వాషింగ్టన్ : పిల్లలు.. ఏపాపం తెలియని చల్లని వారే అనేది మనకు తెలిసిన సత్యం. కానీ ప్రస్తుత తాజా గణంకాలు మాత్రం పిల్లలు పొగరాయుల్లే అని చెబుతున్నాయి. పెద్దలు పొగ త్రాగడం పరిపాటే అయినా. పిల్లలు పొగ త్రాగడానికి ఇష్టపడటం ఏమిటని అనుకుంటున్నారా. పెద్దలు ఇచ్చే అలసత్యమే పిల్లలు పొగ త్రాగే అలవాటుకు దారి తీస్తుందని తాజా విశ్లేషణలో తేలింది. భారతదేశంలో 30 శాతానికి పైగా పిల్లలు ప్రొగ త్రాగడానికి ఇష్ట పడతారని వెల్లడైంది.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా వెనుకబడిన దేశాలు, ఇప్పుడే ఆర్థికంగా ఎదుగుతున్న దేశాలలో ఈ జాడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్, చైనా దేశాలలో పిల్లలు ప్రక్కతోవ పట్టడం అనేది ఎక్కువగా ఉందని తేలింది. కొన్ని షాపుల్లో 5 నుంచి 6 ఏళ్ల పిల్లలకు కూడా పొగాకు విక్రయిస్తుండటం కూడా వారు దానివైపు మళ్లేందుకు దోహదం చేస్తుందని విశ్లేషణలో వెల్లడైంది. ఈ చర్యల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలంటే తల్లి దండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు , మీడియాకు దీనిపై అవగాహన కల్పించాలని అవసరం ఉంది.
Breadcrumb
పెద్దలే కాదు.. పిల్లలు పొగరాయుళ్లే!
Published Mon, Sep 30 2013 5:32 PM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Related news by tags
-
డుప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్.. సూపర్ కింగ్స్ ఖాతాలో మరో విజయం
మేజర్ లీగ్ క్రికెట్ 2024 ఎడిషన్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ మరో విజయం సాధించింది. సియాటిల్ ఓర్కాస్తో ఇవాళ (జులై 24) జరిగిన మ్యాచ్లో 37 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ప్లే ఆఫ్స్ బెర్త్లు ఇదివరకే ఖరారు కావడంతో ఈ మ్యాచ్ నామమాత్రంగా సాగింది. సూపర్ కింగ్స్ తొలుత బ్యాటింగ్ చేస్తూ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం ఓర్కాస్ను 140 పరుగులకే పరిమితం చేసింది.మెరుపు ఇన్నింగ్స్లతో సత్తా చాటిన డుప్లెసిస్, సావేజ్టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్ కింగ్స్.. డుప్లెసిస్ (17 బంతుల్లో 39; 6 ఫోర్లు, సిక్స్), సావేజ్ (27 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్లతో సత్తా చాటడంతో ఓ మోస్తరు స్కోర్ చేసింది. విధ్వంసకర బ్యాటర్లు డెవాన్ కాన్వే (0), స్టోయినిస్ (11) నిరాశపరిచారు. ఓర్కాస్ బౌలర్లలో అయాన్ దేశాయ్, కీమో పాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. గానన్, నండ్రే బర్గర్, బ్రేస్వెల్ తలో వికెట్ దక్కించుకున్నారు.రాణించిన బార్ట్మన్, నూర్ అహ్మద్178 పరుగుల లక్ష్య ఛేదనలో ఓర్కాస్ దారుణంగా విఫలమైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 140 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓట్నీల్ బార్ట్మన్ (4-0-20-3), నూర్ అహ్మద్ (4-0-19-2) అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్లో చెలరేగిన సావేజ్ బౌలింగ్లోనూ (3-0-23-2) సత్తా చాటాడు. మిచెల్ సాంట్నర్ ఓ వికెట్ దక్కింది. ఓర్కాస్ ఇన్నింగ్స్లో డికాక్ (26) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ గెలుపుతో సంబంధం లేకుండానే సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయ్యింది.ఈ మ్యాచ్తో లీగ్ మ్యాచ్లన్నీ పూర్తయ్యాయి. వాషింగ్టన్ ఫ్రీడం, శాన్ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, టెక్సాస్ సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ పోటీపడతాయి. -
ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా అజింక్య
ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) అధ్యక్షుడిగా అజింక్య నాయక్ (37) ఎన్నికయ్యాడు. నిన్న (జులై 23) జరిగిన అధ్యక్ష ఎన్నికలో బీజేపీ బలపరిచిన సంజయ్ నాయక్పై 107 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించాడు. మొత్తం ఓట్లలో అజింక్యకు 221.. సంజయ్కు 114 ఓట్లు పోలయ్యాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా అజింక్య రికార్డు సృష్టించాడు. గత నెలలో మాజీ అధ్యక్షుడు అమోల్ ఖలే మృతి చెందడంతో ఎంసీఏకు ఎన్నిక జరిగింది.అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడిన అజింక్య, సంజయ్ ప్రస్తుతం ముంబై క్రికెట్ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారు. అజింక్య కార్యదర్శిగా.. సంజయ్ ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. ఘన చరిత్ర కలిగిన ముంబై క్రికెట్ అసోసియేషన్కు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల చాలా సంతోషంగా ఉందని అజింక్య తెలిపాడు. కాగా, శరద్ పవార్, విలాస్రావ్ దేశ్ముఖ్, మనోహర్ జోషి లాంటి ఉద్దండపిండాలు ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించారు. -
IPL 2025: గుజరాత్ హెడ్ కోచ్గా యువరాజ్ సింగ్..?
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి చాలా సమయం ఉన్నప్పటికీ అన్ని ఫ్రాంచైజీలు ప్రక్షాళన బాట పట్టాయి. కొన్ని ఫ్రాంచైజీలేమో ఆటగాళ్లను వదిలించుకోవాలని భావిస్తుంటే.. మరికొన్ని కోచింగ్ స్టాఫ్, మెంటార్లను మార్చే పనిలో పడ్డాయి. తాజాగా గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ వచ్చింది. హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా గుజరాత్ నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. అతనితో పాటు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకి కూడా తప్పుకోనున్నట్లు సమాచారం. వీరిద్దరి పర్యవేక్షణలో గుజరాత్ తమ తొలి రెండు సీజన్లలో ఫైనల్స్కు చేరింది. 2022లో ఛాంపియన్గా, 2023లో రన్నరప్గా నిలిచింది. ఇంతటి విజయవంతమైన జోడీ ప్రస్తుతం గుజరాత్ను వీడాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత సీజన్లో (2024) వైఫల్యాల కారణంగా ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం వీరిపై గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మేనేజ్మెంట్ తప్పించాలని నిర్ణయం తీసుకునే లోపే తామే స్వచ్చందంగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని వీరు భావిస్తుండవచ్చు. గుజరాత్ ఫ్రాంచైజీకి సంబంధించి ఈ టాపిక్ నడుస్తుండగానే మరో వార్త సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. నెహ్రా గుజరాత్ హెడ్ కోచ్ పదవి నుంచి తప్పుకుంటే టీమిండియా దిగ్గజం యువరాజ్ సింగ్ ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరుగుతుంది. యువరాజ్తో గుజరాత్ యాజమాన్యం సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. యువీకి గతంలో ఏ జట్టుకు కోచింగ్ ఇచ్చిన అనుభవం లేదు. ఒకవేళ అతన్ని గుజరాత్ టైటాన్స్ పంచన చేర్చుకుంటే ఇదే అతనికి తొలి కోచింగ్ పదవి అవుతుంది. గుజరాత్ ఆఫర్పై యువీ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. కాగా, గుజరాత్ గత సీజన్లో ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్కు అప్పజెప్పిన విషయం తెలిసిందే. హార్దిక్ ఎగ్జిట్తో శుభ్మన్ గిల్ గుజరాత్ నూతన కెప్టెన్గా ఎంపికయ్యాడు. గిల్ నేతృత్వంలో గుజరాత్ గత సీజన్లో 14 మ్యాచ్ల్లో ఐదింట మాత్రమే విజయాలు సాధించి లీగ్ దశలోనే నిష్క్రమించింది. -
రాణించిన ఆడమ్ జంపా.. ఘనంగా బోణీ కొట్టిన డిఫెండింగ్ ఛాంప్స్
ద హండ్రెడ్ లీగ్ 2024 ఎడిషన్లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ఓవల్ ఇన్విన్సిబుల్స్ ఘనంగా బోణీ కొట్టింది. టోర్నీ ఓపెనింగ్ మ్యాచ్లో బర్మింగ్హమ్ ఫీనిక్స్పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫీనిక్స్.. 81 బంతుల్లో 89 పరుగులకే ఆలౌటైంది. ఆడమ్ జంపా (20-10-11-3) ఫీనిక్స్ పతనాన్ని శాశించగా.. మొహమ్మద్ ఆమిర్, సకీబ్ మహమూద్, విల్ జాక్స్ తలో రెండు వికెట్లు, నాథన్ సౌటర్ ఓ వికెట్ దక్కించుకున్నారు. ఫీనిక్స్ ఇన్నింగ్స్లో రిషి పటేల్ (25), బెన్నీ హోవెల్ (24), బెతెల్ (22) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇన్విన్సిబుల్స్ కేవలం 69 బంతుల్లోనే విజయతీరాలకు (2 వికెట్ల నష్టానికి) చేరింది. విల్ జాక్స్ 6, తువండ మెయేయే 23 పరుగులు చేసి ఔట్ కాగా.. డేవిడ్ మలాన్ (24), సామ్ బిల్లింగ్స్ (31) అజేయంగా నిలిచారు. ఫీనిక్స్ బౌలర్లలో టిమ్ సౌథీ రెండు వికెట్లు పడగొట్టాడు.కాగా, ఫీనిక్స్, ఇన్విన్సిబుల్స్ జట్లు నిన్ననే ప్రారంభమైన మహిళల హండ్రెడ్ లీగ్లోనూ పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లోనూ ఫీనిక్స్పై ఇన్విన్సిబుల్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇన్విన్సిబుల్స్ నిర్ణీత 100 బంతుల్లో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన ఫీనిక్స్ 92 బంతుల్లో 105 పరుగులు చేసి ఆలౌటైంది. తద్వారా ఇన్విన్సిబుల్స్ 45 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇన్విన్సిబుల్స్ ఇన్నింగ్స్లో పేజ్ స్కోల్ఫీల్డ్ (71), అలైస్ క్యాప్సీ (52) అర్ద సెంచరీలతో రాణించగా.. ఫీనిక్స్ ఇన్నింగ్స్లో ఒక్కరు మాత్రమే 20 పరుగుల మార్కును దాటగలిగారు. ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో అమండ 3, మ్యాడీ విల్లియర్స్ 2, మారిజన్ కాప్, సోఫీ స్మేల్, ర్యానా మెక్ డొనాల్డ్ గే తలో వికెట్ దక్కించుకున్నారు. -
Asia Cup 2024: టీమిండియా హ్యాట్రిక్ విజయం.. సెమీస్కు అర్హత
మహిళల ఆసియా కప్ 2024 ఎడిషన్లో టీమిండియా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న (జులై 23) పసికూన నేపాల్తో జరిగిన మ్యాచ్లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ ఫోర్కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (81), దయాలన్ హేమలత (47) రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగెజ్ (28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడంది. నేపాల్ బౌలర్లలో సీతా రనా మగర్ 2 వికెట్లు పడగొట్టగా.. కబిత జోషి ఓ వికెట్ దక్కించుకుంది.అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మ (4-0-13-3), రేణుకా సింగ్ (4-1-15-1), తనూజా కన్వర్ (4-1-12-0), అరుంధతి రెడ్డి (4-0-28-2), రాధా యాదవ్ (3-0-12-2) నేపాల్ను ముప్పుతిప్పలు నెట్టారు. నేపాల్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. 18 పరుగులు చేసిన సీతా టాప్ స్కోరర్గా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంతో ముగించింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్లో పాకిస్తాన్ యూఏఈపై ఘన విజయం సాధించి, గ్రూప్-ఏ నుంచి సెమీస్కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది. గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్లో ఏ జట్టు ఇప్పటివరకు అధికారికంగా సెమీస్కు క్వాలిఫై కాలేదు. రెండు మ్యాచ్ల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక గ్రూప్ టాపర్గా ఉండగా.. థాయ్లాండ్, బంగ్లాదేశ్, మలేసియా వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్లో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ సెమీస్లో పోటీపడనుంది. పాక్.. గ్రూప్-బి టాపర్ను సెమీస్లో ఢీకొట్టనుంది. భారత్ సెమీఫైనల్ మ్యాచ్ జులై 26న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ సెమీస్ మ్యాచ్ అదే రోజు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.
Related News by category
-
అగ్ని పర్వతంలా రగిలిపోతున్నా.. కన్న తండ్రిగా బాధ ఉండదా?: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ బీఆర్ఎస్ఎల్పీ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. శాసనమండలిలో భారాస పక్ష నేతగా మధుసూదనాచారిని కేసీఆర్ ప్రకటించారు.ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తాను అగ్ని పర్వతంలా రగిలిపోతున్నానని అన్నారు. ఎన్నో విషయాలను దాచుకొని మౌనంగా ఉన్నానని తెలిపారు. రాజకీయ కక్షతోనే తన కూతురుని (ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత) జైల్లో పెట్టారని మండిపడ్డారు. సొంత బిడ్డ జైలులో ఉంటే కన్న తండ్రిగా బాధ ఉండదా? అని ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యేల వలసలపై ఆందోళన చెందవద్దని నేతలకు కేసీఆర్ సూచించారు. పార్టీలో క్లిష్ట పరిస్థితులు ఏమీ లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితిలో తెలంగాణను సాధించామని గుర్తు చేశారు. గతంలో ఆగురురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అధికారంలో రాలేదా అని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎమ్మెల్యేగా బాగా ఎదుగుతారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు సాధించలేకపోయింది. కాంగ్రెస్ నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా బదనాం చేసే పనిలో ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎందుకు అదుపుతప్పాయి?. ఎక్కడో ఉన్న వాళ్ళు ఎన్నికల్లో గెలిపిస్తే పదవులు వచ్చాక పార్టీ వీడుతున్నారు. పార్టీ వదిలి వెళ్ళిన వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.’ అని తెలిపారు. -
బడ్జెట్లో ‘తెలంగాణ’ అనే పదాన్ని నిషేధించారు: సీఎం రేవంత్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపించిందని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణపై కేంద్ర కక్షపూరితంగా వ్యవహరించినట్లు ప్రజలు భావిస్తున్నారని అన్నారు. 18 సార్లు ఢిల్లీ వెళ్లి నిధులు ఇవ్వాలని కేంద్రాన్నికోరినట్లు తెలిపారు. తానే స్వయంగా మూడుసార్లు ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినట్లు, వివక్ష లేకుండా నిధులు కేటాయించాలని మోదీని కోరినట్లు పేర్కొన్నారు. బడ్జెట్లో తెలంగాణ అనే పదం నిషేదించారని, తెలంగాణ అని పలకడానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇష్టపడటం లేదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు బడ్జెట్ చూస్తే తెలంగాణపై ఎంత కక్ష ఉందో అర్థం అవుతుందన్నారు. వివక్ష అనుకున్నాం కానీ కక్ష పూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే మోదీ తప్పుబట్టారని విమర్శించారు.ఇది బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్.. ‘ఏపీకి ఎందుకు ఇచ్చారు అని అడగం. కానీ తెలంగాణకు ఎందుకు ఇవ్వలేదు. మూసీ రివర్ ప్రాజెక్టు కోసం నిధులు అడిగాం.. ఒక్క రూపాయి ఇవ్వలేదు. మెట్రోకి నిధులు లేవు. ఐటీఐఈఆర్ కారిడార్ ప్రస్తవన లేదు. ఈ బడ్జెట్ కుర్చీ బచావో బడ్జెట్. ఏపీ, బిహార్లకు తాయిలాలు ఇచ్చి కుర్చీని కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇది మోదీకి గౌరవంవం తెచ్చిపెట్టదు. బీజేపీకి తెలంగాణ ప్రజలు 8 ఎంపీ సీట్లు ఇచ్చారు 35 శాతం ఓట్లు ఇచ్చారుకిషన్ రెడ్డిదే బాధ్యత.. రాజీనామా చేయాలి..తెలంగాణ కృతజ్ఞత చూపాల్సిన బీజేపీ వివక్ష ప్రదర్శించింది. తెలంగాణ ప్రజల నిర్ణయం వల్లే మోదీ పీఎం పదవిలో కూర్చున్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయానికి కిషన్రెడ్డిదే బాధ్యత. కిషన్ రెడ్డి తక్షణమే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాలి. బయ్యారం, కాజీపేట రైల్వేఫ్యాక్టరీ, ఐఐఎం ఊసేలేదు. తెలంగాణకు ఐఐఎం ఇవ్వట్లేమని నేరుగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నాకు లేఖ రాశారు. ఐఐఎం ఇవ్వనప్పుడు కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా కొనసాగడం ఎందుకు?క్విడ్ ప్రో కో అన్నట్లు ఉంది బడ్జెట్..మేము కేంద్రంతో సఖ్యతగా ఉండాలని అనుకున్నాం.. కానీ దాన్ని చేతగాని తనంగా తీసుకుంటున్నారు. మోదీని పెదద్దన్నగా మేం బావించాం.. కానీ మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. సవరించే బడ్జెట్లో మా విభజన హామీలు అమలు చేయాలి. పార్లమెంటు సమావేశంలో మా నిరసన తెలియజేస్తాం. కేవలం క్విడ్ ప్రో కో అన్నట్లు ఈ బడ్జెట్ ఉంది.కేంద్ర కక్షపూరిత వ్యవహారంపై రేపు అసెంబ్లీలో చర్చిస్తాం. అసెంబ్లీలో తీర్మానం చేసి ప్రధానికి పంపుతాం. బానిసలుగా కాకుండా తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. బండి కిషన్ రెడ్డి తెలంగాణ పౌరులుగా ఆలోచన చేయండి. ఐఐఎం ఇవ్వమని చెప్పారు.. ఎందుకు ఇవ్వరో చెప్పాలి కదా? ఎవరి దయాదక్షిణ్యాల మీద తెలంగాణ ఆధారపడి లేదు. విభజన చట్టం హామీలు ఏపీకేనా.. తెలంగాణకు వర్తించదా?. దక్షిణాది రాష్ట్రాల మీద బీజేపీ విక్ష చూపిస్తోంది. ఈ వివక్ష ఇలాగే కొనసాగితే అది మరో ఉద్యమానికి దారి తీస్తుంది’ అని పేర్కొన్నారు. -
‘సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట’
సాక్షి, తాడేపల్లి: బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు నిధుల కేటాయింపుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. అమరావతికి రూ.15, 000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారంటూ ఏపీ కూటమి ప్రభుత్వ నేతలను ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ సెటైర్లు వేశారు.అమరావతి కి 15000 కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు!సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట!@ncbn @JaiTDP— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2024 కాగా కేంద్ర బడ్జెట్లో ఏపీకి మరోసారి మొండిచేయి ఎదురైంది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన మిత్రపక్షంగా ఉన్న చంద్రబాబు.. ప్రత్యేక హోదా అంశంలో కేంద్రాన్ని ఒప్పించడంలో విఫలమయ్యారు. అలాగే భారీగా నిధులు రాబట్టలేకపోయారు. సరికదా.. రాష్ట్ర అభివృద్ధి కోసం కనీసం స్పష్టమైన హామీ ప్రకటనలు కూడా చేయించులేకపోయారు. సుమారు పదేళ్ల తర్వాత తెరపైకి ఏపీ విభజన అంశం వచ్చింది. అయితే ప్రత్యేక హోదా అనే పదాన్ని ప్రస్తావించకుండానే ప్రత్యేక సాయం ప్రకటన చేసింది కేంద్రం. ఈ క్రమంలో విభజన చట్టానికి కేంద్రం కట్టుబడి ఉందని చెబుతూ.. ఏపీ రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్ల సాయం అందిస్తామని, అవసరాన్ని బట్టి మరిన్ని నిధులు ఇస్తామని.. అది వివిధ ఏజెన్సీల ద్వారా అప్పుల రూపేణా అని ఒక విడ్డూరమైన ప్రకటన చేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. -
ఓటర్లపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు.. బాబు వెకిలి నవ్వులు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్రాజు.. పొంతన లేని వ్యాఖ్యలతో ఇటు సొంత పార్టీలోనూ, అటు ఇతర పార్టీల్లోనూ తరచూ నానుతూ ఉంటారు. ఎప్పుడు ఎవరిని పొగడుతారో? ఎప్పుడు ఎవరిని విమర్శిస్తారో? ఆయనకే తెలియదన్న పేరు గడించారు. వివాదాస్పద ప్రకటనలతో పార్టీలోనూ గందరగోళం సృష్టిస్తుంటారు. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రసంగిస్తూ ఏపీ ఓటర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఓటర్లను అవమానించారు. వైఎస్సార్సీపీకి ఓటేసిన వాళ్లు అన్నం తినేవాళ్లేనా? అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రజలను కించపరిచేలా ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు మాట్లాడుతున్నా..సభా నాయకుడిగా చంద్రబాబు స్పందించకపోగా వెకిలి నవ్వు నవ్వడంపై ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం: మంత్రి ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. బీజేపీ మిత్రక్షాులైన టీడీపీ, జేడీయూని ప్రసన్నం చేసుకునేందుకు రూపొందించినట్లు ఉందన్నారు. బిహార్కు రూ.41వేల కోట్లు ఆర్థిక సాయం.. ఏపీకి రూ.15వేల కోట్లు, పోలవరం ప్రాజెక్టు పూర్తికి నిధులు కేటాయించి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.‘2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇది 11వ బడ్జెట్, కానీ కొత్త రాష్ట్రాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేసింది. 2014 తర్వాత మొదటిసారిగా, బడ్జెట్లో 'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం' పేరుతో ప్రత్యేక అధ్యాయాన్ని పొందుపరిచారు, కానీ ఆర్థిక 58 పేజీలు, 14,692 పదాలున్న తన మొత్తం ప్రసంగంలో మంత్రి తెలంగాణ అనే పదాన్ని ప్రస్తావించలేదని అన్నారు.ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ ప్రస్తావనను పూర్తిగా దాటవేయడాన్ని ఖండింస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ప్రత్యేక నిధులు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకించనప్పటికీ, తెలంగాణ పట్ల చూపుతున్న వివక్షను తీవ్రంగా ఖండిస్తున్నాం, ముఖ్యమంత్రి ఎ రేవంత్రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రుల బృందం గత ఏడు నెలలుగా అన్ని మంత్రిత్వ శాఖలకు నిధులు ఇవ్వాలని కోరుతూ పలు దరఖాస్తులు సమర్పించాంపోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం పాలమూరు రంగా లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఎలాంటి హామీ ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అప్పటి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇచ్చిన హామీ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆశిస్తున్నాం'ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను బీజేపీ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్న ఆశతో తెలంగాణ ప్రజలు పదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు, హైస్పీడ్ రైలు కనెక్టివిటీ చట్టంలో చేసిన ఇతర వాగ్దానాలు అమలు చేయాలి.రాయలసీమ, ప్రకాశం, ఉత్తర కోస్తాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ఎంపిక చేసి గ్రాంట్లు మంజూరు చేశారు. అయితే తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల ప్రస్తావనను దాటవేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ సహా ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తగిన వాటాను పొందడంలో విఫలమయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి వనరులు, సంక్షేమ పథకాల్లో వాటా దక్కకుండా చేసిన కేంద్ర బడ్జెట్ తెలంగాణకు తీవ్ర నిరాశ కలిగించింది’ అని అన్నారు.
Advertisement