బ్యాంకాక్ : థాయ్లాండ్లోని పట్టని ప్రావిన్స్లో మంగళవారం అర్థరాత్రి వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మంగళవారం అర్థరాత్రి పబ్కు అతి సమీపంలో పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడులో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.
ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో అరగంట వ్యవధిలో మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా....... 30 మంది గాయపడ్డారు. స్థానిక మార్కెట్ సమీపంలో మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.