విద్యుదాఘాతంతో రైతు మృతి | farmer dies due to current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Published Tue, Jan 3 2017 11:40 AM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పోరండ్లలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు.

అలుగనూర్‌ : కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలం పోరండ్లలో విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. కర్ర జలపతిరెడ్డి(50) అనే రైతు పంటకు నీళ్లు పట్టేందుకు మోటరు స్విచ్‌ ఆన్‌ చేస్తుండగా జే వైరు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే రైతు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతనికి భార్య, కొడుకు, కుమార్తె ఉన్నారు. ఆరెకరాల్లో పంట సాగు చేసుకుంటున్నాడని గ్రామస్తులు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement