భారతీయులపై తీవ్ర వ్యాఖ్యలు..మస్క్‌ టీమ్‌ సభ్యుడు రాజీనామా | DOGE Engineer Resigned For Comments On Indians In America | Sakshi
Sakshi News home page

భారతీయులపై తీవ్ర వ్యాఖ్యలు..మస్క్‌ ‘డోజ్‌’ టీమ్‌ సభ్యుడు రాజీనామా

Published Fri, Feb 7 2025 4:09 PM | Last Updated on Fri, Feb 7 2025 4:38 PM

DOGE Engineer Resigned For Comments On Indians In America

వాషింగ్టన్‌:ప్రముఖ బిలియనీర్‌ ఇలాన్‌ మస్క్‌ నేతృత్వం వహిస్తున్న అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫీషియెన్సీ (డీవోజీఈ) టీమ్‌ నుంచి ఓ ఇంజినీర్‌ రాజీనామా చేశాడు. 25 ఏళ్ల మార్కో ఇలెజ్‌ అనే ఇంజినీర్‌ భారతీయులపై సోషల్‌మీడియాలో గతంలో చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు తాజాగా వైరల్‌ అయ్యాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో దుమారం రేగింది. ముఖ్యంగా భారత్‌ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే ఇలెజ్‌ తన పోస్టుకు రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇలెజ్‌ రాజీనామాపై అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. అతడు గతంలో ‘నార్మలైజ్‌ ఇండియా హేట్‌’ అనే పోస్టుతో పాటు ఇండియా నుంచి వచ్చిన హెచ్‌-1బీ వీసాదారులను ఉద్దేశించి ‘గోయింగ్‌ బ్యాక్‌ డోంట్‌ వర్రీ’ అనే వివాదాస్పద పోస్టులు పెట్టాడు. ఈ పోస్టులపై తీవ్ర వ్యతిరేకత రావడంతో డీవోజీఈ ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌కు ఇలెజ్‌ రాజీనామా చేశాడు. ఈ పోస్టు ఖాలీ అయినట్లు ప్రభుత్వం ఇప్పటికే నోటిపై చేసింది. ఇలెజ్‌ డీవోజీఈ కంటే ముందు ఎక్స్‌(ట్విటర్‌)లోనూ ఇలాన్‌ మస్క్‌తో కలిసి పనిచేయడం గమనార్హం​.

కాగా, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత భారతీయులతో సహా పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారులను అమెరికా నుంచి సైనిక విమానాల్లో పంపివేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు సన్నిహితుడైన ఇంజినీర్‌ భారతీయులకు వ్యతిరేకంగా చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు వెలుగులోకి రావడం చర్చనీయాంశమవుతోంది. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement