ట్రాక్టర్ తిరగబడి రైతు దుర్మరణం
Published Sat, Aug 27 2016 12:25 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM
పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు, ఎం.బండమీదపల్లి గ్రామానికి చెందిన జనకమహారాజు(40) అనే రైతు పొలంలో ట్రాక్టర్ నడుపుతుండగా ఇంజన్ తిరగపడి అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం ఉదయం ట్రాక్టర్తో పొలం దున్నుతుండగా ఒక్కసారిగా ఇంజన్ తిరగబడింది. ట్రాక్టర్ నడుపుతున్న జనకమహారాజు అదుపుతప్పి కిందపడ్డాడు. ఈ సంఘటనలో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రైతు మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Advertisement
Advertisement