
పెళ్లి ఇంట్లో చావు బాజా
- పెళ్లివారి వాహనం బోల్తా ఒకరి మృతి
- 14 మందికి గాయాలు
- గోనుపల్లిలో విషాదఛాయలు
విషయం తెలుకున్న గుండవోలు, ఆకలివలస గ్రామస్తులు 108 సిబ్బంది హుటాహుటిన సంఘనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనం, మినీ బస్సు, లారీలో రాపూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇక్కడ ఒక్క వైద్యుడు మాత్రమే ఉండడంతో సైదాపురం, డక్కిలికి చెందిన 108 వాహనాల్లో ప్రైవేట్ కారుర్లలో నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుల్లో డ్రైవర్ పశుపులేటి శీను (తిరుపతి) పాదర్తి పెంచలమ్మ,పాదర్తి మానస (పెద్దచెరుకూరు) బోపం చిట్టేమ్మ, బోపినేని వెంకటేశ్వర్లు (తిరుమల) బోపం కృష్ణయ్య, బోపినేని చిన్నయ్య (నేతివారిపల్లి, చిట్వేలి మండలం) సత్యవేలు మాతమ్మ (చీపినాపి, కలువాయి మండలం) వడ్డిపల్లి లక్ష్మీనరసమ్మ, బుజ్జమ్మ (గోనుపల్లి), మాతంగి మాతయ్య(గూడూరు), వడ్డిపల్లి మణి (తెగచర్ల) ఉన్నారు.