ఇళ్ల మధ్యలో కూలిన విమానం; 23 మంది మృతి | 23 People Killed After Plane Crashes In DR Congo Goma In Africa | Sakshi
Sakshi News home page

ఇళ్ల మధ్యలో కూలిన విమానం; 23 మంది మృతి

Nov 24 2019 6:57 PM | Updated on Nov 24 2019 9:45 PM

23 People Killed After Plane Crashes In DR Congo Goma In Africa - Sakshi

గోమా : ఎయిర్‌పోర్ట్ నుంచి అప్పుడే టేకాఫ్‌ తీసుకున్న విమానం ఇళ్ల మధ్య కూలడంతో 23 మంది చనిపోయారు. ఈ విషాదకర ఘటన మధ్య ఆఫ్రికా దేశంలోని డెమోక్రాటిక్‌ రిపబ్లిక్‌ ఆప్‌ కాంగోకి చెందిన గోమా సిటీలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు .. గోమా ఎయిర్‌పోర్ట్‌ నుంచి జిబీ బి విమానయాన సంస్థకు చెందిన  డోర్నియర్‌-228 విమానం ఆదివారం ఉదయం 9 గంటలకు  బెనీకి బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కాసేపటికే గోమాలోని నివాస ప్రాంతాల వద్దకు రాగానే విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 17 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు తెలిసింది. కాగా, విమానంలో ఉన్నవారెవరూ ప్రాణాలతో బయటపడలేదని పోలీసులు పేర్కొన్నారు. విమానం హఠాత్తుగా కుప్పకూలడానికి సాంకేతిక లోపమే కారణం కావొచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 6 మృతదేహాలను బయటికి తీసినట్లు వెల్లడించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement