
బోయిని ఆంజనేయులు మృతదేహం, రోదిస్తున్న మృతుడి భార్య
సాక్షి, రాజాపేట (ఆలేరు): కరెంట్ కాటుకు మరో రైతు బలయ్యాడు. ఈ విషాదకర ఘటన రాజా పేట మండలం మల్లగూడెంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలి పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని సాయిలు, బాలమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు రామచంద్రం, ఆంజనేయులు, నాగేష్లు. వీరిది వ్యవసాయ కుటుంబం, వీరంతా ఎవరికి వారు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. కాగా ఆంజనేయులు (28)కు భార్య స్వప్న, కుమార్తె, కుమారుడు ఉన్నారు. వీరికి రెండు ఎకరాలపైన భూమి ఉండగా పత్తి, మొక్కజొన్న, వరి సేద్యం చేశాడు.
గురువారం రాఖీ పండుగ రోజు కావడం, ఉదయమే వరిపొలంలో ట్రాక్టర్ ద్వారా మడి దున్నిస్తున్నాడు. ట్రాక్టరుకు అడ్డుగా కిందికి వేలాడుతున్న విద్యుత్ సర్వీస్ వైరును కర్రసాయంతో పైకిలేపుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ఆంజనేయులు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చిన్నవయస్సులో ఆంజనేయులు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆలేరు ఆస్పత్రికి తరలించారు. భార్య స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నాగేశ్వర్రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment