
ప్రాణం తీసిన సెల్ఫోన్..
ఇసుక రీచ్కు వెళ్లి ఇసుక లోడ్ చేసుకుని తిరిగి నెల్లూరు వైపు వస్తు పొట్టెపాళెంలో దుకాణం సమీపంలో ట్రాక్టర్ను రోడ్డుపక్కన ఆపాడు. చార్జింగ్ పెట్టిన సెల్ తీసుకుని వెంకటరమణయ్య రోడ్డుపక్కన నిలుచుని కొడుకును ట్రాక్టర్ నడపాలని సూచించాడు. తండ్రి సూచన మేరకు కొడుకు ట్రాక్టర్ను ముందుకు తీశాడు. అదుపుతప్పిన ట్రాక్టర్ సెల్లో మాట్లాడుతున్న వెంకటరమణయ్యను ఢీకొట్టింది. గోడకు, ట్రాక్టర్ ట్రాలీ ట్రక్కు మధ్యన ఇరుక్కుపోయిన వెంకటరమణయ్య(48) తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం అందించడంతో రూరల్ ఎస్సై సుబ్బారావు సంఘటనా స్థలాన్ని పరిశీలించాడు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.