జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు ఏమైంది.? | Masood Azhar InjuredIn Rawalpindi Hospital Blast | Sakshi
Sakshi News home page

పేలుళ్లలో జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు గాయాలు

Jun 25 2019 10:11 AM | Updated on Jun 25 2019 10:13 AM

Masood Azhar InjuredIn Rawalpindi Hospital Blast - Sakshi

పేలుళ్లలో జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు గాయాలు

న్యూఢిల్లీ : రావల్పిండి ఆస్పత్రిలో సోమవారం జరిగిన పేలుళ్లలో గాయపడిన పదిమందిలో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ ఉన్నట్టు భావిస్తున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మసూద్‌ అజర్‌ ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై పాకిస్తాన్‌ పెదవివిప్పడం లేదు. మరోవైపు భారత నిఘా సంస్ధలు సైతం ఈ విషయాన్ని ఇంతవరకూ ధ్రువీకరించలేదు. 

కాగా, ఓ స్ధానిక చానెల్‌ రావల్పిండి ఆస్పత్రిలో జరిగిన పేలుడులో అజర్‌ సహా పది మంది గాయపడ్డారని వెల్లడించడం గమనార్హం. పాకిస్తాన్‌ సైన్యం నిర్వహించే ఈ ఆస్పత్రికి అజర్‌ తరచూ డయాలసిస్‌ చేయించుకునేందుకు వెళతారని చెబుతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో జరిగిన భారీ పేలుడులో గాయపడిన వారిని ఎమర్జెన్సీకి తరలించారని ట్విటర్‌ యూజర్‌ అషన్‌ ఉలా మియాఖల్‌ పోస్ట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement