విమానం కుప్పకూలి.. నలుగురి మృతి | Four killed in US plane crash | Sakshi
Sakshi News home page

విమానం కుప్పకూలి.. నలుగురి మృతి

Feb 29 2016 10:17 AM | Updated on Apr 4 2019 5:12 PM

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ విమానం కుప్పకూలి ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించారు.

అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఓ విమానం కుప్పకూలి ఇద్దరు పిల్లలు సహా నలుగురు మరణించారు. ఈ ప్రమాదం కాలేజి స్టేషన్‌కు ఆగ్నేయంగా గల నవసోటాలో జరిగింది. నాలుగు సీట్లు మాత్రమే ఉన్న సింగిల్ ఇంజన్ సైరస్ ఎస్ఆర్-20 రకం విమానం సిటీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే ప్రయత్నాలలో ఉండగా అది కూలిపోయిందని సిన్హువా వార్తా సంస్థ తెలిపింది.

ఎయిర్ అఖ్తర్ సంస్థ పేరు మీద రిజిస్టర్ అయి ఉన్న ఈ విమానం.. డేవిడ్ వేన్ హూక్స్ ఎయిర్‌పోర్టు నుంచి హ్యూస్టన్‌కు బయల్దేరింది. కానీ నవసోటా సమీపంలో ఓ విమానంలో వెళ్తున్న పైలట్.. ఈ విమానం కూలిపోయి ఉండటాన్ని గుర్తించాడు. అందులో నలుగురు ప్రయాణికులు మరణించిన విషయాన్ని పోలీసులు కూడా ధ్రువీకరించారు. ప్రమాదానికి గల కారణాలపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) విచారణ జరుపుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement