లారీ ఢీకొని బేల్దారి మృతి | One killed in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని బేల్దారి మృతి

Nov 4 2016 11:17 PM | Updated on Oct 20 2018 6:19 PM

లారీ ఢీకొని బేల్దారి మృతి - Sakshi

లారీ ఢీకొని బేల్దారి మృతి

నెల్లూరు (క్రైమ్‌) : సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ లారీ ఢీకొనడంతో బేల్దారి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన సుందరయ్యకాలనీ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది.

నెల్లూరు (క్రైమ్‌) : సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ లారీ ఢీకొనడంతో బేల్దారి దుర్మరణం పాలయ్యాడు. ఈ సంఘటన సుందరయ్యకాలనీ సమీప జాతీయ రహదారిపై శుక్రవారం జరిగింది. పడారుపల్లి సుందరయ్య కాలనీ బీబ్లాక్‌లో నివాసం ఉంటున్న ఎస్‌కే గౌస్‌బాషా (40) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం గౌస్‌బాషా  సైకిల్‌పై డి బ్లాక్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చే క్రమంలో జాతీయ రహదారి దాటుతుండగా చెన్నై వైపు నుంచి వస్తున్న లారీ వేగంగా సైకిల్‌ను ఢీకొంది. గౌస్‌బాషా తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ లారీని అక్కడే వదిలి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తమకు దిక్కెవరని భార్య ఖాదరున్నీసా గుండెలవిసేలా రోదించింది. ఆమె రోదన చూపరులను కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న సౌత్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ పి.చిన్న బలరామయ్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.  ప్రభుత్వ వైద్యులతో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ చిన్న బలరామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement