బస్సును ఢీకొన్న కారు: ఒకరు మృతి | One killed, three injured in road accident in chittoor district | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న కారు: ఒకరు మృతి

Published Sat, Dec 26 2015 6:46 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One killed, three injured in road accident in chittoor district

చిత్తూరు : చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బలిజపల్లి వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బస్సును ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి... పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహన్ని స్వాధీనం చేసుకుని... పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement