United States of America
-
అక్కడే పడుకుంటున్నా!: మస్క్ ఆసక్తికర కామెంట్స్
వాషింగ్టన్:అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డీవోజీఈ)కి సంబంధించి ఆ సంస్థ హెడ్, ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ ఆసక్తికర వ్యాఖల్యు చేశారు. డీవోజీఈ హెడ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తాను ఆ సంస్థ ఆఫీసులోనే పడుకుంటున్నానని మస్క్ తన సన్నిహితులతో అన్నట్లు మీడియా కథనాలు వెలువడ్డాయి.ఫెడరల్ ప్రభుత్వ బ్యూరోక్రసీ వ్యవస్థపై పట్టు సాధించేందుకు తన ఆఫీసునే బెడ్రూమ్గా మార్చుకున్నానని మస్క్ చెప్పారు.డీవోజీఈ ఆఫీసు వైట్హైజ్ పక్కనే ఉన్న ఇసెన్హొవర్ భవనంలో ఉంది. ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టక ముందే ట్రంప్ను డీవోజీఈ చీఫ్గా నియమించిన విషయం తెలిసిందే. అయితే మస్క్కు గొప్ప హార్డ్ వర్కర్గా పేరుంది. ఆయన గతంలో బిజీ సమయాల్లో తన టెస్లా కంపెనీకి చెందిన ఫ్యాక్టరీ నేలపైనే నిద్రపోయినట్లు వార్తలొచ్చాయి. టెస్లా ఫ్యాక్టరీయే తన మొదటి ఇల్లు అని 2022లో మస్క్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం. తాజాగా డీవోజీఈ ఆఫీసు విషయంలోనూ మస్క్ ఇదే తరహా విషయాన్ని వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. -
ట్రంప్కు కోర్టు మరో షాక్
వాషింగ్టన్:అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడు నిర్ణయాలకు అక్కడి కోర్టులు వరుస బ్రేకులు వేస్తున్నాయి. ఉదార కార్యక్రమాలకు అమెరికా ప్రభుత్వ సాయాన్ని నిలిపివేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై వాషింగ్టన్ జిల్లా కోర్టు తాజాగా స్టే ఇచ్చింది. ట్రంప్ ఆదేశాలపై తాత్కాలిక స్టే విధించిన కోర్టు విచారణను వారంపాటు వాయిదా వేసింది.ట్రంప్ ఆదేశాల చట్టబద్ధతను విచారణ సందర్భంగా జడ్జి ప్రశ్నించారు. విదేశాలు, స్వచ్ఛంధ సంస్థలు,పలు కార్యక్రమాల కింద సాయాన్ని మంగళవారం సాయంత్రం నుంచి నిలిపివేయాలని ట్రంప్ ఆదేశాలిచ్చారు.ఈ ఆదేశాలపై వాషింగ్టన్ కోర్టు స్టే ఇవ్వడంతో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లే అవకాశాలున్నాయి. కాగా అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కోర్టుల నుంచి చుక్కెదురవడం ఇది రెండోసారి. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలిరోజే ట్రంప్ జారీ చేసిన జన్మతఃపౌరసత్వ హక్కు రద్దు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను అక్కడి ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఆదేశాలను కోర్టు రాజ్యాంగ విరుద్ధ చర్యగా అభివర్ణించడం గమనార్హం. -
ట్రంప్.. విద్యార్థుల జంప్!
సాక్షి, అమరావతి: అమెరికాలోని డల్లాస్లో చదువుకుంటున్న సురేష్ది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ మారుమూల పల్లె. ఏటా రూ.40 లక్షలు ఖర్చవుతుండగా కొంత అప్పు చేసి, పార్ట్ టైం ఉద్యోగం (Part time job) చేస్తూ ఫీజులు కడుతున్నాడు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విధించిన నిబంధనలు సురేష్ కు పిడుగుపాటులా మారాయి. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులు పార్ట్ టైం జాబ్స్ చేస్తూ పట్టుబడితే వీసా రద్దు (Visa Cancel) చేస్తామని హెచ్చరించడంతో హతాశుడయ్యాడు. పార్ట్ టైం జాబ్ చేయకుండా చదువుకు అయ్యే ఖర్చులెలా సమకూర్చుకోవాలో తెలియక, మధ్యలో చదువు వదిలేసి స్వదేశానికి తిరిగి రాలేక తల పట్టుకుంటున్నాడు.కరిగిపోతున్న కల..అమెరికాలో ఉన్నత విద్య చదువుకోవడమనేది మన విద్యార్థుల కల. తమ పిల్లలను అప్పు చేసైనా సరే అమెరికా పంపాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆరాట పడుతుంటారు. సంపన్న కుటుంబాలు దీన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. కానీ అక్కడికి వెళ్లిన తరువాత మన విద్యార్ధులు పడే అగచాట్లు సాధారణంగా బయటకు రావు. ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తుంటారు. దూరపు కొండలు నునుపు అన్నట్లు అమెరికా చదువులు, ఉద్యోగాలు దూరం నుంచి చూసేవారికి అందంగానూ, గొప్పగానూ కనిపిస్తుంటాయి. ట్రంప్ రాకతో వాస్తవాలు బయటకు వస్తున్నాయి.ఇంటి అద్దెకూ చాలవు..ఓపెన్ డోర్స్ నివేదిక ప్రకారం.. అమెరికాలో ప్రస్తుతం దాదాపు 3 లక్షల మంది భారతీయ విద్యార్ధులు (Indian Students) ఉండగా వీరి సంఖ్య ఏటా 35 శాతం పెరుగుతోంది. చైనాను కూడా ఈ విషయంలో మనవాళ్లు వెనక్కు నెట్టేశారు. అయితే అమెరికా వెళ్లే విద్యార్థుల్లో అధిక శాతం అప్పులు చేసి విమానం ఎక్కుతున్నారు. ఆ అప్పులను తీర్చడం కోసం అమెరికాలో గ్యాస్ స్టేషన్లు, సూపర్ మార్కెట్లు, రెస్టారెంట్లు తదితర చోట్ల పార్ట్టైమ్ జాబ్స్ చేస్తుంటారు. వీరికి సగటున గంటకు 10 డాలర్ల వరకూ చెల్లిస్తారు. మాస్టర్ ఆఫ్ సైన్స్(ఎంఎస్) చేస్తున్న విద్యార్ధి వారానికి 20 గంటలు పాటు పని చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలకు దాదాపు రూ.70 వేల వరకూ సంపాదిస్తాడు. దీన్ని ఇంటి అద్దె, కళాశాల ఫీజు, భోజనం, రవాణా ఖర్చులకు సరిపెట్టుకోవాలి. అమెరికాలో ప్రస్తుతం ఒక సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాలంటే 1,700 డాలర్లు అంటే దాదాపు రూ.1.46 లక్షలు చెల్లించాలి. మెయింటెనెన్స్ ఖర్చులు అదనం. ఒక విద్యార్ధి నెలంతా పార్ట్టైమ్ జాబ్ చేసినా ఇంటి అద్దె, ఇతర ఖర్చులు నెగ్గుకు రావడం కష్టం. అలాంటిది ఇప్పుడు అది కూడా సంపాదించడం కుదరదని అమెరికా ప్రభుత్వం ఖరాకండిగా చెబుతుండటంతో తీవ్ర నిరాశలో కూరుకుపోతున్నారు.బతుకు భారం.. పోనీ ఎలాగోలా ఇంటి దగ్గర్నుంచి అప్పులు చేసి డబ్బు తెప్పించి చదువుకుని ఉద్యోగం తెచ్చుకున్నా వచ్చే జీతంలో ప్రతి రూ.100కి ప్రభుత్వానికి రూ.30 పన్ను కింద చెల్లించాలి. ఆ మిగిలిన దానిలోనే అన్ని ఖర్చులూ భరించాలి. అలా అయినా ఎలాగోలా గడుపుదామంటే గ్రీన్ కార్డ్ రావడం పెద్ద ప్రహసనం. మన దేశానికి ఏటా 7 వేల గ్రీన్ కార్డులు (అమెరికా పౌరసత్వం) మాత్రమే ఇస్తుండగా పోటీపడుతున్న వారు లక్షల్లో ఉన్నారు.2012లో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి ఇప్పుడు ఇస్తున్నారంటే ఇక ఇప్పుడు దరఖాస్తు చేసుకునే వారికి రావాలంటే కనీసం 40 ఏళ్లు పడుతుంది. అప్పటి వరకూ అదనపు ట్యాక్స్లు కడుతూ.. హెచ్1 వీసాపై బిక్కుబిక్కుమంటూ జీవించాలి. చదవండి: అన్నంత పనీ చేసిన డొనాల్డ్ ట్రంప్!ఇంత కష్టం ఉన్నప్పటికీ అమెరికాలో చదువుకోవాలనే ఆశతో వెళుతున్న వారికి ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) షాక్ ఇస్తోంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే దాదాపు 18 వేల మందికి పైగా పార్ట్టైమ్ జాబ్ చేస్తున్న వారిని గుర్తించి ‘ఐస్’ టీమ్ అదుపులోకి తీసుకుంది. దీంతో భారతీయ విద్యార్ధులు అమెరికాలో పార్ట్టైమ్ జాబ్స్ను వదులుకుంటున్నారు. దండిగా డబ్బులుంటేనే రండి.. అమెరికాలో చదువుకోవాలనుకుంటే ముందుగా అంత ఆర్థ్ధిక స్తోమత ఉందో లేదో చూసుకోవాలి. ఏదో అప్పు చేసి కొంత డబ్బు సమకూర్చుకుని ఇక్కడికి రావడం సరైన విధానం కాదు. అమెరికాలో ప్రస్తుతం పార్ట్టైమ్ జాబ్స్ చేయడానికి ప్రభుత్వం అంగీకరించడం లేదు.కాబట్టి చదువుకుంటూ సంపాదించడం ఇక కుదరకపోవచ్చు. జాబ్ వచ్చినా ఇక్కడ ఖర్చులతో పోల్చితే సంపాదించేది ఏమాత్రం సరిపోదు. అమెరికాకు రావాలనుకునే విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఈ విషయాలను గమనించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది’’ – మణితేజ, డాలస్, అమెరికా -
ఏఐ ‘డీప్’ వార్!
మా పరిశోధకుల్లో ఎక్కువ మంది చైనా టాప్యూనివర్సిటీల నుంచి తీసుకున్న ఫ్రెష్ గ్రాడ్యుయేట్లే. భారీపెట్టుబడులతో నవకల్పనలు పెరుగుతాయంటే పొరపాటే. అదే నిజమైతే ప్రపంచంలోని ఇన్నోవేషన్ అంతాబడా కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయేది – డీప్సీక్ ఫౌండర్ లియాంగ్ వెన్ఫెంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో ఎదురులేని అమెరికా టెక్ దిగ్గజాలకు చైనా ఊహించని షాక్ ఇచ్చింది. ఏఐ రారాజు చాట్జీపీటీకి ఓ అనామక చైనా ఏఐ స్టార్టప్ పెను సవాల్ విసిరింది. అదే డీప్సీక్. దీని చౌక ఏఐ దెబ్బకు మొత్తం సిలికాన్ వ్యాలీ చివురుటాకులా వణుకుతోంది. లక్షల కోట్లు వెచ్చించి అమెరికా కంపెనీలు కడుతున్న ‘ఆర్టిఫిషియల్’కోటను బద్దలుకొట్టేందుకు డ్రాగన్ బరిలోకి దూకడంతో ఏఐ వార్కు తెరలేచింది. దీంతో జపాన్ నుంచి యూరప్ మీదుగా.. అమెరికా వరకు టెక్ షేర్లన్నీ కుప్పకూలాయి. విలువ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీ ఎన్విడియా షేరు ఏకంగా 17 శాతం పడిపోవటంతో దాదాపు 600 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోయింది. మనదేశంలో మూడు అతిపెద్ద కంపెనీలైన రిలయన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ల మొత్తం మార్కెట్ విలువ కంటే ఇది ఎక్కువ. – సాక్షి, హైదరాబాద్2023లో ఆవిర్భావండీప్సీక్ పురుడుపోసుకుని రెండేళ్లు కూడా కాలేదు. క్వాంట్ హెడ్జ్ ఫండ్ ‘హై–ఫ్లయర్’చీఫ్ లియాంగ్ వెన్ఫెంగ్ 2023లో దీన్ని నెలకొల్పారు. అతి తక్కువ ఖర్చుతో డీప్సీక్ రూపొందించిన ఆర్1 ఏఐ మోడల్ చైనాతోపాటు అమెరికా టెక్ దిగ్గజాలను కూడా ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఏఐ మోడల్ను పూర్తి ఉచితంగా అందిస్తుండటం ఓపెన్ ఏఐ వంటి కంపెనీల భవిష్యత్కు గొడ్డలిపెట్టులా మారింది. అమెరికాలో విడుదలైన వారంలోనే యాపిల్ యాప్ స్టోర్లో డీప్సీక్ మొబైల్ యాప్ అత్యధిక డౌన్లోడ్లతో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుని చాట్జీపీటీని వెనక్కి నెట్టింది. ఈ నెల 27న ఒక్కరోజే ఏకంగా 20 లక్షల మంది డౌన్లోడ్ చేసుకోవడం దీని జోరుకు నిదర్శనం. మరోపక్క టెక్ట్స్ ప్రాంప్ట్ను ఇమేజ్గా మార్చే జానస్–ప్రో–7బీతో మరో సంచలనానికి తెరతీసింది డీప్సీక్. అమెరికాకు ‘డీప్’ట్రబుల్.. ఏఐలో అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే స్టార్గేట్ ప్రాజెక్టును ప్రకటించిన విషయం తెలిసిందే. నాలుగేళ్లలో 500 బిలియన్ డాలర్లు వెచ్చించి అమెరికాను తిరుగులేని ఏఐ సూపర్పవర్గా చేసేందుకు ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్, ఎంజీఎక్స్ చేతులు కలిపాయి. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకముందే డీప్సీక్ కారు చౌకగా ఏఐ మోడల్ను అభివృద్ధి చేసి షాకిచ్చింది. ట్రంప్ సలహాదారు మార్క్ ఆండర్సన్.. డీప్సీక్–ఆర్1ను ఏకంగా ‘‘ఏఐ స్పుత్నిక్ మూమెంట్’’గా (1957లో సోవియట్ యూనియన్ ప్రపంచంలో తొలి శాటిలైట్ స్పుత్నిక్ను ప్రయోగించడంతో యూఎస్, సోవియట్ మధ్య స్పేస్ వార్కు తెరలేచింది) అభివర్ణించడం విశేషం.దిగ్గజాలకు దీటుగా..ఎన్విడియా అధునాతన చిప్స్, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ (జీపీయూ)తో పోలిస్తే చాలా లో ఎండ్ హార్డ్వేర్తో (పాత ఎన్విడియా ఏ100 జీపీయూలు) తాము ఏఐ మోడల్స్ను రూపొందించామని డీప్సీక్ ప్రకటించింది. చైనాకు అధునాతన చిప్స్, టెక్నాలజీ ఎగుమతిపై అమెరికా విధించిన ఆంక్షలను సైతం ఎదురొడ్డి సొంతంగా దిమ్మదిరిగే ఏఐ మోడల్ను అభివృద్ధి చేయడంపై నిపుణులు కూడా నోరెళ్లబెడుతున్నారు. డీప్సీక్ దెబ్బతో ప్రపంచ ఏఐ పరిశ్రమ స్వరూపమే మారిపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఓపెన్ సోర్స్ (డెవలపర్లు ఈ సాఫ్ట్వేర్ను మెరుగుపరచే అవకాశంతో పాటు దీని ఆధారంగా సొంత టూల్స్ను రూపొందించుకోవచ్చు) మోడల్ కావడంతో తక్కువ బడ్జెట్లోనే కంపెనీలు, యూజర్లకు ఏఐ అందుబాటులోకి వస్తుంది. డీప్సీక్ ఆర్1 ఏఐ మోడల్ మేథమెటిక్స్, కోడింగ్, రీజనింగ్, లాంగ్వేజ్ పరంగా అన్ని రకాల ప్రమాణాల్లో చాట్జీపీటీ, జెమిని, గ్రోక్ వంటి ఏఐ మోడళ్లకు దీటుగా నిలవడం గమనార్హం. మెటా ఏఐ మోడల్ అభివృద్ధికి 6 బిలియన్ డాలర్లు ఖర్చు చేయగా.. డీప్సీక్ కేవలం 6 మిలియన్ డాలర్లతోనే ఆర్1 ఏఐ మోడల్ను తీసుకొచ్చింది.మైక్రోసాఫ్ట్ నుంచి 13 బిలియన్ డాలర్లతో సహా, భారీగా నిధులు సమీకరించిన ఓపెన్ఏఐలో సిబ్బంది సంఖ్య 4,500. దీనికి పూర్తి భిన్నంగా ఇప్పటిదాకా డీప్సీక్ వెచ్చించింది 10 మిలియన్ డాలర్లే. ఉద్యోగులు 200 మంది మాత్రమే.ఎన్విడియాకు షాకెందుకు?ఏఐ మోడల్స్ను నడిపేందుకు హై ఎండ్ చిప్స్, జీపీయూలు, నెట్వర్కింగ్ అవసరమని ఇప్పటిదాకా ఊదరగొడుతున్నారు. ఈ రంగంలో నంబర్ వన్గా ఉన్న ఎన్విడియా మార్కెట్ విలువ 2023 డిసెంబర్లో తొలిసారి 500 బిలియన్ డాలర్లు దాటింది. గడిచిన ఏడాదిలోనే ఏకంగా 3.5 ట్రలియన్ డాలర్లను (మన కరెన్సీలో రూ.301 లక్షల కోట్లు) తాకి ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ను వెనక్కి నెట్టింది. డీప్సీక్ చౌక మోడల్ వల్ల డిమాండ్ తగ్గొచ్చనే భయంతో ఇన్వెస్టర్లు ఏఐ టెక్ షేర్లను అమ్మేసుకుంటున్నారు. దీంతో ఎన్విడియా షేర్ 17 శాతం కుప్పకూలింది. బ్రాడ్కామ్, ఏఎండీ, అరిస్టా నెట్వర్క్స్, నెదర్లాండ్స్ చిప్ దిగ్గజం ఏఎస్ఎంఎల్ హోల్డింగ్స్, తైవాన్ సెమీకండక్టర్స్ మాన్యుఫ్యాక్చర్స్ (టీఎస్ఎం) వంటి చిప్, నెట్వర్కింగ్ షేర్లు సైతం 15–23 శాతం పడిపోయాయి. -
ట్రంప్ రివేంజ్ పాలిటిక్స్.. 12 మంది ప్రాసిక్యూటర్ల తొలగింపు
వాషింగ్టన్:రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిలో రాజకీయ కక్ష తీర్చుకునే నిర్ణయాలు కూడా ఉన్నాయి. తాజాగా అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ 12 మంది దాకా ప్రాసిక్యూటర్లను తొలగించింది. వీరంతా గత ప్రభుత్వంలో ట్రంప్ను ప్రాసిక్యూట్ చేసిన లాయర్లు కావడం గమనార్హం. బైడెన్ హయాంలో ట్రంప్ పలు క్రిమినల్ కేసుల్లో విచారణను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అధ్యకక్షుడిని కేసులతో ముప్పుతిప్పలు పెట్టిన వారిని వదిలేదని లేదన్న సంకేతాలను జస్టిస్ డిపార్ట్మెంట్ ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ‘గతంలో అధ్యక్షుడు ట్రంప్ను ప్రాసిక్యూట్ చేసిన న్యాయవాదులను యాక్టింగ్ అటార్నీ జనరల్ సర్వీసు నుంచి తొలగించారు. అధ్యక్షుడి ఎజెండాను అమలు చేయలేరన్న కారణంతోనే వీరిని తొలగిస్తున్నాం’అని జస్టిస్ డిపార్ట్మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ట్రంప్ను ప్రాసిక్యూట్ చేసిన న్యాయవాదులంతా ప్రత్యేక కౌన్సిల్ జాక్స్మిత్ నేతృత్వంలో పనిచేశారు. జాక్ స్మిత్ జనవరి మొదటి వారంలోనే తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కాగా, ట్రంప్ గత ప్రభుత్వ హయంలో ప్రముఖంగా ‘క్యాపిటల్’ తిరుగుబాటు, పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ హష్మనీ కేసులను ఎదుర్కొన్నారు. వీటిలో హష్మనీ కేసులో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలారు. అయితే కోర్టు ట్రంప్కు ఈ కేసులో ఎలాంటి శిక్ష వేయలేదు. -
గురుద్వారాల్లో తనిఖీలు.. ట్రంప్పై సిక్కుల ఆగ్రహం
వాషింగ్టన్:ఎన్నికల ముందు చెప్పినట్టుగానే అమెరికా(America) అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలసదారులను సాగనుంపుతున్నారు. ఈ క్రమంలో అక్రమ వలసదారులను అరెస్టు చేయడానికి ట్రంప్(Trump) అనుసరిస్తోన్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో అధికారులు న్యూయార్క్,న్యూజెర్సీల్లోని గురుద్వారాల్లోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాము పవిత్రంగా భావించే ప్రార్ధనా మందిరాల్లో అక్రమ వలసదారుల కోసం హోం ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వెతకడంపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. గురుద్వారాల పవిత్రతను ట్రంప్ చర్య దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.కాగా, ట్రంప్ యంత్రాంగం అమెరికాలో ఇప్పటివరకు వందలమంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. అరెస్టయిన వారంతా ఉగ్రవాదం,డ్రగ్స్,లైంగిక నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారేనని అధికారులు చెబుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ(Deportation) ఆపరేషన్ చేపట్టారు.ఇప్పటికే సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశామని వైట్హౌస్ వెల్లడించింది.మరోవైపు,అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని,ఎందుకంటే అది పలురకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని ఇప్పటికే భారత్ స్పష్టం చేయడం గమనార్హం. -
బంగ్లాదేశ్కు ట్రంప్ బిగ్ షాక్
వాషింగ్టన్: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ షాకిచ్చారు. బంగ్లా ప్రభుత్వానికి అమెరికా సాయాన్ని రద్దు చేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్లో ఆహారభద్రత, ఆరోగ్యం, విద్య తదితర కీలక రంగాల్లో చేపట్టిన ప్రాజెక్టులు ఆగిపోనున్నాయి. 90 రోజుల పాటు పలు దేశాలకు అమెరికా సాయాన్ని నిలిపివేసే పాలసీలో భాగంగా బంగ్లాదేశ్కు సాయం నిలిపివేశారు. ఈజిప్ట్, ఇజ్రాయెల్లకు తప్ప ఇతర అన్ని దేశాలకు 90 రోజులపాటు అమెరికా సాయాన్ని నిలిపివేశారు. ట్రంప్ ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వలసదారుల విధానాలు, ఫెడరల్ వర్కర్లు ఆఫీసు నుంచి విధులు నిర్వహించడం, లేకెన్ రిలే చట్టం అమలు, పారిస్ ఒప్పందం నుంచి తప్పుకోవడం వంటి నిర్ణయాలు వీటిలో ఉన్నాయి.వీటికి తోడు అమెరికాలో ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రపంచంలోని ఇతర దేశాలకు సాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ట్రంప్ ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: 90 వేల మంది ఉద్యోగుల తొలగింపు..ట్రంప్ కఠిన నిర్ణయం -
హెచ్1బీ వీసాలపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్:అత్యుత్తమమైన నైపుణ్యమున్న వ్యక్తులే తమ దేశానికి రావాలని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. మంగళవారం(జనవరి21) వైట్హౌజ్లో ట్రంప్ ఈ విషయమై ఒరాకిల్,ఓపెన్ఏఐ,సాఫ్ట్బ్యాంక్ సీఈవోలతో కలిసి మీడియాతో మాట్లాడారు.‘హెచ్1బీ వీసాలపై విభిన్నమైన వాదనలున్నాయి. రెండు వాదనలకు నేను మద్దతిస్తున్నాను. నేను కేవలం ఇంజినీర్ల గురించే మాట్లాడడం లేదు. అన్ని స్థాయిల్లో నైపుణ్యమున్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. హెచ్1బీ వీసాలపై నాకు వ్యక్తిగత అవగాహన ఉంది. నాణ్యమైన మానవవనరులు అమెరికాకు వచ్చేలా వలస విధానం ఉండాలి. దేశంలో వ్యాపారాల విస్తరణను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒరాకిల్,సాఫ్ట్బ్యాంక్ వంటి కంపెనీలకు అత్యుత్తమ ఇంజినీర్ల అవసరం ఉంది. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు వస్తారన్న అభిప్రాయంతోనే ఇలాన్మస్క్ హెచ్1బీ వీసాలకు మద్దతిస్తున్నారు.హెచ్1బీ వీసాల జారీని నేను ఆపడం లేదు’అని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. కాగా, హెచ్1బీ వీసాలపై ఇటీవల రిపబ్లికన్లలోనే భిన్న వాదనలు వినిపించాయి. కొందరు హెచ్1బీ వీసాల జారీని పూర్తిగా ఆపేయాలని డిమాండ్ చేశారు. అప్పుడే అమెరికాలో స్థానికులకు ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. ఇక అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్ మాత్రం హెచ్1బీ వీసాల జారీని సమర్థించారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన వ్యక్తులు అమెరికాకు రావాల్సిన అవసరం ఉందన్నారు. #WATCH | Washington DC | On H1B visas, US President Donald Trump says, "... I like both sides of the argument but I also like very competent people coming to our country, even if that involves them training and helping others that may not have the qualifications... About HB1, I… pic.twitter.com/ALFRoHUWgD— ANI (@ANI) January 22, 2025 ఇదీ చదవండి: ట్రంప్ 2.0..భారత్కు దక్కిన అరుదైన గౌరవం -
ట్రంప్ 2.0..భారత్కు దక్కిన అరుదైన గౌరవం
వాషింగ్టన్:అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం చేయగానే భారత్,అమెరికా సంబంధాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత తొలి ప్రాధాన్యం భారత్కే లభించింది. అమెరికా కొత్త విదేశాంగ శాఖ మంత్రి మారో రుబియో తన తొలి భేటీ భారత విదేశాంగశాఖ మంత్రితోనే నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్ కూడా పాల్గొన్నారు.సాధారంగా కొత్త అధ్యక్షుడు అధికారం చేపట్టగానే అమెరికా విదేశాంగశాఖ తొలి భేటీ పొరుగు దేశాలైన కెనడా,మెక్సికో లేదంటే నాటో కూటమిలోని ఏదో ఒక దేశంతో జరుగుతుంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్తో తొలి భేటీ జరపడం గమనార్హం.అది కూడా అమెరికా విదేశాంగశాఖ మంత్రిగా మైక్ రుబియో పదవీ బాధ్యతలు చేపట్టిన గంటలోనే భేటీ జరగడం విశేషం. గంటపాటు జరిగిన ఈ భేటీలో అమెరికా,భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.భేటీ ముగిసిన తర్వాత జైశంకర్,రుబియోలు మీడియా ముందుకు వచ్చి కరచాలనం చేసుకున్నారు.రుబియోతో భేటీ అవడం సంతోషంగా ఉందని జైశంకర్ తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో పోస్టు చేశారు. Delighted to meet @secrubio for his first bilateral meeting after assumption of office as Secretary of State.Reviewed our extensive bilateral partnership, of which @secrubio has been a strong advocate. Also exchanged views on a wide range of regional and global issues.Look… pic.twitter.com/NVpBUEAyHK— Dr. S. Jaishankar (@DrSJaishankar) January 21, 2025 ఇదీ చదవండి: జన్మతఃపౌరసత్వం రద్దు -
అమెరికాలో కాల్పులు..హైదరాబాద్ యువకుడి దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన కొయ్యడ రవితేజ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు.రవితేజ మరణవార్త విని చైతన్యపురి ఆర్కేపురం డివిజన్లో నివసిస్తున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాణ్వేషణలో ఉన్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒక్కసారి కనబడు బిడ్డా -
ప్రమాణస్వీకారానికి ముందు ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్:ప్రమాణస్వీకారానికి కొన్ని గంటల ముందు అమెరికా(America)కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సంచలన ప్రకటన చేశారు. వాషింగ్టన్ డీసీలో ఆదివారం జరిగిన మేక్ అమెరికా గ్రేట్ ఎగెయిన్(MAGA) ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా అమెరికాలోకి వలసలపై ట్రంప్ దూకుడుగా మాట్లాడారు.‘నేను ప్రమాణస్వీకారం చేసిన వెంటనే మన దేశంపై అక్రమ వలసదారుల దండయాత్ర ఆగిపోతుంది. సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించడాన్ని ఆపేస్తాం. ఇక మన సంపదను మనమే అనుభవిస్తాం. అక్రమంగా వలస వచ్చిన వేలాది మందిని బలవంతంగా సాగనంపే కార్యక్రమం అమెరికా చరిత్రలోనే భారీగా మొదలుపెడతాం.ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. టిక్టాక్ యాప్ను మళ్లీ తీసుకొచ్చాం. మన ఉద్యోగాలు చైనాకు పోవడానికి వీల్లేదు. అందుకే టిక్టాక్ యాప్లో అమెరికా ప్రభుత్వం 50 శాతం భాగస్వామ్యం తీసుకుంటుంది. అధికారం చేపట్టకముందే ట్రంప్ ఎఫెక్ట్తో ఇప్పటికే కొన్ని పనులు జరిగిపోతున్నాయి. ఇది నా ఎఫెక్ట్ కాదు. మీ అందరి ఎఫెక్ట్’అని ర్యాలీకి హాజరైన వారిని ట్రంప్ తన ప్రసంగంతో ఉత్తేజపరిచారు. కాగా, గతేడాది నంబర్లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ సోమవారం(జనవరి 20)న రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే ట్రంప్ ఏ నిర్ణయాలు తీసుకుంటారన్నది ప్రపంచ దేశాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.ఇదీ చదవండి: నేడే ట్రంప్ పట్టాభిషేకం -
బాధ్యత లేని బాల్యచాపల్యం
బాల్యావస్థ చిత్రమైనది. ఆ దశలో కంటిముందు కనబడేవన్నీ తన సొంతం అనుకునే మనస్తత్వం ఉంటుంది. మరో పదిరోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న డోనాల్డ్ ట్రంప్ ఈ మాదిరి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతోంది. అధికారంలోకి రాకముందే ఆయన వరసబెట్టి పొరుగు దేశాలకు తాఖీదులు పంపుతున్నారు. ‘మీరంతా నా దారికి రండి’ అన్నదే వాటి సారాంశం. అమెరికాలో 51వ రాష్ట్రంగా స్థిరపడటానికి కెనడా సిద్ధంగా ఉండాలట. డెన్మార్క్లో భాగంగా ఉన్న గ్రీన్ల్యాండ్ ప్రాంతాన్ని ఆ దేశం వదిలేసుకోవాలట. అలాగే పనామా అధీనంలోని పనామా కాల్వపై అమెరికాకు పూర్తి హక్కున్నదట. తన అభీష్టం నెరవేరటానికి ఆ దేశాలపై టారిఫ్ మోత మోగి స్తారట. ఫలితం రాకపోతే దురాక్రమణకు సిద్ధపడతారట. సోవియెట్ యూనియన్ దురాక్రమణకు పాల్పడే అవకాశం ఉన్నదని బెదరగొట్టి 1949లో నాటో కూటమిని ఏర్పాటుచేసింది అమెరికాయే. దాని స్థానంలో వచ్చిన రష్యావల్ల కూడా ముప్పు ముంచుకురావచ్చని ఒప్పించి నాటోను కొన సాగిస్తున్నదీ అమెరికాయే. తీరా ట్రంప్ ప్రకటనల తీరు చూశాక నిజమైన ముప్పు అమెరికానుంచే ఉండొచ్చన్న భయాందోళనలు యూరప్ దేశాల్లో కలుగుతున్నాయి. ఏడెనిమిదేళ్లుగా అమెరికా ‘నియమాల ఆధారిత’ ప్రపంచం గురించి మాట్లాడుతోంది. చైనా ప్రాబల్యాన్ని అడ్డగించటమే లక్ష్యంగా అమెరికా వాడుకలోకి తెచ్చిన ఇండో–పసిఫిక్ వ్యూహానికి ప్రాతిపదిక ‘నియమాల ఆధా రిత’ ప్రపంచమే. ట్రంప్ ప్రకటనలకూ, ఈ వ్యూహానికీ పూర్తిగా చుక్కెదురు. అమలులో ఉన్న నియ మాలను ధిక్కరించి, అంతర్జాతీయ న్యాయానికి భిన్నంగా ప్రవర్తించి ఏ దేశాన్నయినా ఆక్రమించు కోవాలనుకునే మనస్తత్వం దేనికి దారితీస్తుంది? అందుకే యూరప్ దేశాలన్నీ ట్రంప్ ప్రకటనపై విరుచుకు పడుతున్నాయి. సభ్యదేశాల్లో ఎవరిపై దాడి జరిగినా మిగిలిన దేశాలన్నీ అండగా నిలవాలన్నది నాటో నియమం. దానికి అనుగుణంగానే జర్మనీ, ఫ్రాన్స్ మొదలు అన్ని దేశాలూ ట్రంప్ తీరును ఖండిస్తున్నాయి. ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడిన రష్యాను ఖండిస్తూ, తైవాన్ను సొంతం చేసుకోవాలనుకునే చైనాను హెచ్చరిస్తూ వస్తున్న అమెరికా ట్రంప్ ఏలుబడి మొదలయ్యాక తానే దురాక్రమణదారుగా మారుతుందా అన్నది చెప్పలేం. పూర్వాశ్రమంలో రిపబ్లికన్ పార్టీకే చెందిన నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఇలాంటి బెదిరింపులకే పాల్పడేవారు. తానొక ప్రమాదకారినన్న భావన కలిగిస్తే చాలు... ప్రపంచమంతా పాదాక్రాంతమవుతుందన్న భ్రమ ఆయనకు ఉండేది. దాన్ని ‘మ్యాడ్మ్యాన్ థియరీ’గా పిలిచేవారు. చివరకు ఆయన హయాంలోనే ఎంతో అప్రదిష్టపాలై ఉత్తర వియత్నాం నుంచి అమెరికా సైనికులు వైదొల గాల్సి వచ్చింది. ట్రంప్ మాటలు ‘మ్యాడ్మ్యాన్ థియరీ’వంటివేనా... నిజంగా ప్రమాదకరమైనవా అనే విచికిత్సలో పడ్డాయి యూరప్ దేశాలు. దౌత్యరంగంలో ఎవరైనా సరే... మరో దేశాధినేత వ్యక్తిగతంగా కలిసినప్పుడు తమకేం చెప్పారన్నది కాక, వారి బహిరంగ ప్రకటనలనూ, వారి ఆచరణనూ పరిగణనలోకి తీసుకుంటారు. తొలి ఏలుబడిలో సైతం ట్రంప్ ఇలాంటి హెచ్చరికలు చాలా చేసేవారు. ఉత్తర కొరియాపై నిప్పుల వాన కురిపించబోతున్నట్టు ప్రకటనలు చేయటం, చివరకు ఆ దేశానికి అతిథిగా వెళ్లి ఒప్పందం కుదుర్చుకురావటం అందరూ చూశారు. చైనా పైనా అదే తరహాలో చిందులు తొక్కేవారు. కానీ ఎప్పుడూ దాని జోలికిపోలేదు. అయితే ఇరాన్ విషయంలో అలా కాదు. ఆ దేశ అగ్రనేతల్లో ఒకరైన కాసిం సొలేమనిని హత్య చేయించారు. వేరే దేశాల నేతలపై దాడులకు పాల్పడటం, దాన్ని అధికారికంగా ప్రకటించటం అసాధారణం. కనుకనే ట్రంప్ రెండో ఏలుబడిపై అందరిలోనూ ఆందోళన నెలకొన్నది. విస్తరణవాద చాపల్యం అమెరికాకు మొదటినుంచీ ఉన్నదే. కానీ అదంతా మృదువైన భాష వెనక నడిచేది. వేరే దేశాల్లో పాలకుల్ని మార్చకుండానే తన పెత్తనాన్ని సుస్థిరం చేసుకునేది. నేరుగా బెదిరింపులకు దిగటం ట్రంప్ ప్రవేశపెట్టిన కొత్త ధోరణి. ఏటా కెనడా రక్షణకు రెండువేల కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నామని, అందువల్ల ఒరిగేదేమీ లేదన్నది ఆయన అభిప్రాయం. 51వ రాష్ట్రంగా కలుపుకొంటే అదంతా ఆదా అవుతుందని ట్రంప్ అంటున్నారు. కెనడా వాదన భిన్నంగా ఉంది. అమెరికా–కెనడా సంబంధాల వల్ల ఇరు దేశాలూ బాగుపడుతున్నాయని ఆ దేశం చెబుతోంది. తమనుంచి అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఇంధనం మార్కెట్ ధరకన్నా తక్కువకు అమెరికాపొందుతున్నదని, వేలకోట్ల డాలర్ల విలువైన అమెరికా సరుకులు కెనడాలో అమ్ముడవుతున్నాయని, అమెరికా చేసే యుద్ధాలకు కోట్ల డాలర్ల ధనం వెచ్చిస్తున్నామని కెనడా విపక్ష నేత పియే పొలియేరా గుర్తుచేశారు. దండిగా ఖనిజ వనరులున్న గ్రీన్ల్యాండ్పై ట్రంప్ కన్నుపడింది. పద్దెనిమిదేళ్ల ట్రంప్ కుమారుడు ఆ ప్రాంతానికెళ్లి అది తమ సొంత జాగీరన్న అర్థం వచ్చేలా ప్రకటించాడు. నిజానికి గ్రీన్ల్యాండ్ డెన్మార్క్ అధీనంలో కూడా లేదు. 57,000 మంది నివసించే ఆ ప్రాంతానికి స్వయంప్రతిపత్తి ఉంది. కేవలం సైనిక, ఆర్థిక వ్యవహారాలు మాత్రమే డెన్మార్క్ చూస్తుంది. పనామా కాల్వపై హక్కు వదులుకోవటానికి పనామా దేశం కూడా సిద్ధంగా లేదు. ట్రంప్ ఒక తేనెతుట్టె కదిల్చి తమాషా చూడదల్చుకున్నారా... నిజంగానే దురాక్రమణకు సిద్ధపడతారా అన్నది మున్ముందు తేలుతుంది. దురాక్రమణకు సిద్ధపడితే ఇప్పుడు పుతిన్కు ఉక్రెయిన్లో ఎదురవుతున్న పరాభవమే అమెరికాకు తప్పకపోవచ్చు. అంతకన్నా కీలకమైనదేమంటే... అమెరికా విశ్వసనీయతతో పాటు మిత్రులనూ కోల్పోతుంది. ఏకాకిగా మారుతుంది. -
నయా రాకెట్ నిశేష్ రెడ్డి...
అంతర్జాతీయ స్థాయిలో మరో యువ టెన్నిస్ ఆటగాడు దూసుకొస్తున్నాడు. అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు సంతతి కుర్రాడు నిశేష్ బసవరెడ్డి... గత సీజన్లో అనూహ్య ప్రదర్శనతో అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) యూత్ చాలెంజర్స్ టూర్ ఫైనల్స్ టోర్నీకి అర్హత సాధించడంతో పాటు... సీజన్ ఆరంభ గ్రాండ్స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్కు వైల్డ్ కార్డు ఎంట్రీ పొందాడు. కాలిఫోర్నియాలో పుట్టి పెరిగిన 19 ఏళ్ల నిశేష్ బసవరెడ్డి డిసెంబర్లోనే ప్రొఫెషనల్ ప్లేయర్గా మారాడు. 457వ ర్యాంక్తో 2024వ సంవత్సరం టెన్నిస్ సీజన్ను ప్రారంభించిన నిశేష్... వరుస విజయాలతో సత్తా చాటి సీజన్ ముగిసేసరికి ఏటీపీ ర్యాంకింగ్స్లో 138వ స్థానానికి చేరాడు. చాలెంజర్ టూర్ టోర్నీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన నిశేష్ ఈ మధ్యకాలంలో 6 టోర్నీల్లో ఫైనల్కు చేరి రెండింట టైటిల్ చేజిక్కించుకున్నాడు. దీంతో అతడికి ఆ్రస్టేలియా ఓపెన్లో బరిలోకి దిగే అవకాశం దక్కింది. ఆదివారం నుంచి మెల్బోర్న్ వేదికగా ప్రారంభం కానున్న గ్రాండ్స్లామ్ టోర్నీలో నిశేష్ బరిలోకి దిగనున్నాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో డాటా సైన్సెస్ అభ్యసించిన నిశేష్ కుటుంబం నెల్లూరు నుంచి అమెరికాకు వెళ్లి స్థిరపడింది. నెల్లూరుకు చెందిన నిశేష్ తండ్రి మురళీ రెడ్డి టెక్ పరిశ్రమలో పని చేస్తుండగా... సోదరుడు నిశాంత్ రెడ్డి ఐటీ కంపెనీలో ఉద్యోగి. తల్లి సాయి ప్రసన్న గృహిణి. చిన్నప్పుడు చాలాసార్లు భారత్కు వచ్చి వెళ్లిన నిశేష్కు హైదరాబాద్, నెల్లూరులో బంధువులు ఉన్నారు. చుట్టాలు, స్నేహితుల వల్ల తెలుగుపై అవగాహన పెంచుకున్న నిశేష్ స్పష్టంగా మాట్లాడలేకపోయినా సినిమాలు మాత్రం బాగా చూస్తాడు. సబ్ టైటిల్స్ లేకుండా భాషను అర్థం చేసుకుంటాడు. ఒలింపిక్ పతక విజేత రాజీవ్ రామ్ వద్ద శిక్షణ పొందుతున్న నిశేష్... భవిష్యత్తుపై భరోసా పెంచుతున్నాడు. ‘17 ఏళ్ల వయసులోనే పట్టభద్రుడిగా మారాను. చాలా అంశాలపై ఆసక్తి ఉంది. అందుకే వాటిలో మరింత మెరుగవ్వాలని నిర్ణయించుకున్నా. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా దృఢంగా అయ్యేందుకు ప్రయత్నిస్తున్నా. చిన్నప్పుడు తరచూ గాయపడే వాడిని. పాఠశాల విద్య పూర్తవగానే ప్రొఫెషనల్ టెన్నిస్ ప్లేయర్గా మారాలని అనుకోలేదు. కానీ అలా జరిగిపోయిందంతే. చిన్నప్పటి నుంచి టెన్నిస్ అంటే విపరీతమైన ఇష్టం. టీవీలో ఎప్పుడూ టెన్నిస్ చానల్ చూస్తూ ఉండేవాడిని. కామెంటేటర్లు చెప్పే మాటలు వింటూ ప్లేయర్ల లాగా షాట్లు ఆడేందుకు ప్రయత్నించేవాడిని. దేన్నైనా నిశితంగా పరిశీలించడం నాకు అలవాటు. దీనివల్లే ప్రత్యర్థి ఆటగాళ్ల తప్పులను గమనించి అందుకు తగ్గట్లు వ్యూహాలు రచించుకోవడం నేర్చుకున్నా. ఇది అంత సులువుగా సాధ్యం కాలేదు. నిరంతర సాధన వల్ల వచ్చిoది’ అని తాజా ర్యాంకింగ్స్లో 133వ ర్యాంక్లో ఉన్న నిశేష్ అన్నాడు. –సాక్షి క్రీడా విభాగంఆక్లాండ్ ఓపెన్లో శుభారంభంఈ ఏడాది ఆడుతున్న రెండో ఏటీపీ–250 టోర్నీలో నిశేష్ బసవరెడ్డి శుభారంభం చేశాడు. న్యూజిలాండ్లో జరుగుతున్న ఆక్లాండ్ ఓపెన్ టోర్నీలో నిశేష్ రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. క్వాలిఫయింగ్లో ఆడిన రెండు మ్యాచ్ల్లో నెగ్గి పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’లో క్వాలిఫయర్గా అడుగు పెట్టిన నిశేష్ తొలి రౌండ్లో 6–2, 6–2తో ప్రపంచ 85వ ర్యాంకర్ ఫ్రాన్సిస్కో కమ్సానా (అర్జెంటీనా)పై గెలుపొందాడు. 69 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో నిశేష్ ఆరు ఏస్లు సంధించాడు. ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా చేయని నిశేష్ ప్రత్యర్థి సర్వీస్ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. గతవారం బ్రిస్బేన్ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలోనూ క్వాలిఫయర్గా మెయిన్ ‘డ్రా’లో ఆడిన నిశేష్ తొలి రౌండ్లో ఫ్రాన్స్ సీనియర్ స్టార్ ప్లేయర్ గేల్ మోన్ఫిల్స్ చేతిలో మూడు సెట్లపాటు పోరాడి ఓడిపోయాడు. -
తడబడ్డ కమలాహారిస్..వీడియో వైరల్
వాషింగ్టన్:అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్ తడబడ్డారు. అమెరికా 119వ కాంగ్రెస్ ప్రారంభం సందర్భంగా సెనేట్లో చేసిన ప్రతిజ్ఞలో జెండా అనే పదాన్ని వదిలేసి చదివారు. హారిస్ తడబడ్డ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఆమెను నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అమెరికాలో 119వ కాంగ్రెస్ తాజాగా సమావేశమైంది. ఈ సందర్భంగా చేసే ప్రతిజ్ఞలో ‘నేను యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జెండాకు విధేయత చూపుతాను’ అని చదవాలి అయితే హారిస్ ‘జెండా’ పదాన్ని వదిలేసి చదివారు. దీనిపై పలువురు నెటిజన్లు స్పందించారు.హారిస్ విధేయత ప్రతిజ్ఞను సలాడ్ చేసేశారని ఒకరు కామెంట్ చేయగా సెనెట్లో ప్రతిజ్ఞను తప్పుగా పలికి హారిస్ దేశాన్ని అవమానించారని మరొకరు విమర్శించారు. చరిత్రలో అతి తక్కువ ఐక్యూ కలిగిన అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్ అని మరో నెటిజన్ విమర్శించారు. FLAG FLUB: Vice President Kamala Harris appears to flub the Pledge of Allegiance during the opening moments of the 119th Congress. pic.twitter.com/NlyMB6iUoz— Fox News (@FoxNews) January 3, 2025 మరో వీడియోలో హారిస్ కొత్తగా ఎన్నికైన సెనేటర్లతో ప్రతిజ్ఞ చేయిస్తుండగా అక్కడే ఉన్న అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇతర సభ్యులతో కలిసి నవ్వుతూ కనిపించారు. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థిగా పోటీచేసిన కమలాహారిస్ ట్రంప్ చేతిలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే.JD Vance laughing as Kamala Harris swears in new U.S. Senators 🤣pic.twitter.com/LRot5mia2Z— Benny Johnson (@bennyjohnson) January 3, 2025 ఇదీ చదవండి: ప్రధానిపై విమర్శలు..మస్క్కు బ్రిటన్ కౌంటర్ -
‘న్యూ ఓర్లీన్స్’ దాడి..ట్రంప్ కీలక ట్వీట్
వాషింగ్టన్:న్యూ ఓర్లీన్స్లో జరిగిన ట్రక్కు దాడిపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమొక్రాట్ల విధానాల వల్లే అమెరికాలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం(జనవరి3) ట్రంప్ ఎక్స్(ట్విటర్)లో ఓ పోస్టు చేశారు.సరిహద్దులు తెరిచి పెట్టడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.బలహీన,అసమర్థ నాయకత్వమే ఇందుకు కారణమన్నారు.డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్(డీవోజే) ఎఫ్బీఐ,డెమోక్రట్ ప్రభుత్వం,న్యాయవాదులు తమ విధిని సక్రమంగా నిర్వహించక పోవడం వల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.Our Country is a disaster, a laughing stock all over the World! This is what happens when you have OPEN BORDERS, with weak, ineffective, and virtually nonexistent leadership. The DOJ, FBI, and Democrat state and local prosecutors have not done their job. They are incompetent and…— Donald J. Trump (@realDonaldTrump) January 3, 2025అమెరికా విఫలమైందని అంతా మాట్లాడుకుంటున్నారన్నారు. న్యూ ఓర్లీన్స్లో బోర్బన్ వీధిలో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ ట్రక్కుతో జనంపైకి దూసుకువచ్చిన ఘటనలో 15 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దాడి తర్వాత పోలీసులు జరిపిన కాల్పుల్లో జబ్బార్ మృతి చెందాడు.ఈ కేసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. జబ్బార్ విదేశీ సంస్థల సహకారం లేకుండా ఒంటరిగానే ట్రక్కు దాడి చేశాడని ఎఫ్బీఐ తేల్చింది.అయితే ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచి జబ్బార్ స్ఫూర్తి పొందాడని ఎఫ్బీఐ తెలిపింది. ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్బీఐ కీలక ప్రకటన -
కాలిఫోర్నియాలో కూలిన విమానం
కాలిఫోర్నియా: వరుస విమాన ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. కాలిఫోర్ని యాలో విమాన ప్రమాదం జరిగింది. డిస్నీల్యాండ్కు సమీపంలోని ఆరెంజ్ కౌంటీలో ఉన్న ఫుల్లర్టన్ మున్సిపల్ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన నిమిషంలోనే విమానం కుప్పకూలింది. ఓ వాణిజ్య భవనం పైకప్పుపై పడింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 2.09 గంటలకు ఈ ఘటన జరిగింది. సింగిల్ ఇంజన్ కలిగిన నాలుగు సీట్ల చిన్న విమానమే అయినప్పటికీ.. ఫర్నీచర్ గోదామ్పై కుప్పకూలడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. విమానం కూలగానే గోదాములో మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేసి సమీప భవనాలను ఖాళీ చేయించారు. గతేడాది నవంబర్లో మరో చిన్న విమానం టేకాఫ్ అయిన వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా విమానాశ్రయానికి అర మైలు దూరంలో ఉన్న చెట్టును ఢీకొట్టింది. విమానంలో ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ఇదీ చదవండి: ట్రక్కు దాడి.. ఎఫ్బీఐ కీలక ప్రకటన -
USA:ట్రక్కు దాడి.. ఎఫ్బీఐ కీలక ప్రకటన
వాషింగ్టన్:న్యూ ఓర్లీన్స్ ట్రక్కు దాడిలో విదేశీ శక్తుల కుట్ర లేదని అమెరికా అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) తేల్చింది. దాడికి పాల్పడ్డ జబ్బార్ ఒంటరిగానే ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడని తెలిపింది. దాడికి ముందు జబ్బార్ ఫేస్బుక్లో ఐదు వీడియోలు పోస్ట్ చేసినట్లు పేర్కొంది.దాడి దర్యాప్తు పురోగతిని అధ్యక్షుడు బైడెన్కు ఎఫ్బీఐ వివరించింది. సుమారు గంట సేపు అధికారులతో చర్చించి దర్యాప్తు వివరాలను బైడెన్ తెలుసుకున్నారు. దాడిపై స్వదేశీ,విదేశీ కుట్ర కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని వైట్హౌజ్ వర్గాలు తెలిపాయి. ఈ దాడి కోసం జబ్బార్ విదేశీ సంస్థలతో కలిసి పనిచేయలేదు. అయితే అతను ఐసిస్ నుంచి స్ఫూర్తి పొందాడు. ఇది వంద శాతం ఉగ్రవాద చర్యనే’అని ఎఫ్బీఐ కౌంటర్ టెర్రరిజం విభాగానికి చెందిన అధికారి క్రిస్టఫర్ తెలిపారు. ఐసిస్ మళ్లీ పుంజుకోకుండా సిరియాలోని అమెరికా బలగాలు ఉగ్రవాద సంస్థ నేతలపై వైమానిక దాడులు నిర్వహిస్తున్నాయని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నూతన ఏడాది వేడుకల వేళ న్యూఓర్లీన్స్లో అమెరికా ఆర్మీ మాజీ ఉద్యోగి జబ్బార్ పికప్ ట్రక్కుతో జనంపైకి దూసుకొచ్చిన ఘటనలో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసుల కాల్పుల్లో జబ్బర్ మృతి చెందాడు. -
అమెరికాలోనూ ‘చాయ్.. సమోసా’
‘తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ’ అంటూ భారతీయ పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు అమెరికా కొత్త పల్లవి అందుకుంది. అక్కడి పర్యాటక పరిశ్రమ భారతీయుల కోసం రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఇతర దేశాల నుంచి అమెరికాకు టూరిస్టుల రాక భారీగా తగ్గడం.. అదే సందర్భంలో భారత్ నుంచి పర్యాటకుల సందడి పెరుగుతుండటం అగ్రరాజ్యానికి ఆశాకిరణంగా మారింది. ఫలితంగా అక్కడి పర్యాటక పరిశ్రమ మన సంప్రదాయాలను పుణికిపుచ్చుకుని ‘రండి.. రండి.. రండి’ అంటూ భారతీయులకు చక్కటి అతిథి మర్యాదలు చేస్తోంది.సాక్షి, అమరావతి: అమెరికా పర్యాటక పరిశ్రమ మందకొడిగా సాగుతోంది. కోవిడ్ మునుపటి స్థాయిని అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. నిరంతర ద్రవ్యోల్బణం కారణంగా అమెరికన్లు విశ్రాంతి ఖర్చులను తగ్గించుకుంటున్నారు. తూర్పు ఆసియా దేశాల నుంచి పర్యాటకుల రాక గణనీయంగా పడిపోయింది. ఈ ఖాళీని భారతీయ పర్యాటకులతో భర్తీ చేయాలని అమెరికా భావిస్తోంది. అగ్రరాజ్యానికి ఆతిథ్య పరిశ్రమ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఇందుకే అమెరికా హోటళ్లు భారతీయ సంప్రదాయ రుచులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. భారతీయ పర్యాటకులను ఆకర్షించి ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త ఆతిథి మర్యాదలు చేస్తున్నాయి.భారతీయ టీవీ చానళ్ల మోతఅమెరికా పర్యాటక పరిశ్రమలో ఆదాయాన్ని పునరుద్ధరించడానికి హోటళ్లు, ట్రావెల్ కంపెనీలు భారతీయ పర్యాటకులపైనే ఆశలు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగా అగ్రరాజ్య హోటళ్లు ‘చాయ్.. సమోసా’లను ప్రవేశపెట్టాయి. దీనికితోడు లాంజ్లు, గెస్ట్ రూమ్స్లో భారతీయ టీవీ చానళ్ల ప్రసారాల మోత మోగిస్తున్నాయి. యూఎస్ నేషనల్ ట్రావెల్ అండ్ టూరిజం ఆఫీస్ (ఎన్టీటీవో) డేటా ప్రకారం గతేడాది తొలి పది నెలల్లో సుమారు 20 లక్షల మంది భారతీయులు అమెరికాను సందర్శించారు.ఇది కోవిడ్ పూర్వపు స్థాయి కంటే 48 శాతం పెరుగుదలను నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా వ్యాపార సందర్శనల కోసం జారీ చేసిన వీసాలలో 50 శాతం, హాలిడే వీసాలు 43.50 శాతం వృద్ధి చెందాయి. విస్తరిస్తున్న భారతీయ మధ్యతరగతి జనాభా, అధిక ప్రయాణ బడ్జెట్లు, పెరిగిన విమాన సామర్థ్యం భారతీయుల్లో అంతర్జాతీయ ప్రయాణ ఒరవడిని చూపిస్తున్నాయి. చైనా, జపాన్ నుంచి తగ్గుదలఆర్థిక, సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాల నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య అమెరికాలో భారీగా తగ్గింది. ఇందులో చైనా నుంచి 44.50 శాతం, జపాన్ నుంచి 50.8 శాతం, దక్షిణ కొరియా నుంచి 23.90 శాతం క్షీణత నమోదైంది. వీరి స్థానాన్ని భారతీయులు భర్తీ చేస్తున్నట్టు ఆసియా అమెరికన్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ వెల్లడించింది. యూరోపియన్ పర్యాటకులు అమెరికాకు మళ్లీ తిరిగి వస్తున్నారు. అయితే యూకే, జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశీయుల సందర్శన 2019 ముందుతో పోలిస్తే తక్కువగా ఉంది. గతేడాది భారతీయ ప్రయాణికులు చేసిన యూఎస్ బుకింగ్లు 50 శాతంపైనే పెరిగాయి. ఇది 2019 కోవిడ్ మహమ్మారి స్థాయితో పోలిస్తే మూడు రెట్లు వృద్ధిని సూచిస్తోంది. ఓఏజీ ఏవియేషన్ డేటా ప్రకారం 2019తో పోలిస్తే గతేడాది భారత్–యూఎస్ మధ్య షెడ్యూల్డ్ విమాన సామర్థ్యం 42.3 శాతం పెరిగింది. -
అమెరికా ఖజానాపై సైబర్ దాడి..!
వాషింగ్టన్:అగ్ర దేశం అమెరికా ఖజానాపై చైనా సైబర్ దాడి చేసినట్లు సమాచారం. వర్క్ స్టేషన్లు,కీలక ఫైల్స్పై చైనా ప్రోద్బలంతో జరిగిన సైబర్ దాడిని గుర్తించామని అమెరికా ట్రెజరీ శాఖ కాంగ్రెస్కు లేఖ రాసింది.ఈ లేఖ మీడియా చేతికి చిక్కడంతో అసలు విషయం బయట పడింది.డిసెంబర్ నెల ప్రారంభంలో సైబర్ దాడి ఘటన జరిగినట్లు తెలుస్తోంది.థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస ప్రొవైడర్ పాస్వర్డ్ను కనిపెట్టిన హ్యాకర్లు బ్రేక్ చేసి వర్క్ స్టేషన్లు, కొన్ని ఫైల్స్లోని సమాచారాన్ని దొంగిలించారని ట్రెజరీ శాఖ అధికార ప్రతినిధి లేఖలో తెలిపారు.ఈ విషయాన్ని యూఎస్ సైబర్ సెక్యూరిటీ,ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ దృష్టికి ట్రెజరీ శాఖ తీసుకువెళ్లింది.సైబర్ దాడిపై ట్రెజరీ శాఖకు థర్డ్పార్టీ సైబర్ సెక్యూరిటీ సేవలందిస్తున్న బియాండ్ ట్రస్ట్ సంస్థ ఈ వ్యవహారంపై స్పందించలేదు. ఇటీవలి కాలంలో కొన్ని థర్డ్ పార్టీ సైబర్ సెక్యూరిటీ సర్వీస్ ప్రొవైడర్ను టార్గెట్ చేసి సైబర్ దాడులకు పాల్పడే ట్రెండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. -
రూపాయి పడింది... ఫీజు భారం పెరిగింది!
సాక్షి, హైదరాబాద్: డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్రమంగా పతనమవుతుండటంతో, ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారితో పాటు కొత్తగా ఎమ్మెస్ కోసం అక్కడికి వెళ్లాలని భావిస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. యూఎస్ వెళ్లేందుకు అన్ని సన్నాహాలూ చేసుకున్న విద్యార్థులు అంచనాలు తారుమారవడంతో ఆందోళన చెందుతున్నారు. 2022 ఫాల్ సీజన్ (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్)లో డాలర్ విలువ రూ.79 కాగా ఇప్పుడది రూ.85.03కు ఎగబాకడం గమనార్హం. 2014లో డాలర్ (Dollar) విలువ రూ. 60.95 మాత్రమే కావడం గమనార్హం. రూపాయి (Rupee) విలువ తగ్గిపోవడంతో విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజుల మొత్తం గణనీయంగా పెరిగిపోతోంది. ట్యూషన్ ఫీజు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన భారానికి తగిన మొత్తం ఎలా సమకూర్చుకోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. పెరిగిన మారకం విలువకు తగ్గట్టుగా బ్యాంకులు అదనంగా రుణాలు ఇచ్చేందుకు సిద్ధపడటం లేదు. ఇప్పటికే అప్పులు చేసిన విద్యార్థులు పెరిగిన ఖర్చును ఎలా సమకూర్చు కోవాలో పాలుపోని స్థితిలో ఉన్నారు. రూపాయితో పోల్చు కుంటే డాలర్ విలువ గత రెండేళ్లలోనే 8 శాతం పెరగడం విద్యార్థులపై పెనుభారం మోపుతోంది. మరోవైపు పార్ట్ టైం ఉద్యోగాలకు (part time jobs) అవకాశాలు సన్నగిల్లడంతో విద్యార్థులు భారత్లోని తల్లిదండ్రుల వైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ తదితర దేశాల్లో పరిస్థితి ఈ విధంగానే ఉందనే వార్తలొస్తున్నాయి. 2025లో రూ.5.86 లక్షల కోట్ల భారంభారత్ నుంచి ఏటా సగటున 13 లక్షల మంది విదేశీ విద్యకు వెళ్తున్నారు. వీరిలో 38 శాతం వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారే ఉంటున్నారు. 2025లో ఈ సంఖ్య 15 లక్షలకు చేరుతుందని అంచనా. ఇక 2019లో విదేశీ విద్యకు భారతీయులు చేసిన ఖర్చు రూ. 3.10 లక్షల కోట్లు కాగా 2022 నాటికి ఇది 9 శాతం పెరిగి రూ.3.93 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుతం డాలర్ విలువ పెరగడంతో 2024లోఇది 8 నుంచి 10 శాతం మేర పెరిగి రూ. 4.32 లక్షల కోట్లకు చేరుతుందని భారత ప్రభుత్వం అంచనా వేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో 2025లో ఇది రూ.5.86 లక్షల కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉందని విదేశీ మంత్రిత్వ శాఖ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫీజుకే అదనంగా రూ. 2.40 లక్షల వ్యయంస్ప్రింగ్ (మార్చి నుంచి జూన్) సీజన్లో చదువుకు సన్నాహాలు మొదలు పెట్టినప్పుడు వర్సిటీల ఫీజు సగటున రూ.24 లక్షలుగా విద్యార్థులు అంచనా వేసుకున్నారు. అయితే ప్రస్తుతం రూపాయి నేల చూపులు చూడటంతో ఇప్పుడు కనీసం రూ.2.40 లక్షలు అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక వసతి ఖర్చులు దీనికి అదనం కాగా.. మొత్తం మీద అమెరికాలో రూ.43 లక్షలతో ఎంఎస్ పూర్తవుతుందని అంచనా వేసుకుంటే, ఇప్పుడదని రూ. 52 లక్షల వరకు వెళుతుందని అంచనా. ఉపాధి భరోసా ఏదీ?అమెరికా వెళ్లే విద్యార్థి ముందుగా అక్కడ ఏదో ఒక పార్ట్టైం ఉద్యోగం వెతుక్కుంటాడు. 2019కి ముందుతో పోలిస్తే 2023లో ఈ అవకాశాలు 40 శాతం తగ్గాయని విదేశీ మంత్రిత్వ శాఖ అధ్యయనంలో గుర్తించారు. కరోనా తర్వాత ఏ దేశం నుంచి వచ్చిన విద్యార్థి అయినా పార్ట్ టైం ఉద్యోగం కోసం పోటీ పడాల్సి వస్తోంది. దీంతో అవకాశాలకు భారీగా గండి పడింది. కెనడాలో 2.22 లక్షల మంది భారత విద్యార్థులున్నారు. చదవండి: త్వరలో హైదరాబాద్ – డాలస్ విమానంఇక్కడ అమెరికాతో పోల్చుకుంటే 30 శాతం ఫీజులు తక్కువ ఉంటాయి. దీంతో ఈ దేశానికి వెళ్లేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇటీవల అక్కడ అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీసా నిబంధనల్లో మార్పులు తెర్చారు. 2020–21లో చదువు పూర్తి చేసిన వారికి పార్ట్టైం ఉద్యోగాలు వచ్చే పరిస్థితి తగ్గింది. దీంతో విద్యార్థులు అనేక కష్టాలు పడుతున్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియాలోనూ ప్రతికూల పరిస్థితులే కన్పిస్తున్నాయి. ఈ పరిస్థితి ఊహించలేదు అమెరికా వస్తున్పప్పుడు రూ. 50 లక్షల వరకు అప్పు చేశా. రూపాయి విలువ పతనంతో ట్యూషన్ ఫీజు మొత్తం పెరిగింది. ప్రస్తుతం వ్యక్తిగత ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకే గదిలో నలుగురం ఉంటున్నాం. అయినా ఇబ్బందిగానే ఉంది. పార్ట్ టైం ఉద్యోగం చేసినా పెద్దగా ఆదాయం ఉండటం లేదు. ఇంటికి ఫోన్ చేయాలంటే బాధగా అన్పిస్తోంది. ఇలాంటి పరిస్థితి ఊహించలేదు. – పాయం నీలేష్ (అమెరికాలో ఎంఎస్ విద్యార్థి)వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా..యూఎస్ వెళ్లడానికి బ్యాంక్ లోన్ ఖాయమైంది. కానీ ఈ సమయంలోనే రూపాయి పతనంతో యూనివర్సిటీకి చెల్లించాల్సిన మొత్తం పెరిగింది. బ్యాంకు వాళ్లు అదనంగా లోన్ ఇవ్వనన్నారు. మిగతా ఖర్చుల కోసం నాన్న అప్పుచేసి డబ్బులు సిద్ధం చేశారు. ఇప్పుడు ఆ డబ్బులు సరిపోయే పరిస్థితి లేదు. అమెరికా వెళ్లాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నా. – నీలిమ (అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్న విద్యార్థిని)2014లో డాలర్ విలువ రూ.60.952022 (ఫాల్ సీజన్)లో రూ.792024 డిసెంబర్లో రూ.85.032025లో రూ.9 లక్షల వరకు అదనపు భారం! -
హెచ్–1బీ వీసాలకు ట్రంప్ దన్ను
వాషింగ్టన్: నిపుణులైన విదేశీ కార్మికులకు అమెరికా సంస్థల్లో ఉపాధికి ఉద్దేశించిన హెచ్–1బీ వీసాల పరిరక్షణ కోసం యుద్ధానికైనా సిద్ధమని వ్యాఖ్యానించిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి మద్దతు లభించింది. హెచ్–1బీ వీసాల జారీని అమెరికాలో పలువురు వ్యతిరేకిస్తున్న వేళ ఈ పరిణామం చోటుచేసుకుంది. నిపుణులైన ఉద్యోగులకు అమెరికాలో పని చేసుకొనేందుకు అవకాశం కల్పించే హెచ్–1బీ వీసాలను వ్యతిరేకించేవారు తమ అభిప్రాయం మార్చుకోవాలని మస్క్ సూచించడం తెల్సిందే. కేవలం నైపుణ్యత మీదనే మనగలిగే స్పేస్ఎక్స్, టెస్లా వంటి సృజనాత్మక సంస్థలకు హెచ్–1బీ వీసాదారుల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించారు. ‘‘హెచ్–1బీ వీసా ప్రక్రియను నేనెప్పుడూ ఇష్టపడతా. వాటికి మద్దతు పలుకుతా. అందుకే అవిప్పటిదాకా అమెరికా వ్యవస్థలో కొనసాగుతున్నాయి. నా వ్యాపార సంస్థల్లోనూ హెచ్–1బీ వీసాదారులున్నారు. హెచ్–1బీ వ్యవస్థపై నాకు నమ్మకముంది. ఈ విధానాన్ని ఎన్నోసార్లు వినియోగించుకున్నా. ఇది అద్భుతమైన పథకం’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ పాలనలో సమూల సంస్కరణలే లక్ష్యంగా ట్రంప్ కొత్తగా తెస్తున్న డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్)కు సంయుక్త సారథులు కానున్న మస్క్, వివేక్ రామస్వామి హెచ్–1బీకి మద్దతు తెలుపుతున్నారు. దీన్ని రిపబ్లికన్ పారీ్ట సీనియర్లు తప్పుబడుతున్నారు. స్థానిక అమెరికన్లకే అధిక ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్న ట్రంప్ ఎన్నికల వాగ్దానానికి ఇది విరుద్ధమంటున్నారు. వాళ్ల వైఖరిని మస్క్ తప్పుబట్టారు. హెచ్–1బీ వీసాల కోసం ఎంతకైనా తెగిస్తానని శనివారం ప్రకటించారు. -
USA:హాలిడే సీజన్పై టోర్నడోల ఎఫెక్ట్
కాలిఫోర్నియా:క్రిస్మస్,న్యూఇయర్ సెలవులను ఎంజాయ్ చేద్దామనుకున్న అమెరికా(America) వాసులను వాతావరణం ఇబ్బందులకు గురిచేస్తోంది. టోర్నడోలు, భారీ మంచు కారణంగా ఏకంగా 7వేల దాకా విమానాలు శనివారం(డిసెంబర్28) ఆలస్యంగా నడిచాయి. దీంతో బంధు,మిత్రులతో కలిసి సెలవులు సరదాగా గడుపుదామనుకున్నవారికి నిరాశే ఎదురైంది.అట్లాంటా,హూస్టన్లలోని విమానాశ్రయాల నుంచి విమానాలు ఆలస్యంగా నడిచాయి.ఆగ్నేయ రాష్ట్రాలైన టెక్సాస్,లూసియానా,మిసిస్సిపిలలో కనీసం పది టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. టోర్నడోల ధాటికి ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు.కాలిఫోర్నియాలోని టాహో బేసిన్లో భారీ వర్షాలతో పాటు మంచు కురవనుందని వాతావరణశాఖ తెలిపింది.కాగా ఇయర్ ఎండింగ్లో అమెరికాలో కక్రిస్మస్తో పాటు న్యూఇయర్ను పురస్కరించుకుని ఉద్యోగులకు వరుస సెలవులు వస్తాయి. దీంతో సెలవుల్లో సరదాగా పర్యటనలకు వెళ్లడంతో పాటు బంధు,మిత్రులను కలిసేందుకు అమెరికా వాసులు ఎక్కువగా ప్రయాణాలు చేస్తారు. దీంతో ప్రస్తుతం అక్కడి విమానాశ్రయాలన్నీ కిటకిటలాడుతుంటాయి. -
టిక్టాక్పై నిషేధం ఆపండి: ట్రంప్
వాషింగ్టన్:అమెరికాలో అధికారం చేతులు మారనున్న వేళ టిక్టాక్(TikTok) యాప్ నిషేధం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) పదవీ బాధ్యతలు చేపట్టేవరకు టిక్టాక్పై నిషేధం విధించవద్దని ఆయన తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.వచ్చే ఏడాది జనవరి 20న ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టిక్టాక్పై నిషేధం కేసులో మరింత సమయం ఇవ్వాలని ట్రంప్ న్యాయవాదులు సుప్రీం కోర్టు(Supreme Court)ను కోరారు.దీనిపై రాజకీయ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వారు కోర్టుకు తెలియజేశారు. కాగా,యాప్ వినియోగదారుల డేటా సేకరిస్తున్నారనే ఆరోపణలతో భారత్ సహా పలు దేశాలు చైనాకు చెందిన టిక్టాక్పై ఇప్పటికే నిషేధం విధించాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికాలో టిక్టాక్ నిషేధానికి ప్రయత్నాలు జరిగాయి. న్యాయపరమైన చిక్కుల వల్ల నిషేధం ఆచరణలోకి రాలేదు.అప్పట్లో ట్రంప్ టిక్టాక్ నిషేధానికి తీవ్రంగా ప్రయత్నించారు. జాతీయ భద్రతకు టిక్టాక్ పెద్ద ముప్పుగా పరిణమించిందని ఆరోపణలు చేశారు.ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ టిక్టాక్పై నిషేధంపై బిల్లు ప్రవేశపెట్టారు.నిషేధానికి మద్దతుగా 352 మంది ఓటు వేయగా 65 మంది వ్యతిరేకించారు.దీంతో బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లుకు ట్రంప్ కూడా పరోక్షంగా మద్దతు పలికారు. అయితే,కొన్ని రోజుల తర్వాత అనూహ్యంగా ఆయన టిక్టాక్ వాడకం మొదలుపెట్టారు. దీంతో యాప్ నిషేధంపై తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఇటీవల అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనూ టిక్టాక్ నిషేధంపై మాట మార్చారు. తాను అధికారంలోకి వస్తే టిక్టాక్ను నిషేధించబోనని స్పష్టం చేశారు. -
మన్మోహన్కు ప్రధాని,రాష్ట్రపతి నివాళి
మన్మోహన్సింగ్ పార్థివ దేహానికి ప్రధాని మోదీ నివాళులు..మన్మోహన్ సింగ్ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీమాజీ ప్రధాని పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మోదీమన్మోహన్ సతీమణి గురుశరణ్కౌర్, కుటుంబ సభ్యులకు సంతాపంప్రధానితో పాటు మన్మోహన్ ఇంటికి వచ్చిన అమిత్ షా, జేపీ నడ్డా మన్మోహన్ పార్థివ దేహానికి రాష్ట్రపతి నివాళిమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి రాషష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళిమన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన ముర్ము ఢిల్లీమన్మోహన్సింగ్ పార్థివ దేహానికి తెలంగాణ సీఎం రేవంత్ నివాళులుమన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి నివాళులర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిమన్మోహన్ సింగ్ భార్య గురుశరణ్ కౌర్ను, ,కుటుంబ సభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డిమన్మోహన్ నివాసానికి కాంగ్రెస్ అగ్రనేతలుమన్మోహన్ ఇంటికి వచ్చిన సోనియాగాంధీ రాహుల్గాంధీ, మల్లికార్జునఖర్గే, ప్రియాంకగాంధీమన్మోహన్ పార్థివ దేహానికి నివాళులర్పించిన నేతలు వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు: మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ మన్మోహన్ లేని లోటు పూడ్చలేనిదిచాలా కాలం నుంచి మన్మోహన్ నాకు తెలుసుసభ్యతకు నిలువెత్తు రూపం మన్మోహన్సింగ్వీడియో విడుదల చేసిన మాజీ రాష్ట్రపతిఆ మాటే నిజమైంది: శశిథరూర్ మాజీ ప్రధాని మన్మోహన్ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ పోస్టు పెట్టిన శశిథరూర్చరిత్ర నా పట్ల దయతో ఉంటుందని 2014లో వ్యాఖ్యానించిన మన్మోహన్ఆయన చెప్పిన మాటలను గుర్తుచేస్తూ పోస్టు పెట్టిన కాంగ్రెస్ ఎంపీపదేళ్ల తర్వాత అదే నిజమైందని వ్యాఖ్యమన్మోహన్ దేశ సేవ..రాబోయే తరాలకు స్ఫూర్తి: సిక్కిం సీఎం తమాంగ్మన్మోహన్ మృతిపట్ల సంతాపం తెలిపిన సిక్కిం సీఎం ప్రేమ్సింగ్ తమాంగ్ఆర్థిక సంస్కరణలకు నాంది పలికి దేశాభివృద్ధికి గట్టి పునాది వేశారుదేశానికి మన్మోహన్ చేసిన సేవలు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని వ్యాఖ్య మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల అమెరికా సంతాపంగత రెండు దశాబ్దాల్లో అమెరికా,భారత్ సాధించిన మన్మోహన్ పునాది వేశారుఅమెరికా, భారత్ పౌర అణు సహకార ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మన్మోహన్ కీలక పాత్ర పోషించారుభారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు ప్రజలకు గుర్తుండిపోతాయిప్రకటించిన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ -
బిల్ క్లింటన్కు అస్వస్థత..ఆస్పత్రిలో చేరిక
వాషింగ్టన్:అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు.చికిత్స కోసం ఆయనను వాషింగ్టన్లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయాన్ని క్లింటన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు.బిల్ క్లింటన్ జ్వరంతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. క్లింటన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. క్రిస్మస్ పండుగకు ఆయన ఇంటికి తిరిగి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.కాగా,అమెరికా అధ్యక్షుడిగా బిల్క్లింటన్ రెండు సార్లు (1993-2001) పనిచేశారు. 2001 తర్వాత వైట్హౌస్ను వీడిన ఆయన తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు.2004లో తీవ్ర ఛాతీ నొప్పి, శ్వాసకోస సమస్యలు రావడంతో ఆయనకు నాలుగుసార్లు బైపాస్ సర్జరీ చేశారు. ఏడాది తర్వాత ఊపిరితిత్తులు మళ్లీ దెబ్బతినడంతో తిరిగి ఆస్పత్రిలో చేర్పించారు.2010లో గుండె సంబంధిత సమస్య రావడంతో మరోసారి శస్త్రచికిత్స చేసి రెండు స్టెంట్లు అమర్చారు. తర్వాత కొద్ది రోజులకు ఆయన పూర్తిగా కోలుకున్నారు.ఇటీవల 2021లో మూత్రనాళ ఇన్ఫెక్షన్కు చికిత్స తీసుకున్నారు.నవంబర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో డెమోక్రట్ల తరఫున ఆయన చురుకుగా ప్రచారం నిర్వహించారు.