వాగులో కొట్టుకుపోయిన రైతు | farmer died after fall in water flow | Sakshi

వాగులో కొట్టుకుపోయిన రైతు

Oct 8 2016 5:18 PM | Updated on Oct 1 2018 4:01 PM

ఎడ్లబండిపై వాగు దాటుతున్న వ్యక్తి ప్రవాహ ఉధృతికి బండితో సహా వాగులో కొట్టుకుపోయాడు.

నావాబుపేట(రంగారెడ్డి): ఎడ్లబండిపై వాగు దాటుతున్న వ్యక్తి ప్రవాహ ఉధృతికి బండితో సహా వాగులో కొట్టుకుపోయాడు. ఈ ఘటనలో రైతు సత్యనారాయణరెడ్డి(50)తో పాటు ఓ ఎద్దు కూడా మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నావాబుపేట మండలం ముబారక్‌పూర్‌లో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన సత్యనారాయణరెడ్డి ఎడ్ల బండి పై పొలానికి వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వాగులో పడి కొట్టుకుపోయాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని కాపాడటానికి యత్నించినా ఫలితం లేకపోయింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement