బీరుట్: సిరియా ఆగ్నేయ ప్రాంతం శివారులోని ఓ సొరంగంలో పేలిన శక్తి మంతమైన బాంబు పేలుడులో 30 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. చెక్పోస్టుకు కిందగా తవ్విన ఈ సొరంగంలో ప్రత్యర్థి వర్గాలు ఈ బాంబును అమర్చి ఉంటాయని భావిస్తున్నారు. టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలను ఈ సొరంగంలో అమర్చారని, ఇలి అత్యంత శక్తిమంతవైనవని అధికార వర్గాలు తె లిపాయి. సోమవారం సంభవించిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిందని పేర్కొన్నాయి.