one killed
-
అమెరికాలో పోలీసుల కాల్పులు.. 13 ఏళ్ల బాలుడి దుర్మరణం
న్యూయార్క్: అమెరికాలో 13 ఏళ్ల పిల్లాడు పోలీసు తూటాకు బలయ్యాడు. తుపాకీ చూపించి డబ్బులు దోచుకుంటున్న ఒక ముఠా గురించి గాలిస్తున్న పోలీసు బృందం అనూహ్యంగా పిల్లాడిని పొట్టనబెట్టుకుంది. స్థానిక మీడియా, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యుటికాలో శుక్రవారం రాత్రి సైకిల్పై వెళ్తున్న ఇద్దరు టీనేజర్లను పోలీసులు ఆపి ‘మీ దగ్గర ఎలాంటి ఆయుధాలు లేవు కదా?’ అని అడిగారు. వారిలో 13 ఏళ్ల న్యాహ్ ఎంవా ఒక్కసారిగా పరుగెత్తడంతో పోలీసులు వెంటపడ్డారు. దాంతో పిల్లాడు తన దగ్గరున్న బొమ్మ పెల్లెట్ గన్తో బెదిరించాడు. దాన్ని నిజమైన గన్గా భావించి ప్యాట్రిక్ హష్నే అనే పోలీసు పిల్లాడిని కిందపడేసి పట్టుకోబోయాడు. మరో ఇద్దరు పోలీసులు పిడిగుద్దులు కురిపించారు. పెనుగులాటలో పిల్లాడిని ప్యాట్రిక్ షూట్ చేశాడు. ఛాతిలో తూటా దిగడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పిల్లాడు చనిపోయాడు. మొత్తం ఉదంతం పోలీసు అధికారి బాడీ కెమెరాలో రికార్డయింది. వారి అతి జాగ్రత్తలు అమాయక పౌరులను బలితీసుకుంటున్నాయని పిల్లాడి సంతాప సభలో స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై నిష్పాక్షిక దర్యాప్తు జరుపుతామని సిటీ మేయర్ హామీ ఇచ్చారు. అంతర్గత కలహాలతో రగిలిపోతున్న మయన్మార్ నుంచి పిల్లాడి కుటుంబం ఎనిమిదేళ్ల క్రితం అమెరికాకు వలసవచ్చింది. -
విషాదం: బాణసంచా కాల్చడంపై ఘర్షణ.. ఒకరు మృతి
లక్నో: దీపావళి రోజు విషాదం చోటుచేసుకుంది. రెండు గ్రూపుల మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. షామ్లీ జిల్లాలో గురువారం దీపావళి రోజు టపాసులు కాల్చడంపై రెండు గ్రూపుల మధ్య ఘర్షణ ఏర్పడింది. గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. చదవండి: దీపావళి ఎఫెక్ట్.. బాణాసంచా పేలుస్తూ 31 మందికి గాయాలు ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని రాహుల్, సంజీవ్ సైనీగా పోలీసులు గుర్తించారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొదుతూ సంజీవ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపినట్లు తెలిపారు. -
కేరళలో నిఫా కలకలం
కోజికోడ్: కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేరళలో మరో వైరస్ బయటపడింది. నిఫా వైరస్ సోకి 12 ఏళ్ల బాలుడు చనిపోయినట్లు ఆ రాష్ట్ర వైద్యశాఖ మంత్రి వీణా జార్జి ఆదివారం వెల్లడించారు. అతడి నమూనాలను పుణెలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ)కి పంపగా, నిఫా వైరస్గా నిపుణులు ధ్రువీకరించారని తెలిపారు. ఈ పరిణామంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంటర్ ఫర్ డిజీస్ కంట్రోల్కు చెందిన నిపుణులను కేరళకు పంపించింది. ఈ బృందం వైరస్ వ్యాప్తిని నిరోధించడంలో రాష్ట్ర యంత్రాంగానికి సాయపడనుంది. బాలుడి మృతిపై ఆరోగ్య మంత్రి వీణా జార్జి మీడియాతో మాట్లాడారు. ‘12 ఏళ్ల బాలుడు నాలుగు రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరాడు. శుక్రవారం అతడి లాలాజలం తదితర నమూనాలను పుణెకు పంపించాం. శనివారం రాత్రి అతడి పరిస్థితి విషమంగా మారింది. ఆదివారం ఉదయం 5 గంటలకు అతడి మృతి చెందాడు. ఆగస్టు 27వ తేదీ నుంచి బాలుడితో సన్నిహితంగా ఉన్న కుటుంబసభ్యులు, స్నేహితులు, చికిత్స జరిగిన ఆస్పత్రులకు చెందిన మొత్తం 188 మందిని గుర్తించాం. వీరందరినీ ఐసోలేషన్లో ఉండాలని కోరాం. వీరిలో హైరిస్క్ ఉన్న 20 మందిని కోజికోడ్ మెడికల్ కళాశాలలో ఐసోలేషన్లో ఉంచాం. వీరిలో ఇద్దరు ఆరోగ్య కార్యకర్తల నమూనాల్లో నిఫా వైరస్ జాడలు బయటపడ్డాయి’అని ఆమె వివరించారు. ‘కోజికోడ్ మెడికల్ కాలేజీలో నిఫా బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డు ఏర్పాటుచేశాం. ముందు జాగ్రత్తగా, బాలుడి నివాసం చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్గా ప్రకటించాం’అని మంత్రి తెలిపారు. ‘ఇక్కడే నిఫా వైరస్ నిర్థారణ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని పుణె ఎన్ఐవీ అధికారులను కోరాం’ అని ఆమె వివరించారు. కాగా, దక్షిణ భారతంలోనే మొట్టమొదటి సారిగా 2018లో కేరళలోని కోజికోడ్లో నిఫా వైరస్ బారినపడిన 17 మంది చనిపోయారు. ఏమిటీ నిఫా..! ఇది›జూనోటిక్ వైరస్. అంటే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. దీనికి ప్రధాన ఆవాసం గబ్బిలాలే. వాటి నుంచి ఇతర జంతువులు, మనుషులకు వ్యాపిస్తుంది. ముఖ్యంగా పందులు, శునకాలు, గుర్రాలు ఈ వైరస్ బారినపడే ప్రమాదం ఉంది. మనుషులకు సోకితే ఆరోగ్య పరిస్థితి విషమించి మరణం సంభవించే ప్రమాదం ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. లక్షణాలేమిటి? ► బ్రెయిన్ ఫీవర్ ► తీవ్రమైన దగ్గుతో కూడిన జ్వరం. ► ఊపిరి పీల్చడంలో ఇబ్బందులు ► ఇన్ఫ్లూయెంజా తరహా లక్షణాలు.. అంటే జ్వ రం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతు నొప్పి, మగతగా ఉండడం. ► కొన్ని సందర్భాల్లో న్యుమోనియా తలెత్తడం ► 24 నుంచి 48 గంటలపాటు కోమాలోకి వెళ్లిపోయే అవకాశం సైతం ఉంది. ► మనిషి శరీరంలో ఈ వైరస్ 5 నుంచి 14 రోజులపాటు ఉంటుంది. కొన్ని కేసుల్లో 45 రోజులదాకా ఉండొచ్చు. గుర్తించడం ఎలా?: అనుమానిత లక్షణాలున్న వ్యక్తి శరీరంలోని స్రావాలతో గుర్తించవచ్చు. ఇందుకోసం రియల్–టైమ్ పాలీమెరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ–పీసీఆర్) పరీక్ష చేస్తారు. ఎలిసా, పీసీఆర్, వైరస్ ఐసోలేషన్ టెస్టుల ద్వారా కూడా గుర్తించవచ్చు. మనుషుల్లో ఎలా వ్యాప్తి చెందుతుంది? నిఫా వైరస్ సోకిన జంతువులు లేదా మనుషులకు దగ్గరగా మసలితే వ్యాప్తి చెందే అవకాశం ఉంది. నిఫా సోకిన గబ్బిలాల విసర్జితాల్లో ఈ వైరస్ ఆనవాళ్లు ఉంటాయి. ఈ గబ్బిలాలు ఉండే ప్రాంతాల్లో పండ్ల కోసం చెట్లు ఎక్కడం లేదా చెట్టు నుంచి రాలిన పండ్లు తినడం వల్ల వైరస్ సోకే ప్రమాదం ఉంది. నిఫా వల్ల మరణించివారి మృతదేహాల్లోనూ వైరస్ ఉంటుంది. అలాంటి మృతదేహాలకు దూరంగా ఉండడం ఉత్తమం. నివారణ ఎలా?: చేతులు తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. పండ్లను బాగా కడిగిన తర్వాతే తినాలి. వైరస్ బారినపడిన వారికి దూరంగా ఉండాలి. చికిత్స ఉందా?: నిఫా వైరస్ బాధితులకు ప్రస్తుతానికి నిరి్ధష్టమైన చికిత్స అంటూ ఏదీ లేదు. అనుమతి పొందిన వ్యాక్సిన్, ఔషధాలూ లేవు. ల్యాబ్లో నిఫా వైరస్పై రిబావిరిన్ డ్రగ్ కొంత మేర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు గుర్తించారు. అయితే, మనుషులపై ఈ డ్రగ్ ఉపయోగించవచ్చా? లేదా? అనేది నిర్ధారణ కాలేదు. -
ఉప్పల్లో ఇసుక లారీ బీభత్సం
-
కూలీల బతుకులు ఛిద్రం
బొబ్బిలి రూరల్/దత్తిరాజేరు: రెక్కాడితే గాని డొక్కాడని కూలీలు వారు... ప్రతి రోజూ ఒకే ఊరి నుంచి 3, 4 ఆటోలలో 45 మంది వరకు కలిసి వేకువజామునే క్యారేజీలు కట్టుకుని వచ్చి రైల్వే పనులు చేస్తుంటారు. మరో 15 రోజులలో పండగ వస్తోందని ఆశతో అందరూ పనిచేసుకుపోతున్నారు. పనిచేసే ప్రదేశం వద్ద రైలు లేదా గూడ్స్ వచ్చే సమయంలో హెచ్చరికగా జెండాలు ఊపుతూ అంతా అప్రమత్తంగా ఉంటారు. రైలుబళ్లు కూడా వేగం తగ్గించి పని ప్రదేశంలో వెళ్తాయి. కాని గురువారం వారి ఆశలు ఆవిరయ్యాయి. రైలు బండి రూపంలో వారి బతుకులు ఛిద్రం అయ్యాయి...మండలంలోని పెంట రైల్వే బ్రిడ్జి వద్ద జరిగిన ప్రమాదంలో దత్తిరాజేరు మండలం కోరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన దన్నాన సన్యాసిరావు(44) మృతి చెందగా, అదే గ్రామానికి చెందిన మృతుడికి వరుసకు సోదరుడయ్యే పతివాడ రాము కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అలాగే దన్నాన అన్నపూర్ణమ్మ భయంతో బ్రిడ్జిపై నుంచి దూకేయడంతో తీవ్రంగా గాయపడింది. అసలేం జరిగింది.....? స్థానికులు, బాధిత కుటుంబాల సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... కోరపు కృష్ణాపురం గ్రామానికి చెందిన 45 మంది సుమారు 30 సంవత్సరాలుగా రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా గురువారం ఉదయం పెంట బ్రిడ్జిపై పనులు చేపట్టారు. ట్రాక్ పనులు చేస్తుండగా ఉదయం 9.30 గంటల సమయంలో విశాఖ నుంచి రావాల్సిన విశాఖ–రాయఘడ డీఎంయూ గంట ఆలస్యంగా 10.30గంటలకు వచ్చింది. వేగంగా రైలు వస్తుండడంతో çపనులు జరుగుతున్నట్లు కార్మికులు హెచ్చరిక జెండా ఊపారు. అయినా రైలు వేగంగా వచ్చి దన్నాన సన్యాసిరావును ఢీ కొట్టింది. దీంతో అతని శరీరం ఛిద్రమై బ్రిడ్జి పిల్లర్ల మీద పడిపోయింది. ఈ సమయంలో అక్కడేపనిచేస్తూ పరుగుతీçస్తున్న పతివాడ రామును కూడా రైలు ఢీకొనడంతో తలకు తీవ్రగాయమైంది. ఈ ఘటనలో భయబ్రాంతులకు గురైన దన్నాన అన్నపూర్ణమ్మ బ్రిడ్జిపై నుంచి దూకేయడంతో సుమారు 25 నుంచి 30 అడుగుల ఎత్తునుంచి కిందపడడంతో ఆమె కాలుకు తీవ్రగాయమైంది. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను 108 వాహనంలో బొబ్బిలి సీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని విశాఖ కేజీహెచ్కు రిఫర్ చేశారు. భార్య కళ్లెదుటే... మృతుడు సన్యాసిరావుకు భార్య రమణమ్మ, కుమార్తెలు దివ్య, ఉష ఉన్నారు. రమణమ్మ కూడా గురువారం భర్తతో పాటే పనిచేస్తోంది. తన కళ్లెదుటే భర్త చనిపోవడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇద్దరు కుమార్తెల్లో ఒకరు టెన్త్, మరొకరు ఇంటర్ చదువుతున్నారు. తీవ్రంగా గాయపడిన పతివాడ రాముకు భార్య చిన్నమ్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. తీవ్రంగా గాయపడిన అన్నపూర్ణమ్మ భర్త గతంలో మృతి చెందగా ఆమెకు పార్వతి అనే ఒక కుమార్తె ఉంది. వీరంతా గ్రామానికి చెందిన ఎస్.బంగారునాయుడు ఆధ్వర్యంలో రైల్వే పనులు చేస్తున్నారు. సన్యాసిరావు మృతదేహాన్ని అతికష్టం మీద బ్రిడ్జి పిల్లర్ల మీద నుంచి తీసి రైల్వే ఇన్స్పెక్టర్ ఎంకే మీనా, ఎస్సై జీపీ రాజు, ఏఎస్సై వీఆర్ రెడ్డి, ఎస్హెచ్ఓ ఈ.కేశవరావు, వీఆర్ఓ రవి, అప్పారావుల సమక్షంలో శవపంచనామా చేసి బొబ్బిలి సీహెచ్సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మిన్నంటిన ఆర్తనాదాలు... ప్రమాదం జరిగిన ప్రదేశంలో కోరపు కృష్ణాపురం గ్రామస్తులతో పాటు మృతుడు సన్యాసిరావు కుటుంబ సభ్యులు హృదయ విదారకంగా రోదించడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి. ఎప్పుడూ ట్రాక్లపై పనిచేసే తాము ప్రమాదాలను పసిగడతామని... 30 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లాల్సిన ట్రైన్ 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని కార్మికులు చెబుతున్నారు. మృతుని కుటుంబ సభ్యులకు, క్షతగాత్రులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని వైఎస్సార్సీపీ నాయకుడు సుమన శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి.... సంఘటన జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన దురదృష్టకరమని, బాధితులను ఆదుకోవాలని ఆయన కోరారు. -
జార్ఖండ్లో 63.36% పోలింగ్
రాంచీ: ఉద్రిక్తత నడుమ జార్ఖండ్లో రెండో దశ పోలింగ్ ముగిసింది. 63.36 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సిసాయ్ నియోజకవర్గంలోని 36వ పోలింగ్ బూత్ వద్ద పోలీసుల నుంచి ఆయుధాలు లాక్కోవడానికి ప్రయత్నించిన వ్యక్తుల మీద భద్రతా సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మరణించగా, మరి కొందరు గాయపడ్డారని ఏడీజీపీ మురారి లాల్ మీనా చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరపుతున్నామని జార్ఖండ్ ఎన్నికల అధికారి వినయ్ కుమార్ చౌబే తెలిపారు. పోలీసుల కాల్పుల అనంతరం కోపోద్రిక్తులైన ప్రజలు రాళ్లు విసరడంతో ఓ పోలీసుకు గాయాలయ్యాయి. రెండో దశలో మొత్తం 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనుండగా, అందులో 18 స్థానాల్లో మధ్యాహ్నం 3 వరకూ మరో రెండు స్థానాల్లో సాయంత్రం 5 వరకు పోలింగ్ జరిగింది. దాదాపు ఏడు జిల్లాల వ్యాప్తంగా 42 వేల మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు చెప్పారు. -
టీడీపీ అభ్యర్థి కారు ఢీకొని యువకుడి మృతి
-
టీడీపీ అభ్యర్థి కారు ఢీకొని యువకుడి మృతి
తెనాలి: తెలుగుదేశం పార్టీ తెనాలి నియోజకవర్గ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ సతీమణి మాధవి ప్రయాణిస్తున్న కారు, బైకును ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వేరొక వాహనంలో మాధవి వెళ్లిపోగా, క్షతగాత్రులను తెనాలిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. వీరిలో ఒక యువకుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. తెనాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న ఆలపాటి మాధవి, హనుమాన్పాలెం–గుంటూరు రహదారిలో తిరిగి వెళుతుండగా, రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. తెనాలి రూరల్ మండలం ఖాజీపేట సెంటరులో ఎదురుగా వస్తున్న బైకును కారు ఢీకొంది. ఈ దుర్ఘటనలో బైకుపై వస్తున్న సమీప కొలకలూరు గ్రామ యువకులు సుద్దపల్లి రవీంద్ర (30), పొన్నెకంటి పవన్కుమార్ (25)కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వీరిని తెనాలిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో పవన్కుమార్ మృతి చెందగా, రవీంద్ర పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. విషయం తెలిసిన కొలకలూరు దళితవాడ ప్రజలు ప్రమాద స్థలానికి చేరుకుని, ఆందోళన చేపట్టారు. తెనాలి రూరల్ ఎస్ఐ రాంబాబు అక్కడకు చేరుకుని న్యాయం చేస్తామని పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. -
జమ్మూలో గ్రెనేడ్ దాడి
జమ్మూ: జమ్మూలో ఉగ్రవాదులు గురువారం జరిపిన గ్రెనేడ్ దాడిలో మహ్మద్ షరీక్ (17) అనే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో 32 మంది గాయపడ్డారు. జమ్మూ ఆర్టీసీ బస్టాండ్లో ఈ దాడి జరిగింది. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు యాసిన్ జావీద్ భట్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. అతనికి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. ఆ సంస్థే జమ్మూలో మతసామరస్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడిందన్నారు. ఘటనపై జమ్మూ ఐజీ ఎంకే సిన్హా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నిందితుడిని నగ్రోటా టోల్ప్లాజా దగ్గర పట్టుకున్నామనీ, హిజ్బుల్ సంస్థ కుల్గాం జిల్లా కమాండర్ ఫరూఖ్ అహ్మద్ భట్తో అతను మాట్లాడినట్లు తేలిందని చెప్పారు. ఫరూఖ్ తనకు గ్రెనేడ్ను కుల్గాంలో అందజేశాడనీ, గురువారం ఉదయం జమ్మూ చేరుకున్నానని విచారణలో యాసిన్ చెప్పాడన్నారు. చనిపోయిన మహ్మద్ ఫరీక్ ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాకు చెందిన వాడు. గతేడాది మే నుంచి చూస్తే జమ్మూ ఆర్టీసీ బస్టాండ్లో ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడికి పాల్పడటం ఇది మూడోసారి. ఎన్కౌంటర్లో జైషే ఉగ్రవాది హతం శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్కు చెందిన ముష్కరుడు మరణించాడని పోలీసులు చెప్పారు. హంద్వారాలోని క్రల్గుండ్లో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా సమాచారం మేరకు పోలీసులు బుధవారం రాత్రి నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారని తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదిని పాకిస్తాన్ జాతీయుడైన అన్వర్గా గుర్తించామనీ, ఇతనికి జైషే మహ్మద్ సంస్థతో సంబంధాలున్నాయని పోలీసులు వెల్లడించారు. ఆయుధాలు, పేలుడు పదార్థాల వంటి నేరారోపక వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. యూపీలో కశ్మీరీలపై దాడి చితక్కొట్టిన బజరంగ్ దళ్ సభ్యులు లక్నో: ఉత్తరప్రదేశ్లో ఉగ్రవాదులనుకుని కశ్మీర్కు చెందిన యువకులపై బజరంగ్ దళ్కు చెందిన వ్యక్తులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం ఆ రాష్ట్రంలోని దాలిగంజ్ బ్రిడ్జిపై డ్రై ఫ్రూట్స్ను అమ్ముతున్న కొందరు కశ్మీర్ యువకులపై బజరంగ్ దళ్కు చెందిన కొందరు విచక్షణారహితంగా దాడి చేశారు. ఆ కశ్మీరీ యువకులపైకి రాళ్లతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరిచారు. నలుగురు నిందితుల్ని అరెస్టు చేశారు. దాడిలో ప్రధాన నిందితుడు, బజరంగ్దళ్ సభ్యుడు, విశ్వ హిందూదళ్ అధ్యక్షుడు సోంకర్, హిమాన్షు గార్గ్, అనిరుధ్, అమర్ కుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులు డ్రైఫ్రూట్స్ అమ్మేందుకు కశ్మీర్ నుంచి ఉత్తర్ప్రదేశ్కు వచ్చినట్లు తెలుస్తోంది. -
కారు-లారీ ఢీ,ఇద్దరు మృతి
-
హైదరాబాద్: దోంగల బీభత్సం
-
రెప్పపాటులో ఢీకొన్న మూడు వాహనాలు ..
రామాపురం(తడ) : తమిళనాడు సరిహద్దులో రామాపురం కుప్పం వద్ద జాతీయ రహదారిపై గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెప్పపాటులో టిప్పర్, లారీ, పరిశ్రమ బస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, 32 మందికి తీవ్రంగా గాయపడ్డారు. నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు..తమిళనాడుకు చెందిన టిప్పర్ శ్రీకాళహస్తి నుంచి రాతి పొడిని(డస్ట్) తీసుకెళుతోంది. టిప్పర్ రామాపురం కుప్పం వద్దకు చేరుకునే సరికి డివైడర్ను దాటుతూ ద్విచక్ర వాహనదారుడు అడ్డు వచ్చాడు. దీంతో టిప్పర్ డ్రైవర్ మదన్(32) బైక్ను తప్పించేందుకు షడన్ బ్రేక్ వేశాడు. దీంతో టిప్పర్ డివైడర్ని ఢీకొని టైర్లు పేలిపోయాయి. దీంతో టిప్పర్ అదుపుతప్పి డివైడర్పైకి ఎక్కి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లింది. అదే సమయంలో తమిళనాడు నుంచి నెల్లూరు వైపు వెళుతున్న ఖాళీ లారీ అకస్మాత్తుగా రోడ్డుపై అడ్డు వచ్చిన టిప్పర్ని వేగంగా ఢీకొంది. ఖాళీ లారీ వెనుకగా కార్మికులతో చెన్నై నుంచి శ్రీసిటీకి వస్తున్న సెల్ఫోన్ తయారీ పరిశ్రమ బస్సు అదుపుతప్పి ఢీకొంది. రెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంలో పాత గుమ్మిడిపూండికి చెందిన ట్రిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు. ఖాళీ లారీ డ్రైవర్ వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలయ్యాయి. క్లీనర్ రామకృష్ణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. బస్సు డ్రైవర్ సతీష్ కాలుతెగిపోయింది. స్థానికులు బయటకు తీసి తమిళనాడు అంబులెన్స్లో చికిత్స నిమిత్తం చెన్నై పంపారు. బస్సులో ముగ్గురు మహిళా ఉద్యోగులతో పాటు 29 మంది కార్మికులు ఉండగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయడిన వారిని తమిళనాడు అంబులెన్స్లో చెన్నై తరలించగా> పలువురిని శ్రీసిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం చెన్నై తరలించారు. ఈ ప్రమాదంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచి పోయాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సూళ్లూరుపేట సీఐ ఎన్ కిషోర్బాబు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులు, పోలీసుల సహకారంతో సహాయ చర్యలు చేపట్టారు. -
కుటుంబంలో పెను విషాదం
చింతామణి: సెలవు రావడంతో ఆనందంగా సొంతూరికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం విరుచుకుపడింది. కారును సరుకు ఆటో డీ కొన్న ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మరణించగా, ఆమె భర్తతో సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. చింతామణి తాలూకా కంచార్లపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని దండుపాళ్యం గేటు దగ్గర ఆదివారం ఈ ఘటన చోటుచేసుకొంది. మృతురాలిని లలితమ్మ (40)గా గుర్తించారు. వివరాలు... ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లి సొసైటీ కాలనీకి చెందిన రవీంద్రరెడ్డి, భార్య లలితమ్మ(40), కూతురు హారిక (18)తో కలిసి బెంగళూరు మహదేవపురలో నివాసం ఉంటున్నారు. రవీంద్రరెడ్డి సివిల్ ఇంజినీర్గా ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నారు. భార్య పుట్టింటికి వెళ్తుండగా... ఆదివారం సెలవు కావడంతో భార్య లలితమ్మ పుట్టినిల్లయిన తంబళ్లపల్లి మండలం ముద్దలదొడ్డి గ్రామంలోని తల్లిదండ్రులను చూడటానికి బెంగళూరు నుంచి బయల్దేరారు. ఉదయం 10 గంటలప్పుడు చింతామణి మీదుగా వెళుతుండగా ఎదురుగా రాగుల లోడుతో వచ్చిన సరుకు ఆటో వీరి కారును వేగంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. లలితమ్మ కొద్దినిమిషాలకే కన్నుమూసింది. రవీంద్రరెడ్డి తలకు తీవ్రకు గాయాలయ్యాయి, కూతురు నీహారికకు కాళ్లు, చేతులు విరిగాయి. వీరిని బెంగళూరు మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.ఆటోలో వున్న వారు శ్రీనివాసపురం తాలూకా కూరకుల్లోపల్లి గ్రామానికి చెందని రైతులు నారాయణస్వామి, రామన్న, మూర్తి రాగులతో చింతామణి మార్కెట్కు వస్తుండగా ప్రమాదం సంభవించింది. వారికి కూడా గాయాలు తగిలాయి. ఆటోను మూర్తి నడుపుతున్నట్లు గుర్తించారు. కంచార్లపల్లి పోలీసులు వచ్చి ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
బంజారాహిల్స్ లో రౌడీషీటర్ల వీరంగం, ఒకరి మృతి
సాక్షి,హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ సమీపంలో బుధవారం రౌడీషీటర్లు వీరంగం సృష్టించారు. అయిదుగురి వ్యక్తులపై రౌడీ షీటర్లు కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రాణం తీసిన రూ.200
సంగారెడ్డి క్రైం: దాబాలో రూ.200 బిల్లు విషయంలో తగాదా ఏర్పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన సంగారెడ్డిలో చోటు చేసుకుంది. కొండాపూర్ మండలం తెర్పోల్కి చెందిన షాకిర్ మియా(45), చాకలి రాములు, గంగ్యా నర్సింలు పెద్దాపూర్లో సిమెంట్ రింగులు కొనుగోలు చేసి, వాటిని వాహనంలో గ్రామానికి తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో ఆ వాహనం పాడవడంతో షెడ్కు తరలించారు. అనంతరం పట్టణ శివారులోని 65వ నంబర్ జాతీయ రహదారి పక్కనున్న ఫ్రెండ్స్ ఫ్యామిలీదాబాకు వెళ్లారు. మద్యం సేవించి భోజనం చేశారు. బిల్లు రూ.1,200 కాగా, రూ.వెయ్యి చెల్లించారు. మిగతా రూ.200 వాహనంలో ఉన్నాయని, తీసుకువస్తామని చెప్పినా దాబా యజమాని అశోక్ చౌహాన్తోపాటు ఆయన కుమారుడు పూర్తి డబ్బులు చెల్లించాల్సిందేనని పట్టుబట్టారు. ఇది పెద్ద గొడవకు దారి తీయడంతో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలోనే షాకీర్ మియా మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాకీర్మియా మృతదేహాన్ని ఘటనాస్థలం నుంచి తరలించేది లేదని బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. దాబాపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. -
వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకరు మృతి
-
తేనేటీగల దాడి: ఒకరి మృతి
సాక్షి, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని అశ్వరావుపేట వద్ద పామాయిల్ తోటలో కూలీలపై తేనేటీగలు దాడి చేశాయి. తేనేటీగల దాడిలో ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తేనేటీగల దాడిలో కూలీ మృతిచెందడంతో అతని స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆస్తి తగాదా ఒకరు మృతి
-
కేవీబీపురంలో దారుణం
-
కేవీబీపురంలో దారుణం
కేవీబీపురం: చిత్తూరు జిల్లాలోని కేవీబీపురంలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్ష్యలతో ఇటుకల వ్యాపారి రాజశేఖర రెడ్డిని దుండగలు నరికి చంపారు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. -
బెజవాడలో కల్తీ మద్యం కలకలం
విజయవాడ: విజయవాడలో మరోసారి కల్తీమద్యం కలకలం రేపుతోంది. శుక్రవారం రిక్షా కార్మికుడు అచ్చన్న శుక్రవారం మద్యం తాగిన కొద్దిసేపటికే మృతి చెందాడు. దీంతో అచ్చెన్న కుటుంబసభ్యులు కల్తీ మద్యం వల్లే మృతి చెందాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతుడి వద్ద ఉన్న మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా గతంలోనూ కల్తీ మద్యం సేవించి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. -
కూకట్పల్లిలో డీసీఎం బీభత్సం
-
ఇంట్లో నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన డీసీఎం
కృష్ణా: జిల్లాలోని కంచికచర్ల మండలం కీసరలో శుక్రవారం తెల్లవారుజామున డీసీఎం బీభత్సం సృష్టించింది. వేగంగా వెళ్తున్న డీసీఎం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీ కొట్టి.. పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. డీసీఎంలో డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖ జిల్లా యలమంచిలి నుంచి గన్నవరం గొర్రెల సంతకు వస్తుండగా.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యలమంచిలికి చెందిన ఎస్కే సుభాని గన్నవరం నుంచి గొర్రెలు తీసుకెళ్లడానికి తన డీసీఎం వాహనంలో ఓ డ్రైవర్తో పాటు వచ్చాడు. ఈ క్రమంలో కీసర వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుభాని మృతి చెందగా.. ఇంట్లో నిద్రిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు క్షతగాత్రులను అంబులెన్స్ల సాయంతో ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. -
రూ. 30 బాకీ కోసం ఘర్షణ
చికిత్స పొందుతూ ఒకరి మృతి చిల్పూరు (స్టేషన్ ఘన్పూర్): గుడుంబా విక్రయ కేంద్రంలో జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జనగామ జిల్లా చిల్పూరు మండలం మల్కాపూర్కు చెందిన అన్నెబోయిన లింగయ్య (35) ఓ గుడుంబా విక్రయ కేంద్రంలో ఖాతాదారుడు. ఈ నెల 24న పాత అప్పును చెల్లించేందుకు లింగయ్య బస్తా బియ్యం తీసుకెళ్లాడు. ముందుగా గుడుంబా తాగిన తర్వాత వాటిని విక్రయదారునికి అందజేశాడు. ఇంకా రూ. 30 బాకీ ఎవరు కడతారని గుడుంబా విక్రయదారుడు అడగడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గుడుంబా అమ్మకందారులు ఒకటై లింగయ్యపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. లింగయ్యను ఆస్పత్రిలో చేర్పించగా, మంగళవారం మృతి చెందాడు. -
రాజమండ్రి పుష్కర ఘాట్లో అపశృతి
-
విషాదంగా మారిన ’రయీస్’ ప్రమోషన్
-
‘దారి’ తీసిన గొడవ
♦ రాళ్ల దాడిలో ఒకరి మృతి, మరొకరి పరిస్థితి విషమం ♦ వికారాబాద్ జిల్లాలో ఘటన దోమ: దారికి అడ్డంగా బైక్ పెట్టడంతో మొదలైన గొడవ చివరకు ఒకరి ప్రాణాన్ని బలి గొంది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం ఐనాపూర్లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుడ్ల రాజు కొన్నిరోజుల క్రితం తన పొలంలో బోరుబావి తవ్వించాడు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం స్నేహితులు యాదయ్య, నరేందర్, బుగ్గయ్య, నర్సింలుతో కలసి విందు ఏర్పాటు చేశాడు. రాజు పొలానికి వెళ్లే దారిలోనే గ్రామానికి చెందిన సుజాజొద్దీన్ (50) పొలం ఉంది. గురువారం సాయంత్రం ఆయన కుమారులు సైఫొద్దీన్, అహ్మద్ తమ పొలం దగ్గర దారికి అడ్డంగా బైక్ నిలిపి ఉంచడంతో యాదయ్య వారిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో వారి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ విషయాన్ని యాదయ్య విందులో ఉన్న తన స్నేహితులకు చెప్పడం తో వారు అక్కడికి వచ్చి ఘర్షణకు దిగారు. ఈ విషయం తెలుసుకున్న సుజాజొద్దీన్ రాత్రి మరోవర్గానికి చెందిన వారిని పిలిపించి సర్ది చెప్పాడు. అనంతరం వారిని మరోసారి తిరిగి పిలిపించడంతో గొడవ మొదలైంది. దీంతో సుజాజొద్దీన్, అహ్మద్, సైఫొద్దీన్లపై రాళ్లతో దాడి చేసి పరారయ్యారు. పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి సుజాజొద్దీన్ మృతి చెందగా.. సైఫొద్దీన్ పరిస్థితి విషమం గా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది. వివరాలు సేకరించిన ఎస్పీ ఎస్పీ నవీన్కుమార్ శుక్రవారం ఘటన స్థలా నికి చేరుకొని గొడవకు దారి తీసిన కార ణాలను పరిగి డీఎస్పీ అశ్ఫక్, సీఐ ప్రసాద్, ఎస్ఐ ఖలీల్ను అడిగి తెలుసుకున్నారు. ముందు జాగ్రత్తగా గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
బలితీసుకున్న మంత్రి కారు
-
బలితీసుకున్న మంత్రి కారు
లక్నో: ఓ మంత్రి కారు డ్రైవర్ బాధ్యతారహితంగా ప్రవర్తించాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ఓ నిండు ప్రాణం పోయేందుకు కారణమయ్యాడు. అతడి కారులో మద్యం సీసాలు కూడా లభించడంతో మద్యం తాగి అతడు వాహనం నడిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తప్రదేశ్లోని ఓం ప్రకాశ్ సింగ్ అనే ఆయన సహాయ మంత్రిగా పనిచేస్తున్నారు. ఆయనకు సంబంధించిన కారు హర్దోయి అనే ప్రాంతంలో ఓ హ్యాండ్ కార్ట్(మనిషిలాగే బండి)ను ఢీకొట్టడంతో దానిని నడిపే వ్యక్తి అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆ డ్రైవర్ను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం కారును తనిఖీ చేయగా అందులో మద్యం బాటిళ్లు లభించాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. -
న్యూఢిల్లీలో ఫైరింగ్ ఒకరు మృతి
-
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్
వరంగల్: తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కాల్మెట్టా అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన పోలీసులకు, మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సల్ చనిపోయాడు. మృతుడిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలం కొంగల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు మృతదేహాన్ని గుర్తించి, తీసుకువచ్చేందుకు శుక్రవారం బీజాపూర్ బయలుదేరి వెళ్లారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ముగ్గురికి తీవ్రగాయాలు సురక్షితంగా బయటపడ్డ చిన్నారులు ఓడీ చెరువు: ఓడీచెరువు మండలంలోని కదిరి– హిందూపురం రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రాష్ట్రం మధుగిరికి చెందిన లక్ష్మమ్మ(70)మృతి చెందింది. నరసింగప్ప, గీత, రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరితో పాటు కారులో ఉన్న ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయట పడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మధుగిరికి చెందిన దంపతులు రమేష్, గీత తమ ఇద్దరు పిల్లలు పావని, చిన్నికి పుట్టెంట్రుకలు తీయించేందుకు రమేష్ తండ్రి నరసింగప్ప, అమ్మ లక్ష్మమ్మతో కలసి కదిరికి బయలు దేరారు. తమ ఇంటి ఇలవేల్పు దేవుడు లక్ష్మినరసింహస్వామికి తలనీలాలు అర్పించి మొక్కుబడి తీర్చుకునేందుకు రమేష్ స్వయంగా కారు డ్రైవింగ్ చేస్తూ వచ్చారు. జేసీబీని ఓవర్టేక్ చేయబోయి.. ఓడీ చెరువు మండలంలోని వేమారెడ్డిపల్లి సమీపంలోకి రాగానే ముందు వెళ్తున్న జేసీబీని ఓవర్టేక్ చేయబోయి వెనకువైపు ఢీ కొట్టాడు. దీంతో కారు కుడివైపు పొలంలోకి దూసుకెళ్లి బండరాâýæ్లను ఢీ కొట్టింది. ప్రమాదంలో లక్ష్మమ్మ, నరసింగప్ప తీవ్రంగా గాయపడ్డారు. గీత, రమేష్ స్వల్పంగా గాయపడ్డారు. పిల్లలు చిన్న గాయం కూడా లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. ముందు సీట్లులో కూర్చున్న రమేష్, గీత సీట్ బెల్టు పెట్టుకోవడంతో ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఘటనాస్థలానికి చేరుకుని 108 కు సమాచారం చేరవేశారు. క్షతగా>త్రులను 108 ద్వారా కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మమ్మ మృతి చెందినట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రెండు ట్రాలీలు ఢీ- క్లీనర్ మృతి
కృష్ణపట్నంపోర్టు బైపాస్రోడ్డు (ముత్తుకూరు): ఆగి ఉన్న ట్రాలీని మరో ట్రాలీ ఢీకొనడంతో ఓ క్లీనర్ దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని పంటపాళెం సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్ఐ శ్రీనివాసరెడ్డి కథనం మేరకు..చీమకుర్తి నుంచి కృష్ణపట్నంపోర్టుకు గ్రానైట్ రాళ్లలో ట్రాలీ బయలుదేరింది. పోర్టు బైపాస్రోడ్డులోని పామాయిల్ ఫ్యాక్టరీ వద్ద ట్రాలీని రోడ్డు వైపు నిలిపి, డీజల్ కోసం డ్రైవర్ సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్కు వెళ్లాడు. ఇంతలో చీమకుర్తి నుంచి వస్తున్న మరో గ్రానైట్ లోడు ట్రాలీ వేగంగా ఆగి ఉన్న ట్రాలీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీ ముందు భాగం నుజ్జునుజ్జు అయింది. అందులోని ప్రకాశంజిల్లా చీమకుర్తి మండలం, కోళ్లబీమునిపాడుకు చెందిన క్లీనర్ సత్తెనపల్లి పిచ్చయ్య (25) రాళ్ల కింద నలిగి, మృతి చెందాడు. డ్రైవర్ పరారయ్యాడు. వారం క్రితమే పనిలో చేరాడు మృతి చెందిన పిచ్చయ్య వారం క్రితమే ఈ ట్రాలీలో క్లీనర్గా చేరాడు. ఈ ప్రమాదంలో వెనుక ట్రాలీలోని గ్రానైట్ బండరాళ్లు కిందపడ్డాయి. పోర్టు సెక్యూరిటీ గార్డులు క్రేన్ ద్వారా పిచ్చయ్య మృతదేహాన్ని బయటకు తీశారు. బండరాళ్లను మరో ట్రాలీలో పోర్టుకు తరలించారు. ఈ ప్రమాదానికి భయపడి డీజల్ కోసం వెళ్లిన మరో ట్రాలీ డ్రైవర్ కూడా పరారయ్యాడు. పిచ్చయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
లారీని ఢీకొని యువకుడి దుర్మరణం
వెంకటగిరి: ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన బంగారుపేట తెలుగుగంగ కాలువ సమీపంలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా రామాపురం మండలానికి చెందిన నోముల చిన వెంకటేష్ (21) నెల్లూరులోని ఓ స్వీట్ బేకరీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వెంకటగిరి సమీపంలోని ఇలగనూరులో ఉన్న తన బంధువుల ఇంటికి మంగళవారం మోటారుబైక్పై వచ్చాడు. బుధవారం తెల్లవారు.జామున నెల్లూరుకు బయలుదేరారు. బంగారుపేట సమీపంలో మరమ్మతులకు గురై రోడ్డుపై ఆగి ఉన్న లారీని అదుపు తప్పి ఢీకొన్నాడు. దీంతో తీవ్రంగా గాయపడిన లారీ సిబ్బంది 108కు సమాచారం అందించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్ పరీక్షించి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడి వద్ద లభించిన బేకరీ బిల్లుపై ఉన్న ఫోన్ నంబరు ఆధారంగా వెంకటేష్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇసుక ట్రాక్టర్ బోల్తా
కూలీ మృతి, డ్రైవర్ పరారు ఎగువపల్లి (సోమశిల) : అధిక లోడుతో అతివేగంగా వెళ్తున్న ఓ ఇసుక ట్రాక్టర్ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడి కూలీ మృతి చెందిన సంఘటన అనంతసాగరం మండలంలోని ఎగువపల్లి సమీపంలో బుధవారం జరిగింది. సోమశిల ఎస్ఐ ఎంఎస్ రాకేష్ కథనం మేరకు.. వైఎస్సార్ జిల్లా బద్వేల్ పురపాలక పరిధిలోని మడకరవారిపల్లికి చెందిన ట్రాక్టర్ మండలంలోని పీకేపాడు ఇసుక రీచ్ నుంచి అధిక లోడుతో ఇసుకను తీసుకెళ్తుండగా ఎగువపల్లి సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కూలీ చిట్టిబోయిన సుధాకర్ (28) ట్రాక్టర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ పరారీ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాన స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ను ఢీకొన్న కారు
బంగారు వ్యాపారి మృతి నెల్లూరు రూరల్ : వేగంగా వస్తున్న కారు బైక్ను వెనుక నుంచి ఢీకొనడంతో బంగారు వ్యాపారి మృతి చెందిన సంఘటన జాతీయ రహదారిపై ఆదివారం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ పోలీసుల కథనం మేరకు.. నగరంలోని పెద్దబజార్కు చెందిన బంగారు వ్యాపారి కేజర్ల బద్రీనాథ్ (61) సొంత పనుల నిమిత్తం గూడూరుకు బైక్పై బయలు దేరాడు. నారాయణ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో విజయవాడ వైపు నుంచి గూడూరు వైపు వస్తున్న కారు వేగంగా వచ్చి బైక్ను వెనుక వైపు ఢీకొంది. దీంతో కింద పడిన బద్రీనాథ్ తలకు బలమైన గాయాలు కావడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఏఎస్ఐ బాలకోటయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ను ఢీకొన్న లారీ
తండ్రి దుర్మరణం కుమారుడికి తీవ్రగాయాలు క్షేమంగా భార్య, కుమార్తె చలివేంద్ర (నాయుడుపేటటౌన్) : మితిమీరిన వేగంతో వెళ్తున్న లారీ బైక్ను ఢీకొనడంతో తండ్రి మృతి చెందగా, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో భార్య, కుమార్తె క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన మండలంలోని చలివేంద్రం సమీపంలో శనివారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. మండలంలోని వద్దిగుంట కండ్రిగకు చెందిన పిగిలం అశోక్ (28) అలియాస్ కిరణ్ తన భార్య ప్రభావతి, పిల్లలు హర్షవర్ధన్, రోహితిలను తీసుకుని శనివారం చిల్లకూరు మండలం తిమ్మనగారిపాళెంలో అత్తంటికి వెళ్లేందుకు మోటారు బైక్పై బయలుదేరాడు. మేనకూరు పంచాయతీ చలివేంద్రం వద్దకు వచ్చే సరికి రహదారిపై ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ బైక్ను ఢీకొంది. దీంతో బైక్ నడుపుతున్న అశోక్తో పాటు ముందు కూర్చుని ఉన్న ఎల్కేజీ చదువుతున్న కుమారుడు హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. భార్య ప్రభావతితో పాటు చిన్నారి రోహితి స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అప్పటికే అశోక్ మృతి చెందినట్లు నిర్ధారించారు. హర్షవర్ధన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ¯ðనెల్లూరుకు తరలించారు. ఎస్ఐ మారుతీకృష్ణ, ఏఎస్ఐ శంకర్రాజు లారీడ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అశోక్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మిన్నంటిన రోదనలు కష్టపడి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే అశోక్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పపత్రి వద్దకు చేరుకోవడంతో అక్కడ రోదనలు మిన్నంటాయి. మృతుడి భార్య ప్రభావతి గుండెలు బాదుకుంటూ రోదించడం ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించింది. అశోక్ ఆమె తల్లి బుజ్జమ్మ మతిస్థిమితం తప్పినట్లుగా ఆస్పత్రి ప్రాంగణంలో అటూ ఇటూ పరుగులు పెట్టడంతో ఆమెను సముదాయించేందుకు అవస్థలు పడ్డారు. -
ప్రాణాల మీదకు తెచ్చిన మేకపాలు
నర్సంపేట: మేకపాల విషయంలో అన్నదమ్ముల మధ్య చెలరేగిన ఘర్షణ ఒకరి ప్రాణాలు తీసింది. అన్నదమ్ముల మధ్య పాల విషయంలో గొడవ జరగడంతో.. కోపోద్రిక్తుడైన అన్న తమ్ముడిని కర్రతో చితక బాదాడు. దీంతో తీవ్రంగా గాయపడిన తమ్ముడిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటో ఢీకొని వ్యక్తి దుర్మరణం
అనంతసాగరం (సోమశిల) : మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ ఆటో ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన అనంతసాగరంలో బుధవారం రాత్రి జరిగింది. ఏఎస్ఐ శ్రీనివాసరావు కథనం మేరకు.. అనంతసాగరానికి చెందిన సిద్దవటం పెంచలయ్య (47) బస్టాండ్ సమీపంలోని æతన ఇంటి నుంచి రోడ్డు మీదకు వస్తుండగా మండలంలోని లింగంగుంటకు చెందిన ఆటో బస్టాండ్ వైపు వెళ్తూ ఢీ కొంది. తీవ్రంగా గాయపడిన పెంచలయ్యను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే లోపు మృతి చెందాడు. ఆటోడ్రైవర్ సంఘటనా స్థలం నుంచి డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కూలీ పనులు చేసుకుని జీవనం సాగించేవాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో కుటుంబలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
స్తంభాన్ని ఢీకొన్న బైక్
ఒకరి దుర్మరణం సూళ్లూరుపేట : పట్టణంలోని చెంగాళమ్మ దక్షిణంవైపు ముఖద్వారంలో మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి ఆదివారం అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కథనం మేరకు.. చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలం కాంపాళెంకు చెందిన అక్కరపాక మునిశేఖర్ (24) తడ మండలం మాంబట్టు సెజ్లోని రీజెన్ పవర్టెక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మాంబట్టులోనే అద్దెకు గది తీసుకుని ఉంటున్నాడు. ఆదివారం మోటార్బైక్పై సూళ్లూరుపేటకు వచ్చాడు. తిరిగి వెళుతుండగా బైక్ అదుపు తప్పి చెంగాళమ్మ ఆలయం ముఖద్వారం ఆర్చి మధ్యలో ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో మునిశేఖర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి మృతుని బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంధువుల వద్ద ఫిర్యాదు తీసుకుని ఎస్ఐ జీ గంగాధర్రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తి మృతి
బుచ్చిరెడ్డిపాళెం : టిప్పర్ టైర్లు వ్యక్తి తలపైకి ఎక్కడంతో అతను మృతిచెందిన సంఘటన మండలంలోని రేబాల వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. రేబాల వద్ద బొల్లినేని కన్స్ట్రక్షన్స్ ఆధ్వర్యంలో ముంబయి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం సికరా ప్రాంతానికి చెందిన గంగాప్రసాద్యాదవ్ ( 60) తన కుమారుడితో కలిసి కొంతకాలంగా రహదారి పనులు చేస్తున్నాడు. రేబాల వద్ద శుక్రవారం మట్టిని అన్లోడ్ చేసే క్రమంలో టిప్పర్ టైర్లు గంగా ప్రసాద్ తలపైకి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్లోంచి పడి యువకుడు మృతి
తీవ్రగాయాలతో కొద్ది దూరం కలయతిరిగిన వైనం చేనిగుంట (తడ) : రైల్లోంచి జారిపడి జార్కండ్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు మృతి చెందాడు.ఈ సంఘటన మండలంలోని చేనిగుంట వద్ద గురువారం జరిగింది. అయితే ఆ యువకుడు రైల్లోంచి జారి తీవ్ర గాయాలతో సాయం కోసం వచ్చేందుకు అటూ ఇటూ కొద్ది దూరం కలయతిరిగినట్లు తెలుస్తోంది. రైల్వే ట్రాక్కు 150 మీటర్ల దూరంలో పొలం గట్టుపై మృతి చెంది ఉండగా స్థానికులు హత్యగా అనుమానించి రెవెన్యూ, పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సీఐ టీ విజయకృష్ణ, తడ ఎస్ఐ ఏ సురేష్బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఒంటిపై ఎలాంటి ఎలాంటి దుస్తులు లేవు. మృతుడికి సమీపంలో ఫ్యాంట్, టీ షర్ట్, పర్సు పడి ఉన్నాయి. చెన్నై వైపు వెళ్లే మార్గంలో 73వ కిలోమీటరు వద్ద రక్తపు మరకలు ఉన్నాయి. అక్కడ చెప్పులు పడి ఉండగా, ట్రాక్కు సుమారు 150 మీటర్ల దూరంలో టీ షర్ట్ పడి ఉంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మతిస్థిమితం కోల్పోయి సాయం అటూ ఇటూ కలయతిరిగినట్లు ఉంది. మృతుడికి సంబంధించి దుస్తుల వద్ద లభించిన పర్సులో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా అతన్ని వివరాలు గుర్తించారు. జార్కండ్ రాష్టం రాంచీలోని రోయిరోడ్డుకి చెందిన హనుమంత మెహతా కుమారుడు షాంబు మెహతా(25)గా నిర్ధారించారు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించి, శీతల గదిలో భద్రపరిచారు. బంధువులకు సమాచారం అందించారు.వారు వచ్చాక పోస్టుమార్టం అనంతరం అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా : డ్రైవర్ దుర్మరణం
కావలిఅర్బన్ : ట్రాక్టర్ అదుపుతప్పి పడి డ్రైవర్ దుర్మరణం పాలైయ్యాడు. ఈ సంఘటన మండలంలోని వ్యవసాయ పొలాల్లో బుధవారం జరిగింది. కావలి రూరల్ పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఆనెమడుగు పంచాయతీ ఆకుతోట గిరిజన కాలనీకి చెందిన చిట్టేటి సురేష్ (25) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. రుద్రకోటకు చెందిన జగదీశ్వరరెడ్డి వద్ద ట్రాక్టర్ తీసుకుని నారుమడులు దున్నేందుకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి పొలాల్లో వేసిన రోడ్డుపై వస్తుండగా ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
రావూరు (ఇందుకూరుపేట): గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ మాజీ సైనిక ఉద్యోగి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని రావూరులో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. రావూరుకు చెందిన మహానంది సుబ్బరాయుడు (65) మాజీ సైనికోద్యోగి. ప్రతి రోజు తెల్లవారు జామున మైపాడులోని నెల్లూరు ప్రధాన రహదారిపై వాకింగ్ చేయడం అలవాటు. రోజులాగేనే ఆదివారం తెల్లవారుజామున జగదేవిపేట రోడ్డు వైపు వాకింగ్కు బయలు దేరాడు. పున్నూరు అంకమ్మ సత్రం వద్దకు చేరుకునే సరికి గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. తీవ్రంగా గాయపడిన సుబ్బారాయుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. మృతుడు సుబ్బారాయుడుకు భార్య రమణమ్మ పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎస్ఐ షరీఫ్ తెలిపారు. -
బైక్ను ఢీకొన్న లారీ: ఒకరు మృతి
-
లారీ ఢీకొని బేల్దారి మృతి
నెల్లూరు (క్రైమ్) : సైకిల్పై రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ లారీ ఢీకొనడంతో బేల్దారి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన సుందరయ్యకాలనీ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. పడారుపల్లి సుందరయ్య కాలనీ బీబ్లాక్లో నివాసం ఉంటున్న ఎస్కే గౌస్బాషా (40) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం గౌస్బాషా సైకిల్పై డి బ్లాక్కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో జాతీయ రహదారి దాటుతుండగా చెన్నై వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా సైకిల్ను ఢీకొంది. గౌస్బాషా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ లారీని అక్కడే వదిలి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తమకు దిక్కెవరని భార్య ఖాదరున్నీసా గుండెలవిసేలా రోదించింది. ఆమె రోదన చూపరులను కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న సౌత్ ట్రాఫిక్ ఎస్ఐ పి.చిన్న బలరామయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రభుత్వ వైద్యులతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్ఐ చిన్న బలరామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు -
రైల్లోంచి జారిపడి వ్యక్తి మృతి
నెల్లూరు (క్రైమ్) : ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి గుర్తుతెలియని (40) వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున కల్లూరుపల్లి హౌసింగ్బోర్డు సమీప రైలు పట్టాల వద్ద చోటు చేసుకుంది. మృతుడు లేత బ్లూ (స్కైబ్లూ)రంగు ఫుల్హ్యాండ్స్ చొక్కా, నలుపు రంగు కాటన్ జీన్స్ ధరించి ఉన్నాడు. మృతుడి జేబులో టెస్టర్ ఉంది. విషయం తెలుసుకున్న రైల్వే హెడ్ కానిస్టేబుల్ జోసఫ్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు ఎలక్ట్రీషియన్ అయి ఉండొచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని డీఎస్ఆర్ ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి
సూళ్లూరుపేట : బైక్ అదుపు తప్పి పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పట్టణంలోని శేషసాయి కల్యాణ మండపం సమీపంలో చెన్నై–కోల్కత్తా ఏషియన్ హైవేపై బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. నాయుడుపేట మండలం అత్తలపాళెంకు చెందిన చిన్నస్వామి (45) వరదయ్యపాళెం మండలం సాధనవారిపాళెంలోని తన అక్క ఇంటికి మోటార్బైక్పై వెళ్లాడు. అక్కడ నుంచి తిరిగి ఇంటికెళ్తూ శేషసాయి కల్యాణ మండపం వద్ద ఆటోను క్రాస్ చేస్తూ అదుపు తప్పి రోడ్డు మీద పడిపోయాడు. తలకు బలమైన గాయంకావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి బంధువులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ జీ గంగాధర్రావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్ను ఢీకొన్న బైక్
యువకుడి దుర్మరణం మరో ఇద్దరికి తీవ్ర గాయాలు ఉలవపాడు/ కావలి రూరల్ : వేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన జాతీయ రహదారిపై మండలంలోని చాగల్లు పోలేరమ్మ గుడి సమీపంలో బుధవారం జరిగింది. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంవ బ్రహ్మారెడ్డిపాళెంకు చెందిన గుమ్మడి కుమార్ (25) చీరాలకు చెందిన టి.రాము, మనోజ్కుమార్తో కలిసి ఒకే బైక్పై నెల్లూరు నుంచి చీరాలకు బయల్దేరారు. నెల్లూరు జిల్లాలోని బ్రహ్మరెడ్డిపాళెంలో దశదిన కర్మకు వచ్చిన చీరాల వాసులు తమ మిత్రుడైన కుమార్ బైక్పై చీరాల తీసుకెళ్తున్నాడు. కుమార్ బైక్ నడుపతున్నాడు. చాగల్లు వద్దకు వచ్చే సరికి లారీని ఓవర్టేక్ చేయబోయి కుడి వైపున డివైడర్ను ఢీకొట్టారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమార్ మృతి చెందాడు. మృతుడికి ఇంకా వివాహం కాలేదు. ఒక్కడే కుమారుడు. పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఎస్ఐ రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోరు నిర్మిస్తూ యువకుడి మృతి
మరొకరికి గాయాలు కావలిరూరల్ : పొలంలో బోరువేస్తూ విద్యుత్ షాకుకు గురై యువకుడు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. మండలంలోని రుద్రకోట పంచాయతీ గుమ్మడిబొందలకు చెందిన దద్దాల పిచ్చయ్య గౌడ్ మామిడితోటలో బోరు వేస్తున్నారు. బోరు నిర్మాణ పనులను ఒడిశా రాష్ట్రం నవరంగ్పూర్ జిల్లా రాయగఢ్కు చెందిన వికాస్ (29), ఒబ్బిగోండ్ అనే కూలీలు చేస్తున్నారు. ఈ క్రమంలో పైపులు పైకి లాగుతుండగా పైన ఉన్న కరెంటు తీగలు పైపునకు తగలడంతో విద్యుత్ షాక్కు గురయ్యారు. వీరిలో వికాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఒబ్బిగోండ్ గాయపడటంతో అతన్ని 108లో కావలికి తరలించి ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. మృతుడు వికాస్ అవివాహితుడు. వికాస్ తండ్రి ఇటీవలే మరణించగా అతను ఉపాధి కోసం ఇక్కడకు వచ్చాడు. అతని తల్లిదండ్రులకు నలుగురు సంతానం కాగా వికాస్ చివరివాడు. కావలి రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
కలిగిరి: కలిగిరిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం ఆర్టీసీబస్సు, బైకు ఢీ కొన్న సంఘటనలో ఎస్థానిబాషా (19) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరక.. కలిగిరికి చెందిన ఎస్థానిబాషా, వీరారెడ్డిపాలెంకు చెందిన స్నేహితుడు మనోజ్ ఇద్దరూ హసనాపురంలో ఐటీఐ కాలేజికి వెళుతున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గేదెలను తప్పించబోయి ఉదయగిరికి వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న ఎస్తానీబాషా తీవ్రంగా గాయపడగా.. మనోజ్కు కూడా గాయాలయ్యాయి. బాషా పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని నెల్లూరులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సాయంత్రం చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. బస్సు డ్రైవర్ ప్రమాదం జరిగిన వెంటనే పోలిస్స్టేషన్కు చేరుకున్నాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు నమోదు చేసుకున్నారు. -
ఫుట్పాత్పైకి దూసుకువచ్చిన కారు
యాచకుడు దుర్మరణం.. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ పట్టివేత నాయుడుపేటటౌ¯న్: ఫుట్పాత్పైకి ఒక్కసారిగా బొలేరో కారు దూసుకు రావడంతో గుర్తుతెలియని యాచకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు వివరాల మేరకు.. స్థానిక వినాయకుడి గుడి పక్కన రోడ్డు ఫుట్పాత్పై ఓయాకుడు కూర్చుని ఉన్నాడు. నాయుడుపేట వైపు నుంచి ఓ బొలేరో కారు అతివేగంగా వస్తూ ఒక్కసారిగా గుడి పక్కనే ఉన్న ఫుట్పాత్ పైకి దూసుకువచ్చింది. దాంతో అక్కడ కూర్చుని ఉన్న సుమారు 50 సంవత్సరాలకు పైగా వయస్సు ఓ యాచకుడు మృత్యువాతపడ్డాడు. బొలేరో కారు సిని ఫకీలో పైకి లేపి కూర్చుని ఉన్న వ్యక్తిపైకి నడపడంతో స్థానికులు గుర్తించి సంఘటన స్థలం వద్దకు పరిగెత్తారు. అప్పటికే కారు నడుపుతున్న డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకున్నారు. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో తూగుతుండడాన్ని గుర్తించారు. బొలేరో వాహనం ఎంపీ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన వాహనంగా గుర్తించారు. డ్రైవర్ పట్టణానికి చెందిన మాబాషాగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ అదుపు తప్పిపడి రైతు మృతి
అనుమసముద్రంపేట : బైక్ అదుపు తప్పి పడి ఓ రైతు దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని సంగం–హసనాపురం ఆర్ అండ్బీ రోడ్డుపై సోమవారం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు.. హసనాపురానికి చెందిన అబ్బూరు ఆదినారాయణ (55) సోమవారం మధాహ్నం పొలానికి వెళ్లాడు. సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చే సమయంలో సంగం నుంచి హసనాపురం వైపు వెళ్లే ద్విచక్ర వాహనదారులను లిఫ్ట్ అడిగాడు. కొందరు ఆపకుండా వెళ్లారు. ఏపీ 26ఏఎస్ 9184 నంబరు బైక్లో వెళ్తున్న వ్యక్తి ఆపి ఆదినారాయణను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలో బైక్ అదుపు పడిపోయింది. ప్రమాదంలో కింద పడిన ఆదినారాయణ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం అనంతరం బైక్ నడుపుతున్న వ్యక్తి పరారీ అయ్యాడు. ఎస్ఐ వెంకటసాయి తన సిబ్బందితో వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదినారాయణ మృతి చెందిన విషయం తెలుసుకున్న బం«ధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
కల్వర్టులో పడిపోయిన కారు,ఒకరు మృతి
-
అంబులెన్స్ - కారు ఢీ: ఒకరి మృతి
-
అంబులెన్స్ - కారు ఢీ: ఒకరి మృతి
మహబూబ్నగర్ : మానవపాటు వద్ద మంగళవారం తెల్లవారుజామున అంబులెన్స్ - కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో అంబులెన్స్లోని ఒకరి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని.. మహాబూబ్నగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతానికి వ్యక్తి మృతి
మృతదేహంతో పోలీస్స్టేషన్ ఎదుట బైఠాయింపు ఉద్రిక్తత పరిస్థితి ఉదయగిరి : విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని దేకూరుపల్లిలో శుక్రవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని దేకూరుపల్లికి చెందిన గోపిదేశి వెంకటరమణయ్య (30) ఉదయం ఎద్దులను మేత కోసం తోలుకోని గ్రామ సమీపంలో ఉన్న తమ పొలం వద్దకు వెళ్లాడు. పొలంలో పనిచేసుకుంటుండగా, ఎద్దులు పక్కనే ఉన్న పైరును మేస్తుండటంతో వాటిని తోలేందుకు పరుగెత్తుతుండగా అదే పొలంలో తాత్కాలిక కర్రల మీద ఏర్పాటు చేసిన విద్యుత్తీగలు తగిలి షాక్కు గురయ్యాడు. గ్రామ ఎస్సీ కాలనీ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ నుంచి కిలో మీటరు దూరం వ్యవసాయ పొలాల్లో ఉండగా కర్రల ఆధారంగా సిద్దు నారాయణరెడ్డి, కారుమంచి రసూల్ తమ పొలాల వద్దకు ఏర్పాటు చేసుకున్నారు. ఈ వైర్లు మృతుడి పొలం వద్ద కర్రల మీద నుంచి కిందికి పడిపోయాయి. గమనించని వెంకట రమణయ్య షాక్ తగిలి మృతి చెందారు. నారాయణరెడ్డి, రసూల్ చర్యల వల్లే వెంకట రమణయ్య మృతి చెందాడని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ మృతుడి బంధువులు స్టేషన్ బయట బైఠాయించారు. ఈ క్రమంలో సాయంత్రం 6 గంటల సమయంలో మృతుడి బంధువులకు, ఈ ప్రమాదానికి కారకులుగా ఆరోపిస్తున్న వ్యక్తుల బంధువుల మధ్య మాటామాటా పెరిగి తోపులాటకు దారితీసింది. కొంతమంది పెద్దలు సర్ది చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. వైద్యులు సంధానిబాషా పోస్టుమార్టం నిర్వహించారు. -
జేసీబీ కింద పడి యువకుడి మృతి
దుత్తలూరు : జేసీబీకి మరమ్మతులు చేస్తున్న ఓ యువకుడు అదే జేసీబీ కింద పడి మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం దుత్తలూరు సెంటర్ సమీపంలో జరిగింది. ఆత్మకూరు మండలం కరటంపాడుకు చెందిన హరీష్ (25) అనే యువకుడు నర్రవాడలో జేసీబీ ఆపరేటర్గా నాలుగు నెలల క్రితం చేరాడు. బుధవారం దుత్తలూరు–వింజమూరు మార్గంలోని మూతబడిన పెట్రోల్ బంక్ వద్ద జేసీబీని నిలిపి కిందవైపు మరమ్మతులు చేస్తున్నాడు. అయితే జేసీబీని ఆపరేట్ చేసే గేర్ లివర్లను లాక్ చేయడం మరిచాడు. మరమ్మతులు చేస్తుండగా అటుగా ఆడుకుంటున్న పిల్లలు పొరపాటున వాటిని తగలడంతో జేసీబీ ముందు భాగంలోని తొట్టెవంటి భాగంలో ఇరుక్కుపోయాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం వింజమూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు ఆందలేదు. -
రెండు లారీలు ఢీ: ఒకరి మృతి
మెదక్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర వద్ద మంగళవారం రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డివైడర్ను ఢీకొన్న బైక్
–అపాచి కార్మికుడి దుర్మరణం మరొకరికి తీవ్రగాయాలు సూళ్లూరుపేట : ప్రమాదవశాత్తు డివైడర్ను బైక్ ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన చెన్నై–గుంటూరు ఏషియన్ హైవేపై సూళ్లూరుపేట సమీపంలోని మన్నారుపోలూరు మలుపురోడ్డు వద్ద ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిట్టమూరు మండలం జంగాలపల్లికి చెందిన పాలిచెర్ల లక్ష్మీనారాయణ (20), అతని సమీప బంధువు చిల్లకూరు మండలం నల్లయ్యగారి పాళెంకు చెందిన పీ శ్రీనివాసులు (24) ఆపాచి కంపెనీలో చేరి పట్టణంలోని కోళ్లమిట్టలో రూము తీసుకుని ఉంటున్నారు. టౌన్లో అద్దెలు ఎక్కువగా ఉన్నాయని, ఎక్కడైనా పల్లెటూరులో రూము తీసుకుంటే అద్దెలు తగ్గుతాయనే భావనతో ఇద్దరు కలిసి మోటార్బైక్పై చిత్తూరుజిల్లా వరదయ్యపాళెం మండలం కారిపాకం వెళ్లి రూము చూసుకుని తిరిగి వస్తుండగా డివైడర్ను కొట్టుకుని పక్కనే ఇనుప రైలింగ్కు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. లక్ష్మీనారాయణ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీనివాసులు తీవ్ర గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మృతుడి బంధువులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ఎస్సై జీ గంగాధర్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కారు ఢీకొని వ్యక్తి మృతి
చిల్లకూరు : ‘నాకు పనుంది బైక్పై నెల్లూరు వెళ్తా.. మీరు ఆటోలో వచ్చేయండి’ చెప్పిన వ్యక్తి కొంతసేపటికి రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందాడు. సంఘటన మండలంలోని కోట క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు నెల్లూరు శ్రామిక్నగర్కు చెందిన ఎంబేటి మురళి (30) లారీ డ్రైవర్గా పనిచేన్నాడు. అతని భార్య పోలమ్మ, తమ ముగ్గురు పిల్లలైన చరిత, ఏసు, శరత్కుమార్లను మోటార్బైక్పై ఎక్కించుకుని ఆదివారం గూడూరు మండలం అయ్యవారిపాళెంలోని బంధువుల ఇంటి వచ్చారు. పోలమ్మ అక్క పిల్లలు చిట్టేడు గిరిజన గురుకుల పాఠశాలలో చదవుతుండగా వారిని చూసేందుకు బంధువులతో కలిసి భార్య పిల్లలను ఆటోలో చిట్టేడుకు పంపాడు. మురళి బైక్పై వెళ్లినప్పటికీ అర్జెంటు పని ఉందని చిట్టేడు నుంచి ఒంటరిగానే నెల్లూరుకు బయలుదేరి ఆటోలో భార్య, పిల్లలను నెల్లూరుకు రావాలని చెప్పాడు. ఈ క్రమంలో మురళి కోట క్రాస్రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా చెన్నె వైపు నుంచి వేగంగా వస్తున్న బైక్ను గమనించకుండా ఢీకొట్టింది. ఈ ఘటనలో మురళి అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుకనే ఆటోలో వస్తున్న భార్య, పిల్లలు అక్కడి చేరకుని మృతదేహాన్ని చూసి బోరు విలపించారు. విషయం తెలుసుకున్న ఎస్సై అంకమ్మ సంఘటనా స్థలానికి చేరకుని వివరాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆటోను ఢీకొన్న లారీ : ఒకరి మృతి
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు రూరల్ మండలం ఎస్ ఉప్పరపల్లి హరిజనవాడ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ... ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను 108 వాహనంలో రైల్వేకోడూరులోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మృతుడి వివరాలు మాత్రం తెలియరాలేదని పోలీసులు తెలిపారు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
- పాకల సముద్ర తీరంలో ఐదుగురు గల్లంతు - ఒకరు మృతి.. నలుగురిని రక్షించిన మెరైన్ కానిస్టేబుల్ - మృతునిది పొన్నలూరు మండల కేంద్రం పాకల (సింగరాయకొండ) : వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని సముద్రంలో నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తూ ఐదుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరు మృతి చెందగా నలుగురిని మత్స్యకారులు క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. ఈ సంఘటన పాకల సముద్ర తీరంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం సింగరాయకొండ, కందుకూరు, జరుగుమల్లి, పొన్నలూరు, కొండపి మండలాల నుంచి భక్తులు పాకల సముద్ర తీరానికి బుధవారం విరివిగా వచ్చారు. అల్పపీడనం కారణంగా సముద్రంలో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. ప్రజలను సముద్రంలోకి వెళ్లకుండా సీఐ భీమానాయక్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో పొన్నలూరుకు చెందిన విగ్రహాన్ని ఆ గ్రామస్తులు రెండు ట్రాక్టర్లలో వచ్చి సముద్రంలో నిమజ్జనం చేశారు. విగ్రహం ఒడ్డునే ఉండటంతో సముద్రం లోపలికి నెట్టే ప్రయత్నంలో ఉండగా ఐదుగురు యువకులు అలల ధాటికి సముద్రంలో కొట్టుకుపోయారు. సీఐ భీమానాయక్ అప్రమత్తమై మెరైన్ కానిస్టేబుళ్లను అప్రమత్తం చేశారు. కానిస్టేబుల్ కె.రామకృష్ణ సముద్రంలో గల్లంతైన వారిని రక్షించేందుకు ప్రయత్నించి చివరకు ఆయన కూడా ప్రమాదంలో పడ్డారు. వెంటనే మరో మెరైన్ కానిస్టేబుల్ కె.ధనుంజయ లైఫ్ జాకెట్ల సాయంతో సముద్రంలోకి వెళ్లి రామకృష్ణతో పాటు నలుగురు యువకులను రక్షించారు. పొన్నలూరుకు చెందిన లింగంగుంట రమేష్ (42)ను ఒడ్డుకు తీసుకొచ్చినా అప్పటికే బాగా నీరు తాగి ఉండటంతో చనిపోయాడు. మరో యువకుడు కొత్తకోట మాధవ (35) అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో వెంటనే 108లో సింగరాయకొండ ప్రభుత్వ అస్పత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. మిగిలిన ముగ్గురు స్వయంపాకుల మణికంఠ, చెన్నయపాలెం మల్లికార్జున, ఎన్.విజయ్లు వెంటనే తేరుకున్నారు. ఆ తర్వాత నుంచి తీరం ఒడ్డునే నిమజ్జనాలు చేసేలా ఎస్సై వైవీ రమణయ్య చర్యలు తీసుకున్నారు. విషయం తెలిసి తహసీల్దార్ షేక్ దావూద్హుస్సేన్ హుటాహుటిన తన సిబ్బందితో పాకల తీరానికి వెళ్లి పోలీసు అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. పొన్నలూరులో.. పొన్నలూరు : స్థానికంగా నివాసం ఉండే రజకులు వినాయక విగ్రహం నిమజ్జనం కోసం రెండు ట్రాక్టర్లలో పాకల సముద్ర తీరానికి వెళ్లారు. అలల ధాటికి రమేష్ గల్లంతై మృతి చెందడంతో భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడు బేల్దారి పనుల కోసం హైదరాబాద్లో ఉంటున్నాడు. భార్య రమణమ్మ కూలి పనులు వెళ్తూ ఇద్దరు కొడుకులు వెంకటసాయి, బాలసాయిలను చదివించుకుంటూ ఇంటి వద్దే ఉంటోంది. వినాయక నిమజ్జనం కోసం రమేష్.. హైదరాబాద్ నుంచి మంగళవారం స్వగ్రామం వచ్చాడు. వినాయక లడ్డూను వేలం పాటపడి దక్కించుకున్నాడు. ఆ రాత్రి తన బంధువులకు ఇంటి వద్ద విందు ఇచ్చి వారితో సంతోషంగా గడిపాడు. రాత్రి గ్రామంలో జరిగిన వినాయక విగ్రహం ఊరేగింపులో పాల్గొన్నాడు. నిమజ్జనానికి వెళ్లొద్దని భార్య బతిమాలినా వినిపించుకోకుండా వెళ్లి రమేష్ ప్రాణాలు కోల్పోయాడు. కాలనీలో విషాద ఛాయలు రాత్రంతా తమతో పాటు వినాయక ఊరేగింపులో పాల్గొన్న రమేష్ సముద్రంలో మృతి చెందడంతో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కళ్లముందే అలల మధ్య కొట్టుకుపోతున్నా ఏమీ చేయలేకపోయామని కాలనీ వాసులు వాపోయారు.పోలీసులు వెంటనే స్పందించకుంటే మిగిలిన నలుగురినీ కోల్పోవాల్సి వచ్చేదని భయాందోళన వ్యక్తం చేశారు. -
ప్రాణం తీసిన సెల్ఫోన్..
నెల్లూరు రూరల్ : ట్రాక్టర్ ఆపి చార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్ తీసుకుని రోడ్డు పక్కన నిలబడిన వ్యక్తిని అదే ట్రాక్టర్ ఢీకొట్టడంతో మృతిచెందిన సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జొన్నవాడ రోడ్డులో పొట్టేపాళెం సమీపంలో చోటుచేసుకుంది. రూరల్ పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు పొదలకూరు రోడ్డు సెంటర్కు చెందిన జి.వెంకటరమణ్య తన ట్రాక్టర్తో ఇసుక తీసుకువచ్చేందుకు పొట్టేపాళెం ఇసుకరీచ్కు బయలుదేరాడు. తోడుగా కుమారుడిని తీసుకెళ్లాడు. సెల్ఫోన్ చార్జింగ్ తక్కువగా ఉండటంతో పొట్టెపాళెం పాత హరిజనవాడ సమీపంలోని మూడోమైలు (గుడితూము) వద్ద ట్రాక్టర్ను ఆపి, సమీపంలోని దుకాణంలో చార్జింగ్ పెట్టాడు. ఇసుక రీచ్కు వెళ్లి ఇసుక లోడ్ చేసుకుని తిరిగి నెల్లూరు వైపు వస్తు పొట్టెపాళెంలో దుకాణం సమీపంలో ట్రాక్టర్ను రోడ్డుపక్కన ఆపాడు. చార్జింగ్ పెట్టిన సెల్ తీసుకుని వెంకటరమణయ్య రోడ్డుపక్కన నిలుచుని కొడుకును ట్రాక్టర్ నడపాలని సూచించాడు. తండ్రి సూచన మేరకు కొడుకు ట్రాక్టర్ను ముందుకు తీశాడు. అదుపుతప్పిన ట్రాక్టర్ సెల్లో మాట్లాడుతున్న వెంకటరమణయ్యను ఢీకొట్టింది. గోడకు, ట్రాక్టర్ ట్రాలీ ట్రక్కు మధ్యన ఇరుక్కుపోయిన వెంకటరమణయ్య(48) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్ ఎస్సై సుబ్బారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
బస్సు- లారీ ఢీ: ఒకరి మృతి
చిత్తూరు : చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చీలపల్లె సమీపంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో పలువురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెంగుళూరులో కాల్పులు : ఒకరి మృతి
బెంగుళూరు : కావేరి నది జల వివాదంతో బెంగుళూరు నగరం అట్టుడుకుతోంది. నగరంలో సోమవారం రాత్రి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ ఆందోళనకారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరోకరు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నగరంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు రాజ్గోపాల్నగర్, కామాక్షిపాలై, విజయనగర్, బయంత్రాయన్పురా, కెన్రెగి, మగాది రోడ్డు, రాజాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు కర్ఫ్యూ విధించారు. -
ట్రాక్టర్ కిందపడి యువకుడి దుర్మరణం
మరొకరికి తీవ్రగాయాలు గూడూరు : ముందు వెళ్తున్న ట్రాక్టర్ను అధిగమించే క్రమంలో దాని కింద పడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన ఆదివారం పట్టణంలోని ముత్యాలపేట ప్రాంతంలో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు రెండో పట్టణంలోని ఎస్ఆర్ఏ థియేటర్ ప్రాంతానికి చెందిన పందేటి మస్తాన్ (28), 1వ పట్టణంలోని రాణీపేట ప్రాంతానికి చెందిన ఏడుకొండలు మోటార్ బైక్పై టవర్క్లాక్ సెంటర్ నుంచి రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్నాడు. ముందు వెళ్లే ట్రాక్టర్ను అధిగమించే క్రమంలో పక్కనే ఉన్న డివైడర్ను ఢీకొని అదుపు తప్పి ట్రాక్టర్ చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న మస్తాన్ తీవ్రంగా గాయపడగా, మోటార్ బైక్ నడుపుతున్న ఏడుకొండలు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మస్తాన్ మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ట్రాక్టర్ మాత్రం వెళ్లిపోయింది. మస్తాన్, ఏడుకొండలు ఇద్దరూ సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 1వ పట్టణ ఎస్సై సుధాకర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకుదిక్కెవరు మస్తాన్ రెక్కాడితే కానీ ఆ కుటుంబానికి పూడగడవని పరిస్థితి. రోడ్డు ప్రమాదంలో మస్తాన్ మృత్యువాత పడటంతో ఇక మాకు దిక్కెవరంటూ మృతుడి భార్య అపర్ణ తన ఇద్దరు కుమారులను పట్టుకుని బోరున విలపించింది. సెంట్రింగ్ పనులు చేస్తూ వచ్చే సంపాదనతో పిల్లలను చదివిస్తూ కుటుంబాన్ని నెట్టుకువస్తున్నారని, మస్తాన్ పెద్ద కుమారుడు నిఖిల్కుమార్ 5వ తరగతి, భానుప్రసాద్ 3వ తరగతి వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్లో చదువుతున్నారు. -
కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం
అక్కంపేట (తడ) : బైక్పై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన మండలంలోని అక్కంపేట వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. ఎస్ఐ సురేష్బాబు సమాచారం మేరకు.. మధ్యప్రదేశ్ మురానా జిల్లా గడియా గ్రామానికి చెందిన శశికాంత్ శర్మ(40) అక్కంపేట సమీపంలో అండగుండాల మార్గంలో నిర్మిస్తున్న జైన్ మందిరం వద్ద పనికి వచ్చాడు. మందిరంపై బొమ్మలు చెక్కడంలో సిద్ధహస్తుడైన శర్మ ఏడాది క్రితం ఇక్కడే ఉంటూ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తన సహచరుడితో కలిసి బైక్పైS కూరగాయలు, ఇతర సామగ్రి కొనుగోలు కోసం అక్కంపేటకు వచ్చాడు. అక్కంపేట మలుపు వద్ద మధ్యలో చెన్నై వైపు వెళ్తున్న వాహనాలను చూసి ఓ మారుతి కారు నిలిచి ఉంది. అవతల వచ్చే వాహనాలను గమనించని బైక్ నడుపుతున్న వ్యక్తి రోడ్డుపై కొంత ముందుకు వెళ్లాడు. గూడూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న స్కార్పియో కారు వేగంగా రావడం చూసి వెనుక కూర్చున్న శర్మ ఆందోళనతో కిందకు దిగి ముందుకు, వెనక్కు ఒకటి రెండు అడుగు వేసే క్రమంలో శర్మను ఢీకొంది. దీంతో శర్మ కారు బానెట్పై పడిపోయాడు. స్కార్పియో రోడ్డు మలుపు మధ్యలో ఆగి ఉన్న మరో కారు ముందు భాగం ఢీకొని డివైడర్ ఎక్కి కొంత దూరం వెళ్లి నిలిచింది. కారు ఢీకొనడంతో శర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్టు తోటి సిబ్బంది తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో..
కారును ఢీకొట్టిన మరో కారు యువకుడు దుర్మరణం ఇద్దరికి స్వల్పగాయాలు కాకుటూరు(నెల్లూరు) : ముందు వెళ్తున్న కారును ఓకారు అధిగమించే ప్రయత్నంలో ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన వెంకటాచలం మండలం కాకుటూరు సమీపంలో మంగళవారం ఉదయం జరిగింది. పోలీసుల సమాచారం మేరకు వివరాలు.. సైదాపురం మండలం మొలకలపూండ్ల గ్రామానికి చెందిన పాలెపు వేమయ్య కుమారుడు రాజశేఖర్(28) సోమవారం తిరుపతిలో ఉన్న తన బంధువు మందా ప్రసాద్ (పొదలకూరు మండలం పొనగలూరు గ్రామం)ను కలిసేందుకు తన కారులో వెళ్లాడు. మంగళవారం ఉదయం ఇద్దరు నెల్లూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో కాకుటూరు దాటిన తర్వాత జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కారును రాజశేఖర్ అధికమించబోయి ఢీకొట్టాడు. దీంతో కారు పల్టీలు కొడుతూ అవతలిరోడ్డుపై పడింది. కారు అద్దాలుపగలడంతో డ్రైవింగ్ చేస్తున్న రాజశేఖర్ పైకెగిరిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. రాజశేఖర్తో ఉన్న ప్రసాద్కు స్వల్పగాయాలయ్యాయి. వీరు ఢీకొన్న కారు ముందుభాగం దెబ్బతినగా డ్రైవర్ షేక్ మీరాజాన్బాబుకు స్వల్పగాయాలయ్యాయి. ఆమార్గంలో వస్తున్న ప్రయాణికులు వెంటనే 108కు, పోలీసులకు సమాచారం అందించారు. ఈప్రమాదం కారణంగా జాతీయ రహదారికి రెండు వైపులా ట్రాఫిక్ స్తంభించింది. వెంకటాచలం ఎస్సై వెంకటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరులోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
బైక్ను ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
కావలిరూరల్ : బైక్ను ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని కొన్నదిన్నె క్రాస్రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి జరిగింది. కావలి రూరల్ ఎస్సై పుల్లారావు సమాచారం మేరకు.. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు పెద్దపాళెంకు చెందిన చాపల శ్రీను (28) శుక్రవారం రాత్రి రామాయపట్నంలో బంధువుల వివాహానికి వెళ్లి అక్కడి నుంచి కావలి మండలం ఒట్టూరుకు చెందిన అప్పన్నగారి సోమరాజు, వెయ్యల శ్రీనుతో కలిసి ఒట్టూరుకు బయలుదేరారు. మార్గమధ్యలో రాత్రి 10.30 గంటల సమయంలో కొనదిన్నె క్రాస్రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా అన్నగారిపాళెం నుంచి పెళ్లి బృందంతో వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న చాపల శ్రీనుకు తీవ్ర గాయాలు కాగా, సోమరాజు, శ్రీను స్వల్పగాయాలయ్యాయి. వెంటనే చాపల శ్రీనును ఆటోలో కావలికి తరలించారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న శ్రీను భార్య సృజన బోరున విలపించింది. విషయం తెలుసుకున్న బంధువులు పెద్దఎత్తున ఏరియా వైద్యశాలకు తరలివచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం చేసి బంధువులకు అప్పగించారు. ఎస్సై పుల్లారావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కూలీ పనులకు వెళ్తూ..
కానరాని లోకాలకు కారు అదుపు తప్పి భర్త మృతి ప్రాణాలతో బయటపడిన భార్యా పిల్లలు కోవూరు : విధి ఆ కుటుంబాన్ని వెక్కిరించింది. నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి ఎదుగుతూ పది మందికి సహాయ పడుతుండటం చూసి సహించలేకపోయింది. ఎన్నో కష్టాలు పడి కుదురుకుంటున్న కుటుంబ యజమానిని రోడ్డు ప్రమాదం పొట్టనపెట్టుకుంది. ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ దురదృష్ట సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై భారత్బెంజ్ షోరూం వద్ద శనివారం తెల్లవారుజామున జరిగింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలంలోని సూదరగుంట రామాపురానికి చెందిన ఎద్దు ఏడుకొండలు (34) బెంగళూరులో కూలీలను తీసుకుని వెళ్లి బేల్దారి పనులు చేయించేవాడు. ఇటీవల రామాపురంలో జరిగిన ఓ వివాహానికి ఏడుకొండలు తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో వచ్చాడు. శనివారం రాత్రి ఏడుకొండలు భార్య అంకమ్మ, మూడేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తెతో పాటు తండ్రి చెన్నయ్య, సమీప బంధువు చలమయ్యతో కలిసి బెంగళూరుకు బయలుదేరారు. పడుగుపాడు వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఏడుకొండలు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మిగిలిన వారికి స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్సై అళహరి వెంకట్రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరిని బతికించేందుకు.. కారు నడుపుతున్న ఏడుకొండలు ప్రమాదంలో అందరిని బతికించేందుకు తాను ప్రాణాలను పణంగా పెట్టాడు. కారు అదుపు తప్పిన సమయంలో ఏడుకొండలు బయటకు దూకేసి ఉంటే కారు పక్కనే ఉన్న పంట కాలువలోకి బోల్తాపడేది. దీంతో పెనుప్రమాదం జరిగేది. అయితే ఏడుకొండలు అప్రమత్తమై కారు కంట్రోల్ చేస్తూ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన ఇనుపు కంచెను ఢీకొన్నాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. కారు బోల్తా పడటంతో స్వల్పగాయాలతో బయటపడ్డారు. మమ్మల్ని బతికించి నువ్వు దూరమయ్యావా... మమ్మల్ని బతికించేందుకు నీవు దూరమయ్యావా అంటూ ఏడుకొండలు భార్య అంకమ్మ రోదిస్తూ విలపిస్తుంది. ఇద్దరు బిడ్డలను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న తీరను చూసిన స్థానికులను కలిచివేసింది. ఏడుకొండలకు భార్యతో పాటు నలుగురు కుమార్తెలు, మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. -
పెళ్లి ఇంట్లో చావు బాజా
పెళ్లివారి వాహనం బోల్తా ఒకరి మృతి 14 మందికి గాయాలు గోనుపల్లిలో విషాదఛాయలు రాపూరు : పెళ్లి ఇంట్లోచావు బాజా మోగింది. మండలంలోని గోనుపల్లి అరుంధతీయవాడకు చెందిన పెళ్లి బృందం జీపులో తిరుపతికి వెళ్తుండగా గుండవోలు సమీపాన ఉన్న మలుపు వద్ద అదుపు తప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా, 14 మందికి గాయాలు పడ్డారు. ఈ గురువారం రాత్రి చోటు చేసుకుంది. గోనుపల్లికి చెందిన వడ్లపల్లి జయరామయ్య, రమణమ్మ కుమార్తె చామండేశ్వరికి తిరుపతికి చెందిన వ్యక్తితో వివాహం నిశ్చయం కావడంతో గోనుపల్లిలో గురువారం రాత్రి సుమారు 7 గంటలకు జీపులో కొందరు, లారీలో మరి కొందరు బయలుదేరారు. జీపు గుండవోలు వద్ద ఉన్న మలుపు వద్ద అదుపు తప్పడంతో జీపులో ఉన్న 15 మందిలో 14 మందికి గాయాలయ్యాయి. పెళ్లికొడుకు తరపున సారె తీసుకు వచ్చిన సూరిపాక జయరామయ్య (65) తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. విషయం తెలుకున్న గుండవోలు, ఆకలివలస గ్రామస్తులు 108 సిబ్బంది హుటాహుటిన సంఘనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనం, మినీ బస్సు, లారీలో రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇక్కడ ఒక్క వైద్యుడు మాత్రమే ఉండడంతో సైదాపురం, డక్కిలికి చెందిన 108 వాహనాల్లో ప్రైవేట్ కారుర్లలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుల్లో డ్రైవర్ పశుపులేటి శీను (తిరుపతి) పాదర్తి పెంచలమ్మ,పాదర్తి మానస (పెద్దచెరుకూరు) బోపం చిట్టేమ్మ, బోపినేని వెంకటేశ్వర్లు (తిరుమల) బోపం కృష్ణయ్య, బోపినేని చిన్నయ్య (నేతివారిపల్లి, చిట్వేలి మండలం) సత్యవేలు మాతమ్మ (చీపినాపి, కలువాయి మండలం) వడ్డిపల్లి లక్ష్మీనరసమ్మ, బుజ్జమ్మ (గోనుపల్లి), మాతంగి మాతయ్య(గూడూరు), వడ్డిపల్లి మణి (తెగచర్ల) ఉన్నారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
దొరవారిసత్రం: మట్టి తీసుకువస్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడటంతో డ్రైవర్ మావిళ్లపాటి రాజయ్య(40) మృతి చెందిన సంఘటన తిమ్మినాయుడు కండ్రిగ గ్రామ రోడ్డు వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... తనియాలి ఎస్సీ కాలనీకి చెందిన రాజయ్య బూదూరు గ్రామ సమీపంలో తెలుగు గంగ కాలువ వద్ద ట్రాక్టర్లో మట్టి లోడు చేసుకుని తిరిగి తనియాలి గ్రామానికి వస్తున్న సమయంలో ట్రాక్టర్ తిమ్మనాయుడుకండ్రిగ గ్రామ రోడ్డు వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే పొలాల్లో పడిపోవడంతో డ్రైవర్ కూడా ట్రాక్టర్ కిందనే పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం సూళ్లూరుపేటకు తరలిస్తున్న సమయంలోనే 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని రాజయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, కొడుకు ఉన్నారు. ప్రమాదంపై పోలీసులకు ఏలాంటి సమాచారం అందలేదు. -
థాయ్లాండ్లో వరుస పేలుళ్లు.. ఒకరు మృతి
థాయ్లాండ్లోని పట్టాని రాష్ట్రంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారు. రెండు వారాల క్రితమే వరుస పేలుళ్లు దేశాన్ని కుదిపేసిన తర్వాత మళ్లీ అలాంటి ఘటనే మరోసారి జరిగింది. రాత్రి 10.40 గంటల సమయంలో ఓ పబ్కు సమీపంలో ఉన్న పార్కింగ్ ప్రదేశంలో నిలిపి ఉంచిన కారులో బాంబులు పేలాయి. రాత్రి 11 గంటల సమయంలో మరో కారు బాంబు పేలింది. దాంతో ఓ మహిళ మరణించగా, 30 మంది గాయపడ్డారు. స్థానిక మార్కెట్ సమీపంలోని చెత్తబుట్టలో దాచి ఉంచిన మూడో బాంబు రాత్రి 11.30 సమయంలో పేలింది. అయితే ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇంతకుముందు ఉత్తర థాయ్లాండ్లో జరిగిన వరుస పేలుళ్లలో నలుగురు మరణించగా, 11 మంది విదేశీ పర్యాటకులు సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. -
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన థాయ్లాండ్
బ్యాంకాక్ : థాయ్లాండ్లోని పట్టని ప్రావిన్స్లో మంగళవారం అర్థరాత్రి వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మంగళవారం అర్థరాత్రి పబ్కు అతి సమీపంలో పేలుడు సంభవించింది. అయితే ఈ పేలుడులో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో అరగంట వ్యవధిలో మరో బాంబు పేలుడు చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా....... 30 మంది గాయపడ్డారు. స్థానిక మార్కెట్ సమీపంలో మరో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. -
వ్యాన్ ఢీకొని యువకుడి దుర్మరణం
నాయుడుపేట : మితి మీరిన వేగంతో వెళ్తున్న ఓ మినీ వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను, ఆ తర్వాత బైక్ను ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందగా, ఆటోడ్రైవర్ గాయపడ్డాడు. ఈ సంఘటన నాయుడుపేట–మల్లాం మార్గంలో మిట్టకండ్రిగ వద్ద సోమవారం అర్ధరాత్రి జరిగింది. మల్లాం నుంచి నాయుడుపేట వైపు వస్తున్న ఆటోను, దాని వెనుకనే వస్తున్న బైక్ను ఎదురుగా వస్తున్న మినీ వ్యాన్ ఢీకొంది. ఆటోబోల్తా పడగా ఆటోడైవర్ పుదూరుకు చెందిన గోనుపల్లి కుమార్ స్వల్ప గాయాలయ్యాయి. మోటార్ బైక్పై వస్తున్న రామారెడ్డికండ్రిగకు చెందిన మైలారి అనిల్ (29) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన కుమార్ను 108లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనిల్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రాణాలు తీసిన అతి వేగం
నెల్లూరురూరల్ : వాహనచోదకుల అతివేగం ఇద్దరి ప్రాణాలు బలిగొంది. బైక్పై అతివేంగా వెళ్తూ కారు ఢీకొని ఓ యువకుడు, ముందు వెళ్తున్న వాహనాన్ని అదిగమించబోయి బైకిస్ట్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మరో వ్యక్తి దుర్మరణం పాలయ్యారు. ఈ సంఘటనలు మండలంలోని వేర్వేర్లు చోట్ల జరిగాయి. నెల్లూరురూరల్ పోలీసుల కథనం మేరకు.. రాపూరు మండలం చిట్టుపాళెంకు చెందిన పులిబోయిన శివ(23) రాపూరు నుంచి నెల్లూరువైపు బైక్పై బయలుదేరాడు. ఆమంచర్ల వద్దకు వచ్చే సరికి ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేస్తూ ఎదురుగా వస్తున్న కారును వేగంగా ఢీకొన్నాడు.. దీంతో తీవ్రంగా గాయపడిన శివను 108 వాహనంలో పెద్దాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శివ మృతి చెందాడు. ఆర్టీసీ బస్సు ఢీకొని.. 4వ మైలుకు చెందిన కాటంరెడ్డి రవీంద్రరెడ్డి (40) బైక్పై ఆదివారం నెల్లూరు వైపు వెళ్తున్నాడు. అదే సమయంలో నెల్లూరు నుంచి కొత్తకాలువ మీదుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రవీంద్రరెడ్డిని ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెద్దాసుపత్రికి తరలించారు. ఈ మేరకు రెండు ప్రమాదాల కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బారావు తెలిపారు. -
కారు బోల్తా : ఒకరి మృతి
-
కారు బోల్తా : ఒకరి మృతి
నల్లగొండ : కృష్ణా పుష్కరాలకు వెళ్తున్న వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా... మరోకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం ముకుందాపురం సమీపంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న కారు తిరుపతమ్మ గుడి సమీపంలో అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో కారు నడుపుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి... అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ - ఆర్టీసీ బస్సు ఢీ: ఒకరి మృతి
కర్నూలు : కర్నూలు నగరం సమీపంలోని నన్నూరు వద్ద గురువారం లారీ - ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరి అక్కడికక్కడే మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.