ్ల వింధ్య అనే కుమార్తె ఉంది. డొంబుదొర గిరిజన సహకార సంస్థ మినీ సూపర్ బజార్లో దినసర వేతన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం పార్వతి దుస్తులు ఉతికింది. వాటిని ఆరబెట్టేందుకు డొంబుదొర ప్రయత్నించాడు. వైరుపై దుస్తులు ఆరబెడుతుండగా దానికి విద్యుత్ సరఫరా ఉండటంతో షాక్కు గురయ్యాడు. అతను కేకలు పెట్టడంతో రక్షించేందుకు పార్వతి ప్రయత్నించింది. ఆమె కూడా విద్యుదాఘాతానికి గురైంది. ఇద్దరు సంఘటన స్థలంలోనే స్పృహకోల్పోయారు. పరిస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో ఆస్పత్రి, విద్యుత్ క్వార్టర్ల వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రలు విద్యుదాఘాతంతో మృతి చెందడంతో కుమార్తె వింధ్య పరిస్థితి దయనీయంగా మారింది. బాధిత చిన్నారిని ఆదుకుంటాం: ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ విద్యుదాఘాతంతో భార్యాభర్తలు మృతి చెందిన ఘటనలో బాధిత చిన్నారిని ఆదుకుంటామని ఐటీడీఏ పీవో ఆర్.గోపాలకృష్ణ మంగళవారం తెలిపారు. గొల్లోరి డొంబుదొర, పార్వతి మృతి చెందడం దురదృష్టకరమన్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన నాలుగేళ్ల చిన్నారిని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని పీవో తెలిపారు. ఐటీడీఏ తరపున పూర్తి సహాయ సహాకారాలు అందిస్తామన్నారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర, గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు గంధం చంద్రుడు జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారని పీవో తెలిపారు. బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారని పీవో ప్రకటనలో పేర్కొన్నారు. (చదవండి: ఊరుకాని ఊరులో.. ఇది కదా మానవత్వం అంటే!) -
టాలీవుడ్లో మరో విషాదం.. కరెంట్ షాక్తో డైరెక్టర్ మృతి
Tollywood Young Director Paidi Ramesh Passed Away With Current Shock: టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది. యంగ్ హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ గురువారం (ఏప్రిల్ 28) ఉదయం అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. అదే రోజు టాలీవుడ్కు చెందిన యంగ్ డైరెక్టర్ కన్నుమూశారు. డైరెక్టర్ పైడి రమేష్ ఓ భవనంపై నుంచి జారిపడి చనిపోయినట్లు సమాచారం. హైదరాబాద్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న పైడి రమేష్ నాలుగో అంతస్తులో ఆరేసిన బట్టలు తీస్తుండగా షాక్ కొట్టి కింద పడి ఆయన మరణించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పైడి రమేష్ మరణంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు నెలకొన్నాయి. పలువురు సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా పైడి రమేష్ 'రూల్' అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీ 2018లో విడుదల అయింది. అయితే ఈ సినిమా అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. ప్రస్తుతం మరో సినిమా ప్రయత్నాల్లో ఉన్నారు పైడి రమేష్. ఇంతలోనే ఈ ఘటన జరగడం పలువురిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. చదవండి: హీరో నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ కన్నుమూత గుండెపోటుతో ప్రముఖ సీనియర్ నటుడు మృతి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మరమ్మతు చేస్తుండగా కరెంట్ సరఫరా
చింతపల్లి : విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో జరిగిన ఈ సంఘటన వివరాలివి. మండల కేంద్రానికి చెందిన యాచారపు కృష్ణ (26) లైన్మన్ దగ్గర పనిచేస్తూ ఇంటింటికీ వెళ్లి కరెంటు బిల్లులు ఇచ్చేవాడు. అయితే శనివారం మండల కేంద్రంలోని విద్యుత్ అంతరాయం ఏర్పడటంతో లైన్మన్ కింద ఉండి కృష్ణను విద్యుత్ స్తంభంపైకి ఎక్కించాడు. విద్యుత్ ఎల్సీలో ఉన్నప్పుడు కార్యాలయంలో ఉండే సిబ్బంది కృష్ణ స్తం భం మీద ఉండగానే సరఫరాను పునరుద్ధరించారు. దీంతో కృష్ణ విద్యుదాఘాతానికి గురై స్తంభంపైనే చనిపోయాడు. అధికారుల నిర్లక్ష్యంతోనే మృతిచెం దాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుతుండగా.. అధికారుల నిర్లక్ష్యమే!
మరిపెడ రూరల్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణం బలైంది. గ్రామమంతా షార్ట్సర్క్యూట్ వస్తుందని చెప్పినా వారు పట్టించుకోలేదు. వెరసి కుక్కర్లో అన్నం వండుతుండగా విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం స్జేజితండా పరిధిలోని బుడ్డతండా(మెగ్యాతండా)లో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. షార్ట్సర్క్యూట్ వల్ల కొద్ది రోజులుగా తండాలోని ఇళ్లలో గల గృహోపకరణాలకు విద్యుత్ సరఫరా అవుతోంది. సమస్యను పరిష్కరించాలని అధికారులకు పలుమార్లు గ్రామస్తులు మొరపెట్టుకున్నారు. అయినా వారు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే తండాకు చెందిన భూక్యా సునీత(25) ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో అన్నం వండుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. తన భార్య మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతురాలి భర్త భూక్యా సంతోష్ ఆరోపిస్తున్నారు. మృతురాలికి ఏడాదిన్నర పాప ఉంది. తల్లి కోసం రోదిస్తున్న చిన్నారిని చూసి పలువురు కన్నీటి పర్యాంతమైయ్యారు. (చదవండి: అయ్యో భగవంతుడా.. మేం ఏ పాపం చేశాం.. ముగ్గురు కొడుకులు రోడ్డు ప్రమాదాల్లోనే..) -
పోల్ పైనే ప్రాణం పోయింది
మల్కాజిగిరి: కాంట్రాక్టర్ పర్యవేక్షణ లోపం, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కరెంట్ షాక్తో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు మృతి చెందిన సంఘటన గురువారం మౌలాలి సబ్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒరిస్సాకు చెందిన సంతోష్, తేజేశ్వర్(22) అన్నదమ్ములు. మూసాపేట జనతానగర్లో ఉంటూ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులుగా పని చేస్తున్నారు. రెండు రోజులుగా మౌలాలి సబ్స్టేషన్ పరిధిలో సుధాకర్ అనే కాంట్రాక్టర్ నేతృత్వంలో విద్యుత్ పోల్స్ , వైర్లు బిగించే పనులు చేస్తున్నారు. గురువారం ఉదయం విద్యుత్ స్తంభం ఎక్కి వైర్లు బిగిస్తుండగా విద్యుత్ సరఫరా కావడంతో తేజేశ్వర్ స్తంభంపైనే మృతి చెందాడు. సంతోష్కు స్వల్ప గాయాలయ్యాయి. కాంట్రాక్టర్ సుధాకర్, డీఈ సుభాష్, ఏడీఈ శ్రీనివాసరెడ్డి, ఏఈ నాగశేఖర్రెడ్డి, లైన్మెన్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యం కారణంగానే తన తమ్ముడు మృతి చెందాడని ఆరోపిస్తూ సంతోష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్ధానిక కార్పొరేటర్ ప్రేమ్కుమార్ సంఘటనా స్ధలాన్ని పరిశీలించారు. తేజేశ్వర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. -
సెల్ఫీ కోసం రైలు బోగీ పైకి.. హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగలడంతో
పిడుగురాళ్ల: ఆగి ఉన్న గూడ్స్ రైలు పైకెక్కి సెల్ఫీ తీసుకుంటుండగా విద్యుదాఘాతానికి గురై యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ శివారులో బుధవారం ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన కటికం వీరబ్రహ్మం రైల్వే స్టేషన్ సమీపంలో నివసిస్తున్నాడు. తన బైక్పై రైల్వేస్టేషన్ వద్దకు వచ్చాడు. అప్పటికే గూడ్స్ రైలు ఆగి ఉండటంతో వెనుక బోగీపైకి ఎక్కాడు. బోగీపై నిలబడి సెల్ఫీ దిగేందుకు చేతిని పైకిలేపడంతో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి కింద పడ్డాడు. కిందపడటంతో తలకు గాయం కావడంతో పాటు, శరీరం కూడా తగలబడుతోంది. అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య దీనిని గమనించి వెంటనే రైల్వేస్టేషన్ మాస్టర్ కృపాకర్కు సమాచారం ఇచ్చాడు. రైల్వే ఎస్ఐ పోలయ్య, ఏఎస్ఐ కె.క్రీస్తుదాసు, కానిస్టేబుల్ సురేష్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. బాధితుడిని 108లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంటు షాక్తో తండ్రి, కూతురు మృతి
పటాన్చెరు టౌన్: బాలుడు లోపలి నుంచి గడియ పెట్టుకోవడంతో ఇనుప చువ్వతో తీసే ప్రయత్నం చేసిన ఘటనలో విద్యుదాఘాతానికి గురై తండ్రి, కూతురు మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన బసుదేవ్ మాలిక్ (36) ఇస్నాపూర్ ప్రముఖ్నగర్లోని ఓ భవనంలో రెండో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. పాశంమైలారంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు బిద్యార్థి మాలిక్(6), కున్ను మాలిక్ (2) ఉన్నారు. సోమవారం ఇంటిపక్కనే ఉండే ఓ బాలుడు వారి ఇంట్లో పొరపాటున లోపలినుంచి గడియ పెట్టుకున్నాడు. దీంతో బసుదేవ్ మాలిక్, అతడి భార్య రేను మాలిక్ ఇద్దరు కలసి ఇనుప చువ్వతో గడియ తీసే ప్రయత్నం చేస్తుండగా ఇనుపచువ్వ వెనుకభాగం ఇంటి బాల్కనీకి ఆనుకుని ఉన్న కరెంట్ స్తంభం నుంచి వెళ్తున్న 11 కేబీ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్కు గురై బసుదేవ్ మాలిక్, అతని వద్ద నిల్చున్న కూతురు కున్ను తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందారు. భార్య రేనుమాలిక్కు తీవ్రంగా గాయాలవడంతో చికిత్స నిమిత్తం చందానగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. -
బిగ్బాస్-5 విజేత వీజే సన్నీకి కరెంట్ షాక్
బిగ్బాస్ సీజన్-5 ముగిసింది. ఈ సీజన్ విన్నర్గా సన్నీ నిలిచాడు. తనదైన ఆట తీరుతో మెప్పింపిన సన్నీ, బెస్ట్ ఎంటర్టైనర్గానూ ఎంతోమంది మనసుల్ని గెలుచుకున్నాడు. ఇక బిగ్బాస్ టైటిట్ గెలిచిన అనంతరం వరుస ఇంటర్వ్యూలతో యమ బిజీగా గడిపేస్తున్నాడు సన్నీ. అయితే తాజాగా జరిగిన ఓ ప్రెస్మీట్లో అనుకోని పరిణామం ఎదురైంది. హైదరాబాద్లో జరిగిన ఈ ప్రెస్మీట్లో పలు మీడియా చానెల్స్తో పాటు యూట్యూబ్ ఛానెల్స్ కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సన్నీ సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో మొబైల్లోని ఓ క్లిప్పింగ్ను సన్నీకి చూపిస్తుండగా అకస్మాత్తుగా చిన్నపాటి కరెంట్ షాక్ తగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఘటనలో ఎవరికి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
Current Shock: ఎంతపని చేశావ్.. ఉడతా..
ప్యాపిలి(కర్నూలు జిల్లా): కరెంట్ స్తంభంపై ఒక ఉడుత తీగలను తాకడంతో అవి తెగి కింద పడి విద్యుదాఘాతంతో రెండు ఎద్దులు మృతి చెందగా ఒక బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు..రాయలచెరువు గ్రామానికి చెందిన చౌడప్ప, లలితల కుమారుడు జగదీశ్ (10) ఎడ్ల బండిపై పొలానికి బయలుదేరాడు. పొలానికి వెళ్లే దారిలో 11 కేవీ విద్యుత్ తీగ తెగి పడి ఉండటాన్ని గమనించకుండా బండిని వెళ్లనిచ్చాడు. చదవండి: పిల్లలు పుట్టడం లేదని బొడ్డుపేగు తిన్న వివాహిత.. ఆ తర్వాత.. విద్యుత్ తీగ ఎద్దులకు తగలగానే అవి షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. బండిపై ఉన్న జగదీశ్ సైతం షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. బండి వెనుక వస్తున్న బాలుడి పెద్దనాన్న మద్దయ్య గమనించి బాలుడిని కాపాడాడు. తీవ్రంగా గాయపడిన జగదీశ్ను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కరెంట్ స్తంభంపై ఒక ఉడుత తీగలను తాకడంతో ప్రమాదవశాత్తు తెగి కింద పడినట్లు ట్రాన్స్కో ఏఈ వినయ్ కుమార్ తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి నివేదికను ఉన్నతాధికారులకు పంపినట్లు ఆయన తెలిపారు. -
భార్యపై అనుమానం: నేనేం చేశాను నాన్నా!
కళ్లల్లో పెట్టుకుని చూసుకోవలసిన బంగారు తల్లిని.. గుండెల్లో పదిలంగా దాచుకోవలసిన చిట్టి తల్లిని.. ముద్దులు మూటగడుతున్న పసికందుని ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియక అమాయకంగా చిరునవ్వులు పూయిస్తున్న సిరిమల్లిని..చిదిమేశాడు.. కరెంటు పెట్టి కర్కశంగా కన్నతండ్రే చంపేశాడు. భార్యపై అనుమానంతో బిడ్డ పాలిట కాలయముడయ్యాడు. అనంతరం పురుగు మందు తాగి ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో శుక్రవారం జరిగిన ఈ ఘటనపై గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలివి. కరెంటు షాక్తో చిన్నారి రెండు కాళ్లు కాలిపోయిన దృశ్యం దుబ్బాక టౌన్/తొగుట: వెంకట్రావుపేటకు చెందిన మిరుదొడ్డి రాజశేఖర్ (32)కు రెండేళ్ల క్రితం దౌల్తాబాద్కు చెందిన సునీతతో వివాహమైంది. తొమ్మిది నెలల క్రితం పాప ప్రిన్సీ జన్మించింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆరు నెలల క్రితం పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి సర్ది చెప్పినా రాజశేఖర్ ప్రవర్తనలో మార్పు రాలేదు. భర్త ప్రవర్తనతో విసిగిన సునీత పుట్టింటికి వెళ్లి పోయింది. దీంతో నెల రోజుల క్రితం భార్యకు సర్దిచెప్పి మళ్లీ వెంకట్రావుపేటకు తీసుకొచ్చాడు. కిరాతక తండ్రి చేతిలో బలైన చిన్నారి ప్రిన్సీ రెండు కాళ్లకు విద్యుత్ తీగ చుట్టి.. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం పాపను బయటికి తీసుకెళ్తున్నానంటూ ఇంట్లో చెప్పి వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ పాప రెండు కాళ్లకు విద్యుత్ తీగ చుట్టి షాక్ ఇచ్చి చంపేశాడు. అనంతరం మిరపతోటకు వినియోగించే పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన సమీపంలోని రైతులు తొగుట పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్ఐ రాంరెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పాప మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న రాజశేఖర్ను గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాథమిక చికిత్స చేసి.. పరిస్థితి విషమించడంతో ములుగు ఆర్వీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నితల్లీ.. నువ్వు లేకుండా నేనెట్టా బతికేది ‘అయ్యో నా చిన్ని తల్లి.. నువ్వు లేకుండా నేనెట్లా బతికేది’.. అంటూ కూతురి మృతదేహాన్ని పట్టుకొని కన్నతల్లి గుండెలవిసేలా రోదించడం స్థానికులను కలచివేసింది. ‘ఆడించడానికి బయటికి తీసుకపోతున్నాడనుకున్నా.. గింత దారుణానికి పాల్పడతాడని కలలో కూడా ఊహించలేదు.. నా బిడ్డ లేకుండా నేను ఎట్లా బతకాలి?’అంటూ ఆ తల్లి గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యింది. -
విషాదం: బట్టల దండెమే మృత్యుపాశమై..
సాక్షి, తల్లాడ: వానజల్లు పడుతోందని బయట ఉన్న బట్టలను తీసుకొచ్చి ఇంట్లో దండెంపై వేస్తుండగా.. ఇనుప తీగకు కరెంట్ ప్రసారమై..తల్లి, ఆమెను రక్షించే ప్రయత్నంలో కుమారుడు మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన బిల్లుపాడులో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..డీబీ కాలనీకీ చెందిన షేక్ నసీమూన్(44) వ్యవసాయ కూలీ. శుక్రవారం పనికి వెళ్లి ఇంటికొచ్చాక వాన జల్లు పడుతోందని బయట ఉన్న బట్టలను తీసి ఇంట్లోని జీ వైరు తీగపై వేస్తుండగా ఘటన చోటు చేసుకుంది. సర్వీసు వైరు పక్కనే ఉండడంతో దీని నుంచి దండేనికి కరెంట్ ప్రసారమై షాక్కు గురైంది. చదవండి: తొమ్మిదేళ్ల క్రితం పెళ్లి.. ఏడాదిగా మరో పరిచయం.. ప్రియుడితో కలిసి ఈక్రమంలో కిందపడినప్పుడు మట్టికుండకు తగిలి అది పగిలి నీళ్లు నేలపై పరుచుకున్నాయి. తల్లి కేక విని పెద్ద కుమారుడు, సుతారి పనిచేసే షేక్ సైదా(24) వచ్చి ఆమెను రక్షించేందుకు పట్టుకోగా..అతడికీ కరెంట్ షాక్ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. 15 సంవత్సరాల క్రితమే నసీమూన్ భర్త యాకుబ్, ఇప్పుడు పెద్ద కొడుకు దుర్మరణం చెందారు. ఇంటర్మీడియట్ చదువుతున్న చిన్న కుమారుడు, మరో కూతురు కన్నీరుమున్నీరుగా విలపించారు. నిరుపేద కుటుంబంలో తీవ్ర దుర్ఘటనతో బిల్లుపాడులో విషాదం అలుముకుంది. సంఘటనా స్థలాన్ని వైరా సీఐ జే.వసంత్కుమార్, తల్లాడ ఎస్ఐ జి.నరేష్ పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక.. -
‘పాడె’ కట్టె అతనికి మృత్యువుగా మారింది
సాక్షి,వర్గల్(సిద్దిపేట): ‘పాడె’ కట్టె కాలనాగైంది. అంత్యక్రియల కలప కోసం వచ్చిన వ్యక్తిని విద్యుత్షాక్ రూపంలో కాటేసింది. పాడె కట్టేందుకు అవసరమైన వెదురు చెట్టును కొడుతుండగా అది విద్యుత్లైన్కు తాకడంతో ఈ దుర్ఘటన సంభవించింది. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల కథనం ప్రకారం.... మజీద్పల్లికి చెందిన ఎంపీటీసీ మాజీ సభ్యుడు లింగ లక్ష్మినర్సయ్య అనారోగ్యంతో మృతిచెందాడు. బుధవారం అతడి అంత్యక్రియల కోసం పాడె కట్టేందుకు అవసరమైన వెదురు కట్టెలు తెచ్చేందుకు గ్రామశివారులోని విద్యుత్ సబ్స్టేషన్ ప్రాంతానికి గాలం స్వామి(38), పాలేటి ధర్మరాజు, చిగురుఎత్తు రాజు వెళ్లారు. అక్కడ వెదురు చెట్టును స్వామి గొడ్డలితో కొడుతుండగా అది పక్కనే ఉన్న విద్యుత్ లైన్ వైర్లను తాకింది. దీంతో అతను తీవ్ర విద్యుత్ షాక్కు గురై అపస్మారక స్థితిలో పడిపోయాడు. పక్కనే ఉన్న మిగతా ఇద్దరు అప్రమత్తమై దూరంగా జరిగి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారు వెంటనే తెలిసిన వారికి సమాచారం చేరవేసి స్వామిని గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పేద కుటుంబంలో పెను విషాదం గాలం స్వామి మృత్యువాత పడిన సమాచారంతో కుటుంబసభ్యులు బోరుమని విలపించారు. మృతుడికి భార్య లక్ష్మి, 18 సంవత్సరాలలోపు ఏసుమణి, సంధ్య, కార్తీక్ పిల్లలు ఉన్నారు. తండ్రి సత్తయ్య కూడా వీరి వద్దనే ఉంటున్నాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని ఆ కుటుంబం స్వామి సంపాదనపైనే ఆధారపడి జీవిస్తోంది. పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం పెనువిషాదంలో మునిగిపోయింది. ఆస్పత్రి వద్ద వారి రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పెళ్లి కావడం లేదని బాధ.. ఉదయం తలుపు బద్దలు కొట్టి చూస్తే.. -
నాగోల్: నిర్లక్ష్యానికి యువకుడు బలి.. ఈ పాపం ఎవరిది?
సాక్షి, ఉప్పల్: అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఈ పాపం తమది కాదంటే.. తమది కాదంటూ రెండు శాఖల అధికారులు ఎవరికి వారు నెట్టేసుకుంటున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, జవాబుదారి తనం కొరవడటంతో నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద దిగిన ప్రయాణికుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాడు. ఎస్ఐ అంజయ్య తెలిపిన ప్రకారం.. నాగోల్ మోహన్నగర్ ప్రాంతానికి చెందిన దస్తీ నవనీత్(35) కూకట్పల్లిలోని మెడ్ప్లస్లో స్టోర్ సూపర్వైజర్. నిత్యం నాగోల్ మెట్రోస్టేషన్ పార్కింగ్లో తన వాహనాన్ని పార్కు చేసి కూకట్పల్లికి వెళ్తాడు. తిరుగు ప్రయాణంలో నాగోల్ మెట్రో స్టేషన్లో దిగి పార్కు చేసిన వాహనాన్ని తీసుకెళ్తుంటాడు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి చివరి ట్రైన్లో నాగోల్ స్టేషన్లో దిగాడు. పార్కు చేసిన వాహనాన్ని తీసుకునేందుకు ఫుట్పాత్ వద్ద ఉన్న గ్రిల్ పైనుంచి దాటేందుకు ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ వీధి లైట్ల స్తంభానికి గ్రిల్కు విద్యుత్ ప్రసారం ఉండటంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే భూమిలో నుంచి వేసిన విద్యుత్ వైర్లు తేలడం. వర్షం కురవడంతో విద్యుత్ ప్రసారం అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సోదరుడు కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఆడి కారు యాక్సిడెంట్: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది? చెప్పిన కూర వండలేదనే కోపంతో భార్యని.. -
కరెంట్ షాక్తో భర్తను ఆడుకున్న భార్య.. తీరా స్టోరీ తిప్పేసి కట్టుకథ
జైపూర్: భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు. రోజూ ఏదో ఒక విషయంపై వివాదం. దీంతో ఆ భార్యాభర్తలు ఇంట్లో ఉన్నంతసేపు గొడవ పడుతుండేవాడు. భర్త తీరుపై విసుగు చెందిన ఆమె ఎలాగైనా భర్తకు బుద్ధి చెప్పాలని భావించింది. ఈ క్రమంలోనే భోజనంలో మత్తు మందు ఇచ్చింది. ఆ తర్వాత ఆమె శాడిజాన్ని చూపించింది. మత్తులో ఉన్న భర్త కాళ్లు కట్టేసి వరుసగా కరెంట్ షాక్ పెడుతూ వేధించింది. మత్తులో ఉన్న భర్త మెలకువ రాగానే మళ్లీ షాకిచ్చి అపస్మారక స్థితికి వెళ్లేలా చేసింది. ఇదంతా అయిపోయాక భర్త కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కరెంట్ షాక్తో పడిపోయాడని చెప్పి ఆస్పత్రిలో చేర్పించిన ఘటన రాజస్థాన్లో జరిగింది. సర్దార్షహర్ ఎస్ఐ మణక్ లాల్ తెలిపిన వివరాల ప్రకారం.. బికనీర్కు చెందిన మహేంద్ర ధన్ తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. తాగొచ్చి తనను వేధిస్తున్నాడనే నెపంతో ఈనెల 17వ తేదీన మంగళవారం ఓ ప్లాన్ వేసింది. విధులు ముగించుకుని ఇంటికొచ్చిన భర్తకు ఆమె భోజనం వడ్డించింది. తిన్న తర్వాత భర్త అపస్మారక స్థితికి వెళ్లాడు. భోజనంలో మత్తుమందు కలపడంతో అపస్మారక స్థితిలోకి చేరిన భర్తను ఒకచోటకు జరిపింది. కొద్దిసేపటికి తేరుకున్న భర్త లేచేందుకు ప్రయత్నించగా భార్య చేతులకు గ్లౌస్లు కట్టుకుని నిల్చుని ఉండగా అతడి కాళ్లకు విద్యుత్ తీగలు కట్టేసింది. అనంతరం భర్తకు కరెంట్ షాక్ ఇచ్చింది. వేధింపులకు గురి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుసార్లు కరెంట్ షాక్ ఇవ్వడంతో భర్త మరోసారి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈసారి భర్త తేరుకుని చూడగా ఆస్పత్రి బెడ్పై ఉంది. అయితే భర్త కుటుంబసభ్యులకు విద్యుత్ షాక్ తగిలి గాయాలపాలయ్యాడని చెప్పి వారితో కలిసి భార్య అతడిని ఆస్పత్రిలో చేర్చింది. మేలుకున్న తర్వాత భర్త జరిగిన ఘోరాన్ని తన కుటుంబసభ్యులకు వివరించాడు. అర్ధరాత్రి 2గంటలకు లేచి కరెంట్ షాక్తో చిత్రహింసలకు గురి చేసిందని వాపోయాడు. భార్య చేసిన పనికి కాళ్లు కోల్పోయాడు. ఫిర్యాదు చేయడంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సర్దార్ షహర్ పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: బ్రేకింగ్.. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి గాయం -
చింతలాముని రథోత్సవంలో కరెంట్ షాక్తో ఇద్దరు మృతి
సాక్షి, కర్నూలు: చింతలాముని రథోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఆదోని మండలం పెసులబండలోని చింతలాముని రథోత్సవంలో కరెంట్ షాక్ సంభవించడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనలో మరో 8మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. -
విషాదం:కరెంట్ షాక్ తో ఇద్దరు యువకులు మృతి..
ఆ తొమ్మిది నెలల పాపకు నాన్న మరి లేడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులను ఆదుకోవడానికి ఆ కుమారుడు ఇక రాడు. పక్షుల వేట కోసం అడవికి వెళ్లిన యువకుల బతుకులు అక్క డే తెల్లారిపోయాయి. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన తీగలే వారి పాలిట మృత్యు పాశాలయ్యాయి. కొత్తూరు మండలంలో జరిగిన ఈ ఘటన గిరిజన గూడల్లో విషాదం నింపింది. ఎల్.ఎన్.పేట/కొత్తూరు: కొత్తూరు మండలం రాయ ల పంచాయతీ కొత్తపొనుటూరు సమీపంలో గురువారం రాత్రి సవర ఆకాష్(17), బుయా బిలియా (22) అనే ఇద్దరు యువకులు విద్యుత్ తీగలు తగిలి మృతి చెందారు. శుక్రవారం ఉదయం వీరి మృతదేహాలు కుటుంబ సభ్యులకు దొరికాయి. ఇందుకు సంబంధించి కొత్తూరు పోలీసులు, మృతుల కుటుంబ సభ్యులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి.. కొత్తూరు మండలం కొత్తగూడకు చెందిన సవర ఆకాష్(17), తన బంధువు ఒడిశాలోని గరబ గ్రా మానికి చెందిన బుయా బిలియా అలియాస్ విలియం(22), నాయుడుగూడకు చెందిన సవర సుశాంత్లతో కలిసి గురువారం సాయంత్రం దాటాక తల కు టార్చిలైట్లు కట్టుకుని సమీపంలోని కొండల్లోకి పక్షుల వేట కోసం వెళ్లారు. చీకటి పడ్డాక గూటికి చేరే పిట్టలను వేటాడడం ఇక్కడి వారికి పరిపాటి. అయి తే వేట సరిగా సాగకపోవడంతో అంతా ఇంటిదారి పట్టారు. సుశాంత్ మరో దారిలో వారి గ్రామానికి చేరుకున్నారు. ఆకాష్, బిలియా మాత్రం ఇంటికి రాలేదు. రాత్రి ఎంత సమయమవుతున్నా వారు ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు సుశాంత్ను అడిగారు. తను మరో దారి గుండా వచ్చేశానని చె ప్పడంతో బంధువులంతా తప్పిపోయిన ఇద్దరి కో సం అడవిలో వెతకడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం ఆకాష్ తండ్రి ఎలియోకు కొత్తపొనుటూరు కొండల సమీపంలోని పంట పొలాల్లో ఈ ఇద్దరు యువకుల మృతదేహాలను చూశారు. వారిపైనుంచి జింక్ వైర్లు ఉండటంతో అవి కాలికి తగిలి విద్యుత్ షాక్ కొట్టి యువకులు చనిపోయి ఉంటారని భావించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు మృత దేహాలను పరిశీలించారు. ఈ జింక్ వైర్లు కేవలం అడవి పందులను చంపడానికి పెడతారు. దీంతో వాటిని అక్కడ పెట్టారని భావిస్తున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిన్నంటిన రోదనలు.. మృతుల్లో ఒకరైన బిలియా ఒడిశా వాసి. ఆయనకు భార్య, తొమ్మిది నెలల పసిపాప ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త చనిపోయాడనే విషయం ఆమెకు ఎలా చెప్పాలో తెలీక స్థానికులు కంటనీరు పెట్టారు. అలాగే ఆకాష్ ఇంటర్ వరకు చదువుకున్నాడు. పై చదువులు చదువుకుని ఉద్యోగం చేసి తమను ఆదుకుంటాడని అనుకుంటే ఇలా అన్యాయం చేసి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. ఆకాష్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాలను కొత్తూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని పాలకొండ డీఎస్పీ శ్రావణి, కొత్తూరు సీఐ చంద్రమౌళి పరిశీలించారు. -
సినిమా షూటింగ్లో కరెంట్ షాక్తో ఫైటర్ మృతి.. స్పందించిన సీఎం
యశవంతపుర: ‘లవ్ యూ రచ్చు’ చిత్రం షూటింగ్లో కరెంట్ షాక్తో సహాయ ఫైటర్ మృతి చెందాడు. తమిళనాడుకు చెందిన వివేక్ (28) రామనగర తాలూకా జోగనదొడ్డి వద్ద సోమవారం షూటింగ్ చేస్తుండగా కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు సహాయకులు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం బెంగళూరు తరలించారు. దర్శకుడు శంకర్రాజ్, నిర్మాత గురుదేశ్పాండె, ఫైట్ మాస్టర్ వినోద్లను బిడిది పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. మరో వైపు కన్నడ చిత్రపరిశ్రమలో జరుగుతున్న లోపాలు, భద్రత ప్రమాణాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చిత్రయూనిట్, దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని వివేక్ కుటుంబసభ్యులు, డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందిస్తూ.. షూటింగ్లకు సంబంధించిన కొన్ని నిబంధనలను ప్రభుత్వం త్వరలో జారీ చేస్తుందని చెప్పారు. -
ముగ్గురిని కాటేసిన కరెంట్: కన్నీటిలో ‘కన్నికాపురం’
కడుపులు మాడ్చుకున్నాం. కష్టాలకోర్చి చదివించాం. మీకు ఏ లోటూ రాకుండా చూసుకున్నాం. చదువుల్లో రాణిస్తుంటే ఎంతో పొంగిపోయాం. త్వరలోనే ఉద్యోగాలు తెచ్చుకుని ఆసరాగా నిలుస్తారని ఆశపడ్డాం. ఇక మాకు కష్టాలు ఉండవని కలలుగన్నాం. కానీ ఆ దేవుడు మా ఆశలను చిదిమేశాడు. చేతికొచ్చిన కొడుకులను తీసుకెళ్లిపోయాడు. ఇక మాకు దిక్కెవరు కొడుకా..? అంటూ ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన చూపరులను కంటతడి పెట్టించింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కాలేదు. పాలసముద్రం: మండలంలోని కన్నికాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విద్యుదాఘాతంతో సోమవారం ముగ్గురు మృతిచెందడంతో స్థానికులు శోకసంద్రంలో మునిగిపోయారు. గ్రామానికి చెందిన చిన్నబ్బమందడి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించాడు. కంకర అవసరం కావడంతో వేల్కూరు నుంచి టిప్పర్లో తెప్పించి అన్లోడ్ చేయిస్తున్నాడు. అంతలోనే పైనే ఉన్న కరెంటు వైర్లు టిప్పర్కు తగలడంతో విద్యుదాఘాతానికి గురై డ్రైవర్ మనోజ్ (34) అక్కడికక్కడే మృతిచెందాడు. అతడిని కాపాడే ప్రయత్నంలో గ్రామస్తులు దొరబాబు (23), జ్యోతీశ్వర్ (19) ప్రాణాలు కోల్పోయారు. క్షణాల్లో ముగ్గురూ మృత్యువాత పడడంతో గ్రామంలో తీరని విషాదం అలుముకుంది. ఆశలన్నీ వారిపైనే గ్రామానికి చెందిన సీదల బాలాజీనాయుడు, ఉష దంపతులకు దొరబాబు, సోమేశ్, చంద్రిమ పిల్లలు. దొరబాబు పెద్దవాడు. సోమేష్, చంద్రిమ కవలలు. ఇంటర్ చదువుతున్నారు. పెద్దకుమారుడి భవిష్యత్తు కోసం తపించారు. ఉన్నకొద్దిపాటి పొలంలో పంటలదిగుబడి అంతంతమాత్రంగా రావడంతో అప్పులపాలయ్యా రు. కానీ పిల్లల చదువుకు వెనకడుగు వేయలేదు. పస్తులుంటూ కూడబెట్టి పెద్ద కుమారుడు దొరబాబును తమిళనాడు రాష్ట్రం, తంజావూరులోని ఓ బీటెక్ కళాశాలలో చదివించారు. గతేడాది ఫస్ట్క్లాస్లో పాసవడంతో ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఉద్యోగం వస్తుందని ఆశ పడ్డారు. కష్టాలు తీరుతాయని సంబరబడ్డారు. ఇంతలోనే విధి వారి ఆశలను చిదిమేసింది. అప్పటివరకు కళ్లెదుట కలియదిరుగుతూ మాటలు చెప్పిన కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారడంతో తల్లడిల్లిపోయారు. ఇక అదే గ్రామానికి చెందిన వెంకటేష్ నాయుడు, రోహిణి దంపతులకు ఇద్దరు కుమారులు. వారిలో పవన్కుమార్ పెద్దవాడు. చిన్నవాడైన జ్యోతీశ్వర్ చదువుల్లో మేటి. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ పూర్తిచేశాడు. గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి రోహిణి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆమె సక్రమంగా నడవలేని స్థితి. ఇద్దరు పిల్లలూ తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా ఉండేవారు. ఉపాధి పనులకెళ్లి కుటుంబానికి ఆసరాగా నిలిచేవారు. ఇంతలో అనుకోని ప్రమాదం ఓ కుమారుడిని కబళించడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. ఇదిలా ఉండగా గంగాధరనెల్లూరు మండలం వేల్కూరు పంచాయతీ, పెద్దకాలువ గ్రామానికి చెందిన మనోజ్ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం రాకపోవడంతో డ్రైవర్ వృత్తిని ఎంచుకున్నాడు. మృతులు ముగ్గురూ అవివాహితులు. లాక్డౌన్ లేకుంటే..! కరోనా లాక్డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. పిల్లలు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో దొరబాబు, జ్యోతీశ్వర్ కూడా ఇంటివద్దే ఉండాల్సి వచ్చింది. లాక్డౌన్ లేకుంటే పిల్లలు చదువుల కోసం వెళ్లేవారని, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. -
విషాదం: మనవరాలిని ఎత్తుకుని మిద్దెపై బట్టలు ఆరవేస్తుండగా..
క్రిష్ణగిరి(కర్ణాటక): క్రిష్ణగిరి సమీపంలో జరిగిన కరెంటు షాక్తో తల్లీ కూతురు, మనవరాలు ఘటనా స్థలంలోనే మృతి చెందిన ఘటన సింగారపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. అంబేడ్కర్ నగర్కు చెందిన పిచ్చుమణి భార్య ఇంద్ర (52), ఆమె కూతురు మహాలక్ష్మి (25). ఈమెకు మిట్టపల్లికి చెందిన శివతో గత నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగి మూడేళ్ల కూతురుంది. ఇటీవల పుట్టింటికి చేరుకుంది. ఆదివారం సాయంత్రం ఇంద్ర మనవరాలిని ఎత్తుకుని మిద్దెపై బట్టలు ఆరవేస్తుండగా ఆకస్మాత్తుగా వైర్లు తగిలి కరెంటు షాక్ కొట్టింది. ఆమె కేకలు వేయడంతో కూతురు మిద్దెపైకెళ్లి రక్షించే యత్నంలో ముగ్గురికీ షాక్ తగిలి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సింగారపేట పోలీసులు మృతదేహాలను స్వాధీనపరుచుకొని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సింగారపేట ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
అన్లోడ్ చేస్తుండగా టిప్పర్కి విద్యుదాఘాతం..ముగ్గురు మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కన్యకాపురంలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం కంకర టిప్పర్ లోడ్ ను అన్లోడ్ చేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ మనోజ్ కుమార్ ముందుగా విద్యుత్ షాక్కు గురయ్యాడు. అతని రక్షించడానికి వెళ్లిన దొరబాబు, జ్యోతిష్కులు కూడా అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
వైద్యుల నిర్వాకం.. చికిత్సకోసం వెళితే.. కరెంట్షాకులు..
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ డాక్టర్స్ స్ట్రీట్లోని ప్రశాంతి హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందగా, వైద్యుడి నిర్లక్ష్యంతో మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు ఆందోళనకు దిగిన సంఘటన బుధవారం జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన కిషన్ (38) మానసిక సమస్యతో ప్రశాంతి హాస్పిటల్లో చికిత్సకోసం పది రోజుల క్రితం చేరాడు. చికిత్స పొందుతున్న కిషన్ మంగళవారం రాత్రి 8 గంటలకు మృతి చెందాడు. అయితే పేషెంట్ పరిస్థితిని అంచనా వేయకుండా వైద్యులు అడ్డగోలుగా కరెంట్ షాక్లు, ఓవర్డోస్ మందులు ఇవ్వడం మూలంగానే చనిపోయాడని ఆరోపిస్తూ బుధవారం ఉదయం మృతుడి బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. టూటౌన్ పోలీసులు ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు చేపట్టారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యం మృతుడి బంధువులతో చర్చించి సయోధ్య కుదుర్చుకున్నట్లు తెలిసింది. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ విషయమై సైకియాట్రిస్టు డాక్టర్ పి.కిషన్ను వివరణ కోరగా, సదరు పేషెంట్కు ట్రీట్మెంట్ పూర్తిచేసి డిశ్చార్జ్ చేసే సమయంలో గుండెపోటు రావడంతో మృతిచెందాడని తెలిపారు. వైద్యంలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని స్పష్టం చేశారు. కాగా ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని టూటౌన్ పోలీసులు తెలిపారు.