కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ కుందుజ్ ప్రావిన్స్లో వైమానిక దళాలు నిర్వహించిన దాడుల్లో 10 మంది తాలిబన్ తీవ్రవాదులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. ప్రావిన్స్లోని ఖాన్ అబద్ జిల్లాలో శనివారం ఆర్థరాత్రి ఈ దాడులు వైమానిక దళం నిర్వహించిందని తెలిపారు.