Masood Azhar
-
మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్..మసూద్ అజార్కి గుండెపోటు!
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషీ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ గుండెపోటుకు గురైనట్లు తెలుస్తోంది. భారత్లోని పూల్వామాపై జరిగిన ఉగ్రదాడిలో మౌలానా మసూద్ అజార్ కీలక సూత్రధారితా ఉన్నాడు. ప్రస్తుతం ఆఫ్ఘానిస్తాన్లో ఉన్న మసూద్ గుండెపోటుకు గురి కావడంతో చికిత్స కోసం పాకిస్తాన్ తరలించినట్లు సమాచారం. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అజర్ గుండెపోటుకు గురైనప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నట్లు తేలింది. చికిత్స కోసం ఆఫ్ఘనిస్తాన్ నుంచి గోర్బాజ్ మీదిగా పాకిస్తాన్కు తరలించారు. తన వైద్య సంరక్షణ కోసం ఇకార్డియాలజిస్టులతో కరాచీలోని కంబైన్డ్ మిలటరీ ఆసుపత్రిలో చేరినట్లు తెలిసింది., ఆ తర్వాత రావల్పిండిలోని సైనిక ఆసుపత్రికి తరలించే అవకాశం ఉ న్నట్లు వా ర్తలు వస్తున్నాయి. కాగా, భారత్ ఆధీనంలో ఉండగా 1999లో భారత్కు చెందిన ఇండియన్ ఎయిర్లైన్ విమానం ఐసీ-814 ఖాట్మాండూ నుంచి న్యూఢిల్లీకి ప్రయాణిస్తుండగా హైజాక్ గురైంది. హైజాక్ చేసిన అనంతరం విమానాన్ని కాందహార్లోకి తీసుకెళ్లారు. ఉగ్రవాదుల డిమాండ్ల మేరకు తమ ఆధీనంలో ఉన్న మసూద్ అజార్ను భారత్ విడుదల చేయాల్సి వచ్చింది.ఈ విడుదల తరువాత, అజార్ పాకిస్తాన్లో జైషే మహ్మద్ అనే ఉగ్రసంస్థను స్థాపించాడు. ఈ ఉగ్రసంస్థ 2001లో భారత్ పార్లమెంట్పై దాడి, 2016లో పఠాన్ కోట్ దాడి, 2019లో పుల్వామాపై దాడికి పాల్పడ్డాడు.#BreakingNews : Maulana Masood Azhar, Jaish-e-Mohammed Terrorist And Founder, Gets Heart Attack: ReportAdmitted to Hospital in Karachi#MasoodAzhar #Kazakistanfather of the nation pic.twitter.com/apMdkziqnj— Kapadia CP 🇮🇳 (@Ckant72) December 26, 2024 -
మసూద్ అజార్ హతం?
ఇస్లామాబాద్: కాందహార్ విమానం హైజాక్ సూత్రధారి మసూద్ అజార్ బాంబు పేలుడులో హతయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్గా మారాయి. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో పాకిస్తాన్లోని భావల్పూర్ మసీదు నుంచి వస్తుండగా బాంబు పేలిన ఘటనలో అతడు హతమైనట్లు ధ్రువీకరించని ట్వీట్ల ద్వారా తెలుస్తోంది. పేలుడుకు సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. అనంతరం పాక్ ఆర్మీ దావూద్ ఇబ్రహీం సహా పలువురు ఉగ్రవాదులపై దాడులు చేపట్టినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తోంది. భారత్లో మోస్ట్ వాంటెడ్గా ఉండి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం తదితర రెండు డజన్ల మంది వరకు ఉగ్రవాదులు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలోనే తాజా పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. 2001 పార్లమెంట్పై దాడి ఘటనకు సంబంధించిన కేసుల్లో అజార్ను భారత్ వాంటెడ్గా ప్రకటించింది. 2008లో నేపాల్ నుంచి భారత్కు బయలుదేరిన ఇండియన్ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి, అఫ్గానిస్తాన్లోని కాందహార్కు తీసుకెళ్లారు. హైజాకర్ల డిమాండ్ మేరకు జైళ్లలో ఉన్న అజార్ సహా ముగ్గురు కరడుగట్టిన ఉగ్రవాదులను భారత్ ప్రభుత్వం విడిచిపెట్టింది. విమాన ప్రయాణికుల్లో ఒకరిని పొడిచి చంపిన ఉగ్రవాదులు, మరికొందరిని గాయపరిచారు. వారంపాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ అనంతరం అందులోని 176 మందిని ఉగ్రవాదులు సురక్షితంగా విడిచిపెట్టారు. -
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహార్ మృతి?
వరల్డ్ మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాది మసూద్ అజహార్(55) మృతి చెందాడా?. ఈ ఉదయం గుర్తు తెలియని దుండగులు జరిపిన బాంబు దాడిలో మసూద్ చనిపోయినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. 1999లో కాందహార్ విమాన హైజాక్ జరిగింది ఇతని విడుదల కోసమే. భారత పార్లమెంట్పై 2001లో జరిగిన దాడితో పాటు 2008 ముంబై దాడులు, 2016లో పఠాన్కోట్ దాడి, 2019 పుల్వామా దాడులకు కారణమైన జేషే మహమ్మద్ సంస్థను స్థాపించింది అజహారే. మహమద్ మసూద్ అజహార్ అల్వీ.. ఉగ్రసంస్థ జైషే మహమ్మద్ స్థాపకుడు. సోమవారం ఉదయం భవల్పూర్ మసీదు నుంచి తిరిగి వెళ్తున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై బాంబు విసిరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. మసూద్ అజహార్ మృతిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరోవైపు పాక్లో గత కొంతకాలంగా ఉగ్రవాదులు.. ఉగ్ర సంస్థల నేతలు మిస్టరీ పరిస్థితుల్లో మృతి చెందుతున్న సంగతీ తెలిసిందే. BIG BREAKING NEWS - As per unconfirmed reports, Most wanted terrorist, Kandhar hijacker Masood Azhar, has been kiIIIed in a bomb expIosion by UNKNOWN MEN at 5 am 🔥🔥 He was going back from Bhawalpur mosque. UNKNOWN MEN working even on New Year day ⚡ He was the chief of Terror… pic.twitter.com/XG97TMmIE8 — Times Algebra (@TimesAlgebraIND) January 1, 2024 పాక్ పంజాబ్ రాష్ట్రంలో ఓ విద్యావంతుల కుటుంబంలో పుట్టిన అజహార్.. కశ్మీర్ స్వేచ్ఛ పేరిట ఉగ్ర కార్యకలాపాలకు దిగాడు. బ్రిటన్కు జిహదీని పరిచయం చేసింది ఇతనే. భారత్ ఇతన్ని అరెస్ట్ చేస్తే.. ఇతని విడుదల డిమాండ్తో ఏకంగా విమానం హైజాక్ చేశారు. కాందహార్ హైజాక్ ఘటనగా భారత్కు ఒక మాయని మచ్చగా మిగిలిపోయిందా ఘటన. జైల్లో ఉన్నప్పుడు అమెరికా దర్యాప్తు సంస్థలు.. ఇంటర్పోల్ సైతం ఇతన్ని గతంలో ప్రశ్నించాయి. 2019, మే 1వ తేదీన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇదీ చదవండి: కాందహార్ హైజాకర్.. ఫర్నీచర్ షాప్ ఓనర్ ముసుగులో ఇంతకాలం! భారత్ పట్టుకుంటే.. 1994లో అజహార్ ఫేక్ ఐడీ మీద శ్రీనగర్కు చేరుకున్నాడు. అక్కడ రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం చేయాలనుకున్నాడు. అయితే భారత భద్రత బలగాలు ఫిబ్రవరిలో అనంతనాగ్ జిల్లా ఖానాబల్ దగ్గర అజహార్ను అరెస్ట్ చేశాయి. అప్పటి నుంచి పాక్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు అతన్ని బయటకు రప్పించే ప్రయత్నాలు చేస్తూ వచ్చాయి. చివరకు.. 1999 డిసెంబర్లో మసూద్ అజహార్ సానుభూతి పరులు ఇండియన్ఎయిర్లైన్స్ విమానం 814ను హైజాక్ చేసి కాందహార్కు తరలించారు. ఆ సమయంలో కాందహార్ పాక్ ఐఎస్ఐ మద్దతుతో తాలిబన్ల ఆధీనంలో ఉండేది. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారానికి అజహార్ సోదరుడు అబ్ధుల్ రౌఫ్ అజహార్ నేతృత్వం వహించాడు. విమాన ప్రయాణికుల విడుదల కోసం జరిపిన దౌత్య పరమైన చర్చలు విఫలం కావడంతో.. అప్పటి భారత ప్రభుత్వం అజహార్ను విడుదల చేయాల్సి వచ్చింది. కోట్ భల్వాల్ జైలు నంచి అప్పటి పోలీస్ అధికారి శేష్ పాల్ వైద్ నేతృత్వంలో అజహార్ అప్పగింత జరిగింది. ఆ తర్వాత ఐఎస్ఐ సంరక్షణలోనే చాలా కాలం అజహార్ పాక్ అంతటా స్వేచ్ఛగా తిరుగుతూ బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించాడు. అయితే పాక్ మాత్రం అజహార్ తమ దగ్గర లేడంటూ బుకాయిస్తూ వచ్చింది. హైజాక్ ఇలా.. 1999 డిసెంబర్ 24న సుమారు 180 మంది ప్యాసింజర్లు, 11 మంది బృందంతో వెళ్తున్న IC-814 విమానాన్ని .. ఐదుగురు ఉగ్రవాదులు దారి మళ్లించి హైజాక్ చేశారు. అమృత్సర్, లాహోర్, దుబాయ్ మీదుగా కాందహార్కు చేర్చారు. అక్కడ ఆ విమానం తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లింది. ఈ హైజాక్ వ్యవహారంలో.. 25 ఏళ్ల భారత ప్రయాణికుడు రూపిన్ కట్యాల్ను పొట్టనబెట్టుకున్నారు హైజాకర్లు. చివరికి డిసెంబర్ 31న.. కరడుగట్టిన ఉగ్రవాది అజహార్ను భారత్ విడుదల చేయడంతో.. మిగతా ప్రయాణికులను అప్పగించారు. -
మసూద్పై చర్యలుంటాయా? పాక్ ప్రధాని రియాక్షన్ ఏంటంటే..
సమర్ఖండ్: పాకిస్తాన్ బుద్ధి మరోసారి.. అదీ అంతర్జాతీయ వేదికగా బయటపడింది. గ్లోబల్ టెర్రరిస్ట్, జైషే ముహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్. ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సదస్సుకు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ హాజరయ్యారు. అయితే.. అంతర్జాతీయ మీడియాతో ముఖాముఖి సందర్భంగా ఆయన్ని ఇరకాటంలో పడేశాడు భారత జర్నలిస్ట్ ఒకరు. భారత్కు చెందిన ఓ మీడియా జర్నలిస్ట్.. ‘షరీఫ్ సాబ్.. మసూద్ అజార్ మీద ఒక చిన్నప్రశ్న. అతనికి వ్యతిరేకంగా మీ చర్యలు ఉంటాయా?’ అని ప్రశ్నించారు. అయితే.. దానికి సమాధానం ఇవ్వకుండా పక్కనే ఉన్న తన ప్రతినిధితో మాట్లాడుకుంటూ ముందుకెళ్లారు. అయితే అక్కడే ఉన్న ఆయన సిబ్బంది సదరు జర్నలిస్ట్ను మళ్లీ ఆ ప్రశ్న అడగకుండా నిలువరించే యత్నం చేశారు. ఇకచాలూ.. దయచేసి ఆపండి అంటూ సిబ్బందిలోని ఓ వ్యక్తి సదరు జర్నలిస్ట్కు సూచించారు కూడా. ఇదిలా ఉంటే.. భారత్ సహా పలుదేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడిన జైషే ముహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ను ఐక్యరాజ్య సమితి గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించింది. అయితే.. ఈమధ్యే మసూద్ అఫ్గన్లో ఉన్నాడంటూ పాక్ ఆరోపించగా.. అలాంటి ఉగ్రసంస్థలను ఆదరించే ఘనత కేవలం పాక్కే ఉంటుందంటూ తాలిబన్లు సెటైర్లు వేశారు. ఇదీ చదవండి: మళ్లీ అక్కడ శవాల దిబ్బలే దర్శనమిస్తున్నాయి -
మా గడ్డ మీలాగా కాదు.. పాక్కు తాలిబన్ల కౌంటర్
కాబూల్: అఫ్గనిస్థాన్లోని అనధికారిక తాలిబన్ల ప్రభుత్వం.. పొరుగు దేశం పాకిస్తాన్కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. జైష్ - ఇ - మహ్మద్ చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన మసూద్ అజర్, అఫ్గనిస్తాలో తలదాచుకున్నాడంటూ పాక్ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టింది. అలాంటి ఉగ్రసంస్థలకు పాక్ గడ్డే అడ్డాగా ఉంటుందని, చివరకు అలాంటి సంస్థలను అక్కడి ప్రభుత్వమే పెంచి పోషిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ(తాత్కాలిక) అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తీవ్రంగా స్పందించారు. అఫ్గన్ నంగార్హర్ ప్రావిన్స్లో మౌలానా మసూద్ అజర్ తలదాచుకున్నాడని, అతనిని గుర్తించి.. అరెస్ట్ చేసి ఇస్లామాబాద్కు అప్పగించాలని ఇప్పటికే అఫ్గన్ను ఓ లేఖ రాసినట్లు పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పాక్ మీడియా హౌజ్లు కొన్ని ఆ కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది. ‘‘అలాంటి లేఖ ఏం మా ప్రభుత్వానికి అందలేదు. అసలు జైషే చీఫ్ మా దేశంలోనే లేడు. అఫ్గన్ భూభాగాన్ని.. మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి మేము ఎవరినీ అనుమతించబోం. అలాంటిది వాళ్లకు(పాక్ను ఉద్దేశించి) మాత్రమే సాధ్యం’’ అంటూ జబీహుల్లా ముజాయిద్ పేర్కొన్నారు. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదంటూ అఫ్గన్ విదేశీ వ్యవహారాల శాఖ పాక్ను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. పాశ్చాత్య దేశాలకు చెందిన పర్యాటకులను కిడ్నాప్ చేసిన నేరానికి భారత్లో శిక్ష అనుభవించాడు అజర్. అయితే.. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ ఐసీ-814 హైజాక్ వ్యవహారంలో ప్రయాణికుల కోసం భారత్ అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. బయటకు వచ్చాక జైష్ ఈ మొహమద్ను నెలకొల్పి.. భారత్లో ఎన్నో ఉగ్రవాద దాడులను నిర్వహించాడు. దీంతో పాక్ ఆ సంస్థను నిషేధించింది. మే 2019లో ఐరాస అతన్ని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారి కూడా ఈ మసూదే. ఇదీ చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి యాక్సిడెంట్! -
తాలిబన్లతో జైషే మహ్మద్ చీఫ్ భేటీ, జమ్మూలో హై అలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉగ్రదాడులు జరగొచ్చన్న నిఘావర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అఫ్గానిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో జమ్మూలో ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందన్న నిఘా సంస్థలు హెచ్చరికలతో హైఅలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా జైషే మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్, కాందహార్లో తాలిబన్ల పొలిటికల్ కమిషన్ హెడ్ ముల్లా అబ్దుల్ ఘని బరాదర్, ఇతర నాయకులతతోనూ భేటీ అయిన నేపథ్యంలో ఈ అలర్ట్ జారీ అయింది. అంతేకాదు అన్ని రాష్ట్రాలు భద్రతా చర్యలు చేపట్టాలని తీవ్రవాద వ్యతిరేక విభాగాలను కూడా అప్రమత్తం చేయాలని నిఘా అధికారులు హెచ్చరించారు. జమ్మూ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలపై లభించిన సమాచారం ఆధారంగా నిఘా సంస్థలు అధికారులను అప్రమత్తం చేశాయి. ఏదైనా అవాంఛనీయ పరిస్థితులు ఎదురైతే, సమర్ధవంతంగా తిప్పికొట్టేలా ఈ సమాచారాన్ని రాష్ట్ర నిఘా, భద్రతా సంస్థలతో పంచుకున్నట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. సోషల్ మీడియాలో నిఘా ఉంచాలని కూడా ఆదేశించినట్టు ప్రకటించారు. ఆగస్టు మూడో వారంలో కందహార్లో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్-ఇ-మహ్మద్ (జేఈఎం) నాయకులు, తాలిబాన్ నాయకుల సమావేశ మైనట్టు తమ దృష్టికి వచ్చిందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా ఇండియాలో ఉగ్ర కార్యకలాపాలకు జేఈఎం తాలిబన్ మద్దతుకోరిందనీ, పాకిస్తాన్ రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించినట్లు వెల్లడించాయి. కాగా అఫ్గానిస్తాన్ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న తర్వాతనుంచీ వేలాది మంది వేలాదిమంది దేశం విడిచి వెళ్లేందుకు కాబూల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో అనేక హృదయవిదాకరదృశ్యాలు ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టాయి. ఈ క్రమంలో గురువారం కాబూల్ విమానాశ్రయంలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి సంచలనం రేపింది. మరోవైపు ఈ పేలుడుకు తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ఐఎస్కేపీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పుల్వామా దాడులు.. చార్జిషీట్ దాఖలు
న్యూఢిల్లీ: దేశ ప్రజలను తీవ్ర విచారంలోకి నెట్టడమే కాక పాక్, ఇండియా మధ్య యుద్ధ పరిస్థితులకు దారి తీసిన పుల్వామా దాడి కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. జైషే మహ్మద్ చీఫ్, ఉగ్రవాది మసూద్ అజర్తో పాటు అతడి సోదరుడు రౌఫ్ అస్గర్ పేరును ఎన్ఐఏ ఈ చార్జిషీట్లో చేర్చింది. పుల్వామా దాడికి వీరిద్దరే ప్రధాన సూత్రధారులని ఎన్ఐఏ ఛార్జిషీట్లో పేర్కొంది. 5,000 పేజీలతో కూడిన ఛార్జిషీట్ను ఎన్ఐఏ జమ్మూ కోర్టులో సమర్పించనుంది. ఈ దారుణమైన ఉగ్రదాడులకు ఎలాంటి ప్రణాళిక రచించారు.. పాక్ నుంచి ఎలా అమలు చేశారనే దాని గురించి అధికారులు చార్జిషీట్లో పూర్తిగా వివరించారు. అంతేకాకుండా జైషే మహ్మద్కు చెందిన 20 మంది ఉగ్రవాదులు ఈ దాడికి అవసరమైన ఆయుధాలను సమకూర్చారని ఛార్జిషీట్లో తెలిపారు. వీటన్నింటికీ అవసరమైన పూర్తి ఆధారాలను కూడా ఎన్ఐఏ బృందం కోర్టుకు సమర్పించనుంది. వాట్సాప్ చాటింగ్, ఫొటోలు, ఆర్డీఎక్స్ రవాణాకు సంబంధించిన ఫొటోలు, ఫోన్ కాల్స్ డేటా... ఇలా కీలక ఆధారాలను ఎన్ఐఏ అధికారులు కోర్టుకు నివేదించనున్నారు. (చదవండి: మళ్లీ ‘పూల్వామా’ దాడి జరిగితేనే బీజేపీ గెలుపు!) భారత్ కశ్మీర్ను ఆక్రమించుకున్నందనే పాక్ ఈ దాడులకు తెగబడిందని ఎన్ఐఏ తెలిపింది. భారత్పై దాడికి పాక్, స్థానికుడు ఆదిల్ అహ్మద్ దార్ను ఉపయోగించింది. అతడు సూసైడ్ బాంబర్గా మరి సీఆర్పీఎఫ్ దళాలు ప్రయాణిస్తున్న కాన్వాయ్ మీదకు పేలుడు పదార్థాలతో నిండిని కారును దూకించాడని అధికారులు తెలిపారు. ఇక పుల్వామా దాడిలో పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన దేశం పాత్రను ఖండించిన సంగతి తెలిసిందే. భారతదేశం సాక్ష్యాలు ఇస్తే నేరస్థులను విచారిస్తామని కూడా తెలిపారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. పైగా అంతర్జాతీయ సమాజం నుంచి ఎంత ఒత్తిడి వస్తున్నప్పటికి పాక్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. -
‘మసూద్ పాక్ జైలులో మగ్గలేదు’
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ పాకిస్తాన్ జైలులో మగ్గుతున్నాడనే వార్తలను భారత అధికారులు తోసిపుచ్చారు. పాకిస్తాన్లోని ఏ జైలులోనూ మసూద్ అజర్ ఎన్నడూ లేడని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మసూద్ ప్రస్తుతం అజ్ఞాతంలో గడుపుతున్నాడని, ఆయన చివరిసారి బహవల్పూర్లోని జైషే మహ్మద్ హెడ్క్వార్టర్స్ మర్కజ్ సుభానల్లాకు వచ్చాడని ఆ వర్గాలు తెలిపాయి. మసూద్ ఆరోగ్యం సైతం మెరుగుపడిందని, అయితే ఆయన జనబాహుళ్యంలోకి రావడం లేదని పేర్కొన్నాయి. ఈ ఏడాది మేలో మసూద్ అజర్ను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. కాగా భారత్ను రెచ్చగొట్టే చర్యల్లో భాగంగా పాకిస్తాన్ వాస్తవాధీన రేఖ వెంబడి సాయుధ దళాలను మోహరించిన క్రమంలో మసూద్ కదలికలపై సమాచారం బహిర్గతం కావడం గమనార్హం. మరోవైపు జమ్మూ కశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ను మోదీ ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో భారత్లో భారీ ఉగ్రదాడికి ఐఎస్ఐ సహకారంతో ఉగ్ర మూకలు స్కెచ్ వేస్తున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. -
భారత్కు తోడుగా ఉంటాం: అమెరికా
వాషింగ్టన్ : అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా ప్రకటించిన భారత ప్రభుత్వ నిర్ణయాన్ని అగ్రరాజ్యం అమెరికా సమర్థించింది. ఉగ్రవాదాన్ని రూపుమాపడంలో భారత్కు అమెరికా ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు...‘ నలుగురు ఉగ్రవాదులు మౌలానా మసూత్ అజర్, హఫీజ్ సయీద్, జకీ ఉర్ రెహ్మాన్, దావూద్ ఇబ్రహీంలను ఉగ్రవాదులుగా గుర్తిస్తూ ఇండియా తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతున్నాం. భారత్- అమెరికా కలిసి ఉగ్రవాదులను ఏరివేయడానికి ఈ కొత్త చట్టం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నాం’ అని అమెరికా దక్షిణ, మధ్య ఆసియా దేశాల వ్యవహారాల బ్యూరో ట్వీట్ చేసింది. కాగా చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)-1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన నెలలోపే.. దావూద్, మసూద్, సయీద్, లఖ్వీలను కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు భారత కేంద్ర హోంశాఖ వెల్లడించిన విషయం విదితమే. ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఇక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఇప్పటికే ఈ నలుగురిపై అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మౌలానా మసూద్ అజార్ (జైషే మహమ్మద్ చీఫ్): ప్రమేయం ఉన్న దాడులు 2001లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీపై దాడులు 2001లో పార్లమెంటుపై దాడి 2016లో పఠాన్కోట వైమానిక స్థావరంపై దాడి 2017లో శ్రీనగర్లో సరిహద్దు భద్రతా శిబిరంపై దాడి ఈ ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణించే బస్సుపై దాడి హఫీజ్ మహమ్మద్ సయీద్ (లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు) : ప్రమేయం ఉన్న దాడులు 2000 సంవత్సరంలో ఎర్రకోట సహా వివిధ ప్రాంతాల్లో దాడులు అదే ఏడాది యూపీలో రాం పూర్లో సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడి భారత్పై జరిగిన దాడుల్లో అత్యంత హేయమైనది 2008 ముంబై దాడులు 2015లో కశ్మీర్ ఉధంపూర్లో సరిహద్దు భద్రతా దళం కాన్వాయ్పై దాడి జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ (లష్కరే తోయిబా కమాండర్): ప్రమేయం ఉన్న దాడులు 2000లో ఎర్రకోటపై దాడి 2008 ముంబై దాడులు రాంపూర్ సీఆర్పీఎఫ్ శిబిరంపై దాడులు జమ్మూ కశ్మీర్ ఉధంపూర్లో సరిహద్దు భద్రతా దళంపై దాడులు లఖ్వీని ఐక్యరాజ్యసమితి 2008లో అంతర్జాతీయ ఉగ్రవాది ప్రకటించింది దావూద్ ఇబ్రహీం(అండర్ వరల్డ్ డాన్ ) పాకిస్తాన్లో తలదాచుకుంటున్న అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్పై దాడులకి ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్నాడు. ఆర్థిక సాయాన్ని అందించాడు తన అనుచరులతో కలిసి దాడులకు వ్యూహరచన చేశాడు. అల్ఖైదా, తాలిబన్ల కార్యకలాపాలకు మద్దతుగా ఉన్నాడు. 257 మంది నిండు ప్రాణాలను పొట్టనపెట్టుకున్న 1993లో ముంబైలో వరుస బాంబు పేలుళ్లు దావూద్ అనుచరుల పనే. We stand w/ #India & commend it for utilizing new legal authorities to designate 4 notorious terrorists: Maulana Masood Azhar, Hafiz Saeed, Zaki-ur-Rehman Lakhvi & Dawood Ibrahim. This new law expands possibilities for joint #USIndia efforts to combat scourge of terrorism. AGW — State_SCA (@State_SCA) September 4, 2019 -
ఆ నలుగురు
న్యూఢిల్లీ: జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్, లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ మహమ్మద్ సయీద్, ముంబై ఉగ్రవాద దాడుల నిందితుడు జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంలను వ్యక్తిగత హోదాలో ఉగ్రవాదులుగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నియంత్రణ) సవరణ చట్టం(యూఏపీఏ)–1967కు కీలక సవరణలకు పార్లమెంటు ఆమోదం తెలిపిన ఒక నెలలోనే ఈ నలుగురిని కొత్త చట్టం కింద ఉగ్రవాదులుగా ప్రకటించినట్లు కేంద్ర హోంశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఇప్పటివరకు యూఏపీఏ కింద చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన సంస్థలనే ఉగ్రవాదులుగా ప్రకటించేవారు. కానీ కొత్తగా అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం వ్యక్తుల్ని సైతం ఉగ్రవాదులుగా ప్రకటించే వెసులుబాటు ఉంది. ఈ చట్టం కింద ఉగ్రవాదుల్ని ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వీరిని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా ముద్రవేసి వారిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. -
‘యాత్ర’కు బ్రేక్? ఏమిటా నిఘా సమాచారం!
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం అనూహ్యంగా జమ్మూకశ్మీర్లో కొనసాగుతున్న అమర్నాథ్ యాత్రను నిలిపేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా జమ్మూకశ్మీర్కు భారీగా బలగాలనూ తరలించింది. ఒక్కసారిగా లోయలో భయాందోళన రేకెత్తించిన ఈ పరిణామాల వెనుక.. నిఘా వర్గాలు అందించిన కచ్చితమైన సమాచారమే కారణమని తెలుస్తోంది. జమ్మూకశ్మీర్లో ఉగ్రమూకలు ఎలాంటి అవాంఛనీయ దాడులకు పాల్పడకుండా.. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఆత్మాహుతి దాడులు జరిగే అవకాశముందని, సోపూర్ ప్రాంతంలో ఐఈడీ (ఇంప్రూవైస్డ్ పేలుడు పదార్థాల)లతో భద్రతా బలగాలను జైషే మహమ్మద్ (జేఈఎం) తదితర ఉగ్రమూకలు టార్గెట్ చేయవచ్చునన్న నిఘా వర్గాల సమాచారమే ఈ ఆకస్మిక పరిణామాలకు కారణమని ఈ వ్యవహారంతో పరిచయం కలిగిన ఇద్దరు విశ్వసనీయ వ్యక్తులు ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. ఏమిటా నిఘా సమాచారం! జేఈఎం చీఫ్ మసూద్ అజార్ సోదరుడు ఇబ్రహీం అజార్ గత నెలలో పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్లో కనిపించాడని జాతీయ భద్రతా సంస్థలకు కచ్చితమైన నిఘా సమాచారం అందింది. 1999 నాటి భారత్ విమానం హైజాక్ ప్రధాన సూత్రధారి అయిన ఇబ్రహీం అజార్ తన కొడుకు మృతికి ప్రతీకారంగా లోయలోకి చొరబడి.. ఇక్కడ భద్రతా దళాలపై జరిపే ఉగ్రదాడులకు నేతృత్వం వహించాలని కోరుకుంటున్నాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇబ్రహీం అజార్ నేతృత్వంలో సుశిక్షితులైన జేఈఎం ఉగ్రవాదులు బార్డర్ యాక్షన్ టీమ్స్ను ఏర్పాటు చేసి.. సరిహద్దు నియంత్రణ రేఖ మీదుగా ఉన్న పాక్ ఆర్మీ పోస్టుల దిశగా కదిలాయని నిఘా వర్గాలు వెల్లడించాయి. ఇబ్రహీం కొడుకు ఉస్మాన్ హైదర్ గత ఏడాది అక్టోబర్లో కశ్మీర్లోకి చొరబడి.. అదే నెల 30వ తేదీన పుల్వామాలోని అవంతీపురలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. మరో బంధువు, మసూద్ అజార్ బావమరిది అబ్దుల్ రషీద్ కొడుకు తహ్లా రషీద్ 2017 నవంబర్ 6న పుల్వామా కండి అల్గార్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఈ నేపథ్యంలో ఆగ్రహంతో రగిలిపోతున్న ఇబ్రహీం.. తన కొడుకు తరహాలోనే భారత బలగాలపై పోరాడుతూ చనిపోతానని జేఈఎం కేడర్కు చెప్పాడని నిఘా వర్గాలు తెలిపాయి. ఇబ్రహీం అజార్ కశ్మీర్లో పెద్ద ఎత్తున దాడులకు గ్రౌండ్వర్క్ చేయడంపై కచ్చితమైన సమాచారం అందడంతో కేంద్రం వెంటనే అప్రమత్తమై ఈ నిర్ణయం తీసుకుందని ఓ సీనియర్ భదత్రాధికారి వెల్లడించారు. పాకిస్థాన్కు చెందిన జేఈఎం, లష్కరే తోయిబా తమ ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయడాన్ని నిఘా వర్గాలు ఇప్పటికే పసిగట్టాయి. అంతేకాకుండా అమర్నాథ్ యాత్ర మార్గంలో ఎం24 స్నిపర్ రైఫిల్, భద్రతా దళాలు లక్ష్యంగా అమర్చిన మందుపాతరలు దొరకడంతో పొంచి ఉన్న ముప్పును గ్రహించిన కేంద్రం వెంటనే అమర్నాథ్ యాత్రను నిలిపివేసిందని, దీంతో యాత్రకు రక్షణగా ఉన్న బలగాలు తిరిగి ఉగ్రమూకల ఏరివేత ఆపరేషన్కు సన్నద్ధమవుతాయని ఆ అధికారి తెలిపారు. కశ్మీర్లో హింసాత్మక దాడులే లక్ష్యంగా పాక్ సాయుధ మూకలు లోయలోకి పెద్ద ఎత్తున చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయని, కశ్మీర్లో పలుచోట్ల ఆత్మాహుతి దాడులు నిర్వహించాలని అవి తలపోస్తున్నాయని నిఘా వర్గాలు స్పష్టం చేశాయి. పెషావర్ నుంచి సుశిక్షితులైన జేఈఎం సాయుధ మూక కశ్మీర్లోకి చొరబడి.. భారత బలగాలపై మెరుపుదాడులు నిర్వహించాలని, ఉత్తర కశ్మీర్లోని సోపూర్లో ఐఈడీలతో భద్రతా దళాలను టార్గెట్ చేయాలని పథకాన్ని రచించినట్టు పేర్కొన్నాయి. పాక్ సైన్యంతోపాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రసంస్థలు కూడా ఈ దాడుల విషయంలో ఆ మూకలకు సహకారం, సమన్వయం అందించనున్నాయని నిఘా వర్గాలు తెలిపాయి. -
జైషే చీఫ్ మసూద్ అజర్కు ఏమైంది.?
న్యూఢిల్లీ : రావల్పిండి ఆస్పత్రిలో సోమవారం జరిగిన పేలుళ్లలో గాయపడిన పదిమందిలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉన్నట్టు భావిస్తున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మసూద్ అజర్ ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై పాకిస్తాన్ పెదవివిప్పడం లేదు. మరోవైపు భారత నిఘా సంస్ధలు సైతం ఈ విషయాన్ని ఇంతవరకూ ధ్రువీకరించలేదు. కాగా, ఓ స్ధానిక చానెల్ రావల్పిండి ఆస్పత్రిలో జరిగిన పేలుడులో అజర్ సహా పది మంది గాయపడ్డారని వెల్లడించడం గమనార్హం. పాకిస్తాన్ సైన్యం నిర్వహించే ఈ ఆస్పత్రికి అజర్ తరచూ డయాలసిస్ చేయించుకునేందుకు వెళతారని చెబుతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో జరిగిన భారీ పేలుడులో గాయపడిన వారిని ఎమర్జెన్సీకి తరలించారని ట్విటర్ యూజర్ అషన్ ఉలా మియాఖల్ పోస్ట్ చేశారు. -
మసూద్ ఆస్తుల ఫ్రీజ్
ఇస్లామాబాద్: జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపజేయడంతోపాటు ఆయనపై ప్రయాణ నిషేధాన్ని పాక్ విధించింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించడంతో పాక్ ఈ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన మసూద్ ఇకపై ఆయుధాలు, మందుగుండు సామగ్రిని కొనడం, అమ్మడం వంటివి చేయడానికి వీలు లేదు. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్ (ఎస్ఈసీపీ) గురువారం పాకిస్తాన్లోని అన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఆదేశాలిస్తూ, మసూద్కు చెందిన అన్ని పెట్టుబడుల ఖాతాలను స్తంభింపజేయాలంది. పోలీసుల అనుమతి లేకుండా మసూద్ ఎక్కడికీ ప్రయాణిచడానికి కూడా వీలు లేదని పాక్ హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. కాగా, పుల్వామా ఉగ్రవాద దాడ అనంతరమే మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. -
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఉగ్రవాదిగా ప్రకటన
-
మసూద్ వ్యవహారం మా ఘనతే : జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ను ప్రశంసించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ప్రధాని మోదీ అవిశ్రాంత కృషి, ఉగ్రవాదంపై రాజీలేని పోరుతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడి, బాలాకోట్లో భారత వైమానిక దాడుల వంటి పరిణామాల అనంతరం చైనా వైఖరిలో వచ్చిన మార్పులు కూడా సానుకూల ఫలితాలు ఇచ్చాయని చెప్పారు. మసూద్ అజర్ వ్యవహారంలో విపక్షాల తీరును జైట్లీ తప్పుపట్టారు. దేశం విజయం సాధిస్తే అది భారతీయులందరి విజయంగా పరిగణించాలని అన్నారు. ఇది భారతీయులందరూ గర్వించదగిన పరిణామం అయితే, విపక్షంలో కొందరు ఈ దౌత్యవిజయంలో పాలుపంచుకుంటే రాజకీయంగా మూల్యం చెల్లించుకుంటామని భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. -
ఇమ్రాన్ ఖాన్ మోదీ ఫ్రెండేగా..ఏం లాభం?
భోపాల్ : పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన సంగతి తెలిసిందే. విషయంలో ఎన్నో ఏళ్లుగా మోకాలడ్డుతున్న చైనా.. అగ్రదేశాల ఒత్తిడులకు ఎట్టకేలకు తలొగ్గక తప్పలేదు. దీంతో భారత్కు భారీ దౌత్య విజయం లభించింది. ఫలితంగా, అజార్ ఆస్తులను స్తంభింపజేసేందుకు, అతడి ప్రయాణంపై నిషేధం విధించేందుకు, ఆయుధాలు సమకూర్చుకునే వీలు లేకుండా చేసేందుకు ఐరాసకు సత్వరం వీలు కలిగింది. ఈ విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, భోపాల్ ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్ స్పందించారు. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్నేహితుడిగా ఉన్నంతకాలం ఐరాస నిషేధం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయని ఆయన ప్రశ్నించారు. చదవండి : అజహర్ అంతర్జాతీయ ఉగ్రవాదే భోపాల్లో ఓ కార్యక్రమంలో డిగ్గీరాజా మాట్లాడుతూ... ‘ పాక్ ప్రధాని ఇమ్రాన్ మోదీజీతో స్నేహం కోసం పాకులాడుతున్నారు. ఇలాంటి సమయంలో మసూద్ అజహర్పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది. దావూద్ ఇబ్రహీం, మసూద్ అజహర్, హఫీజ్ సయీద్ వంటి ఉగ్రవాదులను వెంటనే భారత్కు అప్పగించాలని భారత్ డిమాండ్ చేయాలి. అదొక్కటే సరైన మార్గం అని వ్యాఖ్యానించారు. ఇక మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించటాన్ని కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. యూపీఏ హయాంలో లష్కర్ ఏ తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తలపై రివార్డు ప్రకటించినట్లుగా.. అజహర్ తలపై కూడా భారీ రివార్డు ప్రకటించాలని డిమాండ్ చేసింది. కాగా కశ్మీర్లోని పుల్వామాలో భద్రతా దళం కాన్వాయ్పై జైషే ఉగ్రవాది చేసిన దాడిలో 40 మందికి పైగా జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం పాక్లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేయడం, ఈ క్రమంలో భారత పైలట్ పాక్ ఆర్మీకి చిక్కడం వంటి పరిణామాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఉగ్రదాడులకు కారణమైన మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అగ్ర దేశాలను కోరిన భారత్.. చివరకు బుధవారం దౌత్యపరంగా పెద్ద విజయం సాధించింది. -
ఫలించిన దౌత్యం.. అంతర్జాతీయ ఉగ్రవాదిగా మసూద్
న్యూయార్క్ : దశాబ్ధ కాలంగా భారత్ చేస్తోన్న ప్రయత్నం నేటితో ఫలించింది. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రదాడికి పాల్పడింది తామేనని జైషే మహ్మద్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడి అనంతరం మసూద్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ పదే పదే ఐక్యరాజ్యసమితిని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా నాలుగు సార్లు అడ్డుకున్నప్పటికీ చివరికి భారత్దే పైచేయి అయింది. మసూద్ని బ్లాక్ లిస్ట్లో చేర్చినట్లు భారత అంబాసిడర్ సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ‘అందరికీ శుభవార్త.. మసూద్ అజర్ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ విషయంలో అందరి సహకారం చాలా గొప్పది. అందరికీ ధన్యవాదాలు’ అని అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. Big,small, all join together. Masood Azhar designated as a terrorist in @UN Sanctions list Grateful to all for their support. 🙏🏽#Zerotolerance4Terrorism — Syed Akbaruddin (@AkbaruddinIndia) May 1, 2019 -
‘పుల్వామా దాడితో మసూద్కు సంబంధం లేదంటేనే’
ఇస్లామాబాద్ : ఉగ్రవాది మసూద్ అజహర్ను బ్లాక్లిస్ట్లో పెట్టాలంటూ భారత్.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాక కొన్ని రోజుల క్రితం బ్రిటన్ కూడా త్వరలోనే మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తామని.. పాక్లోని ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పుల్వామా ఉగ్రదాడిలో జైషే పాత్ర లేదని భారత్ ఒప్పుకుంటేనే.. మసూద్ అజహర్ను బ్లాక్లిస్ట్లో పెట్టే అంశంపై చర్చిస్తామంటూ సదరు మంత్రి షరతులు విధించడం గమనార్హం. పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి మహ్మద్ ఫైజల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘పుల్వామా ఉగ్రదాడిలో మసూద్ అజహర్ పాత్ర ఉన్నట్లు భారత్ దగ్గర ఏమైనా రుజువులున్నాయా. ఉంటే వాటిని ప్రపంచానికి చూపించాలి. ఒకవేళ ఎలాంటి ఆధారాలు లేకపోతే.. లేవని ఒప్పుకోవాలి. భారత్ అలా చేస్తేనే మసూద్ని బ్లాక్ లిస్ట్లో పెట్టే విషయం గురించి చర్చిస్తాం’ అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాక ‘పుల్వామా దాడి అనేది ప్రత్యేక అంశం. దీన్ని.. మసూద్ అజహర్కు ముడిపెట్టడం భావ్యం కాదు. కానీ ఈ విషయంలో భారత్ తీరు ఏం బాగోలేదు. కశ్మీర్లో దేశీయ తిరుగబాటును అణచివేయడానికి భారత్ చేసే ప్రయత్నాల్లో ఈ ప్రచారం ఓ భాగమే. దీని గురించి మేం ఎంత చెప్పినా ఎవరూ నమ్మడం లేద’ని ఫైజల్ పేర్కొన్నాడు. ఓవైపు మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ.. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి తెస్తుండగా.. చైనా మాత్రం అందుకు అడ్డుతగులుతున్న సంగతి తెలిసిందే. -
నేను బతికే ఉన్నా.. మరేం పర్లేదు!
ఇస్లామాబాద్ : ‘నేను బతికే ఉన్నాను... పూర్తి ఆరోగ్యంగా ఉన్నా.. మరేం పర్లేదు. మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీతో పోలిస్తే నేను చాలా ఫిట్గా ఉన్నా. నాతో ఆయన ఏ ఆట ఆడతానన్నా సరే సిద్ధంగా ఉన్నా. సవాల్ విసురుతున్నా’ అంటూ ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ తన పత్రికలో పేర్కొన్నాడు. మసూద్ మరణించాడంటూ ఇటీవల సోషల్ మీడియా, పాక్ మీడియాలలో వార్తలు ప్రచురితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జైషే మహ్మద్ అధికార పత్రిక ఆల్-కలాంలో సాది అనే కలం పేరిట కథనం రాసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కథనం ప్రకారం... తన గురించి వస్తున్న వదంతులను నమ్మవద్దని మసూద్ పేర్కొన్నాడు. పుల్వామా దాడిని జైషే సాధించిన గొప్ప విజయంగా అతడు అభివర్ణించాడు. దాడికి పాల్పడి 40 మందికి పైగా భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న తమ కమాండర్ ఆదిల్ అహ్మద్ దార్ను ప్రశంసిస్తూ.. ‘కశ్మీర్లో ఆదిల్ ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. తను రగిల్చిన మంట ఇప్పట్లో చల్లారే ప్రసక్తే లేదు’ అంటూ ద్వేషపూరిత కథనంలో పేర్కొన్నాడు. అదే విధంగా ఆఫ్గనిస్తాన్ ప్రజల పరిస్థితిపై కూడా మసూద్ ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇందుకు సంబంధించి కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది.(ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు?) కాగా కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఆత్మాహుతికి పాల్పడి ఆదిల్ అనే ఉగ్రవాది భారత జవాన్ల కాన్వాయ్పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రతీకారంగా భారత వైమానిక దళం బాలాకోట్లోని జైషే స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాదాన్ని విడనాడాలంటూ భారత్తో పాటు అగ్ర దేశాలన్నీ హెచ్చరిస్తున్నా పాక్ తీరు మార్చుకోవడం లేదు. తమ దేశంలో ఆశ్రయం పొందుతున్న మసూద్ అజహర్ను మాత్రం భారత్కు అప్పగించడం లేదు. మరోవైపు... జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న భారత్కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్ దేశీయ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్ అజర్ పేరును ఐరోపా యూనియన్ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. -
బెడిసికొడుతున్న మన దౌత్యం
జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ యూఎన్ భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకుంది. చైనా ప్రభుత్వ నియంత్రణలోని మీడియా భారత్ను మొరటుగా హెచ్చరించే తరహా వ్యాఖ్యానాలు చేసింది. మరోవైపున చైనా పేరు ప్రస్తావించడానికి కూడా సాహసించకుండానే భారత్ ఆ దేశం పట్ల తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. భవిష్యత్తు పరిణామాలను ముందే అంచనా వేసి వ్యవహరించడంలో చైనా ముందంజలో ఉండగా, వరుస తప్పిదాలతో మోదీ ప్రభుత్వం వెనుకబడిపోయింది. మోదీ విదేశీ విధానంలో కొనసాగుతున్న అయిదు తప్పులు భారత్కు సరైన దౌత్య ఫలితాలను అందకుండా చేస్తున్నాయి. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా ఉండేదీ, ప్రబలమైనదీ ఏమిటి? భయమా లేక ప్రేమా? ఈ ప్రశ్నకు మీరు మనస్తత్వ నిపుణుడిని సమాధానం అడగాల్సి ఉంది. మరోవైపున రాజకీయ కాలమిస్టు ఏం చేయగలడు కఠిన వాస్తవాలను సేకరించడం తప్ప, కల్పన నుంచి, ప్రచారార్భాటం నుంచి వాటిని వేరుచేయడం తప్ప. వాటి ఆధారంగా ముఖ్యమైన వాదనను ప్రేరేపించడం తప్ప. ఈ వారం ప్రారంభంలో, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ను ప్రపంచ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని చైనా అడ్డుకోవడం ద్వారా భారత్ను తీవ్రంగా చికాకుపెట్టింది. ఐరాస ప్రయత్నాన్ని చైనా నాలుగోసారి అడ్డుకోవడమే కాదు. చైనా ప్రభుత్వ, కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలోని మీడియా భారత్ను మొరటుగా హెచ్చరించే తరహా వ్యాఖ్యానాలు చేసింది. కమ్యూనిస్టు పార్టీ యాజమాన్యంలోని ‘గ్లోబల్ టైమ్స్’ వ్యాఖ్యాత మరీ మోటుగా భారత్ గురించి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహావేశంతో ఉన్న చిత్రాలను చూపిస్తూ నరేంద్రమోదీ ప్రస్తుత పరిస్థితిని తన రాజకీయ ప్రచారానికి వాడుకుం టున్నారని ఆరోపిస్తూ చివరగా ఘోరంగా అవమానిస్తూ ఆ వ్యాఖ్యాత తన వ్యాఖ్యానాన్ని ముగించారు. అదేమిటంటే.. చైనా భారత్ మిత్రురాలే తప్ప దాని జాతీయవాదానికి బందీ కాదు. చైనా ప్రభుత్వం దాని అధికార పార్టీ వాణి ద్వారా తన అభిప్రాయాన్ని ఇలా ప్రకటింపజేస్తూ, తన దృష్టిలో భారత్కి, ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న స్థానమేంటో చూపించిందనడంలో సందేహమే లేదు. ఈ వ్యాఖ్యానం ద్వారా చైనా తన ఊహాన్ భేటీ స్ఫూర్తిని పునర్నిర్వచించింది. మీ దేశంలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో మీ భూభాగంలో నా సైనిక దళాలు బైఠాయించనట్లయితే, మన మధ్య ఒప్పందాన్ని నేను గౌరవిస్తాను. ఇతరత్రా సందర్భాల్లో మాత్రం పాత నిబంధనలు వర్తిస్తాయి అన్నదే దీనర్థం. చైనా దురహంకార వైఖరిలో కొట్టొచ్చినట్లుగా రెండు స్పందనలు కనబడుతున్నాయి. అవేమిటంటే వాటి స్వరం, వక్కాణింపులే. మరోవైపున చైనా పేరు ప్రస్తావించడానికి కూడా సాహసించకుండానే భారత్ ‘ఒక దేశం’ పట్ల తన అసంతృప్తిని అలా వ్యక్తపరిచింది. కానీ అమెరికాకు అలాంటి తటాపటాయింపులు ఏమీ లేవు. భారత్ పిరికి ప్రకటన కంటే ఎంతో నిష్కర్షగా, తీవ్రంగా అమెరికన్లు చైనాను పేరెత్తి మరీ విమర్శించారు. భారత్ తన కండపుష్టిని ఇప్పటికీ కోల్పోలేదు. కానీ, ఇప్పుడు అది మరింత జాగ్రత్తగా తన మాటలను, చేతలను ఎంపిక చేసుకుంటోంది. 2019 మార్చి నెలలో అంటే ఎన్నికలకు 2 నెలల ముందు భారత్ తన పట్ల శత్రుపూరితంగా వ్యవహరిస్తున్న చైనా పట్ల అధైర్యంతో వ్యవహరిస్తోంది. అదే సమయంలో ట్రంప్ పాలనలోని స్నేహపూర్వకమైన అమెరికాతో మాత్రం పూర్తి స్వదేశీ వాణిజ్య యుద్ధాన్ని భారత్ ప్రారంభి స్తోంది. మనం చైనా అంటే భయపడుతున్నాం. అదే సమయంలో మన తరఫున మాట్లాడుతున్న దేశంతో పోట్లాడుతున్నాం. మోదీ విదేశీ విధాన సూత్రంలో కొనసాగుతున్న అయిదు తప్పులను మనం ఇక్కడ చూద్దాం. 1. మన వ్యూహాత్మక కూటములను మనం పెద్ద హృదయంతో అభినందించడంలో మన వైఫల్యం: వ్యూహాత్మకంగా ట్రంప్ పాలనలోని అమెరికా మనకు ఎంతో బలిష్టమైన పొత్తుదారు, మిత్రురాలు కూడా. కానీ ట్రంప్తో మొదలుకుని అమెరికా పాలనా విభాగంలోని ఉన్నత స్థానాల్లో భారత్ గురించి ఒక అలక్ష్యంలాంటిది ఏర్పడిపోయింది. ట్రంప్ను దూకుడు పిల్లాడిగా తోసిపుచ్చడానికి భారత్ తొందరపడుతోంది కానీ అలా ప్రకటించేంత సత్తా మనకుందా? హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్పై భారత సుంకాల విషయంలో ట్రంప్ దూకుడు చూసి మీరు నవ్వుకోవచ్చు కానీ స్వదేశంలో వాణిజ్యం విషయంలో భారత్ అమలుచేస్తున్న స్వీయ రక్షణ వైఖరిని ట్రంప్ కూడా తప్పుబడుతున్నారు. దిగుమతి చేసుకుంటున్న ఔషధాలు, వైద్య పరికరాల ధరలను బాగా తగ్గించివేయడం నైతికంగా, రాజకీయపరంగా మంచి నిర్ణయమే. కానీ ఆకస్మికంగా ధరల నియంత్రణ, దిగుమతులపై ఆంక్షలు విధిస్తూ మీరు ఇలాంటి చర్యలను అమలు చేయగలరా? భారతీయ ఇ–కామర్స్లో, డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసుల్లో చైనా పెట్టుబడులను స్వాగతిస్తూనే తమ అమెజాన్, వాల్మార్ట్లపై యుద్ధం ప్రకటిస్తున్న భారత్.. అమెరికన్లకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. పుల్వామా ఘటన తర్వాత అమెరికా భారత్ పక్షాన నిలిచిన తీరు విశ్వసనీయమైనదే కాగా మరోవైపున మోదీ, ట్రంప్ మధ్య సంబంధాలు, వ్యక్తిగత బంధం విషయంలో అవరోధాలున్నాయి. 2017 నవంబర్ నుంచి వీరిద్దరి మధ్య ద్వైపాక్షిక భేటీ జరగడం లేదు.2018 నవంబర్లో బ్యూనోస్ ఎయిర్స్లో జీ–20 దేశాల సదస్సు సందర్భంగా ఇరువురి మధ్య భేటీ కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తనకు అనుకూలమైన అంశాలను పరిష్కరించకపోతే ట్రంప్ కనీసం ఫోటోలకు, గంభీరమైన ఫోజులకు సమయం వెచ్చించడానికి కూడా ట్రంప్ ఇష్టపడే రకం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్యపరంగా అమెరికాకు కాస్త అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడంవల్ల భారత్ కొంపేమీ మునిగిపోదు కదా! అయినా ట్రంప్ ఏమంత పెద్దకోరికలు కోరారనీ. ఆప్ఘనిస్తాన్లో అమెరికన్ సైన్యాలు పడుతున్న పాట్లు పడమని మనల్ని ట్రంప్ కోరడం లేదు. అలాగే రష్యన్ తయారీ ఎస్–400 క్షిపణి వ్యవస్థలను భారత్ కోరవద్దని ట్రంప్ ఒత్తిడి చేయడం లేదు. పైగా ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవును మూసివేయవలసిందిగా కూడా తను కోరడం లేదు. కొన్ని రకాల సుంకాలపై, వాణిజ్యంపై కాస్త మినహాయింపులను తాను కోరుకుంటున్నారు. తెలివైన నాయకులు ప్రత్యేకించి మిత్రులతో జరపాల్సి వచ్చిన ఘర్షణలను తెలివిగా ఎంచుకుని పరిష్కరించుకుంటారు. ట్రంప్తో స్వదేశీ వాణిజ్య యుద్ధరంగాన్ని ప్రారంభించడం ద్వారా మోదీ పెద్దతప్పు చేశారు. 2. అహంకారపూరితమైన అగ్రరాజ్యాలతో ఏకపక్ష బుజ్జగింపు విధానం పనిచేస్తుందన్న తప్పు లెక్క: ఈ అంశాన్ని ఇలా చూద్దాం. అమెరికాతో 60 బిలియన్ డాలర్ల మేరకు వాణిజ్య మిగులును ఆస్వాదిస్తూనే భారత్ మరోవైపున అమెరికాతో వాణిజ్య సంబంధాలను ప్రతిష్టంభనలోకి నెట్టివేసింది. కానీ చైనాతో మనకు 60 బిలియన్ డాలర్ల లోటు వ్యాపారం ఉంటున్నప్పటికీ ఆ దేశానికి పూర్తిగా అనుమతులు ఇచ్చేస్తున్నాం. చైనా సరకులకు, పెట్టుబడులకు విస్తృతంగా మన మార్కెట్లను తెరవడం వెనుక, భారత్ పట్ల చైనా వ్యూహాత్మక విధానాన్ని మెత్తపర్చే ఆలోచన ఉందేమో. కానీ మనమనుకున్నట్లు ఏమీ జరగలేదు. రెండేళ్ల క్రితం చైనీయులు డోక్లామ్లో అడుగుపెట్టారు. ఇప్పుడు వాళ్లు పంపిస్తున్న సందేశం కూడా మోటుగానే ఉంటోంది. మీరు ఎన్నికలకు సిద్ధమవుతున్న సందర్భంలో మేము డోక్లామ్ లేక చుమార్ ఘటనలను పునరావృతం కానివ్వకూడదనుంటే థాంక్యూ అనే నోట్ను మాకు పంపిం చండి. అమెరికా నుంచి అన్నీ వదులుకోవాలని మోదీ ప్రభుత్వం డిమాండ్ చేస్తూనే, చైనానుంచి అన్నీ తీసుకో అనే విధానాన్ని చేపడుతోంది. ఒక దేశాన్ని తక్కువగా చూడటం మరోదేశం ముందు భయంతో సాగిలబడటం అనే విధానమే ఇది. 3. వ్యక్తిగతీకరించిన విదేశీ విధానం పట్ల వ్యామోహం: మోదీకి ప్రజాకర్షణ మిన్న. కానీ వృత్తినైపుణ్యంతో కూడిన దౌత్యానికి సన్నద్ధమవడానికి, దాన్ని కొనసాగించడానికి ప్రజాకర్షణ మాత్రమే సరిపోదు. దీనికి అంతర్గత చర్చ, సంప్రదింపుల ద్వారా విధానాలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. అలాగే ఇతర నేతల వ్యక్తిగత శైలి, వైఖరులు కూడా వ్యత్యాసంతో ఉంటాయి. మోదీ మంత్రిమండలి కంటే మరింత ప్రతిభావంతంగా పనిచేసే వ్యవస్థను జిన్పింగ్ నిర్మించుకున్నారు. మోదీ చైనా అధ్యక్షుడితో తొలిసారి నెరిపిన ప్రేమతో కూడిన భేటీ ప్రయోజనాలు కలిగించలేదని ఇప్పుడు తేలిపోయింది. తర్వాత గ్జియాన్, ఊహాన్ ఇతర చోట్ల కూడా ఇదే కొనసాగింది. మన రిపబ్లిక్ డేకి ట్రంప్ను ఆహ్వానించడంలో, నవాజ్ షరీఫ్తో విఫల కౌగిలింతలో వేసిన తప్పటడుగులు మనం సరైన హోంవర్క్ చేయలేదని తేల్చేసింది. 4. తప్పు అంచనాలతో మూల్యం: రాజకీయాలు, దౌత్యం, యుద్ధం, క్రీడలు, జూదం అన్నింట్లో సరైన అంచనా చాలా విలువైనది. ఇక్కడే మోదీ తప్పు చేశారు. ఎన్నికలకు ముందుగా మోదీ మరొక దాడికి దిగబోతున్నట్లుగా చైనాకు తెలుసు. పాకిస్తాన్పై దాడి చేసి వెనువెంటనే విజయం సాధించామని మోర విరుచుకున్నట్లుగా చైనాతో మోదీ వ్యవహరించలేరని చైనా నేతలకు తెలుసు. సరైన అంచనా వేయడమే చైనీ యులు చేసే మొదటిపని. 5. దేశీయ రాజకీయాలతో విదేశీ విధానాన్ని మిళితం చేయడం: మోదీ స్వదేశంలో ప్రతిష్ట పెంచుకోవడం కోసం తరచుగా తన విదేశీ విధానాన్ని, సదస్సులను ఉపయోగించుకుంటూ ఉంటారు. సరిగ్గా దీన్నే చైనీయులు మొదటగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎన్నికల సీజన్లో మరొక దాడి జరగొచ్చన్న భారతీయ భయాందోళన చైనాకు తెలుసు. అందుకే ఊహాన్లో తమనుంచి భారత్కు హామీ ఇచ్చారు కానీ తమ ఆంక్షల ప్రకారమే ఇచ్చారు. చైనా వాణిజ్య ఆధిపత్యం పెరుగుతోంది. అరుణాచల్, పాకిస్తాన్ వ్యవహారాల్లో వారి దృక్పథం మరింత కఠినంగా మారింది. కానీ భారత్ మాత్రం చైనా పేరు కూడా ఎత్తడానికి సాహసించకుండా మసూద్ అజర్ విషయంలో నంగినంగిగా నిరసన తెలుపతోంది దీనివల్లే భారత్ ఎక్కడుండాలో అక్కడే చైనా ఉంచగలుగుతుంది. మొత్తంమీద చూస్తే ఇది మోదీ అయిదేళ్ల పాలనపై విదేశీ విధాన సమతుల్యతా పత్రం కాదు. ఇది మోదీ తీవ్ర తప్పిదాలు, వాటి పర్యవసానాల చిట్టా మాత్రమే. శేఖర్ గుప్తా వ్యాసకర్త ద ప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
మసూద్ అజర్కు మరో షాక్
పారిస్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న భారత్కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్ అజర్ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్ దేశీయాంగ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్ అజర్ పేరును ఐరోపా యూనియన్ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది. కాగా మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ఇప్పటికే కోరుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పాకిస్తాన్ను తమ భూభాగంలో జైషే మహ్మద్ సహా ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పలు ప్రపంచ దేశాలు ఇస్లామాబాద్పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ వాహన శ్రేణిపై జైషే మహ్మద్ పాల్పడిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్లో ఉగ్రశిబిరాలపై భారత్ మెరుపు దాడులు చేపట్టడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. -
‘చైనా ఉత్పత్తులకు చెక్’
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడాన్ని అడ్డుకుంటున్న చైనాకు అత్యంత ప్రాధాన్య దేశం (ఎంఎఫ్ఎన్) హోదాను ఉపసంహరించాలని ఆరెస్సెస్ ఆర్థిక విభాగం స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) ప్రధాని నరేంద్ర మోదీని కోరింది. చైనాకు ఎంఎఫ్ఎన్ హోదాను ఉపసంహరించడంతో పాటు చైనా ఉత్పత్తులపై నియంత్రణలు విధించాలని, చైనా దిగుమతులపై సుంకాలను పెంచుతూ తక్షణం చర్యలు చేపట్టాలని ప్రధానికి రాసిన లేఖలో ఎస్జేఎం డిమాండ్ చేసింది. పాకిస్తాన్పై భారత్ ఇప్పటికే విధించిన నియంత్రణలను చైనాపైనా అమలు చేయాలని కోరింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న చైనాను కట్టడి చేసేందుకు ఇలాంటి చర్యలు అవసరమని పట్టుబట్టింది. చైనా ఉత్పత్తులపై విధిస్తున్న సుంకాలు తక్కువగా ఉన్నాయని, చైనా దిగుమతులను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని ఎస్జేఎం కో కన్వీనర్ అశ్వని మహజన్ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ పోరాటానికి భారత్ చైనాపై తీసుకునే చర్యలు ఉపకరిస్తాయని అన్నారు. మరోవైపు చైనా వస్తువులను బహిష్కరించాలని ఆరెస్సెస్ సైతం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. చైనా దిగుమతులపై సుంకాలను పెంచాలని కోరింది. -
అజిత్ దోవల్పై ఆరోపణలు తోసిపుచ్చిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను 1999లో భారత్ విడుదల చేయడంలో ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాత్ర గురించి కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసిన నేపథ్యంలో మసూద్ అజర్ను అప్పటి వాజ్పేయి ప్రభుత్వం విడుదల చేసిన వ్యవహారంలో అజిత్ దోవల్కు ఎలాంటి ప్రమేయం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 1999లో ఇంటెలిజెన్స్ బ్యూరోలో సీనియర్ అధికారిగా ఉన్న అజిత్ దోవల్.. మసూద్ అజర్ విడుదలపై సంప్రదింపులు జరిపేందుకు కాందహార్కు వెళ్లిన నలుగురు సభ్యులతో కూడిన కమిటీలో ఒకరు. అజర్ విడుదలను దోవల్ అప్పట్లో వ్యతిరేకించారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. కాగా కాందహార్లో విడుదల చేసిన ముగ్గురు ఉగ్రవాదుల వెంట అజిత్ దోవల్ ఉన్న ఫోటోలను కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించిన రాహుల్ ఈ దాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు కోల్పోయాయని, వారిని హత్య చేసిన మసూద్ అజర్ను ఎవరు విడుదల చేశారో వారి కుటుంబాలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మసూద్ అజర్తో పాటు ముగ్గురు ఉగ్రవాదులను పాకిస్తాన్కు అప్పగించేందుకు కాందహార్లో అజిత్ దోవల్ నెరిపిన ఒప్పందం గురించి కూడా వారికి చెప్పాలని రాహుల్ నిలదీశారు. -
మసూస్ అజహర్కు పాకిస్తాన్ షాక్
-
ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు?
సాక్షి, న్యూఢిల్లీ : జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ ప్రస్తుతం పాకిస్థాన్లో ఉన్నమాట వాస్తవమేనని మొట్టమొదటి సారిగా అంగీకరించిన పాక్ విదేశాంగ మంత్రి, మసూద్ ప్రస్తుతం క్యాన్సర్తో బాధ పడుతున్నారని తెలిపారు. పాకిస్థాన్ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మసూద్ను సోమవారం ఉదయం భావల్పూర్లోని జైషే మొహమ్మద్ శిబిరానికి తరలించినట్లు పాకిస్థాన్ మీడియా తెలియజేసింది. మసూద్ చనిపోయాడన్న, బతికున్నాడన్నా అదో పెద్ద వార్తగా నేడు ప్రపంచ మీడియా ప్రచారం చేస్తోంది? ఇంతకు మసూద్ ఎవరు? ఎక్కడ పుట్టాడు? ఎలా మిలిటెంట్గా మారాడు? ఆయనకు పాకిస్థాన్కు ఉన్న అనుబంధం ఎలాంటిది? ఆయనకు మన దేశంలో జరగుతున్న ఉగ్ర దాడులకున్న సంబంధం ఏమిటీ? సరిగ్గా 20 ఏళ్ల క్రితం అంటే, 1999, డిసెంబర్లో నేపాల్ రాజధాని కఠ్మాండు నుంచి ఢిల్లీకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసీ–814ను మసూద్ అజర్ అనుచరులు హైజాక్ చేసి కాందహార్కు తరలించారు. అందులోని 155 మంది ప్రయాణికులను బందీ చేసుకున్నారు. ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న మసూద్ అజర్ను విడుదల చేస్తేనే బందీలను సురక్షితంగా విడుదల చేస్తామని హైజాకర్లు హెచ్చరించారు. అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం వారి హెచ్చరికకు లొంగిపోవాల్సి వచ్చింది. హైజాకర్ల డిమాండ్ మేరకు మరో ఇద్దరు టెర్రరిస్ట్ నాయకులతోపాటు మసూద్ను అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ ప్రత్యేక విమానంలో కాందహార్కు తీసుకెళ్లి హైజాకర్లకు అప్పగించారు. మసూద్ అజర్ ప్రాముఖ్యత గురించి ఆ రోజే ప్రపంచానికి మొదటిసారి తెలిసి వచ్చింది. అంతకుముందు రెండు సార్లు మసూద్ జైలు నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన గురించి మొదటిసారి భారత్కు తెలిసి వచ్చింది. 1994లో పోర్చుగీసు పాస్పోర్టుపై బంగ్లాదేశ్ మీదుగా కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాకు వచ్చినప్పుడు మసూద్ అజర్ యాదృశ్చికంగా భారత సైనికులకు పట్టుబడ్డారు. అప్పటికే పేరుబడ్డ సజ్జద్ అఫ్ఘాని అనే టెర్రరిస్టుతో కలిసి ఆటోలో వెళుతుండగా తనిఖీలో సైనికులతో అఫ్ఘానితోపాటు మసూద్ను అరెస్ట్ చేశారు. స్కూల్ హెడ్మాస్టర్ కొడుకు భారత్లో పట్టుపడ్డప్పడు దాదాపు 30 ఏళ్లు ఉన్న మసూద్ అజర్ పాకిస్థాన్, పంజాబ్ రాష్ట్రంలోని భావల్పూర్లో పుట్టాడు. ఆయన తండ్రి ఓ స్కూల్ హెడ్మాస్టర్. 1980వ దశకంలో సోవియట్–అఫ్ఘానిస్థాన్ యుద్ధాలతో స్ఫూర్తి పొందిన మసూద్ అఫ్ఘానిస్థాన్ తరపున సోవియట్ దళాలపై మిలెటెంట్ పోరాటాలు జరిపాడు. ఆ తర్వాత 1990వ దశకంలో కశ్మీర్లో ప్రవేశించి మిలిటెంట్ కార్యకలాపాలు ప్రారంభించాడు. 1994లో యాధశ్చికంగా అరెస్ట్ అయ్యాడు. అప్పుడు హర్కతుల్ అన్సార్ అనే మిలిటెంట్ సంస్థకు అతను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. 1999, డిసెంబర్లో విడుదలయ్యాక నేరుగా పాకిస్థాన్ వెళ్లాడు. కార్గిల్ యుద్ధంలో పరాజయం భారంతో ఉన్న పాకిస్థాన్ సైనికులు, ఐఎస్ఐ ఆయనకు ఆశ్రయం కల్పించింది. ఆ తర్వాత కొద్దికాలం అఫ్ఘాన్లో గడిపిన మసూద్ పాకిస్థాన్ తిరిగొచ్చి బాలకోట్లో జేషే మొహమ్మద్ సంస్థను ఏర్పాటు చేశాడు. 2000లో మళ్లీ కశ్మీర్లో ప్రవేశించిన భారత సైనికులకు వ్యతిరేకంగా అనేక మిలిటెంట్ దాడులు జరిపించాడు. పాక్ సైనిక, ఐఎస్ఐ అధికారులతో ఆయన కశ్మీర్లోని సులభంగా వచ్చి అంతకన్నా సులభంగా బాలకోట్ వెళ్లేవాడు. కశ్మీర్లోని షాపియన్, కుల్గామ్, అనంత్నాగ్, పుల్వామా ప్రాంతాల్లో స్థానిక మిలిటెంట్లను చేరదీసి మంచి పట్టు సాధించాడు. మసూద్కు వీవిఐపీ సెక్యూరిటీ 2000, జనవరిలో కరాచిలోని ఓ మసీదు నుంచి ముస్లిం ప్రజలనుద్దేశించి మసూద్ అజర్ ప్రసంగించాడు. ఈ విషయాన్ని ఓ పాకిస్థాన్ జర్నలిస్ట్ రుజువు చేయగా, దాన్ని పాక్ ఐఎస్ఐ ఖండించింది. మసూద్ జాడ తమకే తెలియడం లేదని బుకాయించింది. ఆ జర్నలిస్టు స్వయంగా వెళ్లి మసూద్ అజర్ కలసుకున్నారు. మసూద్కున్న సైనిక సెక్యూరిటీని చూసిన ఆ జర్నలిస్ట్, వీవీఐపీలకు కూడా ఉండనంత సెక్యూరిటీ ఉందంటూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మసూద్ అజర్ 1999లో భారత్ నుంచి విడుదలైన నాటి నుంచి ఇప్పటి వరకు భారత్కు వ్యతిరేకంగా 45 జైషే ఆత్మాహుతి దాడులు జరిపించాడు. వాటిలో పార్లమెంట్, ఎర్రకోట సైనిక శిబిరంపై జరిగిన దాడులు కూడా ఉన్నాయి. దాంతో ఆయన్ని ‘భారత ఒసామా బిన్ లాడెన్’గా భారత మీడియా అభివర్ణించింది. బాలకోట్లో స్థావరం బాలకోట్లో మసూద్ అజర్ టెర్రరిస్ట్ శిక్షణా శిబిరం ఉన్నట్లు 2006లో ఓ అమెరికన్ ‘టెర్రరిస్ట్ ఎక్స్పర్ట్’ కాలిఫోర్నియా కోర్టుకు తెలిపారు. ఆయన అందుకు సాక్ష్యాలు 2001 నుంచి 2004 మధ్య శాటిలైట్ రికార్డు చేసిన ఛాయా చిత్రాలను చూపించారు. ఎప్పటిలాగా అప్పుడు పాకిస్థాన్ ప్రభుత్వం ఆ వార్తను ఖండించింది. ఆ తర్వాత పాకిస్థాన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పర్వేజ్ ముషార్రఫ్నే హత్య చేయడానికి జైషే ఉగ్రవాదులు ప్రయత్నించడం, ఆ తర్వాత అంతర్జాతీయ ఒత్తిళ్లు తీవ్రమవడంతో తప్పనిసరై 2008 నుంచి పాన్ సైన్యం జైషే చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. 2014లో మళ్లీ ప్రత్యక్షం పాక్ సైనిక చర్యలతో అజ్ఞాతంలోకి వెళ్లిన మసూద్ 2014లో హఠాత్తుగా పాకిస్థాన్లో ప్రజల మధ్య మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. 2016లో పఠాన్కోట్లోని భారత వైమానిక స్థావరంపై జైషే ఆత్మాహతి దాడికి పాల్పడడంతో మసూద్పై కఠిన చర్యలకు భారత ప్రభుత్వం, పాక్ను డిమాండ్ చేసింది. తాత్కాలికంగా మసూద్ను అదుపులోకి తీసుకున్న పాక్ సైన్యం రాచ మర్యాదలు చేసి విడిచిపెట్టింది. పఠాన్కోట్ నుంచి పుల్వామా ఉగ్ర దాడి వరకు జరిగిన అనేక ఉగ్ర దాడులతో మసూద్ అజర్కు ప్రత్యక్ష సంబంధం ఉంది. -
భావల్పూర్ జైషే శిబిరానికి మసూద్ తరలింపు
ఇస్లామాబాద్ : ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరణించాడనే వార్తలు వదంతులేనని పాక్ మీడియా కొట్టిపారేయగా, తాజాగా మసూద్ను ఆర్మీ ఆస్పత్రి నుంచి తరలించినట్టు వార్తలొచ్చాయి. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన మసూద్ను ఆర్మీ ఆస్పత్రి నుంచి భావల్పూర్లోని జైషే మహ్మద్ క్యాంప్నకు తరలించారు. మసూద్ అజర్ చనిపోయాడనే వదంతుల నేపథ్యంలో ఆయన తరలింపుపై సమాచారం గందరగోళానికి తావిస్తోంది. (మసూద్ సజీవం : పాక్ మీడియా) కాగా, మసూద్ అజర్ మరణించలేదని ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ స్పష్టం చేసింది. మరోవైపు జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరణించలేదని, ఆయన సజీవంగా ఉన్నారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. మసూద్ మరణించాడన్న ప్రచారం అవాస్తవమని జియో ఉర్ధూ న్యూస్ పేర్కొంది. జైషే చీఫ్ మసూద్ అజర్ భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడని, కాలేయ క్యాన్సర్తో బాధపడుతూ ఆయన మరణించాడంటూ విభిన్న కథనాలు వెల్లడైన నేపథ్యంలో మసూద్ సజీవంగా ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారని జియో న్యూస్ తెలిపింది. -
మసూద్ సజీవం : పాక్ మీడియా
ఇస్లామాబాద్ : జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ మరణించలేదని, ఆయన సజీవంగా ఉన్నారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. మసూద్ మరణించాడన్న ప్రచారం అవాస్తవమని జియో ఉర్ధూ న్యూస్ పేర్కొంది. జైషే చీఫ్ మసూద్ అజర్ భారత వైమానిక దళం చేపట్టిన మెరుపు దాడుల్లో తీవ్రంగా గాయపడి మరణించాడని, కాలేయ క్యాన్సర్తో బాధపడుతూ ఆయన మరణించాడంటూ విభిన్న కథనాలు వెల్లడైన నేపథ్యంలో మసూద్ సజీవంగా ఉన్నట్టు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారని జియో న్యూస్ తెలిపింది. పాక్ ప్రభుత్వం నుంచి మసూద్ పరిస్థితిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెల్లడికాలేదని, ఈ క్షణంలో ఏం జరిగిందనేది తనకు తెలియదని పాక్ సమాచార మంత్రి ఫవాద్ చౌధరి పేర్కొనడం గమనార్హం. కాగా, మసూద్ తీవ్ర అనారోగ్యంతో ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే అంశం మినహా తమకు ఎలాంటి సమాచారం లేదని భారత అధికారులు స్పష్టం చేశారు. (ఉగ్ర మసూద్ మృతి?) మరోవైపు మసూద్ అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారని పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి ఇటీవల పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మసూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడని ఆయన నిర్ధారించినట్లయ్యింది. తమ భూభాగంలోనే మసూద్ ఉన్నాడని పాకిస్తాన్ అంగీకరించడం అదే తొలిసారి కావడం గమనార్హం. -
సర్జికల్ స్ట్రైక్స్పై మసూద్ సోదరుడి ఆడియో..!
-
సర్జికల్ స్ట్రైక్స్పై మసూద్ సోదరుడి ఆడియో..!
న్యూఢిల్లీ : భారత సర్జికల్ దాడులతో ఎలాంటి నష్టం జరుగలేదని పాకిస్తాన్ చెప్తున్న మాటలు తప్పని రుజువయ్యాయి. తమపై ఐఏఎఫ్ మెరుపుదాడులు చేసింది నిజమేనని జైషే చీఫ్ మసూద్ అజార్ తమ్ముడు మౌలానా అమర్ వెల్లడించారు. సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన మరుసటి రోజున జైషే సీనియర్లతో జరిగిన సమావేశంలో అమర్ మాట్లాడినట్టు ఓ ఆడియో షోషల్ మీడియా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ‘బాలాకోట్లోని జైషే క్యాంపులపై వైమానిక దాడులు జరిగింది నిజమే. అయితే, మార్కజ్ (జిహాద్ బోధనా కేంద్రం)పై మాత్రమే దాడులు జరిగాయి. భారత్ చెప్తున్నట్టు జైషే కీలక స్థావరాలకు ఎలాంటి నష్టం జరగలేదు. మా భూభాగంలోకి వచ్చి మరీ జిహాద్ బోధనా కేంద్రంపై భారత్ దాడులకు దిగడం తీవ్ర వేదనకు గురిచేసింది. దీంతో ప్రతీకారానికి భారత్ మంచి అవకాశం ఇచ్చింది. మాపై దాడి చేసి యుద్ధానికి కాలు దువ్వింది’ అని వ్యాఖ్యానించాడు. (మసూద్కు సైనిక ఆస్పత్రిలో చికిత్స) భారీ స్థాయిలో మృతులు.. కశ్మీర్ను రక్షించుకునేందుకు జిహాద్ శిక్షణ పొందుతున్న వారిపై ఐఏఎఫ్ బాంబులతో విరుచుకుపడిందని అమర్ తెలిపారు. తద్వారా కశ్మీర్లోని ముస్లింలకు భారత్ మరింత కోపం తెప్పించిందని పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. మిరాజ్ జెట్ ఫైటర్స్ దాడుల్లో ‘జబా టాప్’ అనే కొండ ప్రాంతంలో చాలా మంది మరణించినట్టు వార్తలు వచ్చాయి. అక్కడ పడి ఉన్న దాదాపు 30 శవాలను తరలించేందుకు అంబులెన్సులు వచ్చాయని స్థానికులు చెప్తున్నారు. ఉగ్రవాద శిక్షణనిస్తున్న మాజీ ఐఎస్ఐ అధికారి, కల్నల్ సలీం కూడా ఈ దాడుల్లో మరణించినట్టు సమాచారం. (సరిహద్దుకు అటూ.. ఇటూ..) -
రాయని డైరీ; మసూద్ అజార్ (జైషే చీఫ్)
‘‘అజార్ భయ్యా.. మీకోసం ఇద్దరు వచ్చారు’’ అని చెప్పాడు ఇంట్లో పనికుర్రాడు. ‘‘ఆ ఇద్దరూ ఎవరో తెలుసుకుని, వారిలో ఎవరితోనైతే నాకు అవసరం లేదో వారిని కాకుండా, ఎవరికి నా అవసరం ఉందో వారిని ముందుగా నా గదిలోకి పంపించు’’ అని చెప్పాను. ‘‘భయ్యాజీ, ఆ ఇద్దరిలో ఒకరు మీకు చిరపరిచితులైన షా మెహమూద్ ఖురేషీ. ఈ దేశ విదేశాంగ మంత్రి. ఇంకొకరు ఒక అపరిచిత వ్యక్తి. ఆయన మెడకు స్టెతస్కోప్ ఉంది. ఆయన చేతిలో బీపీ మిషన్ ఉంది’’ అన్నాడు. ‘‘వాళ్లిద్దరిలో ఎవర్ని ముందుగా లోపలికి పంపుతావో నువ్వే నిర్ణయించుకుని పంపు’’ అన్నాను. వెంటనే షా మెహమూద్ ఖురేషీని పంపాడు పనికుర్రాడు! ‘‘అజార్జీ.. ఎందుకో రమ్మన్నారట’’ అన్నారు ఖురేషీ.. లోపలికి వస్తూనే. ‘‘మీతో అవసరం ఉండి మిమ్మల్ని పిలిపించుకోలేదు ఖురేషీ. మీకు నా అవసరం ఉండి మిమ్మల్ని పిలిపించుకున్నాను’’ అన్నాను. ‘‘చెప్పండి అజార్జీ..’’ అన్నాడు! ‘‘మా పనికుర్రాడికి ఉన్నంత ఇంగితం కూడా లేకపోయింది ఈ దేశపు విదేశాంగ మంత్రికి’’ అన్నాను.. అతడి వైపు చూడకుండా. ‘‘వారెవ్వా అజార్జీ.. నేనివాళ మీ పనికుర్రాడి ఇంగితం గురించి వినవలసిందే. వినడమే కాదు, అతడి నుంచి నేను నేర్చుకోవలసింది ఏమైనా ఉంటే.. మీ ఆదేశాలు లేకనే, నాకై నేనుగా అతడి వద్ద నేర్చుకోడానికి రోజూ ఒక సమయానికి వచ్చి ఇక్కడ కూర్చోగలను’’ అన్నాడు. తల పట్టుకున్నాను. ‘‘ఆశ్చర్యపోతున్నాను ఖురేషీ. నా మాటల్లోని అంతరార్థాన్ని మీరెందుకు గ్రహించలేకపోతున్నారు! ఒక పనికుర్రాడికి ఇంగితం ఉండడం కన్నా, ఒక దేశ విదేశాంగ మంత్రికి ఇంగితం లేకపోవడం ఆలోచించవలసిన విషయం కదా. అలాంటప్పుడు మీరు చేయవలసింది పనికుర్రాడి ఇంగితమేమిటో తెలుసుకోడానికి ఉత్సాహం ప్రదర్శించడం కాదు. ‘విదేశాంగ మంత్రికి ఇంగితం లేదు’ అన్న మాటకు ముఖం కందగడ్డలా మార్చుకోవడం. అది కదా మీరు తక్షణం చేయవలసింది!.. చెప్పండి..’’ అన్నాను. ‘‘మార్చుకుంటాను అజార్జీ.. మీరు కనుక నాక్కొంత సమయం ఇవ్వగలిగితే’’ అన్నాడు. నా గదిలోని చీమ కూడా అంతటి విధేయతను ప్రదర్శించదు! రోషం వస్తే జైషే చీఫ్ అని కూడా చూడకుండా నన్ను కుట్టేస్తుంది. ‘‘బాగున్నవాడి గురించి బాగోలేకుండా పడి ఉన్నాడని చెప్పడం ఏమన్నా బాగుందా ఖురేషీ! ఒక ఉగ్రవాది ఒంట్లో బాగోలేకుండా మంచం మీద పడుకుని ఉన్నాడంటే మాతృదేశానికి ఎంత అప్రతిష్ఠ! శతృదేశానికి ఎంత అపహాస్యం. జైషే హెడ్డుకి చికెన్గున్యా అని తెలిస్తే పిల్లలక్కూడా నవ్వొచ్చేస్తుంది’’ అన్నాను. ‘‘ఇంత ఆలోచించలేదు అజార్జీ..’’ అన్నాడు.. ‘‘మా పనికుర్రాడు తెలుసుకోగలిగాడు ఖురేషీ, నాకు ఏనాటికీ డాక్టర్ అవసరం ఉండబోదని. మీకే తెలియలేదు. వెళ్లండి’’ అన్నాను. పనికుర్రాడిని లోపలికి పిలిచాను. వచ్చాడు. ‘‘బయట అపరిచిత వ్యక్తి ఉన్నాడన్నావ్ కదా. ఆ వ్యక్తి దగ్గరికి తీసుకెళ్లి ఖురేషీని చూపించు’’ అని చెప్పాను. ఏం ప్రభుత్వాలో! ‘మా దగ్గర లేడు’ అని చెప్తే పోయేదానికి, ‘ఉన్నాడు కానీ, ఒంట్లో బాగోలేదు’ అని చెప్పిస్తాయా! ప్రభుత్వాలు తెలివిగా లేకనే ఉగ్రవాదులు తెలివిగా ఉండి ప్రభుత్వాల్ని కాపాడుకోవలసి వస్తోంది. -మాధవ్ శింగరాజు -
మసూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడని ప్రకటన
ఇస్లామాబాద్ : పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి సరైన ఆధారాలు లభిస్తేనే ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అరెస్ట్ చేశామని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా మసూద్ను పాకిస్తాన్ అరెస్ట్ చేయబోదని ఆయన తేల్చిచెప్పారు. జైషే చీఫ్ను అరెస్ట్ చేయాలంటే పక్కా ఆధారాలుండాలని పేర్కొన్నారు. కాగా మసూద్ అజర్ పాకిస్తాన్లో ఉన్నాడని ఖురేషి అంతకు ముందు నిర్ధారించారు. సంయుక్త విచారణకు పాక్ ప్రతిపాదన పుల్వామా ఉగ్రదాడి కేసులో ఉమ్మడి విచారణ చేపట్టాలని భారత్కు పాకిస్తాన్ ప్రతిపాదించింది. మరోవైపు పాక్లోనే తలదాచుకున్న మసూద్ అజర్ ఆరోగ్యం ప్రస్తుతం బాగాలేదని, ఆయన ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితిలో ఉన్నాడని ఖురేషి వెల్లడించారు. ఇక భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు తొలగి సాధారణ పరిస్థితి నెలకొనేవరకూ భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్తో తాను చర్చలు జరపలేనని ఆయన చెప్పారు. దుబాయ్లో ఓఐసీ సదస్సు సందర్భంగా సుష్మా స్వరాజ్తో తాను భేటీ కాలేనని ఖురేషి చెప్పుకొచ్చారు. ఈ భేటీకి భారత్ను తొలిసారి ఆహ్వానించారని తెలిపారు. -
మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి
ఐక్యరాజ్యసమితి: జైషే మహ్మద్ ఉగ్రసంస్థ అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. 15 సభ్య దేశాలున్న భద్రతా మండలిలో వీటో అధికారమున్న ఈ మూడు దేశాలు బుధవారం ఈ ప్రతిపాదన చేశాయి. ప్రతిపాదనను భద్రతా మండలి పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. పాకి స్తాన్ను కేంద్రంగా చేసుకుని భారత్లో పలు ఉగ్రదాడులకు సూత్రధారిగా వ్యవహరించిన మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ చాన్నాళ్లుగా అభ్యర్థిస్తోంది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ విషయంలో భారత్కు వివిధ దేశాల మద్దతు లభించింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ మండలిలో ప్రతిపాదించడం ఇది నాల్గోసారి. పాక్తో సన్నిహిత సంబంధాలున్న చైనా తన వీటో అధికారంతో ప్రతిసారీ అడ్డుతగులుతోంది. పుల్వామాలో భారత భద్రతా దళంపై జరిగిన దాడిని ఖండించిన చైనా ఈసారి ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సి ఉంది. అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటిస్తే మసూద్, సంస్థ చరాస్తుల లావాదేవీలు స్తంభించిపోతాయి. ఆర్థిక వనరులు మూసుకుపోతాయి. ప్రతిపాదనకు ప్రపంచ దేశాలు మద్దతు ఇవ్వాలంటూ భారత్ విజ్ఞప్తి చేసింది. పాక్ స్థావరంగా పనిచేస్తున్న అన్ని ఉగ్రసంస్థలను నిషేధించాలని కోరింది. భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త తలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. రెండు దేశాలు వెంటనే సమావేశమై తగిన చర్యలు తీసుకోవాలి. పరిస్థితి మరింత దిగజారిపోకుండా సంయమనం పాటించాలి. ఇరు దేశాలు బాధ్యతగా వ్యవహరించి శాంతిని నెలకొల్పాలి. ఐక్యరాజ్య సమితి అందరికీ అందుబాటులో ఉంటుంది. రెండు దేశాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. – ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ -
మసూద్పై తక్షణం చర్యలు తీసుకోండి
-
ఇవిగో ఆధారాలు; పాక్కు భారత్ అల్టిమేటం
న్యూఢిల్లీ : భారత్తో యుద్ధానికి కాలుదువ్వుతోన్న పాకిస్తాన్కు అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించకపోవడంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి చర్చలకు సిద్ధమని పేర్కొన్న సంగతి తెలిసిందే. సరైన ఆధారాలు లభిస్తే పుల్వామా ఘటన విషయంలో విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో పుల్వామా ఉగ్రదాడికి సంబంధించిన పలు ఆధారాలను భారత ప్రభుత్వం పాకిస్తాన్కు అందజేసింది. 40 మందికి పైగా భారత జవాన్లను హతమార్చిన తర్వాత ఉగ్రవాదులతో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజహర్ మాట్లాడిన టేపులను పాక్ అధికారులకు పంపించింది. కాగా పుల్వామా దాడిని సమర్థవంతంగా అమలు చేసినందుకు తన అనుచరులను మసూద్ అభినందించాడు. తాను అప్పగించిన పనిని విజయవంతంగా నిర్వహించినందుకు వారిని ప్రశంసించాడు. ఇందుకు సంబంధించిన ఆడియో టేపులను పాక్ అధికారులకు ఇచ్చిన భారత్ తక్షణమే మసూద్పై చర్యలు తీసుకోవాలని ఆల్టిమేటం జారీ చేసింది. (చదవండి : ‘ఒక్క చెంప దెబ్బ చాలు.. నా వెనుక ఐఎస్ఐ ఉంది’) మరోవైపు మసూద్ అజహర్ను బ్లాక్లిస్ట్లో పెట్టాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు ఐక్యరాజ్యసమితిని కోరాయి. మసూద్ అజర్ను అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం విధించాలని, ఆయన ఆస్తులను సీజ్ చేయాలని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్లు పదిహేను మంది సభ్యులతో కూడిన భద్రతా మండలి శాంక్షన్స్ కమిటీకి విజ్ఞప్తి చేశాయి. బ్రిటన్,అమెరికా, ఫ్రాన్స్ల వైఖరిపై చైనా, రష్యా ఇంకా స్పందించలేదు. కాగా ఏకాభిప్రాయంపై నిర్ణయం తీసుకునే కమిటీలో ఈ ప్రతిపాదనపై మార్చి 13లోగా సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. అయితే అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత డిమాండ్పై చైనా ప్రతికూలంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో చైనా ఎటువంటి నిర్ణయం తీసుకుంటదనే విషయం చర్చనీయాంశమైంది. -
ఎవిడెన్స్ ఉంటే భారత్కే సపోర్టు...
న్యూఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి జైషే మహ్మద్కు వ్యతిరేకంగా ఆధారాలు సంపాదించినట్లైతే భారత్కు తాము తప్పకుండా అండగా ఉంటామని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ఆదిల్ ఆల్ జుబేర్ వ్యాఖ్యానించారు. గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. హేయమైన దాడులకు పాల్పడే ఉగ్రవాదులను ఉపేక్షిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ గురించి అడుగగా... అతడి గురించి సాక్ష్యాధారాలు అందించినట్లైతే ఐరాసలో భారత్కు మద్దతు పలుకుతామని తెలిపారు. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు సౌదీ సహాయ పడుతుందని స్పష్టం చేశారు. ఐరాసలో రాజకీయాలను అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందని సౌదీ- పాకిస్తాన్ సంయుక్త ప్రకటన చేసిందని.. అయితే దానిని మసూద్ అజర్కు అన్వయించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తమకు భారత్- పాకిస్తాన్.. ఇరు దేశాల పట్ల నమ్మకం ఉందని, శాంతియుతంగా చర్చలు జరపడం ద్వారా ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు. (‘ఒక్క చెంప దెబ్బ చాలు.. నా వెనుక ఐఎస్ఐ ఉంది’ ) వారిని శిక్షించాల్సిందే.. ‘ఉగ్రవాదులను గుర్తించే అంశం పట్ల మాకు స్పష్టమైన విధానాలు ఉన్నాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషించేవారిని, ఉగ్ర సంస్థలకు నాయకత్వం వహించే వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదు. వారిని కచ్చితంగా చట్టం ముందు నిలబెట్టాల్సిందే. శిక్ష విధించాల్సిందే. అయితే అందుకు సరైన ఆధారాలు సంపాదించాల్సిన ఆవశ్యకత ఉంది. అపుడే బాహ్య ప్రపంచంలో స్వేచ్ఛగా సంచరిస్తున్న ఉగ్రవాదుల ఆగడాలు అరికట్టవచ్చు’ అని ఆదిల్ అల్-జుబేర్ పేర్కొన్నారు. భారత్తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు కృషి చేస్తున్న భారత్కు అండగా నిలుస్తామని వ్యాఖ్యానించారు.(ఉగ్రవాదం ఉమ్మడి సమస్య) కాగా పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ పాక్లో పర్యటించిన సంగతి తెలిసిందే. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను పొగుడుతూ.. ఆ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి రక్షించేందుకు 20 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ఒప్పందం కుదర్చుకున్నారు. అనంతరం బుధవారం భారత్లో పర్యటించిన సౌదీ క్రౌన్ ప్రిన్స్.. పుల్వామా ఉగ్రదాడి ప్రస్తావన లేకుండానే ప్రధాని మోదీతో పలు చర్చలు జరిపారు. ఈ మేరకు భారత్లో సుమారు 100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో సల్మాన్తో పాటు భారత్ వచ్చిన బృందంలో ఒకరైన సౌదీ విదేశాంగ మంత్రి పుల్వామా ఉగ్రదాడి గురించి ప్రస్తావించడం విశేషం. అయితే ఆయన కూడా పాకిస్తాన్లాగే ఆధారాలు ఉంటే అంటూ ముక్తాయించడం వెనుక పరోక్షంగా తమ విధానమేమిటో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.(‘పాక్.. మాకు అత్యంత ప్రియమైన దేశం’ ) -
ఒక్క చెంప దెబ్బతో అన్నీ కక్కేశాడు
జమ్ముకశ్మీర్లో 40 మంది జవాన్ల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడి సూత్రధారి, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజర్పైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.భారత్పై ఎన్నో భీకర దాడులకు పాల్పడిన అజర్ గతంలో ఒకే ఒక్కసారి అరెస్ట్ అయ్యాడు. 1994–99 మధ్య కాలంలో జమ్ములోని కోట్ భల్వాల్ జైలులో అయిదేళ్లు ఊచలు లెక్కపెట్టాడు. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి అవినాశ్ మోహననే అజర్ను ప్రతీరోజూ విచారించేవారు. ఆ విచారణలో అజర్ మనస్తత్వాన్ని బాగా పసిగట్టారు. అజర్ను విచారించడం అత్యంత సులభమని, ఆర్మీ అధికారి ఒక్క చెంప దెబ్బకొట్టగానే, పాక్లో టెర్రరిస్టు గ్రూపుల గురించి, ఐఎస్ఐ గుట్టుమట్లు గురించి పూసగుచ్చినట్టు చెప్పేశాడని అవినాశ్ వెల్లడించారు. గొప్పలు ఎక్కువ మసూద్ అజర్కి గొప్పలు ఎక్కువ. తన గురించే ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. పాకిస్తాన్, ఐఎస్ఐ తనకెంత ప్రాధాన్యత ఇస్తుందో కథలు కథలుగా చెప్పేవాడు, తనని ఎక్కువ కాలం ఎవరూ కస్డడీలో ఉంచలేరని ధీమాగా గడిపేసేవాడు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టడంలో మసూద్కి మించిన వాడు లేడని పేరుంది.. కశ్మీర్లో జిహాదీని ప్రోత్సహించే సామర్థ్యం ఉన్న వాడు కనుకే అతనికి ఐఎస్ఐ అండదండలు పుష్కలంగా ఉన్నాయని అవినాశ్ అభిప్రాయపడ్డారు. తీగలాగితే చాలు.. కాస్త కదిలిస్తే చాలు అజర్ అనర్గళంగా మాట్లాడేవాడు. ఒక చిన్న ప్రశ్న వేస్తే చాలు..ఎన్నో విషయాలను వివరించేవాడు.పాక్ గడ్డపై ఉగ్రవాద మూకలు ఎలా పనిచేస్తాయి ? వారి నియామకం ఎలా జరుగుతుంది ? పాక్ గూఢచర్య ఐఎస్ఐ ఎలాంటి కుట్రలు పన్నుతుంది.. ఇలాంటి విషయాలన్నీ సమగ్రంగా వివరించేవాడు. ఆప్ఘన్ టెర్రరిస్టులు కశ్మీర్ లోయలోకి ఎలా ప్రవేశిస్తారో, హర్కత్ ఉల్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ జిహాదీ ఇస్లామిలను విలీనం చేసి హర్కల్ ఉల్ అన్సర్ సంస్థ ఎలా ఏర్పడిందో వంటి విషయాలన్నీ వివరించాడు. తన స్వార్థం కోసం ఎంతదూరమైనా వెళతాడు అజర్. అనూహ్యంగా అరెస్ట్ అసలు అతను అరెస్ట్ కావడమే చాలా అనూహ్యంగా జరిగింది. హర్కత్ ఉల్ అన్సర్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యదర్శిగా ఉండే అజర్ తమ సంస్థ కమాండర్ ఇన్ చీఫ్ సజ్జాద్ అప్ఘనీని కలుసుకోవడానికి 1994లో ఫిబ్రవరి 11న అనంతనాగ్ జిల్లాలోని కప్రాన్ అటవీ ప్రాంతానికి వెళ్లాడు. వాళ్లిద్దరూ కలిసి ఒక ఆటోలో తప్పించుకోబోయారు. గస్తీ పోలీసులు ఆటోని ఆప్పినప్పుడు ఇద్దరూ కలిసి పరుగులు తీశారు9. దగ్గరలో ఉన్న ఆర్మీ పికెట్కు చెందిన సైనికులు వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. అటు సజ్జాద్ అప్ఘని తాను పట్టబడడానికి అజర్ కారణమని భావించాడు. జైల్లో ఉన్నన్నాళ్లూ వారిద్దరికి ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టేది కాదు. సొంత సంస్థపైనే విమర్శలు అజర్ తన సొంత సంస్థపైనే విమర్శలు గుప్పించేవాడు. కశ్మీర్లో పరిస్థితులపై తన సంస్థ తప్పుదారి పట్టించడం వల్లే తాను అరెస్ట్ అయ్యానని విచారణలో వెల్లడించాడు. ‘అప్ఘనిస్తాన్ తరహా పరిస్థితుల్ని నేను కశ్మీర్లో ఊహించుకున్నాను. ముజాహిదీన్ గ్రూపులు హాయిగా స్వేచ్ఛగా ఆప్ఘన్, పాక్ మధ్య ఎలా ప్రయాణం చేస్తాయో, కశ్మీర్ నుంచి పాక్కు అలాగే రావచ్చునని అనుకున్నాను. కానీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. భారత భద్రతా దళాల నుంచి తప్పించుకోవడానికి ముజాహిదీన్లు పరుగులంకించుకునే దృశ్యాలే కనిపించాయి. నా సొంత ఉగ్రవాద సంస్థ నన్ను తప్పుదోవ పట్టించడం వల్లే అరెస్ట్ అయ్యాను‘‘ అని అజర్ ఆ విచారణలో వివరించాడు. అహం ఎక్కువ అరెస్టయిన తనని బయటకు రప్పించడంలో జాప్యం జరగడం, అయిదేళ్లు జైలు నాలుగు గోడల మధ్య మగ్గిపోవడంతో అజర్ అహం దెబ్బ తింది. దీంతో తనను ప్రోత్సహించిన మాతృ సంస్థ హర్కత్ ఉల్పైనే కక్ష గట్టాడు. 1999లో ఖాట్మండు నుంచి న్యూఢిల్లీకి రావాల్సిన ఐసీ–814 విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్ చేసి ఆప్ఘన్లో కాందహార్కు తీసుకువెళ్లారు. అందులో ప్రయాణికుల్ని సురక్షితంగా విడిపించుకోవడం కోసం అప్పట్లో అధికారంలో ఉన్న ఎన్టీయే సర్కార్ మసూర్ అజర్, ఒమర్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గార్ వంటి వారిని జైలు నుంచి విడుదల చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత తాను సొంతంగా జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. పాక్ ఐఎస్ఐ కూడా ఉగ్రవాద సంస్థలన్నింటిపైనే అతనికి అధికారాలు ఇచ్చింది. దీంతో ఇన్నాళ్లూ తనకు అన్నం పెట్టిన హర్కత్ ఉల్పై ఎలాంటి కృతజ్ఞతాభావం లేకుండా ఎక్కువ మంది కేడర్ను తనవైపు లాగేశాడు. భారత్పై విజేతగా నిలిచించి తానక్కొడినేనని విర్రవీగేవాడు. ప్రస్తుతం ఐఎస్ఐ రక్షణలో మసూద్ అజర్ భారత్పై ఎన్నో దాడులకు తెగబడ్డాడు. పార్లమెంటు, పథాన్కోట్ ఎయిర్బేస్, జమ్ము, ఉరీలో సైనిక శిబిరాలపై దాడుల వెనుక అతని హస్తం ఉంది. కరాచి నుంచి వెలువడే టాబ్లాయిడ్ సజాదే ముజాహిద్ జర్నలిస్టుగా 1993లోనే అతను ఇతర విలేకరుల బృందంతో కలిసి ఎన్నో దేశాలు తిరిగి కశ్మీర్ అంశంలో మద్దతు ఇవ్వాల్సిందిగా కూడా కోరాడు. ప్రస్తుతం పాకిస్తాన్లోని పంజాబ్లో బహవాయిపూర్లోని ఒక కలుగులోఎలుకలా దాక్కున్న అజర్ని అనుక్షణం పాక్ ఐఎస్ఐ కంటికి రెప్పలా కాపలా కాస్తూ ఉంటుంది. ఏదో విధంగా అజర్ను పట్టుకొని భారత్కు తీసుకువచ్చి విచారణ జరపాలన్న కృతనిశ్చయంతో భారత్ ఉంది. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
‘ఒక్క చెంప దెబ్బ చాలు.. నా వెనుక ఐఎస్ఐ ఉంది’
గత గురువారం నుంచి యావత్ భారతావని ఆగ్రహంతో రగిలిపోతోంది. 43 మంది సైనికుల ప్రాణాలను బలిగొన్న ముష్కరుల భరతం పట్టాలని కోరుకుంటోంది. మన ఆకాంక్షలకు అనుగుణంగానే భద్రతా బలగాలు పుల్వామా ఉగ్రదాడికి కీలక సూత్రధారిగా భావిస్తున్న రషీద్ ఘాజీని మట్టుబెట్టి సగం ప్రతీకారం తీర్చుకున్నాయి. అయితే ఇందుకు మూలకారణమైన జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్ను కూడా అంతం చేస్తేనే అమర జవాన్ల త్యాగానికి ఫలితం దక్కినట్లు అవుతుందని భారతీయులు గట్టిగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలో మసూద్ పట్టుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనే అయినా అసాధ్యం మాత్రం కాదని.. గతంలో అతడిని విచారించిన పోలీసు ఉన్నతాధికారి తన ఆనాటి అనుభవాలను పంచుకున్నారు. పుల్వామా దాడికి తామే బాధ్యులమని జైషే మహ్మద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎక్కడైతే తన మేనల్లుళ్ల(తాలా రషీద్ (2017), ఉస్మాన్ (2018))ను భారత జవాన్లు హతమార్చారో చేశారో.. అదే జిల్లాలో జవాన్లే లక్ష్యంగా దాడికి సిద్ధం చేయాలంటూ మసూద్ భావించాడని.. అందుకే దాడి చేసేందుకు ‘పుల్వామా’ ను ఎంచుకున్నాడని ఇంటిలెజిన్స్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ స్థాయిలో ప్రాణ నష్టం సంభవిస్తుందని వారు ఊహించి ఉండకపోవచ్చు. నిజానికి భద్రతా వైఫల్యం వల్లే ఇంతటి దారుణం జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుల్వామా నాటి దాడిని.. ప్రణాళికను పక్కాగా అమలు చేయడంలో విజయవంతమైన మసూద్.. 1994లోనే నకిలీ పాస్పోర్టు కేసులో అరెస్టయ్యాడు. పోర్చుగీసు పాస్పోర్టుతో బంగ్లాదేశ్ గుండా.. భారత్లో ప్రవేశించి.. దక్షిణ కశ్మీర్లోని అనంత్నాగ్కు చేరుకున్నాడు. అయితే మసూద్ పన్నాగాన్ని పసిగట్టిన ఇంటలెజిన్స్ వర్గాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో ఆనాటి ఇంటలిజెన్స్ అధికారి(కశ్మీర్ డెస్క్ హెడ్), సిక్కిం మాజీ డీజీపీ అవినాశ్ మోహననే అతడిని విచారించారు.(పుల్వామా ఉగ్రదాడి; మాస్టర్ మైండ్ హతం!) ఒక్క చెంప దెబ్బ చాలు... ‘అతడి విచారణ మాకు అంతగా కష్టంగా అనిపించలేదు. విచారణలో భాగంగా కోట్ బల్వాల్(జమ్ము కశ్మీర్) జైలులో అతడిని చాలా సార్లు కలిశాను. ఎన్నో గంటల పాటు ప్రశ్నలు సంధించాను. అయితే అతడి నుంచి సమాధానం రాబట్టడం కోసం ఎటువంటి కఠిన పద్ధతులు ఉపయోగించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఓ ఆర్మీ అధికారి కొట్టిన ఒకే ఒక చెంప దెబ్బ అతడిని నిలువెల్లా వణికించింది. ఆ తర్వాత విచారణలో అఫ్గాన్ ఉగ్రవాదులు కశ్మీర్ లోయలోకి ఎలా వస్తున్నారు.. అదే విధంగా ఉగ్ర సంస్థలు హర్కత్-ఉల్- ముజాహిద్దీన్, హర్కత్ ఉల్ జీహాద్ ఈ ఇస్లామీలు... హర్కత్ ఉల్ అన్సార్ అనే ఒకే సంస్థగా ఆవిర్భవించిన తీరు.. దానికి జనరల్ సెక్రటరీగా తాను ఎదిగిన క్రమాన్ని మసూద్ వివరించాడు. కశ్మీర్కు చేరుకునే ముందే సహరన్పూర్ వెళ్లి హర్కత్ ఉల్ అన్సార్ ఏర్పాటైతే కలిగే ప్రయోజనాల గురించి ఇరు సంస్థలకు అర్థమయ్యేలా చెప్పానని తెలిపాడు. కాలినడకన వాస్తవాధీన రేఖను దాటలేకపోయానని. అందుకే ఫోర్జరీ పాస్పోర్టుతో భారత్ వచ్చానని మసూద్ చెప్పినట్లు’ మోహననే ఓ జాతీయ మీడియాతో వ్యాఖ్యానించారు. నా వెనుక ఐఎస్ఐ ఉంది... మసూద్ను విడిపించుకునేందుకు అతడి అనుచరులు ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా అప్పటి బీజేపీ(సంకీర్ణ) ప్రభుత్వం మసూద్ను విడుదల చేసింది. ఆ తర్వాతే అతడు జైషే మహ్మద్ను స్థాపించి తన ఉగ్ర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఈ విషయం గురించి మోహననే మాట్లాడుతూ... మసూద్ విడుదలయ్యే నాటికి తాను కొత్త పోస్టులోకి మారానని చెప్పారు. అయితే తాను విడుదలవుతానని మసూద్కు గట్టి నమ్మకం ఉండేదని పేర్కొన్నారు. ‘ మీరు నన్ను తక్కువగా అంచనా వేస్తున్నారు. నిజాలు చెప్పినంత మాత్రాన సరిపోదు కదా. ఐఎస్ఐ(ఇంటర్ సర్వీస్ ఇంటలెజిన్స్) నన్ను పాకిస్తాన్కు తిరిగి తీసుకువెళ్తానని హామీ ఇచ్చిందని మసూద్ విచారణలో అనేవాడు’ అని మోహననే చెప్పుకొచ్చారు. తద్వారా ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తోందని, ఇందులో భాగంగా ఐఎస్ఐ ఇటువంటి ఉగ్రవాదుల ముసుగులో ప్రచ్ఛన్న యుద్ధాన్ని ప్రోత్సహిస్తోందనే విషయం స్పష్టంగా అర్థమైందని పేర్కొన్నారు. కాగా 1994, ఫిబ్రవరిలో మసూద్ అరెస్టైన 10 నెలల తర్వాతే అతడిని విడిపించేందుకు.. హర్కత్ ఉగ్రవాదులు.. కొంత మంది విదేశీయులను ఢిల్లీ నుంచి కిడ్నాప్ చేశారు. అనంతరం మసూద్ను విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. కానీ ఆ సమయంలో ఉగ్రవాది ఒమర్ షేక్ పోలీసుల చేతికి చిక్కడంతో వారి ప్రయత్నం విఫలమైంది. దీంతో 1999లో మరోసారి ప్రయత్నించి... ఖాట్మండు నుంచి ఢిల్లీ వస్తున్న భారత విమానాన్ని హైజాక్ చేయడం ద్వారా మసూద్ను విడిపించుకున్నారు. ఇక ఆనాటి నుంచి మసూద్ కశ్మీర్లోని భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రదాడులు రచిస్తున్న సంగతి తెలిసిందే.(మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు) చదవండి : ఉగ్రవాది ఆదిల్కు శిక్షణ ఇచ్చింది అతడే! ఉగ్ర మారణహోమం రివేంజ్ తీర్చుకునేందుకు టైమ్, ప్లేస్ డిసైడ్ చేయండి.. ‘పాక్.. మాకు అత్యంత ప్రియమైన దేశం’ -
పాక్ ఆర్మీ ఆస్పత్రి నుంచే ఉగ్ర కుట్ర
ముంబై: పుల్వామా ఉగ్రదాడికి పాకిస్తాన్ నుంచి వ్యూహ రచన చేసినట్లు నిఘా వర్గాల సమాచారం. పుల్వామా ఆత్మాహుతి దాడికి తామే పాల్పడినట్టు జైషే మహ్మద్ తీవ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. పుల్వామా ఆత్మాహుతి దాడికి పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సూచనలు ఇచ్చినట్టు గుర్తించారు. అంతేకాకుండా రావల్పిండిలోని ఆర్మీ బేస్ హాస్పిటల్ నుంచే తన పథకాన్ని అతడు అమలు చేశాడు. అనారోగ్య కారణాలతో కొన్ని నెలలుగా ఆర్మీ బేస్ ఆస్పత్రిలో మసూద్ చికిత్స తీసుకుంటున్నాడు ఈ క్రమంలోనే ఆరు నెలలుగా ఉగ్ర సమావేశాలకు కూడా మసూద్ దూరంగా ఉంటున్నాడు. అయితే అక్కడి నుంచే పుల్వామా దాడికి ఆదేశాలిచ్చి భారీ విధ్వంసానికి ప్రణాళిక రచించాడు. కేవలం ఎనిమిది రోజుల ముందే పుల్వామా ఆత్మాహుతి దాడికి ఉగ్రవాదులను సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. భద్రతా దళాల చేతిలో గతేడాది అక్టోబరులో హతమైన తన మేనల్లుడు ఉస్మాన్ హత్యకు ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, ఈ యుద్ధంలో మరణం కన్నా సంతోషకరమైంది మరొకటి లేదంటూ ఆడియో టేపుల ద్వారా యువతను రెచ్చగొట్టినట్టు బయటకు వచ్చింది. ఉగ్రవాదుల వల్ల శాంతికి విఘాతం కలుగుతోందని కొందరు మాట్లాడుతున్నారు. కానీ, మీరు మాత్రం సరిహద్దుల వెంబడి పోరాటం ఆపకండి అంటూ ఆ ఆడియోలో అన్నట్లు ఉంది. తన సోదరుడు కుమారుడు మహ్మద్ ఉమేర్, అబ్దుల్ రషీద్ ఘాజీల సాయంతో ఈ ఆడియో టేపు ద్వారా కశ్మీర్ లోయలోని యువకుల మనసులో విషబీజాల్ని నాటించాడు. శక్తివంతమైన పేలుడు పదార్థాలను ఉపయోగించి దాడులకు పాల్పడాలని పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫర్బాద్లో జరిగిన సమావేశంలో చర్చించారని ఐబీ వర్గాలు స్పష్టం చేశాయి. ఇక్కడ చదవండి: దాడి సూత్రధారి ఉమేర్ -
దాడి సూత్రధారి ఉమేర్
దాడికి జైషే మొహమ్మద్(జేఈఎం)కు చెందిన మహ్మద్ ఉమేర్ వ్యూహరచన చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు చెప్పారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఉమేర్ అఫ్గాన్లో శిక్షణ పొందాడని, ఆ అనుభవంతో దాడికి పథక రచన చేశాడన్నారు. జైషే చీఫ్ మసూద్ అజహర్కు ఉమేర్ స్వయానా సోదరుడి కొడుకని చెప్పారు. దాడికి ఉమేర్ సూత్రధారి కాగా, మరో ఇద్దరు ఆర్డీఎక్స్ బాంబును రూపొందించారని ఎన్ఐఏ అధికారులు అన్నారు. బాంబును తయారుచేసిన ఇద్దరు ఇప్పటికే సరిహద్దును దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోకి వెళ్లిపోగా, ఉమేర్ మాత్రం దాడిని పర్యవేక్షించేందుకు పుల్వామాలోనే ఆగిపోయాడని తెలిపారు. అతని కోసం భద్రతాబలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయన్నారు. మసూద్ అజహర్కు బంధువైన హైదర్ 2018, అక్టోబర్లో కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంతో, అతని స్థానంలో ఉమేర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. సిరియా, అఫ్గాన్ తరహాలో.. సిరియా, అఫ్గానిస్తాన్లోని అమెరికా బలగాలు లక్ష్యంగా తీవ్రవాదులు, తిరుగుబాటుదారులు కారుతో పుల్వామా తరహాలో ఆత్మాహుతి దాడులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్లో ఉగ్రవాదుల దగ్గర శిక్షణ పొందిన ఉమేర్ దాన్ని కశ్మీర్లో పక్కాగా అమలు చేశాడు. ఈ ఆత్మాహుతి దాడి కుట్ర రషీద్ ఘజీ, కమ్రాన్ అనే ఇద్దరు ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ)తో కలిసి తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. జమ్మూ–కశ్మీర్ జాతీయ రహదారికి సమీపంలో పుల్వామా–పొంపోర్ల మధ్య 20–25 కిలోమీటర్ల ప్రాంతం ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా ఉందన్నారు. ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నామనీ, గ్రామాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కాగా, ఉగ్రవాదుల జాడ తెలుసుకునేందుకు అధికారులు ఈ ప్రాంతంలో సెల్ఫోన్ కాల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. అలాగే దాడి జరగడానికి 48 గంటల ముందు వరకూ ఇంటర్నెట్ ద్వారా వెళ్లిన కాల్స్, సందేశాలను విశ్లేషిస్తున్నారు. ఐఎస్ఐ మునీర్ ముద్ర! దాడిలో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ ముద్ర కనిపిస్తోంది. పాక్ ఉత్తర ప్రాంతాల కమాండర్గా పనిచేసిన మునీర్కు కశ్మీర్పై పూర్తి అవగాహన ఉందని ఐఎస్ఐ నిపుణులు వెల్లడించారు. ఐఎస్ఐ చీఫ్గా మునీర్ను గత ఏడాది అక్టోబర్లో పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా నియమించారు. పుల్వామా దాడి జరిపిన జైషే మహ్మద్తోనే గతంలో కశ్మీర్లో ఐఎస్ఐ అనేక ఉగ్రవాద కార్యకలాపాలు చేయించింది. భారత పార్లమెంటుపై దాడి కేసులో మరణ శిక్షకు గురైన అఫ్జల్ గురు వర్ధంతి సమయంలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఇంతటి భారీ దాడి చేయించడానికి ఐఎస్ఐ కుట్ర పన్నిందని పాక్ నిఘా సంస్థ గురించి తెలిసిన వారంటున్నారు. కానీ, తన పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయడానికి దాడిని కొద్ది రోజులు వాయిదా వేసింది. ‘ఇది అమలు జరిగిన తీరులో ఐఎస్ఐ చీఫ్ ముద్ర కనిపిస్తోంది’ అని కేబినెట్ సెక్రెటేరియట్లో పనిచేసిన తిలక్ దేవాశర్ తెలిపారు. -
జైషే చీఫ్పై మారని చైనా తీరు
-
జైషే చీఫ్పై మారని చైనా తీరు
సాక్షి, న్యూఢిల్లీ : జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించిన ఘటనను చైనా ఖండించినప్పటికీ ఈ దాడికి బాధ్యత వహించిన ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత వినతిని తోసిపుచ్చింది. జైషే చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితిని భారత్ దీర్ఘకాలంగా కోరుతున్న విషయం తెలిసిందే. పుల్వామా ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని, చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గెంగ్ షౌంగ్ పేర్కొన్నారు. ఉగ్రవాద ముప్పును దీటుగా ఎదుర్కొనేందుకు ఆసియా దేశాలు పరస్పరం సహకరించుకుంటాయని, ప్రాంతీయ శాంతి సుస్ధిరతలను పరిరక్షించుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. జైషే చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించాలనే అంశంపై చైనా వైఖరిని ప్రస్తావిస్తూ పుల్వామా దాడికి బాధ్యత వహించిన జైషే మహ్మద్ను ఐరాస భద్రతా మండలి కౌంటర్-టెర్రరిజం జాబితాలో ఉంచారని, వ్యక్తిగతంగా మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేర్కొనే అంశాన్ని బాధ్యతాయుతంగా, వృత్తిపరమైన నిబంధనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. -
ఉగ్రవాదుల మౌలిక వసతులు కూల్చండి పాక్కు సూచించిన భారత్
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు మద్దతివ్వడాన్ని ఆపాలని, తన భూభాగంలో ఉన్న ఉగ్రవాదుల మౌలిక వసతుల్ని కూల్చివేయాలని భారత్ పాకిస్తాన్కు సూచించింది. జైషే చీఫ్ మసూద్ అజర్తో పాటు ఇతర ఉగ్రవాదుల్ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగా గుర్తించాలన్న తమ ప్రతిపాదనకు మద్దతు తెలపాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. పుల్వామా దాడిని భారత్ తీవ్రంగా ఖండిస్తోందని విదేశాంగ శాఖ ప్రకటన జారీచేసింది. ఐక్యరాజ్య సమితి, ఇతర దేశాలు నిషేధించిన, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే ఈ హేయమైన దాడికి పాల్పడిందని పేర్కొంది. జైషే చీఫ్ అయిన మసూద్ తన ఉగ్ర కార్యకలాపాల్ని విస్తరించడానికి, భారత్లో దాడులు చేసేందుకు పాకిస్తాన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందని ఆరోపించింది. జాతీయ భద్రతను కాపాడేందుకు ఎలాంటి చర్యకైనా వెనకాడమని తేల్చిచెప్పింది. -
ఉగ్ర దాడికి కొత్త వ్యూహాలు
న్యూఢిల్లీ: సైనిక బలగాలపై దాడులకు ఉగ్రవాదులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. సాయుధుడు ఆర్మీ శిబిరంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడటం, లేదంటే బాంబులు విసరడం లాంటివి ఇంతకుముందు చాలాసార్లు జరిగినవే. పుల్వామాలో జరిగిన దాడిలో ఉగ్రవాది 350 కిలోల పేలుడు పదార్థాలతో కూడిన వాహనాన్ని నడుపుకుంటూ వచ్చి జవాన్ల వాహనశ్రేణి వద్ద పేల్చుకోవడం వారి కొత్త వ్యూహాన్ని సూచిస్తోంది. జమ్మూ కశ్మీర్లో ఇలాంటి తరహా పేలుళ్లు చివరిసారిగా 2001లో సంభవించాయి. అప్పుడు అసెంబ్లీ సమీపంలో కారులో పేలుడు పదార్థాలు అమర్చి ఉగ్రవాదులు 38 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 11న నౌషెరా సెక్టార్లో జరిగిన ఐఈడీ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. చాన్నాళ్లు తరువాత కశ్మీర్లో ఐఈడీ దాడులు పెరగడంపై ఆర్మీ ఆందోళన చెందుతోంది. గతేడాది జనవరిలో బారాముల్లాలో చోటుచేసుకున్న ఇలాంటి దాడిలో నలుగురు పోలీసులు మృత్యువాతపడ్డారు. నక్సల్స్ ప్రభావిత ఛత్తీస్గఢ్, ఈశాన్య రాష్ట్రాల్లో ఐఈడీ దాడులు భద్రతా బలగాలకు కొత్తేం కాదు. కానీ కశ్మీర్లో తక్కువ సంఖ్యలో ఉన్న ఉగ్రవాదుల వ్యూహాలు వేరుగా ఉంటాయి. మిలిటరీ శిబిరంలోకి చొరబడి సైనికులు తేరుకునే లోపే చేయాల్సినంత నష్టం చేయడమే లక్ష్యంగా వారు తెగబడుతారు. ఇటీవల అగ్రస్థాయి ఉగ్రవాదుల్ని వరసగా మట్టుపెట్టడంతో, మిగిలిన టెర్రరిస్టుల్లో ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే వాంఛ పెరిగిందని, ఇందులో భాగంగానే ఐఈడీ పేలుళ్లకు పాల్పడుతున్నారని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు. వేర్పాటువాదులకు చేరువకావాలనుకుంటున్న పాకిస్తాన్ ప్రయత్నాలను భారత్ అడ్డుకోవడం కూడా ఉగ్రవాదుల వ్యూహాల మార్పునకు కారణం కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్ను పాక్లో కలపడమే లక్ష్యం భారత్లో పలు ఉగ్రదాడులకు జైషే స్కెచ్ సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఉగ్రదాడికి పాల్పడిన జైషే మొహమ్మద్ను మౌలానా మసూద్ అజహర్(50) 2000, మార్చి నెలలో ప్రారంభించాడు. కశ్మీర్ను భారత్ నుంచి విడగొట్టి పాకిస్తాన్లో కలపాలన్న ఏకైక లక్ష్యంతో ఈ సంస్థ పనిచేసేది. పాక్ ప్రోద్బలంతో జైషే ఉగ్రవాదులు భారత్లోని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులు, సైనికులపై దాడులకు పాల్పడ్డారు. సొంత దేశంలోని ముస్లిమేతరులను ఈ ఉగ్రసంస్థ విడిచిపెట్టలేదు. 2001, అక్టోబర్ 1న కశ్మీర్ అసెంబ్లీపై దాడికి పాల్పడి 38 మందిని బలికొనడంతో జైషే మొహమ్మద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ దాడిని తామే చేశామని తొలుత గర్వంగా ప్రకటించుకున్న జైషే సంస్థ.. ఆ తర్వాత తమకు సంబంధం లేదని బుకాయించింది. అదే ఏడాది భారత పార్లమెంటుపై లష్కరే తోయిబా ఉగ్రవాదులతో కలిసి దాడిచేసింది. ఈ నేపథ్యంలో భారత్ సహా అంతర్జాతీయంగా తీవ్రమైన ఒత్తిడి రావడంతో పాకిస్తాన్ జైషే మొహమ్మద్ను 2002లో నిషేధించింది. అయినప్పటికీ ఇతర సంస్థల ముసుగులో జైషే మొహమ్మద్ తన ఉగ్రవాద కార్యకలాపాలను కొనసాగిస్తూనే ఉంది. 2016లో పఠాన్కోట్ ఎయిర్బేస్పై జరిగిన ఉగ్రదాడిలోనూ జైషే పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఇటీవల కశ్మీర్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో మసూద్ అజహర్ మేనల్లుడు, స్నైపర్ ఉస్మాన్ను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై ఆత్మాహుతి దాడికి మసూద్ తెగబడ్డాడని నిపుణులు భావిస్తున్నారు. -
మసూద్ అజర్కు మరోసారి మద్దతుగా నిలిచిన చైనా
-
భారత్ ప్రయత్నాలకు చైనా మళ్లీ అడ్డుపుల్ల
వాషింగ్టన్: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ అధినేత అజార్ మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ భారత్ చేసిన ప్రయత్నం మరోసారి విఫలమయింది. ఈ మేరకు భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల మద్దతు ప్రకటించినప్పటికీ చైనా వీటో చేసింది. శుక్రవారం వాషింగ్టన్లో జరిగిన ఓ కార్యక్రమంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి మాట్లాడారు. ‘ఈ తీర్మానంపై మండలిలోని దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఈ విషయంతో నేరుగా సంబంధం ఉన్న భారత్, పాక్లూ భిన్నాభిప్రాయంతో ఉన్నాయి’ అని అన్నారు. -
‘మసూద్ అజర్ అంతర్జాతీయ ఉగ్రవాదే’
వాషింగ్టన్ : పాకిస్తాన్కు కొంత కాలంగా వరుస షాక్లు ఇస్తున్న అమెరికా.. తాజాగా మరో గట్టి ఝలక్ ఇచ్చింది. పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పడ్డ ప్రముఖ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలంటూ అమెరికా స్పష్టం చేసింది. మసూద్ అజర్ విషయంలో పాకిస్తాన్కు వంతపాడుతున్న చైనాను కూడా ఈ వ్యాఖ్యలు ఇబ్బందుల్లోకి నెట్టాయి. మసూద్ అజర్ నిస్సందేహంగా ఉగ్రవాదాని పాల్డుతున్న వ్యక్తే. అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదులు జాబితాలో చేర్చాల్సిన అవసరముందని ఆమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ అధికార ప్రతినిధి హార్థర్ న్యూర్ట్ స్పష్టం చేశారు. మసూద్ అజర్ విషయంలో చైనా కూడా తన వైఖరిని మార్చుకోవాలని పేర్కొన్నారు. మసూద్ అజర్ని ఐక్యరాజ్య సమితి సమావేశంలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే క్రమంలో.. చైనా దానిని వీటో చేయడాన్ని ఆమె ఖండించారు. మసూద్ అజర్ని కాపాడే విషయంలో చైనా ప్రపంచానికి సమాధానం చెప్పుకోవాల్సిన రోజు వస్తుందని ఆమె చెప్పారు. అమెరికా చట్టాల ప్రకారం మసూద్ అజర్ని, అతని సంస్థ జైషే మహమ్మద్ని అంతర్జాతీయ ఉగ్రవాదులుగానే పరిగణిస్తామని ఆమె స్పష్టం చేశారు. -
‘భారత్తో బంధం వద్దనుకుంటున్న చైనా’
సాక్షి, న్యూఢిల్లీ : మసూద్ అజర్ విషయంలో చైనా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని భారత రక్షణ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పఠాన్కోట్ దాడికి సూత్రధారి అయిన మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్ ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. భద్రతామండలిలోని 1267 నిషేధాల కమిటీ ముందు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే తీర్మానాన్ని ప్రవేశపెట్టగా చైనా దానిని వరుసగా నాలుగోసారి అడ్డుకుంది. సమితిలో చైనా ప్రవర్తించిన విధానం వల్ల.. భారత్తో బంధాలు ప్రమాదకరస్థాయిలోకి వెళ్లే అవకాశముందని రక్షణ శాఖ నిపుణులు పీకే సింగ్ తెలిపారు. చైనా సమితిలో తనకు ఉన్న వీటో అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్తో బంధాన్ని చైనా కాదనుకుంటోంది అని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం విషయంలో చైనా అసుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలకు ఇదొక తార్కాణమని మరో రక్షణశాఖ నిపుణుడు రాహుల్ జలాల్ అన్నారు. మసూద్ అజర్ విషయంపై చైనా విదేశాంగ శాఖ కార్యదర్ధి హు చునియాంగ్ మాట్లాడుతూ.. మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో కొన్ని అభిప్రాయబేధాలున్నాయని చెప్పారు. మసూద్ అజర్పై భారత్ చాలా అంశాలకు వివరణ ఇవ్వలేదని ఆరోపించారు. -
అజర్పై నిషేధాన్ని మళ్లీ అడ్డుకున్న చైనా
బీజింగ్/ఐక్యరాజ్యసమితి: పఠాన్కోట్ ఉగ్రదాడి సూత్రధారి, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్కు చైనా మరోసారి అండగా నిలిచింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి వీలుగా ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో 1267 నిషేధాల కమిటీ ముందు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్లు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని నాలుగోసారి అడ్డుకుంది. మసూద్పై నిషేధం విధించే విషయంలో ఏకాభిప్రాయం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. చైనా ఇంతకుముందు మసూద్పై నిషేధాన్ని సాంకేతికంగా నిలుపుదల చేసిన గడువు మరికొద్ది సేపట్లో ముగుస్తుందనగా ఈ తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు భద్రతా మండలికి తెలిపింది. మసూద్పై నిషేధానికి చైనా తప్ప భద్రతా మండలిలోని 14 దేశాలు అంగీకరించాయి. -
మళ్లీ చైనా మోకాలడ్డింది!
జేషే మహమ్మద్ చీఫ్, పఠాన్కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత్ ప్రతిపాదనకు చైనా మరోసారి మోకాలడ్డింది. అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించి, నిషేధం విధించాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో భారత్ ప్రతిపాదించగా.. ఇందుకు అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్ మద్దతు తెలిపాయి. చైనా మాత్రం మొండిగా ఈ ప్రతిపాదనను అడ్డుకుంటూ వస్తున్నది. ఇప్పటికే పలు దఫాలుగా ఈ ప్రతిపాదన ఆమోదం పొందకుండా అడ్డుకున్న చైనా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో దీనిని నిలిపివుంచుతూ టెక్నీకల్ హోల్డ్లో పెట్టిన సంగతి తెలిసిందే. దీని గడువు ఈ నెల 2తో ముగిసింది. దీంతో ఈ ప్రతిపాదనపై టెక్నీకల్ హోల్డ్ను మరో మూడు నెలలపాటు పొడిగిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్కు కొమ్ముకాసేవిధంగా చైనా ఈవిధంగా వ్యవహరిస్తుండటంతో ఉగ్రవాదం విషయంలో చైనా ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని భారత్ గతంలోనే నిరసన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. -
మసూద్ అజహర్ విషయంలో చైనాపై మన వైఖరేంటి?
ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదుల జాబితాలో మసూద్ అజహర్ పేరును చేర్చకుండా చైనా రెండోసారి అడ్డుకుందని, ఈ విషయాన్ని భారతదేశం ఎలా చూస్తోందని వైఎస్ఆర్సీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజ్యసభలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆయనీ ప్రశ్న అడిగారు. అసలు చైనా ఏ సాంకేతిక కారణాలతో అడ్డుకుంటోందని, భారత దేశం తన ప్రతిపాదనలు సమర్పించడంలో విఫలమైందా అని కూడా ఆయన అడిగారు. మసూద్ అజహర్ ఈ సమాజానికి ప్రమాదకారి అని స్వయంగా పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా చెప్పిన నేపథ్యంలో దీనిపై భారతదేశం ఎలా ముందుకు వెళ్లబోతోందన్నారు. దానికి విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2016 ఫిబ్రవరిలో భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వద్దకు ఈ విషయాన్ని తీసుకెళ్లిందని, మసూద్ అజహర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరిందని చెప్పారు. పాకిస్తాన్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను ఇప్పటికే ఉగ్రవాద సంస్థగా గుర్తించారని, అది ఉగ్రవాద కార్యకలాపాలలో ఉండటంతో పాటు అల్ కాయిదాతో కూడా సంబంధాలు కలిగి ఉందని చెప్పామన్నారు. ఆ సంస్థ నాయకుడైన మసూద్ అజహర్ను మాత్రం ఉగ్రవాదిగా గుర్తించలేదని, 1267 ఆంక్షల కమిటీలో సభ్యత్వం కలిగిన చైనా ముందుగా ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా ఆపాలని చెప్పి, ఆ తర్వాత భారత ప్రతిపాదనను 2016 డిసెంబర్ 29న పూర్తిగా అడ్డుకుందని అక్బర్ చెప్పారు. ఈ సంవత్సరం జనవరిలో మళ్లీ తాజాగా అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాలు కమిటీ ముందు మసూద్ అజహర్ను ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరాయని, అయితే దీనిపై మళ్లీ చైనా అభ్యంతరం చెప్పిందని వివరించారు. కమిటీ నిబంధనల ప్రకారం, ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకోవాల్సి ఉంటుందని, అంతేకాక తమ అభిప్రాయాలకు కారణం ఏంటో ఏ సభ్యదేశం బహిరంగంగా వివరించాల్సిన అవసరం లేదని తెలిపారు. మన ప్రభుత్వం ఈ అంశాన్ని చైనాతో చర్చించిందని కూడా ఆ సమాధానంలో వివరించారు. పాకిస్తాన్ ఇటీవల లష్కరే తాయిబా, జమాత్ ఉద్ దవా సంస్థలను నిషేధించడంతో పాటు హఫీజ్ సయీద్ను గృహనిర్బంధంలో ఉంచిందని, అప్పుడే ఆ దేశ రక్షణ మంత్రి హఫీజ్ సయీద్ను సమాజానికి ప్రమాదకారిగా చెప్పారని అన్నారు. ఉగ్రవాదాన్ని అణగదొక్కి, మన దేశ పౌరులను కాపాడేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని, అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివరించారు. -
చైనాపై మన వైఖరేంటి?
-
మసూద్పై ఆధారాలున్నాయ్
-
మసూద్పై ఆధారాలున్నాయ్
సాక్ష్యాలు చూపాలన్న చైనా డిమాండ్పై భారత్ బీజింగ్: జైషే మొహమ్మద్ అధినేత మసూద్ అజర్ దుశ్చర్యలన్నిటికీ ‘పక్కాఆధారాలు’ ఉన్నాయని భారత్ స్పష్టం చేసింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతుతో అమెరికా ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో చేసిన ప్రతిపాదనకు చైనా మోకాలడ్డిన సంగతి తెలిసిందే. ఈ అంశంలో సరైన ఆధారాలు చూపాలన్న చైనా డిమాండ్పై భారత్ తాజాగా స్పందించింది. ఈ అంశంపై భారత విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ తమ వద్ద మసూద్ దుశ్చర్యలకు సంబంధించి సరైన ఆధారాలు ఉన్నాయన్నారు. అయితే ఈ విషయంపై ఇతర దేశాలను ఒప్పించాల్సిన బాధ్యత భారత్పై లేదన్నారు. దీనిపై ఐరాసలో దరఖాస్తు పెట్టిన దేశాలు మసూద్కు సంబంధించి బాగా తెలిసుకున్నాయి కాబట్టే ఆ ప్రతిపాదన చేశాయని.. లేకుంటే అసలా ప్రస్తావనే తెచ్చేవి కావని అన్నారు. ఆయన బుధవారం చైనా విదేశాంగమంత్రి వాంగ్ ఇతో సమావేశమయ్యారు. ఇండో–చైనా వ్యూహాత్మక సమావేశాల్లో భాగంగా ఇది జరిగింది. ఎన్ఎస్జీ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత్ సభ్యత్వంపై చైనా సానుకూలంగా ఉందన్నారు. అయితే విధివిధానా లపై ఆ దేశానికి తనదైన వైఖరి ఉందన్నారు. -
మారని చైనా.. అదే ప్రశ్నకు తిక్క వివరణ
-
మారని చైనా.. అదే ప్రశ్నకు తిక్క వివరణ
బీజింగ్: త్వరలో సమావేశం జరగబోతున్నప్పటికీ భారత్కు వ్యతిరేకంగానే చైనా మాట్లాడింది. జైషే ఈ మహ్మద్ సంస్థ వ్యవస్థాపకుడు ఉగ్రవాది మసూద్ అజర్పై నిషేధం విధించడానికి భారత్ వద్ద బలమైన పటిష్టమైన ఆధారాలు ఉండాలంటూ ఆగ్రహం తెప్పించే వ్యాఖ్యలు చేసింది. ఈ నెల 22న భారత విదేశాంగ కార్యదర్శి, చైనా మంత్రి జాంగ్ యేసు మధ్య వ్యూహాత్మక అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో అంతర్జాతీయ వేదికపై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు, స్థానిక అంశాలు కూడా ఉన్న నేపథ్యంలో మసూద్పై నిషేధం విధించాలంటూ భారత్ ఐరాసకు చేసిన ప్రతిపాదనకు మీరు ఎందుకు మద్దతివ్వడం లేదని చైనా ప్రతినిధి ప్రశ్నించగా పైవిధంగా స్పందించారు. ఏవో కొన్ని అంశాలను తీసుకొని తాము మసూద్ విషయంలో నిర్ణయం అంత త్వరగా తీసుకోలేమని అంతకంటే ముందు భారత్ వద్ద గట్టి ఆధారాలుండాలని చెప్పారు. అలాగే, ఎన్ఎస్జీ విషయంలో కూడా భారత్పై అభిప్రాయాలు ఉన్నాయిగా అని ప్రశ్నించగా విభేదాలు ఉండటం సాధారణం అంటూ సమాధానం దాట వేశారు. ఈ నేపథ్యంలో అసలు ఇరు దేశాల మధ్య త్వరలో జరిగే చర్చలు సత్పలితాలు ఇస్తాయా అనేది అనుమానమే. వాస్తవానికి మసూద్ నేర చరిత్రకు సంబంధించి ఒక్క భారత్ వద్దే కాకుండా పాక్ వద్ద కూడా కీలక ఆధారాలు ఉన్నాయి. వీటన్నింటిని కూడా ఇప్పటికే భారత్ ఐరాస ముందుంచింది. చైనా తప్ప భద్రతా మండలిలోని మిగితా దేశాలు భారత్కు అనుకూలంగా ఉన్నప్పటికీ చైనా మాత్రం వ్యతిరేకంగానే ప్రవర్తిస్తోంది. -
అనుకున్నదే అయింది
పాకిస్తాన్లో తలదాచుకుంటున్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్ధ అధినేత మసూద్ అజర్పై నిషేధంపై చైనా జిత్తులు మారి వేషాలు మానుకోవడం లేదు. అజర్పై నిషేధానికి అమెరికా యూఎన్ కౌన్సిల్లో ప్రతిపాదన చేయడం ఆ తర్వాత చైనా మరలా ససేమీరా అన్న విషయం తెలిసిందే. ప్రతిపాదనను ప్రతిసారీ అడ్డుకుంటున్న చైనాపై యూఎన్ కౌన్సిల్ సభ్య దేశాలు గుర్రుగా ఉన్నాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు భారత్ పావులు కదిపింది. అజర్పై నిషేధాన్ని విటోతో అడ్డుకోవడంపై చైనాకు దౌత్యపరంగా వ్యతిరేక గొంతు వినిపించింది. భారత్ వ్యాఖ్యలపై స్పందించిన చైనా యూఎన్ కౌన్సిల్లోని సభ్యులు అందరూ టెర్రరిజం వ్యతిరేకం కార్యక్రమంలో భాగస్వాములేనని చెప్పింది. (చదవండి:అజర్కు చైనా రక్ష.. భారత్కు లాభం..!) అందరూ నియమాలను అనుసరిస్తున్నారని ఉద్ఘాటించింది. భారత్ లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని చెప్పింది. నిషేధానికి కొన్ని సాంకేతిక సమస్యలున్నాయనే పాత మాటనే పదే పదే ప్రస్తావించింది. తాము యూఎన్ నియమాలకు అనుగుణంగానే నడుచుకుంటున్నామని పేర్కొంది. -
మసూద్పై నిషేధానికి చైనా అడ్డంకి
-
అజర్కు చైనా రక్ష.. భారత్కు లాభం..!
ఆప్త మిత్రుడికి చేయందింబోయి చైనా చిక్కుల్లో పడుతోందా?. పాకిస్తాన్ టెర్రరిస్టు మసూద్ అజర్పై నిషేధం విధించడాన్ని చైనా మరోమారు వీటో అధికారంతో అడ్డుకోవడం భారత్కు కలిసొచ్చే అంశంగా మారింది. గతేడాది యూనైటెడ్ కౌన్సిల్లో అజర్పై నిషేధం విధించాలంటూ భారత్ చేసిన ప్రతిపాదనకు మోకాలు అడ్డుపెట్టిన చైనా.. తాజాగా గత నెల 19న ఒబామా సర్కారు ప్రవేశపెట్టిన ప్రతిపాదనను కూడా అడ్డుకుంది. ఈ నెల 2న జరిగిన యూనైటెడ్ కౌన్సిల్ సమావేశంలో 15 సభ్యత్వ దేశాల్లో చైనా మినహా అజర్పై నిషేధానికి ఏ ఒక్కరూ అడ్డు చెప్పలేదు. దీంతో మిగిలిన దేశాల ముందు చైనా దురుద్దేశం బట్టబయలైంది. అమెరికాతో పాటు ఫ్రాన్స్, యూకేలు కూడా అజర్పై నిషేధ ప్రతిపాదనను కౌన్సిల్లో లేవనెత్తాయి. చైనా చేసిన పనికి మిగిలిన దేశాలు నోచ్చుకున్నట్లు కనిపించాయి. టెర్రరిజాన్ని పెంచి పోషించేందుకు చైనా సాయం చేస్తున్నట్లు అవి భావించే అవకాశం కనిపిస్తోంది. దీంతో కౌన్సిల్ దేశాలతో చైనాకు ఉన్న దౌత్యపరమైన సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. భారత్ అదే పనిగా అజర్పై నిషేధానికి కౌన్సిల్లో ప్రతిపాదనలు చేయడం ద్వారా చైనాను దోషిగా నిలబెట్టొచ్చు. -
‘అమెరికా ప్రతిపాదనపై మా నిర్ణయం కరెక్టే’
బీజింగ్: భారత్లోని పఠాన్కోట్లో ఉగ్రదాడి వెనుక కీలక సూత్రదారు జైషే ఈ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను చైనాలోకి అనుమతించకుండా నిషేధించాలంటూ అమెరికా చేసిన ప్రతిపాదనను అడ్డుకోవడాన్ని చైనా సమర్థించుకొంది. అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకే తాము ఈ పనిచేసినట్లు స్పష్టతనిచ్చింది. అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే పనిలో భాగంగా గత ఏడాది 1,267 ఐక్యరాజ్యసమితి ముందు చర్చ జరిగిందని, అయితే, తాము ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా తమ దేశంలోని ఇతర పార్టీల, ముఖ్యవ్యక్తుల అభిప్రాయాలు తీసుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సంబంధిత కథనానికై చదవండి.. (పాక్పై గురిపెట్టిన ట్రంప్.. చైనాకు చిక్కు ప్రశ్న) -
పాక్పై గురిపెట్టిన ట్రంప్.. చైనాకు చిక్కు ప్రశ్న
న్యూయార్క్: తాను వస్తే ఉగ్రవాదాన్ని, దానికి అవకాశాన్నిచ్చే అంశాలను ఏమాత్రం ఉపేక్షించబోనని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తొలుత ఏడు ముస్లిం దేశాలపై నిషేధం విధించి ఇప్పుడు పాకిస్థాన్ వైపు దృష్టి సారించారు. భారత్లోని పఠాన్కోట్లో దాడికి ఉగ్రదాడికి దిగిన జైషే ఈ మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ను చైనాలోకి అనుమతించకుండా నిషేధించాలని కోరారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఆయన ఇప్పటికే చైనా అధికారులతో ఇదే విషయాన్ని చెప్పినట్లు కీలక వర్గాల సమాచారం. గత డిసెంబర్లోనే అజర్ను ఇతర ప్రాంతాల్లో తిరుగాడకుండా, ఆయన సంస్థను నిషేధించాలంటూ భారత్ ఐక్యరాజ్యసమితికి డిసెంబర్లో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సరిగ్గా డోనాల్డ్ ట్రంప్ పదవీ ప్రమాణం చేయడానికి ఒక రోజు ముందు జనవరి 19న చైనాకు ఈ ప్రతిపాదన చేశారు. ‘మా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే చైనాకు మసూద్ నిషేధంపై ప్రతిపాదన చేశారు. ఇప్పుడిక చైనా వంతు ఏం చేస్తుందో ఆ దేశమే నిర్ణయం తీసుకోవాలి’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధులు తెలిపారు. ఇప్పటికే బ్రిటన్, ఫ్రాన్స్ మద్దతును సాధించిన భారత్ అమెరికా సపోర్ట్ను కూడగట్టింది. ఈ మేరకు యూఎన్ సాంక్షన్ కమిటీ 1267కి గత నెలలోనే అమెరికా పంపించింది. అయితే, ఇప్పటికే అమెరికా ప్రతిపాదనను తొలుత వ్యతిరేకించి పక్కకు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఇలా ఒక తొమ్మిది నెలలు మాత్రమే ఆ ప్రతిపాదనను తన వద్దకు ఉంచుకోగలుగుతుంది. ఆ తర్వాత అది బ్లాక్ అవడమో.. రద్దు కావడమో జరుగుతుంది. ఈ రెండింట్లో ఏం జరిగినా చైనాకు దెబ్బే అవుతుంది కాబట్టి ఆమోదించే అవకాశాలే ఎక్కువని తెలుస్తోంది. -
మసూద్పై నిషేధానికి చైనా అడ్డంకి
న్యూఢిల్లీ: పఠాన్కోట్ బాంబు దాడుల సూత్రధారి మసూద్ అజర్ను ప్రపంచ ఉగ్రవాదిగా గుర్తించి, నిషేధం విధించాలని ఐక్యరాజ్యసమితి (ఐరాస)ని అమెరికా కోరింది. దీనికి మళ్లీ చైనా మోకాలడ్డింది. భారత్ పలు దఫాలుగా చేసిన ప్రయత్నాల అనంతరం ఈ ప్రతిపాదనను అమెరికా ఐరాస దృష్టికి తీసుకువెళ్లింది. దీనికి చైనా అడ్డుకట్ట వేసినట్లు తెలుస్తోంది. అమెరికా సీనియర్ ప్రభుత్వాధికార వర్గాల సమాచారం మేరకు భారత్, అమెరికా పలు దఫాలు చర్చలు సాగించిన తర్వాత ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్, దాని అధినేత మసూద్ అజర్పై నిషేధం విధించాలన్న ప్రతిపాదన రూపుదిద్దుకుంది. తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల మద్దతుతో అమెరికా ఐరాస అనుమతుల కమిటీ ముందు మసూద్పై నిషేధ ప్రతిపాదనను ప్రవేశపెట్టింది. అయితే చైనా దీన్ని వ్యతిరేకించి హోల్డ్లో పెట్టింది. అయితే చైనా తాజా చర్యపై భారత్ ప్రతిస్పందిస్తూ.. ‘చైనా నిర్ణయం వెనుక అంతరార్థాన్ని భారత్ గుర్తించింది’అని పేర్కొంది. -
భారత్ ప్రతిపాదనకు అమెరికా ఓకే
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ ప్రతిపాదనకు అగ్రదేశాలు దన్నుగా నిలిచాయి. పఠాన్ కోట్ సైనిక స్థావరంపై దాడి సూత్రధారి, పాకిస్తాన్ కు చెందిన జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పై నిషేధం విధించాలన్న భారత్ ప్రతిపాదనకు అమెరికా, యూకే, ఫ్రాన్స్ మద్దతు తెలిపాయి. ఎప్పటిలానే చైనా అడ్డుపడింది. వాషింగ్టన్-ఢిల్లీ మధ్య జరిగిన సంప్రదింపులతో ఈ ప్రతిపాదన తుదిరూపం దాల్చింది. జైషే-ఈ-మహ్మద్ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అని, దీనికి సంబంధించిన నాయకులు స్వేచ్ఛగా తిరగకుండా ఆంక్షలు విధించాలని ప్రతిపాదనలో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనను అమెరికా సమర్థించడంతో చైనా వ్యతిరేకించిందని తెలిపాయి. ఏ ప్రతిపాదనైనా భద్రతా మండలిలో 10 రోజుల్లోగా ఆమోదించాలి లేదా తిరస్కరించాలి.. లేకుంటే నిలిపివుంచాల్సి ఉంటుంది. ఆరు నెలల పాటు ‘హోల్డ్’లో పెట్టిన తర్వాత మరో మూడు నెలలు పొడిగించుకునే అవకాశముంది. అప్పటికీ ఆమోదం లభించకపోతే ప్రతిపాదన కాలపరిమితి ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ప్రతిపాదనకు చైనా బ్రేక్ వేసింది. భద్రతా మండలిలో తాజా పరిణామాలను చైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని భారత విదేశాంగ ప్రకటించింది. సాంకేతిక అంశాలను సాకుగా చూపి చైనా ఇప్పటికే రెండుసార్లు భారత్ ప్రతిపాదనకు అడ్డుతగిలింది. -
చైనా ద్వంద్వ వైఖరి.. భారత్ రియాక్షన్
న్యూఢిల్లీ: పాకిస్తాన్కు సంబంధించిన జైషే-ఈ-మహ్మద్ అధినేతను బ్లాక్లిస్టులో పెట్టాలని ఐక్యరాజ్యసమితిలో భారత్ పెట్టిన అభ్యర్థనను చైనా అడ్డగించింది. జైషే-ఈ-మహ్మద్ గ్రూప్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పలు మాస్టర్ మైండ్ దాడులకు పాల్పడుతున్నారని, జనవరిలో భారత ఆర్మీ బేస్పై జరిపిన దారుణమైన దాడుల్లో అతని హస్తముందని భారత్ ఆరోపిస్తోంది. అజార్ ను బ్లాక్ లిస్టులో పెట్టడాన్ని చైనా అడ్డగించడం.. ఉగ్రవాదం పట్ల ఆ దేశం అవలంభిస్తున్న ద్వంద్వ వైఖరికి నిదర్శనమని భారత విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది. 15 దేశాల సెక్యురిటీ కౌన్సిల్ ఇప్పటికే జైషే-ఈ-మహ్మద్ను బ్లాక్ లిస్టులో పెట్టింది. కానీ అజార్ను బ్లాక్లిస్టులో పెట్టలేదు. అయితే అజార్ను కూడా ఆ జాబితాలో చేర్చాలని కోరుతూ భారత్ తొమ్మిది నెలల కిందటే ఐక్యరాజ్యసమితిలో ఓ ప్రతిపాదనను పెట్టినట్టు విదేశీ వ్యవహారాల వికాస్ స్వరూప్ తెలిపారు. అన్ని దేశాల నుంచి పూర్తి మద్దతు వచ్చినప్పటికీ, చైనా మాత్రం ఈ విషయంలో ఏప్రిల్ నుంచి ఎలాంటి స్పందన తెలుపలేదని పేర్కొన్నారు. తాజాగా తమ అభ్యర్థనను రద్దు చేసినట్టు వికాస్ చెప్పారు. టెర్రరిజం నుంచి వచ్చే పెను ప్రమాదాన్ని చైనా అర్థం చేసుకుంటుందని తాము భావించామని ఆయన అన్నారు. అయితే ఈ విషయంపై చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెంటనే స్పందించలేదు. ఒకవేళ ఐక్యరాజ్యసమితి సెక్యురిటీ కౌన్సిల్లో అజార్ను బ్లాక్ లిస్టులో పెడితే, గ్లోబల్గా అజార్ ప్రయాణించడాన్ని రద్దు చేయొచ్చు. ఆస్తులు కూడా ఫ్రీజ్ చేసే అవకాశముంటోంది. -
ఆ రెండు అంశాల్లో మా వైఖరి మారదు: చైనా
బీజింగ్: అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్కు సభ్యత్వం, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్ విషయాల్లో తమ వైఖరిలో మార్పు ఉండబోదని చైనా స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వాన్ని అడ్డుకున్న చైనా.. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని ఐకరాజ్యసమితిలో రెండుసార్లు వ్యతిరేకించింది. ఇప్పుడు తాజాగా ఈ రెండు అంశాల్లో తమ వైఖరి మారదని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెంగ్ షుయాంఘ్ స్పష్టం చేశారు. -
ఐక్యరాజ్యసమితిపై ఇండియా ఫైర్
జైషే మహ్మద్ అధినేత, అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్పై నిషేధం విధించడంలో ఐక్యరాజ్యసమితి ఇంకా మీనమేషాలు లెక్కిస్తోందని, లేనిపోని రాజకీయాలు చేస్తోందని భారతదేశం తీవ్రస్థాయిలో మండిపడింది. జైషే మహ్మద్ సంస్థను ఐక్యరాజ్యసమితి భద్రతామండలి బ్లాక్లిస్టులో పెట్టినా, దాని అధినేత మసూద్ అజహర్ (48)ని మాత్రం ఇంకా నిషేధించలేదు. అజహర్ను నిషేధించాలంటూ భారతదేశం చేసిన ప్రతిపాదనను భద్రదతామండలిలో శాశ్వత సభ్యత్వం ఉన్న చైనా రెండుసార్లు అడ్డుకుంది. తమ దేశంలో ఈ ఏడాదే రెండుసార్లు జైషే మహ్మద్ సంస్థ దారుణమైన ఉగ్రదాడులకు పాల్పడిందని భారత్ ఆరోపించింది. జనవరిలో పఠాన్కోట్ వైమానిక స్థావరంపైన, తర్వాత సెప్టెంబర్లో ఉడీలోని సైనిక స్థావరంపైన ఉగ్రవాద దాడులు జరిగాయి. రెండు ఘటనల్లో కలిపి 26 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాద సంస్థల అధినేతలపై ఆంక్షలు విధించడంలో భద్రతామండలి ఘోరంగా విఫలం అవుతోందని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మండిపడ్డారు. భారతదేశంలోని ఏదో ఒక ప్రాంతంలో దాదాపు ప్రతిరోజూ ఉగ్రవాదులు రెచ్చిపోతూనే ఉన్నారని.. అలాంటి సంస్థల అధినేతలుగా తమను తాము ప్రకటించుకున్నవాళ్లపై నిషేధం విధించడానికి భద్రతామండలి ఇప్పటికే 9 నెలల సమయం తీసుకుందని ఆయన అన్నారు. మసూద్ అజహర్పై నిషేధం విధించకుండా తొలిసారి ఏప్రిల్ నెలలో వీటో చేసిన చైనా.. తర్వాత సెప్టెంబర్ నెలలో దాన్ని మరో మూడు నెలలు పొడిగించింది. దాంతో భారత్ తీవ్రస్థాయిలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. -
మిలటరీ, ప్రభుత్వానికి పాక్ పత్రిక షాక్
ఇస్లామాబాద్: జైషే-ఈ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్ లపై చర్యలు తీసుకోవడం ఏ విధంగా దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తుందని పాకిస్తాన్ కు చెందిన ఓ జాతీయ దినపత్రిక ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. డావ్న్ పత్రికలో మిలటరీ, ప్రభుత్వాల మధ్య విభేదాలు ఉన్నాయనే కథనాన్ని ప్రచురించిన సిరిల్ అల్ మెడియా జర్నలిస్టుపై పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా మిలటరీ టెర్రరిస్టు గ్రూపులైన హక్కానీ నెట్ వర్క్, తాలిబన్లు, లష్కరే-ఈ-తోయిబాలకు సహకరిస్తోందనే వార్తలు కూడా జాతీయపేపర్లలో పెద్ద ఎత్తున ప్రచురించాయి. ఉగ్రసంస్ధల నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోరంటూ 'ది నేషన్' పత్రిక 'హౌ టూ లూజ్ ఫ్రెండ్స్ అండ్ ఏలియనేట్ పీపుల్' శీర్షికన ఎడిటోరియల్ ను ప్రచురించింది. అజర్, సయీద్ లపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం మీడియాకు పాఠాలు చెబుతోందని ఘాటుగా వ్యాఖ్యానించింది. పఠాన్ కోట్ దాడి సూత్రధారి అజర్, 2008 ముంబై దాడుల సూత్రధారి సయీద్ లు పాకిస్తాన్ లో స్వేచ్చగా తిరుగుతున్నారని, ఇరువురికి మిలటరీ భద్రతను కల్పిస్తోందనే వార్తలు ఉన్నాయని పేర్కొంది. మీడియా తన పనిని సజావుగా చేయాలని ప్రభుత్వం, మిలటరీ లు చెప్పడం గర్హనీయమంది. జాతీయ భద్రతకు సంబంధించిన మీడియా కథనాలపై ప్రభుత్వం, మిలటరీలు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాయని అనడానికి జర్నలిస్టు అల్ మెడియా ఓ ఉదాహరణ అని పేర్కొంది. అల్ మెడియా ఇచ్చిన రిపోర్టు కల్పన అనే ప్రభుత్వ ఆరోపణను కొట్టిపారేసింది. నిషేధించిన సంస్ధలు పాకిస్తాన్ లో స్వేచ్చగా తిరగుతుంటే ప్రభుత్వం, మిలటరీలు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారని ప్రశ్నించింది. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లపై చర్యలు తీసుకుంటే దేశ భద్రతకు ఎలా ప్రమాదం జరుగుతుంది?. ప్రపంచదేశాల మద్దతును పాకిస్తాన్ ఎందుకు కోల్పోతుంది?. దిగజారిపోతున్న దేశ ప్రతిష్టను కాపాడుకోవడం చేతకాక మీడియా సంస్ధలు పని ఎలా చేయాలో మీరు మాకు(ఆ దేశ పత్రికలకు) నేర్పిస్తారా? అంటూ నిలదీసింది. ఓ రిపోర్టర్ ను క్రిమినల్ లాగా పరిగణించగడానికి మీకు ఎంత ధైర్యం అంటూ తీవ్రంగా స్పందించింది. పైగా ఈ ఘటనను జాతీయ భద్రత కోసం చేస్తున్నట్లు చిత్రీకరించడం ఏకాధికారాన్ని ప్రదర్శిచమేనని అంది. అల్ మెడియాకు తమ సంఘీభావాన్ని ప్రకటించింది. మీడియా మొత్తం మీతో పాటు నిలబడుతుందని పేర్కొంది. -
భారత్ పుండుపై చైనా కారం!
మసూద్ అజార్ విషయంలో డ్రాగన్ తీవ్ర ఆరోపణలు న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఉగ్రవాది మసూద్ అజార్పై నిషేధం విషయంలో పుండుపై కారం చల్లినట్లు భారత్ పట్ల చైనా వ్యవహరిస్తోంది. మసూద్పై ఐక్యరాజ్యసమితి నిషేధం విధించాలన్న భారత్ తీర్మానాన్ని అడ్డుకున్న చైనా.. ఈ విషయంలో మన దేశంపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఉగ్రవాద నిరోధం పేరిట రాజకీయ లబ్ధి పొందేందుకు భారత్ ప్రయత్నిస్తున్నదని అక్కసు వెళ్లగక్కింది. మసూద్పై అంతర్జాతీయంగా నిషేధం విధించాలని, అతన్ని ఐరాస ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని చైనా వీటో చేసిన సంగతి తెలిసిందే. చైనా చర్య వల్ల పఠాన్కోట్, ఉడీ ఉగ్రవాద దాడుల సూత్రధారి అయిన మసూద్ అంతర్జాతీయంగా యథేచ్ఛగా తిరుగుతూ.. భారత్ వ్యతిరేక కార్యకలాపాల కోసం నిధులు సేకరించగలడు. భారత్-అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ సన్నిహితంగా మెలుగుతున్న నేపథ్యంలో భారత్ను ఇరకాటంలో పెట్టేందుకు చైనా మసూద్ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. గోవాలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్పింగ్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆ దేశం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘ఉగ్రవాద నిరోధం విషయంలో ద్వంద్వ వైఖరులు ఉండరాదు. ఉగ్రవాదంపై పోరాటం పేరిట రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించకూడదు’ అని చైనా విదేశాంగశాఖ ఉపమంత్రి లీ బావోడాంగ్ సోమవారం విలేకరులతో అన్నారు. మసూద్ విషయంలో భారత్ వైఖరిని పరోక్షంగా నిందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. మసూద్ను ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసింది. ఈ వీటో గడువు ముగియడంతో రెండురోజుల కిందట దానిని ఇంకో ఆరు నెలలు పొడిగించింది. చైనా అభ్యంతరం చెప్పకుంటే భారత్ తీర్మానం దానంతటదే ఆమోదం పొందేది. మరోవైపు అణు సరఫరాదారుల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్ స్వభ్యత్వం పై ఏకాభిప్రాయం కోసం చర్చలు జరిపేందుకు సిద్ధమని చైనా స్పష్టం చేసింది. మసూద్ విషయంలో మాత్రం తమ వైఖరి మారబోదని పేర్కొంది. -
మొండి చైనాకు మరోసారి భారత్ విజ్ఞప్తి!
-
మొండి చైనాకు మరోసారి భారత్ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: ఉగ్రవాద సూత్రధారి మసూద్ అజార్ విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తున్న చైనాకు ఈ విషయంలో అధికారికంగా విజ్ఞప్తి చేయాలని భారత్ నిర్ణయించింది. మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న భారత తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా సంగతి తెలిసిందే. ఈ విషయంలో పాకిస్థాన్కే కొమ్ముకాస్తూ.. తాజాగా తన వీటో గడువును ఆరు నెలలపాటు కొనసాగించింది. వచ్చేవారం గోవాలో జరగనున్న బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు గ్జీ జింగ్పింగ్ సమావేశం కానున్నారు. ఈ భేటీలో మసూద్ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశముందని కథనాలు వస్తున్నాయి. పఠాన్కోట్ ఉగ్రవాద దాడి, ఉడీ ఉగ్రవాద దాడి వెనుక సూత్రధారిగా భావిస్తున్న మసూద్ అజార్ను అంతర్జాతీయంగా నిషేధించాల్సిందేనని భారత్ కోరుతూ వస్తున్నది. మసూద్ను ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించాల్సిందేనని, అలా చేయకపోతే ప్రమాదకర సంకేతాలు వెళ్లే అవకాశముంటుందని భారత విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ గురువారం విలేకరులతో పేర్కొన్నారు. ఉగ్రవాదంపై సంకుచిత దృక్పథం కలిగి ఉండటం అంతర్జాతీయ సమాజానికి శ్రేయస్కరం కాదని చెప్పారు. మసూద్ను ఉగ్రవాదిగా ప్రకటించడం ద్వారా ఉగ్రవాద సంస్థలకు గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుందని ఆయన పేర్కొన్నారు. మసూద్ను ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని తన వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసిన చైనా.. ఈ వీటో గడువు ఇటీవల ముగియడంతో ఆరునెలల పాటు కొనసాగించింది. ఐరాస భద్రతా మండలిలో చైనాకు వీటో అధికారం ఉంది. భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉండగా.. చైనా మినహాయించి 14 సభ్యదేశాలు భారత్ తీర్మానానికి మద్దతు తెలిపాయి. అజార్పై నిషేధం విధించాలంటూ భద్రతా మండలి ఆంక్షల కమిటీకి భారత్ చేసుకున్న దరఖాస్తును అవి సమర్థించాయి. -
భారత్కు మళ్లీ చైనా షాక్!
-
భారత్కు మళ్లీ చైనా షాక్!
బీజింగ్: పఠాన్కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి, పాకిస్థాన్ ఉగ్రవాది మసూద్ అజార్ విషయంలో చైనా మరోసారి భారత్ వ్యతిరేక వైఖరిని కొనసాగించాలని నిర్ణయించింది. మసూద్ అజార్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ భారత్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ వీటోను చైనా తాజాగా ఆరునెలలపాటు పొడిగించింది. మసూద్ను ఉగ్రవాదిగా ఐరాస గుర్తించాలన్న భారత్ తీర్మానాన్ని చైనా తన వీటో అధికారంతో సాంకేతికంగా నిలిపివేసింది. ఈ వీటో గడువు సోమవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చైనా అభ్యంతరం చెప్పకుంటే భారత్ తీర్మానం దానంతటదే ఆమోదం పొందేది. కానీ చైనా తన వీటోను ఇంకో ఆరు నెలలు కొనసాగించాలని నిర్ణయించినట్టు ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్ షుయంగ్ మీడియాకు తెలిపారు. భారత్ తీర్మానంపై ఇప్పటికీ విభిన్న అభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో సంబంధిత పక్షాలు మరింతగా సంప్రదింపులు జరిపేందుకు వీలుగా తన వీటోను పొడిగించినట్టు చెప్పుకొచ్చారు. ఐరాస భద్రతా మండలిలో చైనాకు వీటో అధికారం ఉన్న సంగతి తెలిసిందే. భద్రతా మండలిలో 15 సభ్యదేశాలు ఉండగా.. చైనా మినహాయించి 14 సభ్యదేశాలు భారత్ తీర్మానానికి మద్దతు తెలిపాయి. అజార్పై నిషేధం విధించాలంటూ భద్రతా మండలి ఆంక్షల కమిటీకి భారత్ చేసుకున్న దరఖాస్తును అవి సమర్థించాయి. చైనా మాత్రం తన అక్కసును చాటుకుంటూ భారత్ తీర్మానన్ని అడ్డుకుంది. -
నేడు చైనాకు రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం చైనా బయలుదేరి వెళ్లనున్నారు. భారత్తో చైనాకు ఉన్న వివాదాంశాలతో సహా ఈ పర్యటనలో పలు కీలకాంశాలపై చర్చిస్తారు. జై షే ఉగ్ర సంస్థ నాయకుడు మసూద్ అజహర్ విషయంలో చైనా అడ్డుపడుతుండటం, అణుశక్తి వ్యాప్తి నిరోధక ఒప్పందంపై తప్పక సంతకం చేయాలనడం తదితర విషయాలపై చర్చించనున్నారు. -
మసూద్పై చైనా తీరుకు భారత్ ప్రతీకారం
ఉయిఘూర్ ఉగ్రవాదికి వీసా న్యూఢిల్లీ: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించే విషయంలో అడ్డుపడ్డ చైనాకు భారత్ అదే స్థాయిలో సమాధానమిచ్చింది. చైనా ప్రభుత్వం ఉగ్రవాద సంస్థగా గుర్తించిన ‘ఉయిఘూర్ కాంగ్రెస్’ గ్రూపునకు చెందిన డోల్కున్ ఇసాకు భారత్ వీసా మంజూరు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ‘సిటిజన్ పవర్ ఫర్ చైనా’ ధర్మశాలలో (హిమాచల్ప్రదేశ్) నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఉయిఘూర్ కాంగ్రెస్ సభ్యుడు (జర్మనీలో తలదాచుకుంటున్నాడు) హాజరుకావాల్సిఉంది. చైనాలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పటంపై భేటీలో చర్చించనున్నారు. 2009లోనే ఉయిఘూర్ సభ్యులకు భారత్ వీసా నిరాకరించింది. కానీ, మసూద్ విషయంలో చైనా తీరుకు నిరసనగా ఇసాతోపాటు పలువురు ఈ సంస్థ సభ్యులకు వీసాలివ్వటంతో చైనాకు బలమైన సంకేతాలు పంపింది. దీనిపై చైనా మండిపడింది. ‘మేం ఇంటర్పోల్ రెడ్కార్నర్ నోటీసులు జారీ చేసిన వ్యక్తిని చైనాకు అప్పగించాల్సింది ఆయా దేశాల బాధ్యత’ అని విమర్శించింది. చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్స్లో కమ్యూనిస్టు ప్రభుత్వం దమనకాండకు బాధితులే ప్రస్తుత ఉయిఘూర్ కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ తీరును వ్యతిరేకించటంతో చైనా వీరిపై ఉగ్రవాద ముద్ర వేసింది. కొంతకాలంగా తమ సంస్కృతిని కాపాడుకునేందుకు వీరు ప్రయత్నిస్తున్నారు. -
మసూద్ అంశాన్ని సమీక్షించండి
చైనాకు స్పష్టం చేసిన సుష్మా స్వరాజ్ మాస్కో: ఐక్యరాజ్యసమితిలో జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్పై నిషేధాన్ని చైనా అడ్డుకోవడంపై ఆ దేశానికి భారత్ తీవ్ర అసంతృప్తి తెలిపింది. మాస్కోలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్యీతో సమావేశమైన భారత్ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐరాసలో ఆ దేశ చర్యను పునఃసమీక్షించుకోవాలని సూచించారు. రష్యా, భారత్, చైనా(ఆర్ఐసీ) విదేశాంగ మంత్రుల సమావేశం సోమవారం మాస్కోలో జరిగింది. అనంతరం విలేకర్లతో సుష్మా మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాట లక్ష్యాల్ని సాధించాలంటే చైనా నిర్ణయాన్ని మార్చుకోవాలని వాంగ్కు స్పష్టం చేశానన్నారు. ఉగ్రవాద సమస్యపై ఉమ్మడిపోరాటానికి సంయుక్త సహకారం అవసరమని చైనాకు సూచించానని చెప్పారు. ఉమ్మడిగా ఉగ్రవాదంపై పోరాటం కొనసాగాలంటే నిర్ణయాన్ని మార్చుకోవాలని వాంగ్కు ఆమె వెల్లడించారు. ఈ అంశంపై ఇరుపక్షాలు చర్చలు కొనసాగించాలని నిర్ణయించాయంటూ విదేశాంగ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. అజర్ను ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్ అభ్యర్థనను గత నెలలో ఐరాస అనుమతుల కమిటీ ముందు చైనా అడ్డుకుంది. దీనిపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జైషే మహ్మద్ను నిషేధించిన ఐరాస దాని అధినేతను నిషేధించకపోవడం సరికాదంది. అంతకుముందు ఆర్ఐసీ సదస్సులో సుష్మ మాట్లాడుతూ... ఉగ్రవాదం నిర్మూలనలో ద్వంద్వ విధానాలు అనుసరిస్తే అంతర్జాతీయ సమాజం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన ప్రమాదం ఉందన్నారు. భద్రతా మండలి సంస్కరణలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, చైనా, రష్యా సహకారం అందించాలని కోరారు. రష్యాలో స్మోలెన్స్క్ స్టేట్ మెడికల్ అకాడమీ అగ్ని ప్రమాదంలో ఇద్దరు భారత వైద్య విద్యార్థుల మృతి, ఖాజన్లో కశ్మీర్ వ్యాపారవేత్త హత్య అంశాలను రష్యా విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్తో భేటీ సందర్భంగా సుష్మా లేవనెత్తారు. భారత్లో యాసిడ్ దాడికి గురైన రష్యా యువతి చికిత్సకయ్యే మొత్తం ఖర్చును భరిస్తామన్నారు. -
చైనాకు భారత్ ఝలక్ ఇస్తుందా?
న్యూఢిల్లీ: పఠాన్కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి, పాకిస్థాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ చీఫ్ మసూద్ అజార్పై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించకుండా చైనా అడ్డుకోవడంపై భారత్ ఆగ్రహంగా ఉంది. ఈ విషయంలో చైనాకు తగిన బుద్ధి చెప్పాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో చైనా పెట్టుబడులకు అనుమతించే విషయమై కేంద్రం పునరాలోచన చేయవచ్చునని సమాచారం. దేశంలో చైనా పెట్టుబడులకు భద్రతా అనుమతులు ఇచ్చే విషయంలో కేంద్రం పునరాలోచన చేయడమంటే.. ఐరాసలో చైనా చర్యకు దీటుగా బదులు ఇవ్వడమేనని అధికార వర్గాలు చెప్తున్నాయి. పఠాన్కోట్ ఉగ్రవాద దాడితోపాటు భారత్ వ్యతిరేక చర్యలు చేపడుతున్న అజార్ను అంతర్జాతీయంగా నిషేధించాలని భారత్ చాలాకాలంగా కోరుతోంది. అయితే అతడిపై నిషేధ తీర్మానాన్ని ఐరాసలో తన వీటో అధికారంతో చైనా తిరస్కరించడం భారత్ను అసంతృప్తికి గురిచేసింది. 'చైనా దౌత్యపాలసీలో పాకిస్థాన్కు ప్రత్యేక స్థానముంది. అందులో భాగంగానే ఐరాసలో చైనా చర్యను చూడాల్సి ఉంటుంది. ఉగ్రవాదం పీడ చైనాపై పడితేగానీ ఆ దేశం పాకిస్థాన్కు మద్దతు తెలుపడం మానుకోదు' అని ఆర్మీ మాజీ చీఫ్, కేంద్ర మంత్రి వీకే సింగ్ అన్నారు. 1962 భారత్-చైనా యుద్ధంనాటి నుంచి ఆసియా దిగ్గజాలైన ఈ ఇరుదేశాలకు సత్సంబంధాలు లేవు. అరుణాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ లోని లడఖ్ విషయమై రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. -
ఇదేంటి చైనా ఇలా చేశావు.. భారత్ ఆగ్రహం!
వాషింగ్టన్: పఠాన్కోట్ ఉగ్రవాద దాడి సూత్రధారి, జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ను నిషేధించాలంటూ ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన తీర్మానాన్ని చైనా వీటో అధికారంతో తిరస్కరించడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉగ్రవాది అయిన అజార్ను కాపాడేందుకు చైనా, పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నాయని పరోక్షంగా ఆరోపించింది. సాంకేతిక కారణాలు చూపుతూ చైనా అసమగ్రంగా వ్యవహరించిందని పేర్కొంది. ఉగ్రవాదం అణచివేతపై ఇలాంటి సంకుచిత దృక్పథాన్ని కనబర్చడం ఏమాత్రం సరికాదని, ఉగ్రవాదాన్ని ఓడించేందుకు అంతర్జాతీయ సమాజం చూపాల్సిన సంకల్పాన్ని ఇది చూపడం లేదని తేల్చిచెప్పింది. ఐక్యరాజ్యసమితిలో చైనాతో సహా ఐదు అగ్రరాజ్యాలకు మాత్రమే వీటో అధికారం ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్తో చర్చలు జరిపిన తర్వాతే భారత్కు వ్యతిరేకంగా చైనా ఈ దుందుడుకు చర్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది. జనవరి 2న పఠాన్కోట్ ఉగ్రవాద దాడి ఘటనకు సూత్రధారి అయిన మసూద్ అజార్ ప్రమాదకరమైన ఉగ్రవాది అని, అతన్ని నిషేధించకపోవడం వల్ల భారత్ ఇప్పటికీ ఉగ్రవాద ముప్పు ఎదుర్కొంటున్నదని కేంద్ర విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే చైనా మాత్రం అజార్ ఉగ్రవాది కాదని, అందుకే తాము వీటో ద్వారా ఈ తీర్మానాన్ని వ్యతిరేకించామని సమర్థించుకుంటోంది. -
మళ్లీ దోవల్-మసూద్ ఫేస్ టు ఫేస్!
న్యూఢిల్లీ: పాకిస్థాన్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ స్థాపకుడు మౌలానా మసూద్ అజార్ను రౌండప్ చేయడం, అతని కార్యాలయాలు మూసివేస్తుండటం.. తప్పకుండా ఒక వ్యక్తికి ఆనందం కలిగించి ఉండాలి. ఆయనే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్. 1994లో శ్రీనగర్లో మసూద్ అజార్ను తొలిసారి పట్టుకున్నప్పుడు అతడో చిన్న చేప అని భద్రతా సంస్థలు కొట్టిపారేశాయి. అప్పట్లో 26 ఏళ్ల అజార్ వద్ద ఓ నకిలీ పోర్చుగీసు పాస్పోర్టుతో, హర్కతుల్ ముజాహిద్దీన్ మ్యాగజీన్ ప్రతులు దొరికాయి. కానీ అజిత్ దోవల్ రంగంలోకి దిగిన తర్వాతే తెలిసింది మసూద్ పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో.. అతనికి పాకిస్థాన్లో భారీ ఎత్తున ఉగ్రవాద నెట్వర్క్ ఉంది. కశ్మీర్ లోయలోని ఉగ్రవాద గ్రూపులు హర్కతుల్ అన్సర్, హర్కతుల్ ముజాహిద్దీన్ మధ్య సయోధ్య కుదిర్చి.. కశ్మీర్తోపాటు భారత్ అంతటా భారీ ఎత్తున దాడులు జరిపేందుకు మసూద్ను పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ పంపింది. అజిత్ దోవల్, ఆయన బృందం ఎంతో శ్రమించి ఈ విషయాలను వెలుగులోకి తేవడంతో మసూద్ గురించి వెల్లడైంది. ఆ తర్వాత 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం ఐసీ 814 నేపాల్లోని కట్మాండు నుంచి ఢిల్లీ బయలుదేరుతుండగా.. దానిని హైజాక్ చేసి కాందహార్ తరలించారు. దీంతో బందీలుగా ఉన్న ప్రయాణికులను విడిపించేందుకు దోవల్ ఉగ్రవాదులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత ముగ్గురు ఉగ్రవాదులను తీసుకొని అప్పటి విదేశాంగ జశ్వంత్ సిన్హాను వెంటబెట్టుకొని కాందహార్ వెళ్లి బందీలను విడిపించుకొచ్చారు. మసూద్తోపాటు అప్పుడు విడుదలైన ఉగ్రవాదులు ఒమర్ షైక్ (ప్రస్తుతం జర్నలిస్టు హత్యకేసులో పాక్లో అరెస్టయాడు), ముస్తాక్ జార్గర్. అప్పుడు అజిత్ దోవల్ బృందంలో ఉన్న అసిఫ్ ఇబ్రహీం ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉగ్రవాదంపై ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తూ.. దోవల్తోపాటే ఉండగా, మరో సభ్యుడు అవినాశ్ మోహనానీ సిక్కీం డీజీపీగా వ్యవహరిస్తున్నారు. పఠాన్కోట్ ఉగ్రవాద దాడి, ఆఫ్ఘనిస్థాన్లోని మజర్ ఎ షహర్లో భారత రాయబార కార్యాలయంపై దాడులకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న మసూద్ అరెస్టు నేపథ్యంలో భారత్ తీసుకోవాల్సిన చర్యలపై దోవల్ బృందం ఇప్పుడు మరోసారి కేంద్రానికి మార్గనిర్దేశనం చేస్తోంది. -
పాక్లో మసూద్ అరెస్ట్
పఠాన్కోట్ ఘటన నేపథ్యంలో భారత్ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ * జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, అతని సోదరుడు, మరికొందరు ఉగ్రవాదులు అరెస్టు * పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కార్యాలయం ప్రకటన * ఉగ్రవాదంపై భారత్తో కలసి పనిచేస్తామని వెల్లడి * అరెస్టుపై అధికారిక సమాచారం లేదన్న భారత్ * ప్రధానితో సుష్మాస్వరాజ్, విదేశాంగ అధికారుల భేటీ * నేడు మళ్లీ సమావేశమై పాక్తో చర్చలపై నిర్ణయం ఇస్లామాబాద్: పఠాన్కోట్ ఘటన తర్వాత భారత్ తీసుకొచ్చిన ఒత్తిడికి పాకిస్తాన్ తలొగ్గింది. ఈ దాడికి బాధ్యులుగా భావిస్తున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్, అతని సోదరుడు రెహ్మాన్ రవూఫ్లను అరెస్టు చేసింది. వీరితోపాటు పలువురు జైషే ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది. దీంతోపాటు జైషే సంస్థకు చెందిన కార్యాలయాలను కూడా సీజ్ చేసినట్లు వెల్లడించింది. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం (ఆర్మీ చీఫ్ జనరల్ రషీల్ షరీఫ్, ఐఎస్ఐ చీఫ్, హోం, ఆర్థిక మంత్రులు, విదేశాంగ శాఖ సలహాదారు సర్తాజ్ అజీజ్, పలువురు కీలక నేతలు హాజరయ్యారు) పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు పకడ్బందీగా పనిచేయాలని.. ఈ ప్రయత్నంలో భారత్తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఉగ్రవాదుల ఏరివేతకు తీసుకుంటున్న చర్యలపై సమావేశం సంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో పాటు పఠాన్కోట్ ఘటనలో లోతైన విచారణ కోసం ఐఎస్ఐ, ఎంఐ, ఐబీలతో పాక్ ప్రధాని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం జనవరి 15న (శుక్రవారం) ఇస్లామాబాద్లో ఇరుదేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం జరగాల్సి ఉండగా.. పఠాన్కోట్ ఉగ్రదాడుల నేపథ్యంలో ఈ భేటీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ దాడికి వ్యూహరచన పాకిస్తాన్లో జరిగినట్లు, జైషే ఉగ్రవాదులే దాడికి పాల్పడినట్లు ఆధారాలు అందజేసిన భారత్.. బాధ్యులపై చర్చలు తీసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో గతవారంలో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వరుసగా రెండ్రోజులు ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ద్వైపాక్షిక చర్చల విషయంలో బంతిని పాక్తిసాన్ కోర్టులోకి నెట్టినందున.. ఏం చేయాలనే దానిపై ఈ భేటీల్లో చర్చించారు. మోదీ ప్రభుత్వం ఇచ్చిన ఆధారాలతో దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతోపాటు మరిన్ని వివరాలు పంపించాలని భారత్ను కోరారు. జనవరి 2న జైషే ఉగ్రవాదులే పఠాన్కోట్ ఎయిర్బేస్పై దాడికి పాల్పడ్డారని ఆధారాలు అందజేసిన భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. వీరిని అరెస్టు చేయాల్సిందేనని డిమాండ్ చేయటంపైనా చర్చించారు. దీనికి అనుగుణంగానే.. పాక్లో తలదాచుకుని.. భారత్పై దాడులకు వ్యూహరచన చేస్తున్న జైషే చీఫ్, అతని సోదరులతోపాటు.. పలువురు జైషే ఉగ్రవాదులను అరెస్టు చేయటం అనివార్యమైంది. అయితే.. మసూద్ అజర్ను భారత్కు అప్పగిస్తారా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే.. అజర్ అరెస్టుపై తమకు అధికారిక సమాచారం అందలేదని భారత్ తెలిసింది. పాక్ ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడినట్లు వార్తలొస్తున్నా.. తమకు సమాచారం రాలేదని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాన మంత్రితో విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్, విదేశాంగ శాఖ కార్యదర్శి జయశంకర్, అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ భేటీ అయ్యారు. అజర్పై భారత్ నజర్ 1994లోనే శ్రీనగర్లో హర్కతుల్ జిహాదీ సాయంతో అల్లర్లు సృష్టించేందుకు జైషే చీఫ్ మసూద్ అజర్ ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో భారత బలగాలు అజర్ను అరెస్టు చేశాయి. అప్పటికే ప్రమాదకర ఉగ్రవాది, వ్యూహకర్తగా పేరున్న మసూద్ అరెస్టుతో కశ్మీర్ లోయలో ఉగ్ర కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. దీంతో మసూద్ను విడిపించేందుకు 1995లో కొందరు ఉగ్రవాదులు కశ్మీర్కు వచ్చిన విదేశీ పర్యాటకులను కిడ్నాప్ చేశారు. ఇందులోనుంచి ఒక టూరిస్టు తప్పించుకోగా.. మిగిలిన వారిని ఉగ్రవాదులు చంపేశారు. ఈ ప్రయత్నం బెడిసికొట్టడంతో.. 1999 డిసెంబర్లో 155 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం (ఐసీ184)ను మసూద్ సోదరుడు ఇబ్రహీం నేపథ్యంలోని కొందరు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. అఫ్ఘానిస్తాన్లోని కాందహార్లో (అప్పడు తాలిబాన్ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతం) విమానాన్ని ల్యాండ్ చేసి.. మసూద్తో పాటు మరో ఇద్దరు కరడుగట్టిన నేరస్తులను విడిపించుకున్నారు. 2001లో భారత పార్లమెంటుపై దాడికి కూడా మసూద్ వ్యూహరచన చేశారు. అప్పడు భారత్ ఒత్తిడితో జైషే చీఫ్ను అరెస్టు చేసినా..2002లో విడుదల చేశారు. అప్పటినుంచి అజర్పై భారత్ దృష్టిపెట్టింది. విధానం నిర్ణయించటానికి షరీఫ్ ఎవరు? పఠాన్కోట్పై ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ పాత్రమై అనుమానాలు తలెత్తుతున్న సమయంలో.. పాకిస్తాన్ మాజీ రాయబారి అషఫ్ ్రజహంగీర్ కాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో విదేశాంగ విధానం నిర్ణయించటంలో పాకిస్తాన్ ప్రధాని ఒక్కరే నిర్ణయం తీసుకోలేరని.. ఆర్మీ మద్దతు లేకుండా అడుగు ముందుకేయలేరని స్పష్టం చేశారు. ‘మోదీ స్టాప్ ఓవర్ విషయంలో పాక్ ఆర్మీ స్పందన ఏంటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. అప్పటి భారత ప్రధాని వాజ్పేయి పాక్ పర్యటించి వెళ్లాకే కార్గిల్ యుద్ధం జరిగింది. ఇప్పుడ మోదీ పర్యటన తర్వాతే పఠాన్కోట్ ఘటన జరిగింది’అని డాన్ పత్రికకు రాసిన వ్యాసంలో కాజీ పేర్కొన్నారు. ప్రధాని అత్యున్నత స్థాయి సమావేశంలో ఆర్మీ చీఫ్ పాల్గొన్నంత మాత్రాన ప్రభుత్వం-ఆర్మీ మధ్య అన్నీ సవ్యంగా ఉన్నట్లు కాదని ఆయన అన్నారు. భారత్తో దౌత్యపర సంబంధాల విషయంలో ఆర్మీ నిర్ణయమే కీలకమవుతుందని వెల్లడించారు. స్పష్టమైన ఆధారాలిచ్చి భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న కాజీ.. బాధ్యులపై చర్యలుంటాయని షరీఫ్ హామీ ఇచ్చినా.. ఇంత త్వరగా నిర్ణయం తీసుకుంటారనుకోలేదన్నారు. పాక్ చర్యపై భారత్లో మిశ్రమ స్పందన జైషే చీఫ్ అరెస్టుపై బీజేపీ, కాంగ్రెస్ జాగ్రత్తగా స్పందించగా శివసేన మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. ద్వైపాక్షిక శాంతి చర్చలకు పాకిస్తాన్ తీసుకున్న చర్యలను ఆహ్వానిస్తున్నామని బీజేపీ ప్రకటించింది. అభివృద్ధిని కోరుకునే భారత్-పాక్ దేశాల ప్రజలు ఈ చర్యలను హర్షిస్తారని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ తెలిపారు. కాగా, పాక్ చర్యను స్వాగతించిన కాంగ్రెస్ కఠినంగా వ్యవహరించటంలో వెనక్కు తగ్గొద్దని సూచించింది. చర్చల ప్రక్రియను కొనసాగించేందుకు నవాజ్ షరీఫ్ చిత్తశుద్ధితో పనిచేస్తే.. పాకిస్తాన్లో గొప్ప రాజనీతిజ్ఞుడుగా ఖ్యాతి సంపాదిస్తారని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు. జేడీయూతోపాటు ఇతర పార్టీలు కూడా పాక్ నిర్ణయాన్ని స్వాగతించగా.. శివసేన మాత్రం అజర్ అరెస్టుపై పెదవి విరిచింది. చర్చల ప్రక్రియకు ఇదేం పెద్ద అనుకూల అంశం కాబోదని.. ఉగ్రవాదులను అరెస్టు చేయటం, తర్వాత విడుదల చేయటం పాకిస్తాన్కు అలవాటేనని వ్యాఖ్యానించింది. -
'అజార్ అరెస్టా.. ఇంకా కన్ఫర్మ్ కాలేదు'
ఇస్లామాబాద్: పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై దాడిలో సూత్రదారి మౌలానా మసూద్ అజార్ అరెస్టుపై తమకు అధికారిక ప్రకటన సమాచారం లేదని భారత్ స్పష్టం చేసింది. అతడు అరెస్టు అయ్యాడా లేదా అనే విషయంపై పాక్ నుంచి తమకు ధ్రువీకరణ సమాచారం అందలేదని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు. పాకిస్థాన్ మంత్రి మహ్మద్ జుబెయిర్ కూడా ఇదే అంశాన్ని తెలిపారు. మసూద్ అజార్ అరెస్టు అయ్యాడని వార్తను ఇప్పుడే పక్కాగా చెప్పలేమని, అయితే, అతడిని అదుపులోకి తీసుకునే క్రమంలో చాలామందిని అరెస్టు చేసినట్లు ఆ మంత్రి తెలిపారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూప్ అధినేత మౌలానా మసూద్ అజార్ను ఇస్లామాబాద్లో భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నట్టు బుధవారం సాయంత్రం వార్తలు వచ్చాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద గ్రూప్ కార్యాలయాలపై దాడులు జరుపుతూ.. వాటిని మూసివేస్తున్న సైన్యం.. ఇందులో భాగంగా మసూద్, అతని నలుగురు కీలక అనుచరులని భద్రతా సంస్థలు అదుపులోకి తీసుకున్నాయని పాకిస్థాన్కు చెందిన జీయో న్యూస్ వెల్లడించింది. -
కాందహార్ హైజాక్ వల్ల విడుదలై.. ఇప్పుడు దొరికాడు!
జైషే మహమ్మద్ ఉగ్రవాద గ్రూపు స్థాపకుడు, 2001 నాటి పార్లమెంటుపై దాడి సూత్రధారి మసూద్ అజార్ గురించి భారత నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటినుంచో గాలిస్తున్నాయి. 1999 నాటి కాందహార్ హైజాక్ వ్యవహారం ద్వారా తప్పించుకొని పాకిస్థాన్లో తలదాచుకుంటున్న మసూద్ అజార్ను తమకు అప్పగించాలని భారత్ ఎప్పటినుంచో దాయాదిని కోరుతూ వస్తోంది. పఠాన్కోట్ ఉగ్రవాద దాడి వ్యవహారంలో మసూద్ అజార్ను పాక్ భద్రతా సంస్థలు నిజంగానే అదుపులోకి తీసుకుంటే.. భారత్కు అది పెద్ద విజయమే అవుతుంది. భారత్-పాకిస్థాన్ చర్చల దిశగా కీలక ముందడుగు పడినట్టు అవుతుంది. పాకిస్థాన్ పంజాబ్లోని భవల్పుర్లో జన్మించిన మసూద్ అజార్ను మొదట 1994లోనే అరెస్టు అయ్యాడు. తీవ్రవాద కార్యకలాపాల కోసం పోర్చుగీసు నకిలీ పాస్పోర్టుతో కశ్మీర్ వచ్చిన అతన్ని అరెస్టు చేసి జైలుకు కూడా తరలించారు. అయితే, 1999లో పాకిస్థాన్ ఉగ్రవాదులు ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి దక్షిణ ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్ తరలించారు. విమానంలోని 155 మంది ప్రయాణికులు బందీలుగా చిక్కడంతో ఉగ్రవాదుల డిమాండ్ మేరకు జైల్లో ఉన్న మసూద్తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను భారత ప్రభుత్వం విడుదల చేసింది. ఉగ్రవాదులకు బందీలుగా చిక్కిన ప్రయాణికులను విడిపించుకుంది. అప్పట్లో కాందహార్ తాలిబన్ అధీనంలో ఉండేది. కాందహార్ నుంచి పాకిస్థాన్ పారిపోయిన అజార్ 2001లో భారత పార్లమెంటుపై దాడి వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత తన సహచరుడు ఒమర్ షైక్తో కలిసి జమ్ముకశ్మీర్లో మిలిటెన్సీని ప్రేరేపించడానికి జైషే మహమ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. చాలాకాలంపాటు సొంత ప్రాంతం పంజాబ్ ప్రావిన్స్లోని భవల్పూర్లో అజ్ఞాతంలో గడిపిన అజార్ను పట్టుకునేందుకు భారత నిఘా, భద్రతా సంస్థలు ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాయి. 2014లో మసూద్ పాక్లోని ఓ బహిరంగ ర్యాలీలో ఫోన్ ద్వారా ప్రసంగించడంతో మళ్లీ వెలుగులోకి వచ్చాడు. జేఈఎం ద్వారా భారత్ లక్ష్యంగా అతడు ఉగ్రవాద కార్యకలపాలకు పాల్పడుతున్నాడని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. -
'తాలిబాన్లకు ఆయుధాలు సరఫరా చేశాను'
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ తాలిబాన్ కు తాను ఆయుధాలు సరఫరా చేశానని సీరియల్ కిల్లర్, బికినీ కిల్లర్ గా పేరొందిన చార్లెస్ శోభరాజ్ వెల్లడించారు. తీహార్ జైల్లో జైష్ ఏ మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజర్ తనకు పరిచయం ఏర్పడిందని శోభరాజ్ తెలిపారు. అంతేకాకుండా అమెరికా గూఢచార సంస్థ సీఐఏతో కూడా గతంలో సన్నిహిత సంబంధాలున్నాయన్నారు. 1999 డిసెంబర్ లో కాట్మండ్ నుంచి కాంధార్ వెళ్లే ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం హైజాక్ తర్వాత ప్రయాణికులను విడిపించేందుకు మసూద్ తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను విడిచిపెట్టారని.. ఆతర్వాత తాను మసూద్ లు కలుసుకున్నామని.. ఆయుధాల కోసం తాలిబాన్లు మాదక ద్రవ్యాలను అమ్మేవారని శోభరాజ్ తెలిపారు. మసూద్ తో ఉన్న పరిచయంతో తాలిబాన్లకు చైనా నేరస్థులతో కలిసి ఆయుధాల డీలర్ గా పనిచేశానన్నారు. అరెస్ట్ అయ్యాక తనతో సీఐఏతో తెగతెంపులు చేసుకుందని, తనకు ఎలాంటి సహాయం చేయలేదని, ఉగ్రవాదంపై పోరాటానికి తాను తన ప్రాణాలను పణంగా పెట్టానని శోభరాజ్ అన్నారు. 2003లో ఇరాక్ యుద్ద సమయంలో సద్దాం హుస్సేన్ ఏజెంట్ ను తాను కలిశానని శోభరాజ్ అన్నారు. తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బందికి స్వీట్స్ లో మత్తు మందు కలిపి ఇచ్చి 1986లో జైలు నుంచి పరారయ్యాడు. అమెరికా మహిళ కొనీ జో బ్రాజించ్ హత్య కేసులో కాట్మండ్ జైలులో సుమారు 20 ఏళ్లు శిక్ష అనుభవించాడు. శోభరాజ్ తన జీవిత కాలంలో 50 శాతం పలు నేరాల్లో శిక్ష అనుభవించాడు. తన జీవితంలో అనేక విషయాలను ఇటీవల మీడియాతో పంచుకున్నాడు.