పాక్ దాడుల్లో 35 మంది మిలిటెంట్లు మృతి | 35 militants killed in Pak's tribal region | Sakshi
Sakshi News home page

పాక్ దాడుల్లో 35 మంది మిలిటెంట్లు మృతి

Dec 2 2014 1:50 PM | Updated on Sep 2 2017 5:30 PM

పాకిస్థాన్ బలగాలు మంగళవారం జరిపిన దాడుల్లో 35 మంది మిలిటెంట్లు మృతి చెందారు.

ఇస్లామాబాద్: పాకిస్థాన్ బలగాలు మంగళవారం జరిపిన దాడుల్లో 35 మంది మిలిటెంట్లు మృతి చెందారు. ఆఫ్ఘాన్ స్థాన్ సరిహద్దు వద్ద సమస్యాత్మకంగా మారిన మిలిటెంట్ల స్థావరాలపై పాకిస్థాన్ బలగాలు దాడులు చేశాయి. ఈ దాడిలో 35 మంది మిలిటెంట్లు మృతిచెందినట్లు ఆర్మీ అధికారి స్పష్టం చేశారు. తాజా దాడిలో పలు వాహనాలు, కొన్ని భవనాలు కూడా ధ్వంసమైనట్లు తెలిపారు.

 

అయితే దాడిలో మృతి చెందిన మిలిటెంట్ల వివరాలు తెలియాల్సి ఉందని స్పష్టం చేశారు. మృతి చెందిన మిలిటెంట్లలో విదేశీయులు కూడా ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement